9, ఆగస్టు 2021, సోమవారం

సంసోను యొక్క జీవిత కథ

సంసోను యొక్క జీవిత కథ

ఇశ్రాయేలీయులును దేవుడు తన సొంత ప్రజలుగా ఎన్నుకొని అయన చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ వారిని కంటికి రెప్పవలె కాపాడుతున్నాడు, కానీ వారు మాత్రం దేవునికి వ్యతిరేకంగా దుష్క్యార్యములను చేస్తున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులను యావే దేవుడు నలువది యేండ్ల పాటు వారిని ఫిలిస్తీయుల వశము చేసెను. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైన బానిసత్వ జీవితం జీవిస్తున్నారు అనేకమైన కష్టాలు, బాధలు పడుచున్నారు. ఆవిధంగా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే వారు దేవునికి ఇష్టమైన వారు. కనుక వారందరిని రక్షించటానికి, కాపాడటానికి ఒక నాయకుడు కావలయును వారినందరిని ఎదురించటానికి ఒక వీరుడు కావాలి, కనుక దేవుడు ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతడే సంసోను. సంసోను పుట్టుక అలాంటిది ఇలాంటిది కాదు. 
మనం బైబిల్ గ్రంధం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తుల యొక్క పుట్టుక గురించి దేవదూత పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి శుభవార్తను తీసుకొని వచ్చింది, అందులో మొదటి వ్యక్తి సంసోను. సంసోను జన్మించినప్పటినుంచి దైవానుగ్రహం కలవాడు. అతడు జన్మించినప్పటినుండి మరణించినవరకు వ్రత తాత్పరుడై జీవించెను. ఆ వ్రతము నజరేయ వ్రతము, ఈ వ్రతము చేపట్టడం అంత సాధారణమైనది కాదు. ఎందుకంటే ఆ వ్రతం చేపట్టు వారు ద్రాక్షరసం గాని, తల జుట్టు కత్తరించకూడదు. ఎవరైతే ఈ వ్రతాన్ని చేపడతారో వారు దేవుని శక్తి పొందిఉంటారు. అయితే ఈ వ్రతాన్ని చేపడుతున్న సంసోనుకు దేవుని ఆత్మ, శక్తి కలిగి ఉన్నాడు.
ఒకానొకరోజున సంసోను తిమ్నాతుకు చేరెను ఆ నగరచివరిలో ఒకద్రాక్షతోటను చేరగానే అక్కడ ఒక కొదమసింహం గర్జించుచు అతని మీదికి దూకెను. ఆసమయంలో సింహం మీదపడి మేకపిల్లను చీల్చినట్లు చీల్చివేసెను. ఈసన్నివేశం సంసోనుయొక్క ధైర్యాన్ని, వీరత్వాన్ని మనకు తెలియజేస్తుంది తరువాత సింహండొక్కనుండి చేసిన పట్టు తేనే త్రాగి  మిగిలినది సంసోను తల్లిదండ్రులకు ఇచ్చెను.
సంసోను వివాహం చేసుకోబోయే యువతిని చూసిన తరవాత వారికీ విందు చేసెను. అక్కడ పెండ్లికుమార్తె వైపువారు సంసోనుయొక్కశరీర దారుఢ్యాన్ని, కండలుతిరిగినబలాన్ని, అతని ఎత్తునుచూసి, భయపడి వారికీ తోడుగా ముప్పదిమంది మనుషులను తెచ్చుకొనెను. సంసోనుకు శరీరబలమేకాకా తనకు జ్ఞానంకూడా ఎంతోమిక్కుటంగాఉన్నది, అతని వివాహానికివచ్చిన ముప్పదిమందిలో తనయొక్కజ్ఞానముతో మిమ్మొక పొడుపుకత అడిగెదను పెండ్లిపండుగ ఏడురోజులు ముగియకమునుపే కథ విప్పెదరే మీకు ముప్పది కప్పడములు, ముప్పదికట్టుబట్టలు బహుమానంగాఇచ్చెదను. విప్పలేకుంటే మీరు ఏదైనా బహుమానం నాకు ఇవ్వండి. ఇది పందెం అని వారికీ సవాలు విసిరెను. సంసోను తినెడు దానినుండి తినబడునది వచ్చే బలమైనదాని నుండి తీయనిది వచ్చే అని వారికీ పొడుపు కథ వేసెను. వారికీ మూడురోజులు గడిచినగాని శతవిధాలుగా ప్రయత్నించినా ఎలాంటి సమాధానం దొరకలేదు. చివరికి అతని భార్యపోరు పడలేక పొడుపుకథ విప్పిచెప్పెను. సమాధానంచెప్పిన వారికీ బహుమానంఇచ్చి మిగతావారందరిని కోపంతో చంపివేసెను.
కొంతకాలం తరవాత తన భార్యను చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి సంసోనుకి అడ్డువచ్చి నీకు ఆమెమీద అయిష్టము కలిగిందనుకొని స్నేహితునకుఇచ్చి పెండ్లిచేశాను అని చెప్పగా ఆవేశంతో వారిపంటలను, ద్రాక్ష, తోటలను, ఓలీవు తోటలను గుంటనక్కలచేత త్రొక్కించి వాటికి నిప్పంటించి కాల్చివేసెను. దీనంతటికి సంసోనే, కారకుడని  తెలుసుకొని తిమ్నాతు పౌరుని కుమార్తెను పెండ్లాడుననుకొని వారందరిని నిలువునా కాల్చి చంపిరి. సంసోను ఇది అంత  విని మీరింత పాడు పని చేసిరి అని ఫిలిస్తీయుల మీదపడి చిక్కిన వారిని చికినట్లుగా చీల్చి చండాడి చంపివేసెను. ఇది అంతయు కూడా దేవుని అనుగ్రహం వలన జరుగుతున్నది. ఫిలిస్తీయులు యూదా మీదికి దండెత్తి వచ్చి లేహి  నగరమును ముట్టడించిరని చూసిన యూదియులు సంసోనును ఫిలిస్తీయులకు అప్పగించి ఆ వీరునకు యూదియులు రెండు క్రొత్త తాళ్లతో బందించి కొండా గుహ నుండి వెలుపలకు  తీసుకోని వచ్చారు. సంసోను ఫిలిస్తీయులను చూడగానే యావే ఆత్మ సంసోనును ఆవేశింపగా అతని బంధములనియునిపండుకొనిన నారా త్రాళ్లు  ఆవిధంగా అవుతాయో ఆవిధంగా త్రాళ్లు అన్ని ఆయను. 
ఆ త్రాటి కత్తులన్నియు కూడా ఒక్కసారిగా సడలిపోయెను. అదే స్థలములో ఒక పచ్చి పచ్చిగా నున్న గాడిద దౌడ ఎముక ఒకటి సముసోను కంట పడెను. అతడు ఆ ఎముకను అందుకొని ఒక వీరుడు, సైనికుడు ఏవిధంగానైతే తన ప్రజల కోసం పోరాడుతారో అదేవిధంగా సంసోను కూడా ఫిలిస్తీయులతో పోరాడి ఒక్కొక్కరిని గాడిదలను కొట్టినట్టు కొట్టి, ఒక వీరుడివలె వేయి మందిని చంపెను. చేతిలోని దౌడ ఎముకను పారవేసిన స్థలమును రామతులేహి అని పేరు వచ్చెను, మహా విజయం సంసోను దప్పికగొనినపుడు దేవునికి ప్రార్థన చేయగా నెల బ్రద్దలై గోయి ఏర్పడి దాని నుండి నీరు వచ్చెను. ఆ నీరు త్రాగి సంసోను సేద తీర్చుకొనెను కనుక ఆ ఊటకు అన్హాకోరే అనే పేరు వచ్చెను.
కొన్ని రోజుల తరవాత సంసోను గాజాకు వెళ్లి అక్కడ ఒక వేశ్య ఇంటికి వెళ్ళినపుడు సంసోను వచ్చినన్ని విని ఆ ఊరి జనులందరు ప్రోగై నగర ద్వారమున కాపలా ఉండగా సంసోనును చంపవచ్చుగా అనుకోని రాత్రంతయు ఊరకుండిరి. సంసోను నది రాత్రి వరకు అలంటి సద్దా చేయక నిద్రపోయాను. కానీ అతడు అర్ద రాత్రి లేచి నగర ద్వారము తలుపులను, ద్వారా బంధాలను, అడ్డుకర్రలతో సహా ఊడబెరికి చకశక్యంగా అంతో బలమైన ద్వారములనియు భుజాలపైన వేసుకొని హెబ్రోను ఎదురుగ ఉన్న కొండా పైకి ఎక్కి వాటన్నిటిని అక్కడే వదలిపెట్టెను. 
ఆ తరవాత సారెకు లోయలో నివసించే డెలీలా కు వచ్చి పచ్చిగా ఉన్న అల్లే త్రాడులను ఏడింటిని ఇచ్చి ఆమె చేత సంసోను బందీ చేసెను.  సంసోను మాత్రం ఆ త్రాళను అన్నిటిని నిప్పంటించిన నారా తరాల వాలే సునాయాసంగా తెంచివేసెను. ఆ తర్వాత ఎవరు వాడని కొత్త తాళ్లతో సంసోను బంధించిరి. కానీ సంసోను తన చేస్తి కట్టులన్నియు దారములవలె త్రెంచి వేసెను మరల మరొకసారి సంసోను నిద్ర పోయిన సమయంలో అతని తలా జాడలను ఏడూ పడుగులకు వేసి మీకునకు బిగగొట్టి బంధించిరి అతడు నిద్ర లేచి తల వెంట్రుకలను వానిని కట్టిన మేకులను తన బలంతో ఒక్క ఊపున ఊడబీకేను. ఆవిధంగా తన వీరత్వాన్ని, బలాన్ని ఫిలిస్తీయుల ఎదుట నిరూపించుకొనెను.  
చివరకు ఫిలిస్తీయులు సంసోను యిత్తడి గొలుసుతో బంధించి సంకెళ్లు వేసిరి. అక్కడ సంసోను అందరి ఎదుట వీర కార్యాలు చేసెను. ఆ మందిరములో ఫిలిస్తీయ దొరలూ మరియు మూడువేలమంది స్త్రీ పురుషులు పై అంతస్తున కూర్చుండి సంసోను చేయు వీర కార్యాలను చుస్తునారు.ఆ సమయంలో ఫిలిస్తీయులపై ఒక్క దెబ్బతో పాగా తీర్చుకోవటానికికి అతడు మందిరమును మోయు మూలా స్తంభాలను రెండింటి మీద చేతులు మోపి, కుడి చేతితో ఒక దాని మీద, ఎడమ చేతిని ఇంకో దాని మీద మోపి రెండు కంబములపై తన బలము చూపెను.
సంసోను ముందుకు వంగి స్తంభములను శక్తి కొలది నెట్టెను, ఆ నెట్టుకు మందిరము పెళ్లున కూలి, సర్దారుల మీద, ప్రేక్షకుల మీద  పడెను, సంసోను తాను బ్రతికి ఉండగా చంపినా వారి కంటే చనిపోవుచు చంపిన వారే ఎక్కువ. ఆ తర్వాత సంసోను, సోదరులు, బంధువులు వచ్చి మృత దేహాన్ని జోరా, ఏస్తవోలు నగరము మధ్యనున్న మనోవా సమాధిలోనే అతనిని కూడా పాతిపెట్టిరి.
ఈ విధంగా సంసోను ఫిలిస్తీయుల ఎదుట అనేక వీర కార్యాలు ప్రదర్చించి ఇశ్రాయేలు ప్రజలకు ఇరవై యేండ్ల పాటు న్యాయాధిపతిగా ఉండెను. సంసోను బ్రతికినంత కాలం ఫిలిస్తీయులకు హడలెతించెను..
-బ్రదర్. సాలి. రాజు . ఓ.సి.డి.

