22, మార్చి 2025, శనివారం

తపస్సు కాలపు మూడవ ఆదివారము

తపస్సు కాలపు మూడవ ఆదివారము 

నిర్గమ 3:1-8, 13-15
1కొరింథీ 10:1-6, 10-12
లూకా 13:1-9
క్రీస్తునాధునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము  తపస్సు కాలపు మూడవ ఆదివారంలోనికి ప్రవేశించియున్నాము. ఈ నాటి మూడు దివ్యాగ్రంధ పఠనములు మనకు దేవునితో మన సంబంధం గురించి మరియు ఆయనకు మహిమను తెచ్చే జీవితాలను ఎలా జీవించాలని అనే  ముఖ్యమైన అంశాల గురించి తెలియజేస్తున్నాయి.
           అసలు దేవునితో సంబంధం అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే పునీత అవిలాపురి తెరెసమ్మ గారు  ఈ విధంగా అంటున్నారు. 
1. వ్యక్తిగత అనుభవం: ప్రతి ఒక్కరి జీవితములో కూడా దేవునితో ఒక వ్యక్తిగతమైన సబంధం ఉండాలని మరియు మన హృదయాలలో దేవునితో ఒక ప్రత్యేకమైన సంభందం  ఉండాలని ఈ మొదటి మాటలో అంటున్నారు.
2. స్నేహం: ఆమె ప్రార్థన దేవునితో ప్రేమపూర్వకమైన స్నేహం అంటున్నారు.  ఎందుకు ఆమె ఆలా అంటున్నారు అంటే స్నేహితులు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారో, తమ సంతోషాలను మరియు బాధలను పంచుకుంటారో, అదే విధంగానే మనం కూడా దేవునితో మన హృదయాన్ని తెరవాలని ఒక స్నేహితునివలె మనము కూడా ఆయనతో మాట్లాడాలని తెలియజేస్తున్నారు.
3. ఆత్మ పరిశీలన: దేవునితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఆత్మ పరిశీలన చాలా ముఖ్యమైన సాధనమని ఆమె అంటున్నారు. మన బలహీనతలను మరియు మన పాపాలను గుర్తుచేసుకొని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి ఆమె మనకు తెలియజేస్తున్నారు. 
                          ఈ విధమైనటువంటి సంబంధాన్ని  మనం  జీవిచాలని ఆమె అంటున్నారు. ఈ నాటి పఠనలుకూడా ఇదే విషయాన్ని  మనకు తెలియజేస్తున్నాయి. 
           ముందుగా మొదటి పఠనములో మోషే దేవుని యొక్క పిలుపును అందుకుంటాడు. దేవుడు మండుతున్న పొద రూపంలో మోషేకు ప్రత్యక్షమై, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకుంటానాడు. ఇక్కడ, దేవుడు మోషేతో తనను తాను 'నేను ఉన్నవాడను' అని పరిచయం చేసుకుంటాడు, ఇది ఆయన శాశ్వతత్వాన్ని, స్వయం సమృద్ధిని మరియు విశ్వాసనీయతను తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు తన ప్రజల బాధలను చూసి, వారిని విడిపించడానికి ఒక గొప్ప నిర్ణయాన్ని  తీసుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ దేవుని పిలుపు మరియు ఆయన శక్తిని ఈ సంఘటనద్వారా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనము గమనించలసింది దేవుని పేరు యొక్క ప్రాముఖ్యత మరియు ఆయనతో మన సంబంధం గురించి ఇది తెలియజేస్తుంది. 
         రెండవ పఠనములో  పౌలు ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణం నుండి నేర్చుకోవలసిన గుణ పాఠాల గురించి కొరింథీయులకు గుర్తుచేస్తున్నాడు మరియు వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని అద్భుతాలను చూసినప్పటికీ, వారు అవిధేయత, విగ్రహారాధన మరియు సణుగుడు ద్వారా పాపం చేశారు అని పౌలు గారు వారి అనుభవాలను మనకు హెచ్చరికగా ఉపయోగిస్తాడు, తద్వారా మనం అదే తప్పులు చేయకుండా ఉంటాము అని దేవునితో సభందం కలిగి జీవిస్తామని అంటున్నారు.
అంతేకాకుండా ఇక్కడ మనం దేవుని విశ్వాసనీయతను అంత తేలికగా తీసుకోకూడదు. మన హృదయాలను పాపం నుండి కాపాడుకోవాలి మరియు దేవునికి విధేయత చూపాలి అని అంటున్నారు. ఎందుకంటే గర్వం అనేది మన పతనానికి దారితీస్తుందని కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయంగా ఆయనతో సంబంధం  కలిగి ఉండాలని అంటున్నారు.
         చివరిగా సువిశేష పఠనములో యేసు పీలాతు చేతిలో చంపబడిన గలిలయుల గురించి మరియు సిలోయము గోపురం కూలి చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘటనలు ఎందుకు క్రీస్తు వారికీ తెలియజేస్తున్నాడంటే పాపులు పశ్చాత్తాపపడకపోతే వారు కూడా నాశనం అవుతారని హెచ్చరికగా ఉపయోగిస్తాడు. యేసు ఒక అంజూరపు చెట్టు ఉపమానాన్ని కూడా చెబుతాన్నాడు, ఇది దేవునిపట్ల మన పశ్చాత్తాపం మరియు ఫలాలను ఉత్పత్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తుంది. మనం మన పాపాలను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని వైపు తిరగాలుగుతామో. అపుడే దేవుడు మనకు పశ్చాత్తాపపడటానికి అవకాశాలను ఇస్తాడు, కానీ మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మనం దేవునికి ఫలాలను ఇచ్చే విధంగా మనం మారాలని, అంటే మనం ఆయనకు మహిమ తెచ్చే జీవితాలను జీవించాలి తెలియజేస్తున్నాడు.

