17, ఆగస్టు 2024, శనివారం

20 వ సామాన్య ఆదివారం

20 వ సామాన్య ఆదివారం 
సామెతలు 9:1-6, ఎఫెసీ5: 15-20, యోహాను 6:51- 58
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణములు దివ్య సత్ప్రసాదము గురించి తెలుపుచున్నవి. గత కొన్ని వారాలుగా తల్లి శ్రీ సభ దివ్యసప్రసాదం గురించే బోధిస్తుంది. సాధారణంగా ఒక్కొక్క ఆదివారం ఒక్క ప్రత్యేక అంశం గురించి బోధిస్తున్నది కానీ దివ్యసప్రసాదం గురించి ఐదు వారాలుగా మనం ధ్యానించాలని కోరుచున్నది.
 ఈ యొక్క దివ్య సత్ప్రసాదం గురించి మరియు ప్రభు శరీర రక్తముల యొక్క విలువను మన యొక్క అనుదిన జీవితంలో గ్రహించాలి అన్నదే శ్రీ సభ యొక్క ఉద్దేశం. చాలామంది వాక్యము, వాక్యం కావాలి అని తహతహలాడుతుంటారు కానీ వాక్యము, శరీరము ధరించి మనందరినీ పోషిస్తున్నది, ఉత్తేజపరుస్తుంది, శక్తినిస్తుంది అనే సత్యమును మరిచిపోతున్నాం దివ్య సత్ప్రసాదానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలము వాక్యమునకు ప్రాముఖ్యతను ఇచ్చే జీవిస్తూ ఉంటాం కానీ ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు జ్ఞానము కలిగి ఆ యొక్క ప్రభు ప్రేమ గౌరవం కలిగి ప్రభు శరీర రక్తములను స్వీకరించాలి అని తెలుపుతున్నారు. దివ్యసప్రసాదము శ్రీ సభకు కేంద్రం మరియు ఒక గుండె లాంటిది. ప్రభువే స్వయముగా స్వయంగా దివ్యసప్రసాదమును మన కొరకై ఏర్పరచి స్వీకరించమని తెలిపారు.

ఈనాటి మొదటి పఠణంలో విజ్ఞానము అనేటటువంటి స్త్రీ మూర్తి విందు చేసి అందరిని ఆహ్వానించినది జ్ఞానం లేని వాళ్ళందరని కూడా పిలుస్తుంది ఎందుకంటే వారు కూడా తనలాగా జ్ఞానవంతులు అవ్వాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో. పాత నిబంధన గ్రంధంలో విజ్ఞానమును దేవునితో పోల్చి చెబుతూ ఉంటారు దేవుడు స్వయముగా విందులో ఏర్పరచి వారిని పిలుస్తూ ఉన్నారు. తన యొక్క విందులో పాల్గొనుట ద్వారా అజ్ఞానులు సైతం జ్ఞానులుగా మారుతారు అని అర్థం. దేవుడు ఏర్పరిచిన విందు ద్వారా అందరూ ఏకమవుతారు, సంతోషంతో జీవిస్తారు. విజ్ఞాన మూర్తి ఏర్పరిచిన విందు స్వీకరించుటవలన మరియు  ద్రాక్ష రసాన్ని సేవించడం వలన వారు జీవాన్ని పొంది సరియైన మార్గమును తెలుసుకొని జీవించగలుగుతారు. 
విజ్ఞానము పొందుట చాలా అవసరం ఎందుకనగా విజ్ఞానం మనలను సత్యము వైపునకు నడిపించును.ఏది నిజమో అబద్దమో గ్రహించేలా చేసి సత్యమునకు  సాక్షులుగా జీవించి లాగున చేస్తుంది. 
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు అన్యులను యూదులను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ జీవించమని తెలుపుచున్నారు ఎందుకనగా వారిని తన యొక్క శరీర రక్తములను పంచుకొనుటకు ప్రభువు ఏకం చేశారు అలాగే మనలను వివేకవంతులవలె జీవించమని తెలుపుతున్నారు. ఈ లోక సంబంధాను సారముగా జీవించకుండా దేవుని యొక్క చిత్తము ప్రకారంగా జీవించమని తెలుపుచున్నారు.
ఈనాటి సువిశేష  భాగములో ప్రభుని శరీర రక్తములను భుజించి ఉన్నటువంటి వారికి కలిగినటువంటి ప్రయోజనం గురించి ఏసుప్రభు తెలుపుచున్నారు. ఏసుప్రభువు స్వయముగా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము ఈ యొక్క ఆహారం గురించి నటువంటి వారు నిరంతరము జీవిస్తారు అని తెలుపుతున్నారు. యోహాను శుభవార్తను, జీవము కలిగిన సువార్త అని పిలుస్తారు ఎందుకనగా ఆయన యొక్క గ్రంథంలో ఎక్కువ జీవము గురించి మాట్లాడారు ఇది మనము ప్రభుని శరీర రక్తములను స్వీకరించటం ద్వారా పొందుతున్నాం. ప్రభువే స్వయముగా, తాను ఒసిగేటటువంటి శరీర రక్తములను భుజిస్తే కానీ వారిలో జీవము ఉండదు అని తెలుపుతున్నారు. ఆదికాండములో ఆది తల్లిదండ్రులను దేవుడు చెట్టు పండు తినవద్దు అని పలికారు తినన ఎడల మీరు మరణిస్తారు అని తెలిపారు కానీ  మనలను ఆయన యొక్క శరీర రక్తమును భుజించమని కోరుతున్నారు.
ప్రభు నీ శరీర రక్తములను భుజించి మరణించినటువంటి వారిని ఆయన అంతిమ దినమున సజీవముగా లేపుతారు అని తెలుపుతున్నారు అదేవిధంగా భుజించినటువంటి వారి యెడల దేవుడు ఉంటారు అని తెలుపుచున్నారు అనగా మన యొక్క జీవితమును ప్రభువు పంచుకుంటారు మనము జీవితమును పంచుకుంటాము. క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించుట ద్వారా మన యందు ఎల్లప్పుడూ కూడా జీవము ఉంటుంది.
ప్రభువు అనేక అద్భుతాల ద్వారా దివ్య సత్ప్రసాద యొక్క శక్తిని మనందరికీ కూడా తెలుపుతున్నారు కావున మనం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించటానికి మనల్ని మనము తయారు చేసుకోవాలి.
Fr. Bala Yesu OCD