తోబియా జీవిత కథ



మనము రక్షణ గ్రంధంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు తన సేవ కొరకై మరియు తన ప్రజలను రక్షించడానికి ఎన్నుకున్నారు. మనం ఇప్పుడు చూస్తున్న కథలో తోబియా అనే వ్యక్తి ద్వారా తన తండ్రిఐన  తోబితునకు అంధత్వాన్ని తొలగించడానికి మరియు తనకు కాబోయే భార్య సారాకు పిశాచ విముక్తిని కలిగించడానికి దేవుడు తోబితూను ఎన్నుకున్నాడు.

     తోబియా తల్లిదండ్రులు తోబితూ మరియు అన్న. తోబితూ తన జీవిత కాలమంతా కూడా తల్లి దండ్రులకు చేదోడు వాదోడుగా తమ కన్ను సన్నులలో జీవిస్తు, మరియు అన్ని విషయాలలో సహాయం చేస్తుండేవాడు. 

తోబియా తండ్రి తోబితూ ద్రుష్టి కోల్పోయి వారు అంతయు కోల్పోయి తోబితూ చనిపోతాడు అని అనుకున్న సమయంలో  తోబితుకు పూర్వము తాను మేదియ దేశమునందలి రాగీసు పట్టణమును తన స్నేహితుడైన గబాయేలు ఇంట దాచి ఉంచిన ధనము జ్ఞప్తికి తెచ్చుకొని తన కుమారుడైన తోబియాకు తెలియచేస్తాడు.

తోబియా తండ్రితో నేను నీవు చెప్పినదెల్ల చేయుదును అని చెప్పి తోబియా తండ్రితో నేను గబాయేలు నుండి ధనము తీసుకురావడం ఎలా? నేను అతనిని ఎరుగను, అతడు నన్ను ఎరుగడు. మరి నేను ఏ ఆనవాలు చూపవలెను? అదియుగాక మేదియాకు ఏ త్రోవనా పోవవలెను నాకు తెలియదు, అని తండ్రితో చెప్పెను. అందుకు తండ్రి తోబియాకు గబాయేలు సంతకం చేసిన కాగితం ఒక ముక్క ఇచ్చి మరొకటి గబాయీలు వద్ద ఉన్న సొమ్ముతో ఉన్నదని చెప్పి తన వద్ద ఉన్నదీ తోబియాకు ఇచ్చి, ఇది చూపించు అనెను.

తోబియా తనకు మేదియాకు తీసుకుపోవడానికి ఒక స్నేహితుని వెదకడానికి బయటికి వెళ్ళగానే రఫాయేలు దేవదూత అతనికి ప్రత్యక్షమై కనబడెను. కానీ తోబియాకు దేవుదుతా అని తెలియదు. అందుకు తోబియా అయ్యా! మీది ఏ వూరు అని అడిగెను . అందుకు ఫాయేలు నేను ఇశ్రాయేలుడను. ఈ పని అయినా దొరుకుతుందేమో అని ఈ పట్టణమునకు వచ్చాను అని అనెను. అందుకు తోబియా మేదియు వెళ్ళడానికి దారితెలుసున అని అని ప్రశ్నించెను. అందుకు రెఫాయేలు నేను అచటికి చాల సార్లు వెళ్లితిని, ఆ ధారులన్నియు నాకు సుపరిచితములే అని అనెను. రఫాయేలు నేను ఆ దేశమునకు పోయున్నప్పుడెల్ల రాగీసు నగరమున వసించు మా బంధువగు గబాయేలు ఇంట బస చేసిడివాడను అని అనెను. అందుకు తోబియా స్నేహితునితో నువ్వు ఇక్కడే ఉండుము నేను ఈసంగతిని నా తండ్రితో చెప్పి వత్తును, నీవు నాతో ప్రయాణము చేయవలెను. నేను నీకు వేతనం చెల్లింతును అని అనెను. అందుకు రఫాయేలు సరియే , నీవు కోరినట్లే నేను నీవెంట వత్తును అని అనెను.

అందుకు తోబియా తండ్రి వద్దకు పోయి నాతో ప్రయాణము చేయుటకు మన జాతి వాడు ఒకడు దొరికెను అని చెప్పి రఫాయేలును  ఇంటికి ఆహ్వానించెను. తోబియా తండ్రివద్ద దీవెనలను పొంది తల్లిదండ్రులను ముద్దాడి మేదియాకు ప్రయాణము గట్టెను. తోబియా దేవదూత తో ప్రయాణమై వారు సాయంత్రం వరకు ఠీగ్రీసు నది తీరమున విడిదిచేసెను.  తోబియా కాళ్ళు కడుగు కొనుటకు ఏటిలోకి దిగిన వెంటనే పెద్దచేప ఒకటి నీటిలోనుండి దూకి తోబియా పాదములు పట్టుకో బోయెను . దానిని చూసి అతడు గట్టిగ అరిసెను. దేవదూత అతనితో వోయి ఆ మత్స్యమును పట్టుకొనుము, దానిని జారిపోనీకుము అని అనెను. వెంటనే  తోబియా ఆ చేపను పట్టుకొని ఒడ్డుకులాగెను.  

దేవదూతచేపకడుపును చీల్చి దాని పిత్తమును కాలేయమును మరియు గుండెను తీసి నీవద్ద ఉంచుకొనుము. కానీ దాని ప్రేగులను మాత్రమూ పారవేయుము అనెను. తోబితూ దేవదూత చెప్పినట్లే చేసెను. అతడు చేపలోని కొంత భాగమును కాల్చి భుజించి తరువాత వారు ఇరువురు ప్రయాణమును సాగించిరి. మేదియ దరిదాపుల్లోకి వచ్చిరి. తోబియా దేవదూతను చూసి నేస్తమా అసరియా (దేవదూత అతనికి చెప్పిన పేరు) చేప పిత్తముకాలేయము, గుండెలతో ఏ ఏ రోగములను నయము చేయవచ్చును  అని అడిగెను. అతడు చేప గుండెను కాలేయమును కాల్చి పొగ వేసినచో నరులను పట్టి పీడించు భూతముగాని పిశాచముగాని పారిపోవును. ఆ నరులకు మరల పిశాచము భాధ సోకదు. పిత్తమును తెల్లని పొరలు కమ్మిన వారి కన్నులకు లేపనముగా ఉపయోగించవచ్చును. దాని కంటి పొరలమీద పూసి వాని మీద ఊదిన చాలు, పొరలు తొలగి పోవునని చెప్పెను.  

