28, సెప్టెంబర్ 2024, శనివారం

26వ సామాన్య ఆదివారం


సంఖ్యా 11:25-29, యాకోబు 5:1-6, మార్కు9:38-43,45,47-48
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు అసూయ అనే అంశము గురించి బోధిస్తున్నాయి. సమాజంలో చాలామందికి తమ తోటి వారి పట్ల అసూయ భావం ఉంటుంది. అసూయ అనగా ఇతరుల యొక్క ఎదుగుదలను అభివృద్ధిని సహించలేక మనసంతా బాదించేది అసూయ. ఎదుటివారి గొప్పదనమును చూసి మనం కొన్ని సందర్భాలలో ఓర్వలేకుంటాం.
అసూయ అనేది కోపము, క్రూరము కంటే ఘోరమైనది సామెతలు 27:4. 
మనం జీవించేటటువంటి ప్రదేశంలో మనకన్నా గొప్పగా ఎవరైనా ఎదుగుతున్నారంటే మనందరం కూడా తట్టుకోలేక పోతాం. మన కన్నా అందంగా ఉన్నా, డబ్బున్నా, పేరు ప్రతిష్టలన్నా, వారిని చూసినప్పుడు మనలో అసూయ భావం కలుగుతుంది. ఈ యొక్క అసూయ వలన ఎప్పుడు మనము ఎదుటివారి గురించే ఆలోచిస్తాం దానివలన ప్రశాంతంగా జీవించలేం. అసూయ వలన మన యొక్క ఆయుష్షు తగ్గుతుంది. (సిరా 30:24.
చాలా సందర్భాలలో ఈ యొక్క అసూయ వలన పాపం చేస్తాం. మనం దేవునితో మంచిగా ఉంటే సైతాన్కు అసూయ, అందుకే మన జీవితంలో శోధనను ప్రవేశపెడుతుంటుంది. మనం కొంతమందితో మంచిగా మాట్లాడితే వేరే వారికి అసూయ ఉంటుంది. మనం కొన్నిసార్లు ఖరీదైన కార్లు కొన్నా, వస్తువులను కొన్నా కొంతమంది దానిని చూసి తట్టుకోలేరు.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ఇశ్రాయేలు ప్రజలపై నాయకత్వం భారం కింద కృంగిపోయి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు యావే ప్రభువు అతనికి సహాయంగా ప్రజల పెద్దల నుండి 70 మందిని ఎన్నుకున్నారు వారిని గుడారం చుట్టూ నిలవమని చెప్పారు. మోషే దేవుడు చెప్పిన విధంగా చేశారు అంతట యావే దేవుడు మేఘం నుండి దిగివచ్చి మోషే మీద వచ్చిన ఆత్మలో కొంత ఆత్మను ఆ 70 మంది మీద ఉంచారు. ఆ ఆత్మను స్వీకరించినప్పుడు ఆ 70 మంది కూడా దేవుని వాక్యమును ప్రకటింప సాగారు. ఈ గుంపులో లేనటువంటి ఎల్దాదు, మేధాదు అనే ఇద్దరు వ్యక్తులు మీద కూడా వేరుగా ఆత్మ దిగి వచ్చి వారు కూడా ప్రవచింపసాగారు. గుడారం దగ్గర లేని ఇద్దరు మీదకు ఆత్మ దిగిరాగా, వారు ప్రవచించుట చూచి యెహోషువ వారిని అడ్డుకోవాలని భావించాడు అందుకు మోషే నీవు నా మీద ఉన్న ప్రేమ వలన అసూయపడుచున్నావు అని చెప్పారు.(సంఖ్యా11:29). దానికి ప్రత్యుత్తరముగా మోషే ప్రవక్త యెహోషువతో ఈ విధంగా అంటున్నారు దైవ ప్రజలందరూ ప్రవక్తలుగా మారి దేవుని సేవ చేయాలని దేవుని ప్రణాళిక. యెహోషువ, దేవుని యొక్క ఆత్మ ప్రవచన శక్తి, బోధనా శక్తి అందరి శ్రేయస్సు కొరకై ఇవ్వబడినది అని గ్రహింప లేకపోయారు. అసూయ పడుచున్నారు. ఈ యొక్క ప్రవచన శక్తిని కేవలము 70 మందికి మాత్రమే పరిమితం చేయాలని యెహోషువ భావించాడు. మోషే ప్రవక్త ఎటువంటి అసూయ పడకుండా అందరూ ప్రభువు సేవ చేయుట మంచిదే అని భావించారు. అందుకే తాను స్వీకరించినటువంటి ఆత్మను సైతం ఇతరుల కొరకు ఇవ్వటకు సిద్ధపడ్డాడు. తన గౌరవ ప్రతిష్టలు తగ్గిపోతాయని కానీ, తన అధికారం ఇతరులకు ఇవ్వడం ద్వారా తన నాయకత్వానికి హాని కలుగుతుందని మోషే భావించలేదు ఆయన అనుక్షణం ప్రజల యొక్క శ్రేయస్సునే కోరుకున్నారు. తన యొక్క పదవి గురించి భయపడలేదు. 
కొన్ని సందర్భాలలో మనం కూడా యెహోషువలే తొందరపడి అసూయ చెందుతుంటాం. ఈ అసూయ వలన ఇతరులతో కూడా మాట్లాడటం మానేస్తాం. అసూయ వలన జరిగే కొన్ని నష్టాలు;
1. అసూయ మనలను నిరుత్సాహపరుస్తుంది (సామెతలు 23:17-18)
2. అసూయ మనల్ని కఠినులను చేస్తుంది (పరమగీతం 8:6)
3. అసూయ మనల్నీ confuse చేస్తుంది. (యాకోబు 3:16).
4. అసూయ మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
ఈనాటి రెండవ పఠణంలో ధనవంతులు చేస్తున్నటువంటి మోసము గురించి తెలుపుతున్నారు. వారు పేదవారిని కూలగొట్టి సంపాదించినటువంటి ధనము మొత్తము కూడా నాశనమవుతుంది అని యాకోబు గారు తెలుపుచున్నారు. ధనవంతులు పేదవారి పట్ల, తమ దగ్గర పని చేసే వారి పట్ల ప్రేమ భావం కలిగి జీవించాలి. ధనికులు, పేదవారిని చిన్నచూపు చూడకుండా వారి యెడల కనికర హృదయం కలిగి జీవించాలి. 
ఈనాటి సువిశేష భాగములో కూడా యోహాను, ఒక వ్యక్తి ఏసుప్రభువు పేరిటములను గూర్చి ప్రభువునకు ఫిర్యాదు చేస్తున్నారు అతడిని వెంటనే తన పరిచర్య నుండి నిషేధించాలని ఏసుప్రభువును కోరాడు. యోహాను కూడా యెహోషువలై తన యొక్క అసహనాన్ని, అసూయను వ్యక్తపరుస్తున్నాడు. ప్రభు అంటున్నారు "నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కాని వాడు" మన పక్షమున ఉండు వాడు (మార్కు 9:39-40) అని తెలిపారు. దేవుని వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అందించబడ్డాయి దానిని యోహాను గుర్తించలేకపోయారు.
కేవలము వారి వలె అద్భుతాలు చేస్తున్నారు అనేటటువంటి అసూయతోనే యోహాను ఏసు ప్రభువునకు ఈ విషయమును తెలియజేశారు. 
పవిత్ర గ్రంథంలో అసూయ గురించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 
1. కయీను అసూయ వలనే సోదరుడిని చంపివేశాడు. (ఆది 4:3-8)
2. ఏసేపు యొక్క అన్నలు అసూయ వలనే ఆయన్ను బావిలో పడేశారు (ఆది 37:5-8)
3. మోషే గొప్పతనమును చూసి మిరియం అసూయ పడుతున్నది.
4. సౌలు దావీదు యొక్క కీర్తిని చూసి అసూయ పడుతున్నాడు. 
5. మెర్థుకయి కీర్తిని చూసి హామాను అసూయ పడుతున్నాడు.
6. హేరోదు రాజు కూడా బాల యేసుని చూసి అసూయ పడుతున్నాడు.
అదేవిధంగా ఈ యోహాను గారు కూడా అసూయ పడుతున్నారు. మన యొక్క జీవితంలో అసూయను విడిచి పెట్టేసి తోటి వారిని అంగీకరించి జీవించాలి అప్పుడే మనందరం కూడా సంతోషంగా జీవించగలుగుతాం. 
Fr. Bala Yesu OCD