కాబట్టి  ప్రియా దేవుని బిడ్డలరా ఇక్కడ మనం నేర్చుకోగల కొన్ని సాధారణ గుణాలు మనకు కనిపిస్తాయి. దేవుడు నమ్మదగినవాడు మరియు విశ్వాసనీయుడు. మనం పాపం నుండి పశ్చాత్తాపపడాలి మరియు దేవునికి విధేయత చూపాలి.
 కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ  తపస్సు కాలం మనం పశ్చాత్తాపాన్ని, విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి, దేవునిచే అనుగ్రహించబడిన సమయం కాబట్టి  మన పాపాలను దేవుని ముందు ఉంచుతు పశ్చాత్తాపం పడి దేవునితో సంబంధం  కలిగి జీవించాలని ప్రార్దించుకుందాము.

Fr. Johannes OCD

15, మార్చి 2025, శనివారం

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము
ఆదికాండము 15:5-12, 17-18
ఫిలిప్పీయులు 3:17-4:1
లూకా 9:28-36

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని  దైవ భక్తులారా, ఈ రోజున మనమందరము తపస్సుకాలపు రెండవ  ఆదివారం లోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ నాటి మూడు పఠనలు కూడా మనం దేవుని విశ్వసించాలి, క్రీస్తును అనురించాలి మరియు ఆయన మాట వినాలి అని తెలియజేస్తున్నాయి ఎందుకంటే అలా చేయడం ద్వారా, మనం ఆయన వాగ్దానాలను పొందుతాము మరియు ఆయన మహిమలో పాలుపంచుకుంటాము అని క్లుప్తంగా వివరిస్తున్నాయి.
           మొదటి పఠనములో ఆదికాండము  నుండి చూస్తున్నాము ఇక్కడ అబ్రాహామునకు మరియు దేవునికి మధ్య ఒక ఒప్పందం గురించి తెలియజేస్తుంది. దేవుడు అబ్రామునకు ఆకాశంలోని నక్షత్రాలను చూపించి, అతని సంతానం ఆలాగే ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. దానికి గాను అబ్రాము దేవునిపై విశ్వాసం చూపిస్తున్నాడు, ఇది అతనికి బహు మంచిగా అనిపించింది. మరల కొద్దీ సేపటి తర్వాత అబ్రాము దేవుని వాగ్దానం గురించి అనుమానం వ్యక్తం చేసాడు అది ఏవిధంగానంటే తన సంతానం ఈ భూమిని ఎలా పొందుతుందని  దేవుని అడిగాడు. దానికి గాను దేవుడు అబ్రాహాముతో నీవు దీనిని నమ్ముటకు కొన్ని జంతువులను తెచ్చి, వాటిని రెండుగా కోసి, ఒకదానికొకటి ఎదురుగా అమర్చమని చెప్పాడు. ఈ ఒప్పంద విధిలో భాగంగా, దేవుడు ఒక పొగమంచు పొగ మరియు మంట దీపం రూపంలో జంతువుల మధ్య దీర్ఘంగా నడిచాడు. దానికి గాను ఈ ఒప్పందంలో దేవుడు అబ్రాము సంతానానికి కనాను అను భూమిని ఇస్తానని వాగ్దానం చేసియున్నాడు. అబ్రాము సంతానం నాలుగు వందల సంవత్సరాలు బందీలుగా ఉంటారని, తర్వాత వారు గొప్ప సంపదతో తిరిగి వస్తారని దేవుడు అబ్రాహామునకు ఒక కచ్చితమైనటువంటి మాటను చెప్పాడు. ఇక్కడ ఈ వచనలలో దేవుని విశ్వాసనీయతను మరియు ఆయన వాగ్దానాలను నెరవేర్చే శక్తిని చూపిస్తుంది. అబ్రాహాము దేవునిని విశ్వసించినట్లే, మనం కూడా ఆయనను విశ్వసించాలి మరియు ఆయన వాగ్దానాలపై ఆధారపడి జీవిస్తుండాలి, ఎందుకంటే మనము కూడా అబ్రాహాము వలే దేవునిపై విశ్వాసం ఉంచి జీవిస్తే అయన వలే మనము కూడా దివించబడతాము. కాబట్టి ఆ ఆశీర్వాదలను ఎలా పొందలో అబ్రాహామును ఒక ఉదాహరణగా తీసుకోవాలని మొదటి పఠనము మనకు వివరిస్తుంది.