తరువాత వారిరువురును మేదియ దేశమున ప్రవేశించి ఏక్బటానా నగరమున సమీపించెను.అప్పుడు దేవదూత తోబియానీ పేరేతి పిలిచి నేటి రాత్రి మనము నీ బంధువైన రగువేలు ఇంట బస చేయవలెను. అతనికి సారా అను కుమార్తె కలదు ఆమె తప్ప అతనికి వేరే సంతానం లేదు. ఆ కన్య నీకు దగ్గరి చుట్టము. నీకు ఆమెను పెండ్లియాడు హక్కు కలదు. ఆమె తండ్రి ఆస్తి కూడా నీకు దక్కును అని అనెను.  అందుకు తోబియా రెఫాయేలుతో నేస్తమా ఆ యువతీని ఇది వరకి వరుసగా ఏడుగురు వరులకు ఇచ్చి పెళ్ళిచేసిరి. వారిలో ప్రతి వాడును మొదటి రేయినే శోభనపు గదిలోనే చచ్చెను. ఈ సంగతులెల్ల నాకు తెలియును. 

ఆమెను పట్టిన భూతమే ఆ వరులను సంహరించెను అని వింటిని. ఆ భూతము సారాకు ఎట్టి హాని చేయదట. ఆమెను సమీపించు పురుషులను మాత్రమూ పట్టి చంపును. నా మట్టుకు నాకాపిశాచమానిన భయముగా ఉన్నది. మా తండ్రికి నేనొక్కడినే కుమారుడును నేను చనిపోయినచో, నా తల్లిదండ్రలు దిగులుతో సమాధి చేరుకొందురు. అప్పుడు వారిని పాతి పెట్టు దిక్కు కూడా ఉండదు అని అనెను.అందుకు దేవదూత తోబియాతో ఆ భూతమును తలంచుకొని భయపడకుము. సారాను స్వీకరింపుము. ఈ రాత్రియే రగువేలు  ఆ యువతిని ప్రధానము చేయును. నీవు ఆమె పడక గదిలోకి వెళ్ళినవెంటనే చేప గుండెను తీసికొని కాలుచున్న సాంబ్రాణి మీద వేయుము. ఆ వాసనకు భూతము పారిపోవును. అది మరల సారా చెంతకు రాదు. నీవు ఆ యువతిని కూడక ముందే మీరిరువురు లేచి దేవునిని ప్రార్థింపుము అని అనెను. 

తోబియా రఫాయేలు చెప్పిన మాటలను విని, అతడు సారాను గాఢముగా ప్రేమించి తన హృదయమును ఆమెకు అర్పించెను . వారు ఏక్బటానా నగరమును చేరగానే తోబియా, నేస్తమా అసరియా నన్ను వెంటనే రగువేలు ఇంటికి తీసుకొని పొమ్ము అనెను. దేవదూత తోబియాను అతని ఇంటికి కొనిపోయెను. వారు మొదట రగువేలును పలకరించెను, అతడు వారిని లోనికి ఆహ్వానించెను. వారు వారితో మేము నఫ్తాలి తెగకు చెందినవారలము ప్రస్తుతం నీకివే పట్టణములో ప్రవాసమున ఉన్నవారమని చెప్పిరి తోబియా రగువేలుతో, తోబితూ నా తండ్రియే అని చెప్పెను. ఆ పలుకులు విని రగువేలు తటాలున లేచి ఆనందభాష్పములతో తోబియా ను ముద్దాడెను. వారు స్నానము చేసి భోజనమును కూర్చుండబోవుచుండగా, తోబియా నేస్తునితో, నేస్తమా అసరియా నీవు సారాను నాకిచ్చి పెళ్లి చేయమని రగువేలును అడగవా? అని అసరియా తో చెప్పెను. రగువేలు ప్రక్కనుండి ఆ మాటలు విని తోబియాతో, మా అమ్మాయి సారాను పెండ్లియాడుటకు నీవుతప్ప మరెవ్వరును అర్హులుకారు. నీవు మాకు అయినవాడవు అని అనెను. అంతటా రగువేలు సారాను పిలిపించి, ఆ యువతిని చేపట్టుకొని ఆమెను తోబియాకు అప్పగించెను. 

ఆ తరువాత వారు అన్న పానీయాలు సేవించి ముగించినపిదప రేయి నిద్ర పోవు సమయమాయెను. అప్పుడు సారా తల్లిదండ్రులు తోబియాను శోభనపు గదిలోనికి తీసుకొని పోయిరి. అతడు రెఫాయేలు సలహాలను జ్ఞప్తికి తెచ్చుకొని తన సంచిలోనుండి చేప గుండెను, కాలేయమును వెలుపలికి తీసి కొంత భాగము మండుచున్న సాంబ్రాణి మీద వేసెను. అప్పుడు భూతము ఆ వాసనా భరింపజాలక ఐగుప్తు దేశమునకు పారిపోయెను. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూయగా తోబియా పడక మీదనుండి లేచి సారతో నీవును లేచి నిలుచుండుము ప్రభువు మన మీద కరుణ చూపి మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్థన చేయుదమనిచెప్పెను. సారా లేచి నిలుచుండగా వారు ఇద్దరు ప్రభువు రక్షింపవలెనని మనవిచేసి ప్రార్థించిరి. ప్రార్థన ముగిసిన తరువాత ఆ రాత్రి ఇద్దరు కలిసి శయనించిరి. అంతలో ఆ రాత్రే రగువేలు సేవకులను తీసుకొని పోయి తోబియా చనిపోతాడని తలంచి సమాధి తవ్వించెను. సమాధి తవ్విన వెంటనే ఇంటిలోకి వెళ్లి భార్యను పిలిచి ఒక సేవకురాలిని లోపలి పంపించి తోబియా బ్రతికి వున్నాడోలేదో తెలుసుకొని రమ్మని చెప్పెను.   

ఆమె లోపలికి వెళ్లిచూడగా వధూ వరులు ఇద్దరు గాఢ నిద్రలో ఉండిరి. కనుక సేవకురాలు బయటకు వచ్చి రగువేలుతో తోబియా చనిపోలేదు అనిచెప్పెను. ఆ తరువాత తోబియా రెఫాయేలును పిలిచి నీవు నలుగురు సేవకులను రెండు ఒంటెలను వెంటపెట్టుకొని రాగీసునందలి గాబయలు ఇంటికి పొమ్ము, అతనికి ఈ చేవ్రాలుకు పత్రమును చూపి సొమ్మును అడుగుము మరియు అతనిని కూడా వివాహ మహోత్సవమునకు తోడ్కొని రమ్ము. మా తండ్రి నా కొరకై రోజులు లెక్కపెట్టుకొనుచుండును. నేను ఒక్క రోజు జాగు చేసిన అతడు దుఃక్కించును. మా మావ రగువేలు నన్ను ఇక్కడే ఉండమని నిర్బంధము చేసెను. అతని మాట కాదనలేక పోతినిఅనిచెప్పెను. రెఫాయేలు నలుగురు సేవకులను తీసుకొని పోయి గాబయలు ఇంటికి చేరి, అతనికి చేవ్రాలు కల పత్రమును చూపించెను. మరియు తోబితూ కుమారుడు తోబియా పెండ్లి సంగతి చెప్పి అతనిని వివాహ మహోత్సవమునకు ఆహ్వానించెను. వెంటనే గాబయలు వెండి నాణెముల, సంచులను లెక్కపెట్టి ఇచ్చెను.  ఆ సంచులను ఒంటెలమీదకెక్కించి , వారు మరుసటి రోజున వేకువనే ఇల్లుచేరుకొనునప్పటికీ తోబియా భోజనము చేయుచుండెను. తోబియా గబాయేలునకు స్వాగతం చెప్పెను. గాబయలు తోబియాను దీవించెను.

రగువేలు తన కూతురు సారా వివాహ సందర్భమున జరుప నిశ్చయించెను. పదునాలుగు దినముల ఉత్సవము ముగిసెను. తోబియా మామ చెంతకు వచ్చి నన్ను వెళ్లి పోనిమ్ము. మా తల్లిదండ్రలు నన్ను కంటితో చూచు ఆశను వదులుకొని యుందురు. కనుక నన్ను మాఇంటికి పోనిమ్ము అని అనెను. రగువేలు ఇక జాగు చేయక సారాను తోబియాకు అప్పగించెను. తోబియా తన ఆస్తిలో సగభాగములో, బానిసలను, ఎడ్లను, గొర్రెలను, గాడిదలను, సామానులను, మొదలైనవి తీసుకొని సంతోషముతో రగువేలు ఇంటినుండి భయలుదేరేను. అతడు తన ప్రయాణము విజయవంతమైయ్యేను గనుక స్వర్గాధిపతియు లోకపాలకుడైన దేవుని స్తుతించెను. ఇల్లు వీడకముందు తన అత్తా మామలను వారు బ్రతికున్నంతకాలము గౌరవముతో చూచుకొందునని ,మాట ఇచ్చెను. వారు ప్రయాణము చేయుచు, నినెవే చెంతగల కాసెరెను నగరము దరిదాపుల్లోకి వచ్చిరి. రెఫాయేలు, తోబియా చేప పిత్తమును తీసుకొని తన భార్యకంటె ముందుపోయెను. తోబియా చేప పిత్తముతో తండ్రి యెదుటికి వచ్చెను. అతడు తన తండ్రి కన్నులమీద వూది అతనిని తన చేతితో పట్టుకొని నాయన ధైర్యము తెచ్చుకొనుము అనిచెప్పెను. అంతటా అతడు చేప పిత్తమును తండ్రి కన్నులకు పూసెను. ఆ వృద్ధుని కన్నులనుండి కంటి కొనాలతో మొదలుపెట్టి తెల్లని పొరను పెరికివేసెను.  