21, సెప్టెంబర్ 2024, శనివారం

25 వ సామాన్య ఆదివారము

25 వ సామాన్య ఆదివారము

సొలొమోను జ్ఞాన గ్రంధము 2 : 12 , 17 - 20 

యాకోబు 3 : 16 - 4 : 3 

మార్కు 9 : 30 - 37 

క్రిస్తునాధుని యందు ప్రియ సహోదరి సహోదరులారా !


ఈనాడు తల్లి తిరుసభ 25 వ సామాన్య కాలపు ఆదివారములోనికి ప్రవేశిస్తుంది.  ఈనాటి మూడు దివ్యగ్రంధ పట్టణాలు కూడా మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అని ఆత్మపరిశీలన చేసుకోమని మనలను అందరిని కూడా ఆహ్వానిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే మన యొక్క బుద్ధి ప్రవర్తనలు ఏ విధంగా ఉంటున్నాయి అని మనలను మనము ప్రశ్నించుకోవలసిన సమయము. ఎందుకంటే ఈనాటి సువిశేష పఠనంలో మనము రెండు అంశాలను చూస్తున్నాము. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు తాను పొందబోయెటువంటి సిలువ మరణమును అటుపిమ్మట జరగబోయే పునరుత్తాన్ని గురించి ప్రభు తన యొక్క శిష్యులకు వివరిస్తూ ఉంటున్నారు. కానీ శిష్యులు మాత్రం మనలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. అంటే ఎవరు ప్రథముడు అని తమలో తాము వాదించుకుంటున్నారు. యేసు పలికిన మాటలను వారు గ్రహించలేక పోతున్నారు.

 ఆ సమయములో యేసు వారికి ఒక గొప్ప ఉదాహరణను చెప్పడానికి ఈ విధంగా వారితో పలుకుతున్నారు. (మార్కు 9 : 37 ) "ఇట్టి చిన్నబిడ్డలలో ఒకనిని స్వీకరించువాడు నన్నును స్వీకరించు వాడు అగును. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు"అని ప్రభువు పలుకుతున్నాడు. తమలో తం,యూ ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నవారికి ఒక గుణపాఠాన్ని ఒక చిన్న బిడ్డ ద్వారా వారికీ విశిదీకరిస్తున్నారు. అంటే చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే ఒకరి పై ఆధారపడి జీవిస్తారో, నిర్మల మనసు కలిగి ఉంటారో, చెప్పిన మాటకు విధేయులై ఉంటారో, అలాగా మీరును మరీనా తప్ప మీలో ఎవడును  గొప్పవాడు కాదు అని ప్రభు వారికి తెలియచేస్తున్నారు. ఆ చిన్న బిడ్డలవలె మనము జీవించాలి అంటే మనము ఎం చేయాలి అంటే మన యొక్క జీవిత విధానాన్ని మనము మార్చుకోవాలి. ఎపుడు కూడా దుస్తుల వాలే కాకుండా నీతిమంతులుగా మనయొక్క జీవితాన్ని మనము గడపాలి. యేసు ప్రభువు తన యొక్క జీవితము ద్వారా మనకు మనము ఏ విధంగా జీవించాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో మనము చూస్తున్నాము.యేసు ప్రభు తన యొక్క సిలువ మరణాన్ని గురించి సంబందించిన విషయములను మనము చూస్తున్నాము. సో. జ్ఞాన  2 : 18 -20  వచనాలలో మనము చూస్తున్నాము. క్రూరముగా అవమానింతుము, హింసింతుము, పరీక్షకు గురిచేయుదము, ఇతని సహన భావమెంత గొప్పదో పర్రెక్షించి చూతము అని యేసును గూర్చిన పలుకులను మనము చూస్తున్నాము. యేసు ప్రభు తనయొక్క సిలువ మరణము పొందెబోయే ముందు ఈ విధముగా అనేకమైన అవమానాలు, హింసలు, నిందలు పొందియున్నారు. కానీ చివరిగా యేసు పలికినటువంటి పలుకులు (లూకా 23 : 34 ) "తండ్రి వీరు ఏమిచేయుచున్నారో వీరికి తెలియడంలేదు, వీరిని క్షమించుము" అని వారిని క్షమించి వారికై ప్రార్ధన చేస్తున్నారు. మనము కుడి మన యొక్క జీవితంలో ఎపుడు కూడా  ఒకరి పట్ల కఠినంగా కాకుండా ప్రేమ కలిగి జీవించాలి అని ప్రభు తన యొక్క జీవితం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. 