20 వ సామాన్య ఆదివారం

 సామెతల గ్రంధం 9:1-6  ఎఫెసీ 5: 15-20 యోహాను 6: 51-58 

పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించునో వాడు నిరంతరం జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అనెను. అంతట యూదులు ఒకరితో ఒకరు "మనము భుజించుటకు ఈయన తన శరీరమును  ఎట్లు ఈయగలడు?" అని వాదించుకొనసాగిరి. యేసు వారికి "మీరు మనుష్యకుమారుని శరీరమును భుజించి, ఆయన రక్తమును త్రాగిననే తప్ప , మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి , నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను వానిని అంతిమ దినమున లేపుదును. ఏలయన నా శరీరము నిజమైన ఆహారము. నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును.  జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున  జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అటుల కాక, ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడును జీవించును అని సమాధానము ఇచ్చెను. 

ఈనాటి మొదటి పఠనంలో విజ్ఞానమను స్త్రీ మూర్తి ప్రజలను "రమ్ము నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము. జ్ఞానము లేని వారు ఇచ్చటకు రెండు అని ఆహ్వానిస్తుంది. మూర్ఖత్వమును  విడనాడి బ్రతుకుడు.  విజ్ఞాన పథమున నడువుడు అని మనం మొదటి పఠనంలో  విటున్నాం.  ప్రియ విశ్వాసులారా  జ్ఞానము లేని వారు  ఇచటకు రెండు అని విజ్ఞానమను స్త్రీ మూర్తి పిలిచినట్లే దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. మనలను దేవుని వాక్కు అనే భోజనమును ఆరగించమని ఆహ్వానిస్తున్నారు. మానవుడు కేవలం, రొట్టె వలెనే కాక దేవుని నోటి నుండి వచ్చు వాక్కు వలన జీవించును. ఇది అక్షరాల సత్యం. కానీ చాలా మంది ఇంకా మూర్ఖత్వంలోనే జీవిస్తున్నారు. అజ్ఞానములోనే ఉండిపోతున్నారు. నా యొద్దకు రెండు అని పిలిచిన దేవుని మాటను వినలేక పోతున్నారు. దేవుని విజ్ఞాన మార్గంలో నడవమని ఆహ్వానిస్తుంది. మనము జ్ఞానము కలిగిన వారిగా జీవించి విజ్ఞాన పథంలో జీవించుదాం. 

ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అదే విధంగా ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నాశరీరమే అని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు. 

అదే విధంగా నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువారు నిత్యజీవము పొందును. నేను వారి యందు వారు నాయందు ఉండును. నేను తండ్రి మూలమున జీవించునట్లే నన్ను భుజించువాడు నా మూలమున ఎల్లప్పుడును జీవించును. ఇది గొప్ప భాగ్యం మానవులమైన మనందరికీ. 

కాబట్టి ప్రియ విశ్వాసులారా మనం నిత్య జీవం పొందాలంటే , మనం మనము దేవుని యందు ఉండాలంటే దేవుని శరీర రక్తాలను నిత్యం స్వికరించాలి. మరి క్రీస్తు ప్రభువుని శరీర రక్తలను స్వీకరించాలంటే పరిశుద్ధతతో జీవించాలి. దేవుని చిత్తాను సారం నీవు నేను మనందరం ఆ ప్రభుని చిత్తం తెలుసుకొని జీవించాలి. పవిత్రతతో నింపబడాలి. 

మనం ఏమి చేయాలంటే? దేవుని పిలుపును , ఆహ్వానాన్ని విని దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుని యొక్క జ్ఞానమును, జ్ఞాన ఫలములను పొంది దేవుని వాక్కుతోను శరీర రక్తములతోను నింపబడాలి. మన మూర్ఖత్వాన్ని తొలగించమని ఆ దేవుని జ్ఞానము కొరకు ప్రార్ధించాలి. నిత్య జీవం, పొందాలంటే మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని విడనాడి దేవుని త్రోవలో నడవాలి. దేవునితో నిత్యం కలకాలం జీవించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన: ప్రేమ మయుడైన దేవా మేము ముర్ఖులం, మా మూర్ఖత్వంలో, అజ్ఞానంలో  జీవిస్తున్నాం. నీ జ్ఞానమును, జ్ఞానవరములను పవిత్రత్మను మాపై కుమ్మరించి విజ్ఞానముతో  నింపుము, నిత్యం నీ త్రోవలో నడుస్తూ నిత్య జీవం పొందే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...