అంతటా తోబియా సంతోషముతో దేవుని బిగ్గరగా స్తుతించుచు ఇంటిలోనికి వెళ్లెను. తరువాత అతడు తండ్రికి తనసంగతంతయు తండ్రికి చెప్పెను. తన ప్రయాణము సఫలమైనదని, తన సొమ్మును కొని వచ్చితినని అంత మాత్రమే కాకా రగువేలు కుమార్తె ఐన సారాను కూడా పెండ్లియాడితినని ఆమెను కూడా వెను వెంటనే వచ్చుచున్నదనియు, ఇప్పటికే నినివే నగర ద్వారములను చేరి యుండునని వివరించెను.

వివాహ మహోత్సవము ముగిసిన తర్వాత తోబియా తండ్రితో నాయన నన్ను ఇతనికి ఎంత చెల్లింపమందువు? మేము తెచ్చిన సొత్తులో సగము అతనికి ఇచినను నష్టములేదు. అతడు నన్ను సురక్షితముగ  నీ చెంతకు కొనివచ్చి, గాబయలు వద్దకు మన సొమ్ములను తీసుకొని వచ్చెను. అదియే గాక నా భార్య కి భూత విముక్తి నీకు రోగ విముక్తి కలిగించెను. ఈ ఉపకారములన్నిటికి అసరియాకు ఎంత సొమ్ము చెల్లిపమందువు  అని అడిగెను. అతడు కొనివచ్చిన సొత్తులో సగం పంచియిమ్ము. అతడు అంత వేతనమునకు అర్హుడు అని చెప్పెను తండ్రి. కనుక తోబియా రెఫాయేలును పిలిచి నేస్తమా నీవు తీసుకొచ్చిన ధనముతో సగము తీసుకొనుము. నీవు నాకు చేసినమేలులకు ఇది బహుమానము. ఇక క్షేమముగా మీ ఇంటికి పొమ్ము అని అనెను. అప్పుడు రెఫాయేలు తండ్రి కొడుకులను పిలిచి వారితో ఇట్లనెను; నేను దేవుని సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగానుండు ఏడుగురు దేవదూతలలో ఒకరైన రెఫాయేలును అని అనెను. ఆ పలుకు విని ఆ తండ్రీకొడుకులు ఇద్దరును భయకంపితులై గడగడా వణుకుచు నేలమీద బోర్లగిలా పడెను. కానీ దేవదూత వారితో నీవు భయపడకుడి మీకు ఎట్టికీడును కలుగదు, ప్రభువుని సదా కీర్తింపుడు అని అనెను. వారిద్దరూ, నేలమీదనుండి లేచి నిలబడుచుండిరి, కానీ ఆ దేవదూత మరల వారికి కనిపింపలేదు. వారు కీర్తనలతో దేవుని స్తుతియించిరి. దేవదూత తన చెంతనున్నప్పుడు ప్రభువు తమకు చేసిన అద్భుత కార్యములకు గాను దేవుడిని కీర్తించిరి.

తరువాత కొంత కాలానికి తండ్రి చనిపోయినప్పుడు వారు అతనిని గౌరవ మర్యాదలతో పాతి పెట్టిరి. ఆ కొంతకాలానికి తల్లియును చనిపోగా తోబియా ఆమెను తండ్రి ప్రక్కనే పాతి పెట్టెను. తదనంతరం అతడు భార్య,పిల్లలతో మేదియ దేశములోని వెళ్లి అక్కడ తన మామ రగువేలు ఇంటివద్దనే నివసించెను . అతడు వృద్ధులైన అత్త మామలను మిగుల గౌరవముతో చూచుకొనెను. ఆ వృద్ధులు చనిపోయినప్పుడు అక్కడే పాతిపెట్టెను. తోబియా తండ్రి ఆస్తికి వలే మామ ఆస్తికి వారసుడాయెను. అతడు ఎల్లరి మన్నులకు పాత్రుడై నూట ఇరువది యేండ్లు వరకు జీవించి తనువూ చాలించెను. తాను చనిపోకముందు నినివే నాశనమగుటను గూర్చియు మేదియ రాజు సియాకరు నినెవే పౌరులను బందీలుగా కొనిపోవుటను గూర్చియు వినెను. తోబియా చనిపోవకముందే నినెవే నగరమునకు పట్టిన దుర్గతిని చూసి సంతసించి నిత్యుడైన దేవునికి వందనములు అర్పించెను.

-బ్రదర్. సాలి. రాజు. ఓ.సి.డి.

7, ఆగస్టు 2021, శనివారం

19 వ సామాన్య ఆదివారం

సామాన్య 19 వ ఆదివారం

1 రాజుల 19: 4 - 8, ఏఫేసి 4: 30; 5: 2, యోహాను 6 :41-51

ఈనాటి సువార్త పట్నంలో యేసు "నేనే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమును" అని ఎలుగెత్తి పలుకుచున్నాడు. పరలోక పిత క్రీస్తును మానవాళికి ఆహారంగ ఒసగాడు. క్రీస్తు ద్వారా అందించిన ఆయన వాక్కు, సందేశం, ఉపదేశం మనందరకు జీవాహారం. క్రీస్తును విశ్వాసంతో స్వీకరించినవాడే ఆ జీవాన్ని పొందగలడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అని యేసు పలికెను. భౌతిక జీవితానికి ఆహారము అత్యవసరమైనట్లే, క్రీస్తు ఈ లోకములో మానవ జీవితానికి ఏంతో అవసరం. ఆయన మానవాళికి జీవాహారం. యావే భోజనం ప్రయాణంలో అలసి సొలసి పడిఉన్న ఏలీయా ప్రవక్తకు శక్తినిచ్చి గమ్యానికి నడిపించింది. ఇపుడు నూతన వేదంలో దేవుడే స్వయంగా ప్రజలకు ఆహారoగా దిగి వచ్చాడు. ఈ లోకములో మనం జీవిత ప్రయాణాన్ని కొనసాగించి మన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే ఆ దివ్య భోజనం మనకెంతో అవసరం. క్రీస్తు శరీరం మన జీవితానికి దివ్య భోజనం. జీవితంలో అలసి, సొలసి విసిగి వేసారి బాధలతో మ్రగ్గుతున్న ప్రజలకు ఆ దివ్యాసప్రసాదం శక్తిని, ఓదార్పును, శాంతిని ఒసగుతుంది. దివ్యాసప్రసాదాన్ని లోకేనేటప్పుడు   నిజంగా మనం దైవకుమారిని శరీరాన్ని బక్షిస్తునాం. కనుక ఆయన మనయందు ప్రవేశించి మనకు శక్తిని జీవాన్ని ప్రసాదిస్తాడని విశ్వసించాలి. విశ్వాసంతో యోగ్యతతో దివ్యాసప్రసాదవిందులో పాల్గొన్న వారికే అట్టి అనుభవం లభిస్తుంది.

క్రీస్తు వాక్కు, సందేశం, మన జీవితానికి దివ్యవరం. ఆ ఆహారాన్ని స్వీకరించినపుడే మనం క్రెస్తవులుగా జీవించగలం. అపుడే మనకు భౌతికమైన ఆకలిదప్పులు అప్రధానంగా గోచరించగలవు. క్రీస్తుతో నిండినవాడు ఆకాలిదప్పులను గూర్చి అలమటించడు. మరణాన్ని గూర్చి భయపడడు. ఎలైన అతని యందు నిత్యజీవము ఎపుడు పారుతూ ఉంటుంది. మనం ఇతరులకు ఆహారమై ఉండాలి మన ఆదర్శ జీవితం ద్వారా సత్య సందేశం ద్వారా మనం ఇతరులకు ఆహారమై జీవిస్తుండాలి.- Br.Ratna Raju

19 వ సామాన్య ఆదివారం

19 వ సామాన్య ఆదివారము

1 రాజులు 19: 4-8 

ఎఫెసీ 4: 30 – 5: 2

యోహాను 6: 41-51

నేటి దివ్య పఠనాలు మరొకసారి దేవుని యొక్క జీవాహారం, ఆ జీవాహారం ఇచ్చే శక్తిని గురించి భోదిస్తున్నాయి. దేవుని యొక్క ఆహరం స్వీకరించడము ద్వారా విశ్వాసుల యొక్క జీవితాలలో అనేక రకాల మేలులు, అద్భుతాలు జరుగుతుంటాయి, దీవెనలు పొందుతారు.