            తరవాత రెండవ పఠనములో  పౌలు గారు ఫిలిపియులైన క్రైస్తవులకు సరైన మార్గంలో నడవాలని సలహా ఇస్తున్నాడు. అతను తనను  అనుసరించమని చెబుతున్నాడు. ఈ సందర్భంలో  పౌలు ఎందుకు ఆ ప్రజలను ఆవిధంగా అంటున్నాడంటే అతని విశ్వాసం మరియు నిబద్ధతను అనుసరించమని సలహా ఇస్తున్నాడు. అదేసమయంలో, కొందరు ప్రజలు వారి శరీరాన్ని దేవుని దృష్టిలో అపవిత్రం చేస్తున్నారని మరియు వారికీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారని వారి జీవితాలను బట్టి పౌలు ఆవిధంగానైనా వారిని తిరిగి దేవుని చెంతకు తీసుకునిరావాలన్నా ఆలోచనతోటి వారిని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా, వారు ప్రభువులో స్థిరంగా నిలబడాలని కోరుకుంటున్నాడు. ఈ విధంగా, పౌలు ఫిలిప్పీయులకు మంచి మార్గంలో నడవడం మరియు దేవుని వాక్యాన్ని పాటించడం గురించి బోధిస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా అనేక సార్లు మనకిష్టమొచ్చినట్లు జీవిస్తూ ఉంటాము. కాబ్బటి ఈనాటి నుండి మనమందరము చెడు జీవితాన్ని వదలిపెట్టి మంచి మార్గాన్ని ఎంచుకోవడం మరియు దేవుని వాక్యాన్ని పాటించడం గురించి ఆలోచించడం మొదలు పెట్టమని పౌలు గారు మనలను  ఈ రెండవ పఠనము ద్వారా హెచ్చరిస్తున్నాడు.
           చివరిగా సువిశేష పఠనములో  యేసు ప్రభువుని రూపాంతరికరణము గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు మొషే మరియు ఎలియా  కలిసి ఉండగా రూపాంతరం చెందాడు. ఈ సందర్భంలో ఇక్కడ మన ఆలోచన ఏవిధంగా ఉండాలంటే యేసు ప్రభువు యొక్క విశ్వాసం మరియు అయన యొక్క వాక్య పరిచర్య మరియు అయన వచ్చిన పనిని గురించి ఆలోచించామని మనకు సలహా ఇస్తుంది. ఇక్కడ మనం గమనించలసింది ఏమిటంటే, యేసు తన శిష్యులైన పేతురు, యోహను, యకోబులను వెంటబెట్టుకొని పర్వతము మీదికి తీసుకొని వేలతాడు. అక్కడికి వెళ్లిన తరువాత యేసుక్రీస్తు రూపాంతరం చెండుతాడు. అయన ముఖం మారిపోయి, తన వస్త్రాలు ప్రకాశవంతంగా మారుతాయి. మోషే మరియు ఎలియా ప్రవక్తలు  ఆయనతో సంభాసించటం వారి ముగ్గురికి కనిపిస్తారు. అక్కడ వారు ముగ్గురు అయనకు జెరూసలేములో సంభవించే మరణం మరియు పునరుత్థానం గురించి మాట్లాడారు వారు మాట్లాడుకుంటారు. ఇది అంత జరిగిన తరువాత వారు తిరిగి కిందకు వచ్చే సమయములో ఒక మేఘం వారిని కమ్ముకుంటుంది. ఆ మేఘం నుండి ఒక స్వరం వారికీ వినిపిస్తుంది, అది ఏమిటంటే ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఏర్పరచుకొనినవాడు; ఆయన మాట వినుడు అని ఒక శబ్దం వస్తుంది. ఇక్కడ మనం గమనించలసింది.
ఈ సంఘటన యేసు యొక్క దైవత్వాన్ని మరియు ఆయన తండ్రితో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మోషే మరియు ఏలీయా కనిపించడం ద్వారా పాత నిబంధన యేసులో నెరవేరుతుందని చూపిస్తుంది. తండ్రి స్వరం యేసును ఆయన కుమారుడిగా ధృవీకరిస్తుంది మరియు ఆయన మాట వినమని మనకు ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి మనము అయన మాట విని దేవుని ఆశీర్వాదలు పొందాలని మనము ప్రార్థన చేసుకోవాలి మరియు ఆయనను విశ్వాసించాలి.
        కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈ తపస్సు కలమంతా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము, అంతే కాకుండా మన విశ్వాసాన్ని దేవుని పట్ల ఏంతగా ఉందొ నిరూపించుకొనే ఒక గొప్ప అవకాశము, అందుకని మనం మన విశ్వాసాన్ని దేవుని ముందు వ్యక్తపరుచుచు అయన యడల మన విశ్వాసాన్ని చూపిస్తూ జీవించాలని ఈ దివ్యబలి పూజలో విశ్వాసంతో ప్రార్థించుకుంటు పాల్గొందాము.
Fr. Johannes OCD 

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...