ఒక మానవునిగా మన జీవితంలో అనేకమైన అవసరాలను మనము ఎదుర్కొంటు ఉంటాము. వాటిని మనము చేరుకోవాలి అంటే అనేకమైనటువంటి మార్గాలగుండా ప్రయాణిస్తాము. అది మంచిమార్గమే కానీ చెడు మార్గమే కానీ.   ఈనాటి రెండొవ పఠనంలో మనము చూస్తున్నాము మానవుల మధ్య కలహాలు అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి? వాటికి గల కారణము ఎవరు? అసలు మనము చేయవలసిన పని ఏంటీ అని చూస్తున్నాము. యాకోబు 4:1 వచనంలో చూస్తున్నాము. మానవుల మధ్య అనేకమైనటువంటి భేదములు ఎలా పుడుతున్నాయి అంటే అది కేవలము మనలో ఉన్నటువంటి వ్యామోహములనుండి. అనేకమైనటువంటి కోరికలు, ఆశలు, ఆశయాలు ఉండడం ద్వారా వాటిని పరిపూర్తి చేసుకోవడానికి మన పొరుగువానికి హాని తలపెట్టడానికి కూడా మనము వెనుదిరగడంలేదు. అనేకమైన యుద్ధములు చేస్తున్నాం కానీ మనము చేయవలసిన పని మాత్రం చేయడంలేదు. ఏంటి అంటే మనకు కావలసిన వాటికోడం దేవునికి ప్రార్ధించడం లేదు. యాకోబు 4 : 2 -3  వచనాలలో మనము వింటున్నాం, మీరు కావలసినవి మీరు పొందలేక పోతున్నారు అంటే మీరు దేవునితో ఐక్యమై జీవించటంలేదు అని.  మనయొక్క జీవితంలో మనకు కావలసిన వాటిని కానీ కావలసిన వారిని గని మనము సంపాదించుకోవాలి అంటే అది కేవలము దేవునితో ఐక్యమై జీవించడం ద్వారా మాత్రమే అని  నంటే నీతిమంతమైన మార్గమున ఒక నీతిమంతునిగా మెలగడం ద్వారా జరుగుతున్నది. 

నీతిమంతుని యొక్క లక్షణాలను మనము చూస్తున్నాం. స్నాతి ప్రథముడిగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి, మృదుమనసు కలిగి ఉండాలి. అంటే ఒక మాటలో చేపల అంటే క్రీస్తు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా మనము కుడి ఉండాలి. కానీ మనము ఏ విధంగా ఉంటున్నాం? విభుంనమైనటువంటి స్వభావము కలిగి ఉంటున్నాం.సువిశేష పఠనంలో మనము చూస్తున్నాం. క్రీస్తు తరువాత తాను స్థాపించబోయే రాజ్యాన్ని తన శిష్యులు కొనసాగించాలి అన్న ఉదేశ్యముతో వారికి తనను గురించి తాను చెప్పుకుంటూ ఉంటే శిష్యులు మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. యేసును అర్ధంచేసుకోలేక ఉంటున్నారు.    

మరి మనము మన యొక్క జీవితంలో యేసును అర్ధం చేసుకొని జీవిస్తున్నామా ? తండ్రి దేవుని యొక్క ఆలోచనలను మనం అర్ధం చేసుకోవాలి అంటే ముందుగా మనము ఎం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని తొలగించుకొని అందరితో కలిసి ఏకత్వంగ జీవించాలి. అందరికి భిన్నంగా ఉన్నట్లయితే మన జీవితంలో మనమే కలహాలు సృష్టించుకున్నవాళ్ళం అవుతాం. అలా కాకుండా అందరితో కలిసి ఉన్నట్లయితే మనము దేవుని చేరగలుగుతాం. తనయొక్క శిష్యులు ఆయనతో కలిసి ఉన్నప్పటికీ ఆయనను అర్ధం చేసుకొనలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం యేసుయొక్క ఆలోచనలకూ అతీతంగా ఉంటూ ఉన్నాయి. మనము కూడా కొన్నిసార్లు ఈ విధంగా దేవుని యొక్క ఆలోచనలకూ విభిన్నంగా ప్రవర్థిస్తూఉంటాం. కారణము  విధేయత లేకపోవడం. కాబట్టి మనము దేవునితో కలిసి జీవించాలి అంటే విధేయత కలిగి జీవించాలి. చిన్న బిడ్డల వాలే మారు మనసు కలిగి ఉండాలి.



ఎడిత్ స్టెయిన్ కార్మెల్ భవన్

జానంపేట 

 బ్రదర్. పవన్ కుమార్ ఓ. సి. 

రక్షకుడైన యేసు ప్రభువు- మంచి కాపరి

 యోహాను 10: 27-30 నా గొఱ్ఱెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అ...