ఈనాటి మొదటి పఠనములో ఏలీయా ప్రవక్త రొట్టెను భుజించి శక్తిని పొందిన విధానము తెలుసుకుంటున్నాము. ఏలీయా ప్రవక్త ఇశ్రాయేలులో ప్రవచించే సమయములో కార్మెల్ కొండమీద 450 మంది బాలు ప్రవక్తలను వధించి నిజదేవుడైన యావే గురించి తెలియజేసారు. అటు తరువాత ఆ విషయము విన్న అన్య జాతికి చెందిన యెసెబెలు రాణి ఇది భరించలేక వెంటనే ఏలీయా ప్రవక్తను చంపాలన్న వార్తను పంపించింది. అది విన్న ప్రవక్త భయముతో ఉన్నారు. హోరేబు కొండవద్దకు వచ్చి ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నారు. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఏలీయా ప్రవక్తను పోషిస్తుంది. ఆయనలో కొత్త ధైర్యము, ఒక నూతన తేజాన్ని నింపుతుంది  

ఇక్కడ మనము అర్ధము చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి

  1. రొట్టె భుజించిన తరువాత మార్పు వచ్చింది. అప్పటివరకు బలహీనంగా ఉన్నాడు, ప్రాణభయంతో ఉన్నారు, శారీరక శక్తి నశించిపోతుంది. ఎందుకంటే చాల దూరం అరణ్యములో ప్రయాణము చేసారు. ఒక్కసారి రొట్టెను భుజించిన తరువాత తాను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పొందాడు. తనలో కొత్త ధైర్యము వచ్చింది, కొత్త విశ్వాసము నమ్మిక పుట్టుకొచ్చాయి. దేవుని యొక్క పని బ్రతికినా, మరణించినా పరిపూర్తి చేయాలనుకున్నారు. మనలో కూడా దేవుని యొక్క జీవాహారము భుజించినప్పుడు  మార్పు రావాలి. మనము పాపులం కావచ్చు, అన్యాయము చేసినవారు కావచ్చు, వివిధ రకాలుగా స్వార్ధపు ఆలోచనలతో జీవించిన వారు కావచ్చు. అయినప్పటికీ దేవుడిని నీ నా హృదయములోనికి పిలిచినప్పుడు స్వీకరించినప్పుడు పాపి పుణ్యాత్ముడుగా మారాలి, స్వార్ధం నిస్వార్ధము అవ్వాలి, అన్యాయము న్యాయము చేసేలా ఉండాలి. మనలో మార్పు వస్తేనే మనము స్వీకరించే దివ్యసత్ప్రసాద స్వీకరణకు ఒక మంచి అర్ధము ఉంటుంది 

  2. ఇక్కడ దేవదూత ఏలీయాతో నీవు చాల దూరము ప్రయాణము చేయాలి అని చెబుతుంది. ఒక జీవితము ప్రారంభించిన తరువాత (క్రైస్తవ జీవితము) మనము కూడా దేవునిలో ప్రయాణము చేయాలి. ప్రయాణము అంటే ముందుకు సాగుట. అది ఎక్కడినుండి అయినా సరే. ముందుకు వెళ్ళుట అని కూడా చెప్పవచ్చు. ఏలీయా నీవు ప్రయాణం చేయాలి అనగా దేవుని యొక్క పనిని పూర్తి చేయుటకు నీవు ప్రయాణం చేయాలి. ఆ పనిలో ముందుకు సాగాలి. దేవుని కీర్తిని వెదజల్లుటలో ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించుటలో ముందుకు వెళ్ళాలి. ప్రతి యొక్క ప్రయాణములో దేవుని యొక్క అభయ హస్తమును చవిచూడాలి. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణములో దేవుణ్ణి తెలుసుకున్నారు. అలాగే ఏలీయా కూడా తన ప్రయాణములో ఇంకా దేవుణ్ణి తెలుసుకుని అయన కోసం నిలబడాలని దీని అర్ధం. ఏలీయా ఎలాగైతే ప్రయాణము చేసాడో మనము కూడా అలాగే ప్రయాణము చేయాలి. దివ్యసత్ప్రసాదము స్వీకరించిన తరువాత దేవుని వైపు మాత్రమే ప్రయాణము చేయాలి. దేవుని ప్రేమను పంచుటలో ప్రయాణము చేయాలి. దేవుని సాన్నిధ్యము రోజురోజుకి ఎక్కువగా అనుభవించుటకు ముందుకు ప్రయాణము చేయాలి. సమస్యలు అను పర్వతము ఎక్కి మరి ప్రయాణము చేయాలి. అలాగే కుటంబ జీవితము జీవిస్తున్న భార్యాభర్తలు చాలాదూరం అన్యోన్యముగా, ప్రేమగా ప్రయాణము చేయాలి, మంచిగా ఉండాలి.  

  3. దేవుని యొక్క అభయం ఉంటే ఎవ్వరు ఎన్నడును ఒంటరి కాదు. ఎందుకంటే వారికి దేవుడు తోడుగా ఉంటారు. నిస్సహాయుడిగా ఉన్న ఏలీయాకు దేవుడు తోడుగా ఉన్నారు, ఓదార్చారు, నడిపించారు. పడిపోయిన తనను మరల లేవనెత్తుతున్నారు. అలాగే మన బాధల సమయములో మనము ఒంటరి కాదు దేవుడు మనకు తోడుగా ఉంటారు.

  4. మనము విశ్వసించే దేవుడు, సమకూర్చే దేవుడు. ఏలీయా ప్రవక్త తన ప్రయాణములో తాను ఏమి తీసుకువెళ్లకపోయిన దేవుడు ఆహారము ఒసగుతున్నారు, సమకూరుస్తున్నారు.

రెండవ పఠనములో పౌలు గారు క్రీస్తునందు నూతన జీవితము గురించి బోధిస్తున్నారు. క్రీస్తుని అంగీకరించిన తరువాత, స్వీకరించిన తరువాత వారిలో కొత్త జీవితము ఉండాలి. ఆ జీవితములో పరస్పర ప్రేమ, దయ ఉండాలి. క్షమించుకునే మనస్సు ఉండాలి. అయన తన శరీర రక్తాలు మన కోసము ధారపోసి మరణించారు కాబట్టి ఆయనను మనలోకి ఆహ్వానించే సమయములో ఇలాంటి మంచి గుణాలు మనలోకి రావాలి. మొదటి పఠనములో చెప్పిన విధముగా రొట్టె స్వీకరించినప్పుడు మార్పు వచ్చిన విధముగా క్రీస్తుని శరీర రక్తాలు స్వీకరించినపుడు క్షమా, దయ, ప్రేమ అనేవి మనలో పుట్టాలి. మనము మారాలి. ప్రేమతో నడుచుకోవాలి. 

సువిశేషములో మరొకసారి దివ్యసత్ప్రసాదము గురించి చేసిన ప్రభోదం గురించి వింటున్నాము. యేసు ప్రభువు తాను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారముగా అంటున్నారు. చాల మందికి అర్ధం కాని విషయం ఇది. ఎందుకంటే ఎలాగా ఒకరు పరలోకము నుండి దిగివస్తారని మానవ ఆలోచన. అందుకే వారు విశ్వసించలేదు. దేవుడిని విశ్వసించాలన్న, దేవుని యొక్క మాటలు అంగీకరించాలన్నా మనలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. దేవుని యొక్క ఆత్మకు మనము సహకరించాలి. యేసు ప్రభువు ఎన్నో అద్భుతాలు చేసారు. ఎవ్వరుకూడా చేయనటువంటి గొప్ప కార్యాలు చేసారు. అయినా సరే వారు అంగీకరించలేదు. ఎందుకంటే వారు ఆయనలో తప్పును మాత్రమే వెదికారు. కొందరు మాత్రమే ఆయనను రక్షకునిగా అంగీకరించారు. వారి హృదయాలు కఠినమైనవి. వారి విశ్వాసము కన్నా వారి తర్కము వారిని ఎక్కువగా ప్రభావితము చేసింది. దేవుని విషయాలు మనము విశ్వాసము ద్వారా అర్ధము చేసుకోవాలి. యేసు ప్రభువే జీవాహారము. మన ఆత్మలకు జీవము. మనయొక్క ఆత్మలను పోషించేవారు కాబట్టి ప్రభువును ఎపుడు స్వీకరించాలి.

దేవుని యొక్క దివ్య సత్ప్రసాదం స్వీకరించుట ద్వారా కలుగు ఆశీర్వాదాలు .

1.మనం నిత్య జీవం పొందుతాముద

2.దేవుని ఐక్యమై ఉంటాం (యోహాను 6 :57 )

3.మనకు ధైర్యం ఇస్తుంది

4.మనకు శక్తిని ఇస్తుంది

5.అనారోగ్యాలను బాగు చేస్తుంది

6.హృదయ పరివర్తనకు దారి తీస్తుంది

7.పరలోక ద్వారాలను తెరుస్తుంది

8.దేవుని యొక్క తోడునిస్తుంది.ఆమెన్

By Rev. Fr. Bala Yesu OCD

31, జులై 2021, శనివారం

18 వ సామాన్య ఆదివారం

18 వ సామాన్య ఆదివారం

నేనే జీవాహారము 

నిర్గమఖాండము;16 ;2 -4 , 12 -16 .

ఎఫెసీయులు;4 -17 , 20 -24 .

యోహాను;6 ; 24 -35 .


క్రీస్తు నాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాడు మనం 18 వ సామాన్య ఆదివారం లోనికి ప్రవేశించియున్నాం.

ఈనాడు పఠనములు మనకు తెలియచేసేది ఏమిటంటే- మీరు అశాశ్వతమైన ఆహారం కోసంకాకుండా శాశ్వతమైన ఆహారం కోసం, మరియు శాశ్వత మైన వాటి కొరకు శ్రమించండి, అని బోధిస్తున్నాయి.

మొదటి పఠనంలో దేవుడు ఇశ్రాయేలీయులను పరీక్షిస్తున్నాడు, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశము నుండి మోషే, అహరోనులతో నడిపించుకుని వస్తున్న సమయంలో వారు ఆకలికి తట్టుకోలేక, మేము ఐగుప్తు మంచిగా ఉండేది అని, యావే దేవుడిని మరియు ఆ మోషే, అహరోను ప్రవక్తలను నిందిస్తున్నారు. 

నిర్గమ: 16 : 11  వ వచనంలో చూసినట్లయితే, యావే ప్రభువు మోషే తో నేను ఇశ్రాయేలీయులు సణుగుకొనుట వింటిని కాబట్టి, ఇదిగో నేను ఆకాశము నుండి వారికీ  ఆహారం కురిపింతును అని చెప్పెను.

ఆవిధంగా యావే దేవుడు వారికీ మన్నాను మరియు పూరేలి పిట్టలను  వారికీ ఆహారంగా దయచేసాడు. కానీ వారు శారీరక ఆహారం కొరకు తపించుచున్నారు, దేవుని తెలుసుకోలేక పోతున్నారు.

రెండవ పఠనంలో పునీత పౌలుగారు ఈవిధంగా బోధిస్తున్నారు, మీరు మీ పూర్వ జీవితమును, స్వభావమును మార్చుకొనుడు. ఎందుకంటే మీ జీవితాలు మోసపూరితమైనవి, భ్రష్టుబట్టిపోయినవి. 23 వ వచనంలో చుస్తే మీ మనస్తత్వమును నూతనత్వము గావించుకొనుడు. నీతిని, పరిశుద్ధతను కలిగి కొత్త స్వభావమును ధరించండి, అని పౌలు గారు ఆ యొక్క ఎఫెసీ ప్రజలకు భోదించారు.

సువిశేష పఠనంలో చుస్తే ప్రజలు క్రీస్తు ప్రభువు యొద్దకు వచ్చారు. క్రీస్తు వారితో, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందువలన నన్ను వెదకుచున్నారు, నా అద్భుత  కార్యములను చూసికాదు అని అన్నారు. అదే విధంగా ఆయన తన గొప్ప రహస్యాన్ని, వాగ్దధానాన్ని వారికిఇచ్చారు. అది ఏమిటంటే 27 వ వచనంలో మనం చూస్తున్నాం; మీరు అశాశ్వతమైన భోజనముకై శ్రమింపవలదు, నిత్య జీవితము చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు, దానిని నేను మీకు ఒసగెదను.  

మనం గమనించినట్లయితే; క్రీస్తుప్రభుని ప్రజలు వెదకుచు వచ్చారు అని మనం వింటున్నాం. క్రీస్తుని వెంబడించిన  వారు 5 రకాల మనుషులు.

1 . తిండికోసం- భుక్తికోసం వెంబడించినవారు 

మత్తయి; 14 ; 13 -21 ( 5 రొట్టెలు 2 చేపలు )

మత్తయి ; 15 ; 32 -39 (7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు)

ఫిలి; 3 ; 19  వారి కడుపు వారికీ దేవుడు.

2 . రెండవ రకం 

అద్భుతములు చూసి వెంబడించారు.

మత్తయి; 11 ;21  అద్భుతాలు చూసారు కానీ నమ్మలేదు. 

3 . స్వస్థత కొరకు వెంబడించినవారు 

లూకా 17 ; 11 -19  పది మంది కుష్టురోగులు.

లూకా 11 ; 23 -26 దెయ్యముల నుండి  వెడలగొట్టబడినవారు.

4 . యేసు బోధనలను తప్పు పట్టడానికి  వెంబడించినవారు. 

లూకా20 ; 1 -8 శాస్త్రులు మరియు పరిసయ్యులు.

5 యేసుని మనస్ఫూర్తిగా నమ్మినవారు.

సమారియా స్త్రీ; యోహాను 4 : 6 -42 .

జక్కయ్య ; లూకా 19 ; 1 -10 .

క్రీస్తు ప్రభుని మనం మనస్ఫూర్తిగా విశ్వసించేవారిగా మనం ఉండాలి. మన దృష్టివలన కాకా విశ్వాసం వలన నడుచుకోవాలని క్రీస్తు మనకు తెలియాచేస్తున్నారు. 

క్రీస్తుప్రభువుని, ఆ నిత్యజీవితాన్ని, ఆ యొక్క శాశ్వత భోజనాన్ని మనం పొందాలంటే, మనం ఏమి చేయాలంటే, క్రీస్తుప్రభుని విశ్వసించాలి, విశ్వాసంతో జీవించాలి. విశ్వాసిగా మారి క్రీస్తులో ఐక్యం కావాలి. 

ప్రజలు దేవుడు ఇచ్చిన రొట్టెలను మాంసాలను చూశారేగాని దానిని ప్రసాదించిన దేవుడిని మాత్రం మరిచిపోయారు. 

కాబట్టి ప్రియా స్నేహితులారా, క్రీస్తుప్రభువు; నేనే జీవాహారమును, నన్ను భుజించువారు, నిత్య  జీవితమును పొందుతారు అని తెలియచేస్తున్నారు. క్రీస్తు ప్రభువు మత్తయి;6;31 లో చెబుతున్నారు, ముందు మీరు దేవుని రాజ్యాన్ని వెదకండి, అపుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయి.

_బ్ర. సురేష్ కొలకలూరి

24, జులై 2021, శనివారం

17 వ సామాన్య ఆదివారం


2 రాజులు 4 : 42 - 46 ఎఫెసీ 4 : 1 - 6 యోహా 6 : 1 – 15

ఐదువేలమందికి ఐదు రొట్టెలు రెండు చేపలతో ఆకలిని తీర్చుట

“నేనే జీవాహారమును నా యొద్దకువచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి దప్పికగొనడు అని యోహాను  శుభవార్త 6 : 35 వవచనంలో యేసు పలుకుచున్నాడు.”

క్రీస్తునాదుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుని విశ్వాసులారా!

యేసుప్రభు మన ఆత్మకు, శరీరానికి ఆహారమైయున్నాడు. పరలోకపు నిత్యజీవాన్ని మనందరికి  ప్రసాదించుటకు పరలోకమునుండి  భూలోకమునకు దిగివచ్చిన జీవాహారము క్రీస్తే అని ఈనాటి పఠనాలలో మనం ధ్యానిస్తున్నాం. క్రీస్తు సువార్తను శిష్యులు అన్ని ప్రాంతాలలో బోధిస్తూ క్రీస్తు నామంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అది చూసిన ప్రజలు కాపరిలేని మందలవలె యేసువద్దకి తరలివస్తున్నారు. అప్పుడు యేసు వారికి పరలోక రాజ్యం గూర్చి బోధించి తర్వాత వారు ఆకలితో ఉండటం గ్రహించి వారికి భోజనమును ప్రసాదిస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యావే దేవుణ్ణి విశ్వసించి తమ వాగ్దత్త భూమిని చేరుటకు ప్రయాణిస్తూ ఉండగా మధ్యలో వారి శారీరక ఆకలిని తీర్చుటకు మన్నాను కురిపించిన దేవుడు ఈనాడు క్రీస్తు ద్వారా క్రీస్తుని విశ్వసించి పరలోక సత్యాన్ని తెలుసుకొని నిత్యజీవము పొందుటకు తన చెంతకు వచినటువంటి ప్రజలు ఆకలిగా ఉండటం ప్రభువు గ్రహించి వారు తిరిగి గమ్యం చేరుటకు కావలసిన శక్తిని ఇవ్వుటకు 5 రొట్టెలను 2  చేపలను 5000 ల మందికి అద్భుత రీతిలో వారిఅందరి ఆకలిని తీర్చారు. ఈనాటి మొదటి పఠనంలో గూడా ఇటువంటి అద్భుతాన్ని గూర్చి వింటున్నాం. ఎలీషా ప్రవక్త దగ్గరికి యావే భక్తుడు ఒకడు తానుపొందిన ప్రథమఫలములను దేవునికి సమర్పించుటకు బయలుదేరి, ఆ దేవాధీ దేవుని సన్నిధి ఎలీషా ప్రవక్తలో ఉన్నదని గ్రహించి 20 రొట్టెలను, ధాన్యపు వెన్నులను కానుకగా అర్పించెను. ఎలీషా తన సేవకునితో వాటిని అక్కడ ఉన్న ప్రవక్త జనులకు పంచిపెట్టమని చెప్పగా ఆసేవకుడు 100 మందికి ఇవి సరిపోవు గదా అని సందేహం వ్యక్తపరిచిన్నప్పటికీ ఎలీషా ప్రవక్త దేవుని మీద విశ్వాసంతో దేవుని వాక్కు ద్వారా వాటిని వారందరికీ సంతృప్తిగా అందించి ఇంకా కొన్ని మిగిలేలా ఈ గొప్ప అద్భుతం చేయగలిగారు. అది ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు చేసిన అద్భుతాన్ని గూర్చి ముందుగానే సూచిస్తుంది.  

ఈ రెండు సంఘటనలను మనం ధ్యానిస్తే ఒకే విధంగా ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఎలీషా ప్రవక్త దేవుని వాక్కును బోధిస్తున్నారు, యేసు కూడా సువార్తను బోధిస్తున్నారు. వీరిద్దరూ కూడా దేవుని వాక్కును తమ ప్రజలకు భోదిస్తున్నారు. వీరిద్దరూ  తమ చెంత దేవుని వాక్కును ఆలకిస్తున్న ప్రజల ఆకలిని గుర్తించి వారికీ శారీరక ఆహారాన్ని సంతృప్తిగా అందిస్తున్నారు. ఇద్దరు కూడా తమ భక్తుల కానుకలను స్వీకరించి వాటితో తమ ప్రజల ఆకలి తీర్చుటకు,  ఎలీషా  తన  సేవకునితో  అదేవిధంగా యేసు  తన  శిష్యునితో వాటిని అందరికి భోజనంగా పంచమన్నప్పుడు ఇద్దరు సేవకులు అనుమానంగా, లేక సందేహంగా ఇంతమందికి ఇవి ఎలా సరిపోతుంది లేకుంటే ఇంతమంది ఆకలి తీర్చడం ఎలా అని సంకోచించారు. కానీ ఎలీషాకి, క్రీస్తు ప్రభువుకి ఏమి జరగబోతుందో  ముందే దేవుని చేత ఎరుకపరిచారు. కాబట్టి దేవునియందు వారి ధృడ విశ్వాసం ద్వారా దేవుని శక్తితో వారు ఆ కానుకలను అధికం చేసి అందరి ఆకలిని సంతృప్తిగా తీర్చి ఇంకా కొన్ని మిగిలేలా గొప్ప అద్భుత కార్యం చేయగలిగారు.       

ఈ అద్భుత కార్యం చూసిన తరువాత ప్రజలందరూ యేసును గూర్చి రాబోవు నటువంటి ప్రవక్త, మెస్సయ్య ఈయనే అని గ్రహించి వారు యేసుని రాజుగ చేయాలనుకున్నారు. అది గ్రహించిన యేసు అక్కడినుండి వెడలిపోవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే తాను ఇహలోక రాజుగా ఈలోకానికి రాలెదు, కానీ దైవారాజ్యానికి రాజుగా వచ్చియున్నాడు అని వారు గ్రహించలేకపోయారు.

ఎలీషా, మరియు యేసుక్రీస్తు ఇద్దరుకూడా తన ప్రజల శారీరక ఆకలిని తీర్చారు. కానీ యేసు ప్రభువు కేవలం భౌతిక ఆహారము మాత్రమేగాక ఆత్మలకు ఆహారమై ఉన్నాడని మనం గ్రహించాలి. ఎప్పుడయితే మనం దేవునియందు గట్టి విశ్వాసం కలిగి దేవుని వాక్కును ఆలకించి ఆ వాక్యాను సారంగా జీవిస్తామో అప్పుడే మనం నిత్యజీవాన్ని పొందగలం అని యేసు తెలియజేస్తున్నాడు. మనందరినీ శాశ్వతంగా తండ్రి దేవునితో ఐక్యమొనర్చుటకే యేసుప్రభు ఈలోకానికి వచ్చియున్నాడు. అందుకే రెండవ పఠనంలో పునీత పౌలు గారు ఐక్యమునకు పిలుపునందిస్తున్నారు.దే వుడు మనలను ఒకే నిరీక్షణకై పిలిచారు. అందరము ఒకే శరీరము, ఒకే ఆత్మను కలిగియున్నాము, ఎటువంటి విబేధాలు లేకుండా అందరికి ఒకే ప్రభువు, ఒకే విశ్వాసం,ఒకే దేవుడు, ఒకే తండ్రి, ఆయన అందరికి పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు అని. ఆ దేవునితో నిత్యజీవితం కలిగి శాశ్వతంగా తమ బిడ్డలుగా ఐక్యమై ఉండుటకు తన ఏకైక కుమారుడు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ఈ లోక పాప పరిహారమై చిందించి, తన ప్రాణాన్ని మనందరికీ  జీవాహారంగా మార్చాడు. ఆ జీవాహారాన్ని పొందుటకు క్రీస్తునందు విశ్వాసం కలిగి జీవిద్దాం మరియు దైవభక్తుడు మరియు చిన్నపిల్లవాడి వలె మనకి దేవుడిచ్చిన జీవాహారాన్ని ఆత్మాహారాన్ని ప్రతి ఒక్కరికి పంచుదాం. అందుకు కావలసిన దైవానుగ్రహాలను దేవుడు మనకు దయచేయాలని తండ్రి దేవుని ప్రార్దిదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున . ఆమెన్.

- విజయ్ తలారి

17, జులై 2021, శనివారం

పదహరవ సామాన్య ఆదివారం


 పఠనములు: యిర్మీయా:23 :1 -6; ఎఫె:2 :13 -18; మార్కు:6 :౩౦ -34
క్రీస్తు నాధుని యందు ప్రియ విశ్వాసులారా! ఈనాడు మన తల్లి తిరుసభ పదహారవ సామాన్య ఆదివారంలోకి మనందరినీ ఆహ్వానిస్తుంది.
      ముందుగా మొదటి పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే, పూర్వ వేదంలో ఇశ్రాయేలీయుల రాజుల స్వార్ధం, అహం, పాలితులపట్ల అశ్రద్ధవల్ల తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు చెల్లా చెదురయ్యారని యిర్మీయా ప్రవక్త మొదటి పఠనంలో తెలియజేస్తున్నాడు.
       రెండవ పఠనాన్ని మనం చూస్తే, పునీత. పౌలు గారు చెల్లా చెదురైనా మానవ జాతిన ఏకం చేయడానికి క్రీస్తు ప్రభువు తన జీవితాన్నే త్యాగం చేసారని బోధిస్తున్నాడు.
               అదే విధంగా, సువిశేష పఠనంలో కాపరిలేని గొర్రెలవలే నున్న వారిని చూసి యేసు జాలి పడి వారికి ఉపదేశింప నారంభించెను అని పు.మార్కు గారు తెలియజేస్తున్నారు.
           అయితే , ముందుగా మొదటి పఠనాన్ని క్లుప్తంగా ధ్యానించినట్లయితే,ఈ లోకంలో జీవిస్తున్న ప్రతిఒక్కరికి దేవుడు ఏదోఒక బాధ్యతను అప్పగించి ఉన్నాడు.అయితే ఆ బాధ్యతను నీవు ఏవిధంగా నెరవేరుస్తున్నావు అనేది  ముఖ్యం.ఉదా;నాయకులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,  గురువులు,ఇంకా మొదలైనవారు.
            ఈనాటి పఠనంలో,యిర్మీయా ప్రవక్త గారు ఆత్మ పూరితుడై ఇశ్రాయేలు రాజులగురించి ప్రవచించాడు.యిర్మీ;21 ;1 లో చూస్తే, “ప్రభు మందను చెల్లాచెదరు చేసి,నాశనము చేయు కాపరులు శాపగ్రస్తులు”,అని బోధించాడు.ఎందుకంటే వారు ప్రజలపై జాగ్రత్తపడకుండా, వారిని ఎంతో కష్టపెట్టి, అన్యదేవములను కొలువమని చెబుతూ, వారిని బ్రష్టులుగా చేసి, దేవునినుండి దూరమయ్యేలా వారిని చెల్లాచెదరు చేసారు.దీని కారణంగా ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వకుండా వారి ఇష్టాను సారము జీవించసాగారు. హోషేయ:5 :4 లో చూస్తే,"ప్రజలు తాము చేసిన దుష్కార్యాలవలన తిరిగి దేవునివద్దకు రాలేకపోవుచున్నారు.వారు విగ్రహారాధనమున తల మునస్కులై యున్నారు.కావున ప్రభువును తెలిసికోజాలకున్నారు".
      ఎజ్య్రా కాలములో దివ్య గ్రంధాన్ని చదువుచున్నప్పుడు దుఃఖం  పట్టలేక బోరున ఏడ్చారు అని తెలుపుచున్నది(నెహమ్యా : 8 :9). కానీ, రానురాను వారిలో ఆ విశ్వాసం సన్నగిల్లిపోతుంది.అదే విధంగా, రాజు అనేవాడు ఇశ్రాయేలు ప్రజలకు సేవకుడు మాత్రమే. కానీ, ఐగుప్తు దేశంలో ఫరో రాజు మాత్రం దేవునితో సమానము.అందుకే దావీదు మహారాజు తనను సేవకుడిగా పోల్చుకున్నాడు, నేను దేవుని యొక్క సేవకుడనని. మొదటి సమువేలు;17 :34 లో చూస్తే, దావీదు సౌలుతో "నీ దాసుడు తన తండ్రి గొఱ్ఱెలమందనుకాయుచుండెడివాడు.అప్పుడప్పుడు సింగము గాని, ఎలుగుబంటిగాని, మంద మీద పడి గొర్రెలనెత్తుకొని పోయెడిది.నేను వన్య మృగమును తరిమి, చావమోది దాని నోటినుండి గొర్రెను విడిపించుకొని వచ్చెడివాడను.అది నామీద తిరగబడెనేని మెడక్రింద జూలు పట్టుకొని చితక బొడిచి చంపెడివాడను".ఇలా తన తండ్రి గొర్రెలను కాపాడినట్లు దావీదు రాజుగా అభిషిక్తుడైన తరువాత కూడా తన తండ్రి అయినటువంటి దేవునియొక్క మంద అయినటువంటి మనలను తన మరణాంతము వరకు, ఇతర రాజులనుండి సురక్షితముగా కాపాడుకుంటూ వచ్చాడు.సమువేలు  ప్రవక్త  కాలమున  ఇశ్రాయేలుప్రజలు,సమువేలుతో ఇలా అంటున్నారు; అన్ని రాజ్యాలకు రాజు ఉన్నాడు, మాకు కూడా ఒక రాజును నియమించు అని పలుకుచున్నారు.రాజుని ఎప్పుడైతే వారికి నియమించారో అప్పటి నుండి వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి,ఇంకా విభజన ఏర్పడినది.
        మొదటి రాజులగ్రంధము 9 :4 -9 లో చూస్తే తండ్రియైన దేవుడు సొలొమోను రాజుతో ప్రమాణము చేస్తున్నాడు. అదేమిటంటే, నీతండ్రి దావీదు వలె నన్ను చిత్త శుద్దితో కొలుస్తూ, నాకు విధేయుడవై నా ఆజ్ఞలను పాటింతువేని నీ వంశీయుడొకడు నిత్యము నీ సింహాసముపై కూర్చుండి ఇశ్రాయేలును పరిపాలించునని నేను పూర్వము నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొందును.కానీ, నీవుగాని, నీ అనుయాయులు  గాని  నన్ను విడనాడి అన్యదైవములను ఆరాదింతురేని,ఇశ్రాయేలును నేనిచ్చిన నేలమీద నుండి తొలగింతును. నేను దేవాలయమును విడనాడుదును,జనులు చూసి నవ్వుకొందురు. గడ్డిపోచతో సమానముగా చూతురు.ప్రభువు ఈ గడ్డకు, ఈ దేవాలయానికి ఎంత గతి పట్టించెనో చూడుడని ఛీ కొట్టుకొందురు".  దేవుడు వారితో ఇంత చెప్పినా కూడా వారు మాత్రం ఆయనకు విరుద్ధముగానే జీవించారు.
    అంతే కాకుండా ఒక్కటిగావున్న రాజ్యాన్ని సొలొమోనురాజు మరణించిన తరువాత రెండుగా విభజించి ఒకటి ఉత్తర రాజ్యంగా, మరొకటి దక్షణ రాజ్యంగా విభజించారు.దీని మూలంగా వీటిని పరిపాలిస్తున్న రాజులు వారి స్వంత స్వలాభాలకోసం, అన్యదేవుళ్ళను కొలవడం,బంగారముతో ఆవులనుచేసి కొలవడం,వారికిష్టమొచ్చినట్లు దేవాలయమును నిర్మించి, సాధారణ కుటుంబానికి చెందిన యాజకులను ఈ దేవాలయములలో నియమించడం,కొండలపైనదబ్బర దేవతలకు దూపములను, నైవేద్యములను అర్పించడం, ఇలా ఇన్నోరకాలుగా  ప్రజలను ఎన్నో పాపములను ఒడిగట్టేలా చేసారు. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీస్తుపూర్వం 595 - 587 మధ్య కాలంలో పరిపాలిస్తున్నటువంటి సిద్కియా రాజును తన పాపపు జీవితము నుండి మరల మంచి జీవితమునకు తీసుకురావటానికి యిర్మీయా ప్రవక్తను దేవుడు పంపిస్తున్నాడు.కానీ, అతడు మాత్రం ప్రవక్త మాటలను వినికూడా, ఆచరించకుండా బబులోనియాపై యుద్దానికి దిగాడు. అందుకు గాను బాబులోనీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసి,ప్రజలను బానిసలుగా బాబులోనియాకు తీసుకొని వెళ్లారు. దీనంతటికి ముఖ్య కారణం అప్పుడున్నటు వంటి కాపరులే.
    అయితే దేవునినుండి వెడలిపోయిన ప్రతిఒక్కరిని మరల దేవునితో ఏకం చేయడానికి,అయన వద్దకి చేర్చుటకు ఈ యిర్మీయా ప్రవక్తను తన చిన్న ప్రాయమునందే ఎన్నుకొని తన పేరిట బోధించామని పంపిస్తున్నాడు. అదేవిధంగా రానున్న మెస్సయా గురించి తెలియజేస్తున్నాడు. "నేను దావీదు వంశమునుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి.రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమంతట నీతి న్యాయములు నెలకొల్పును.అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును" (యిర్మీయా :23 :6 ).  
    మరి ఈనాటి సువిశేష పఠనాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు:
                మొదటిది, శిష్యులయొక్కపని.
                 రెండవది, దేవునియొక్క కనికరం.
      మొదటిగా, గడచినా వారము యేసుప్రభువు తన పండ్రెండు మంది శిష్యులను ఇద్దరిద్దరిని చొప్పున వివిధ ప్రాంతాలకు వేదప్రచారమునకు పంపించినపుడు,వారు వెళ్లి హృదయపరివర్తనము గురించి బోధించి,పిచచములను ప్రాలద్రోలి, ఎంతోమందిని స్వస్థపరిచి,తిరిగి ఏసుప్రభువుని చేరుకొనిన పిమ్మట వారి శ్రమను, పనితనమును చూసి,వారికి విశ్రాంతి అవసరమని గుర్తించి,జనసమూహమునుండి  ఈనాడు వారిని నిర్జనప్రదేశమునకుపంపిస్తునాడు.ఇక్కడ శిష్యులపై దేవునియొక్క ప్రేమను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం అర్ధం చేసుకునేదిఏమిటంటే,క్రీస్తును అనుసరిస్తున్న మనము ప్రతిరోజు ప్రజల ఆవరణనుండి, దేవుని ఆవరణకు వెళ్ళాలి.మనయొక్క బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలి.అప్పుడే మన జీవితానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది.
         రెండవదిగా, దేవుని యొక్క కనికరం. మనం చూస్తే,యిర్మీయా ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరుతుంది. యేసుప్రభువు జనసమూహాన్ని చూసి,కాపరిలేని గొర్రెల వలే నున్న వారిపై కనికరము కలిగి, వారికి అనేకవిషయములను బోధింపనారంభించెను అని పు.మార్కు గారు అంటున్నారు.
 అయితే ప్రజలపై ఎందుకు దేవుడు జాలి చూపిస్తున్నాడు అంటే, ఏమార్గమున వెళ్లాలో వారికి తెలియదు.అందుకే దేవుడంటున్నాడు,"నేనే మార్గమును"అని.ఎవరిని ఆశ్రయిస్తే వారిలో కష్టాలుపోతాయని వారికీ తెలియదు. అందుకే దేవుడంటున్నాడు, "నేనే జీవమును" అని.అయితే సత్యవంతుడైనటువంటి యేసుప్రభువుని ఎప్పుడైతే వారు ఆశ్రయిస్తున్నారో,   వారి రోగములను నయం చేస్తున్నాడు.పాపములను తుడిచివేస్తున్నాడు.పరలోక రాజ్యం గురించి,నిత్య జీవితము గురించి,అదేవిధముగా, తండ్రి దేవునియొక్క ప్రేమను గురించి తెలియజేస్తూ, వారిని పాపపు మార్గము నుండి నిత్యజీవితము అను మార్గము వైపు నడిపిస్తున్నాడు.అందుకే ఈనాటి సువిశేష పఠనంలో ఎంతోమంది ప్రజలు దేవునియొద్దకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. 
 ఆనాడు ఎంతోమంది రాజులు వారి స్వార్ధం కోసం చూసుకుంటే ఈనాడు యేసుప్రభువు ప్రజల క్షేమం కోరుకున్నాడు. అందుకే వారియొక్క జీవితాలను మారుస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు  ఇలా అంటున్నాడు, “నేను మీ క్షేమము కొరకు ఆదేశించిన పధకములు నాకు మాత్రమే తెలియును.నేను మీ అభివృద్ధినేగాని వినాశనమును కోరాను.నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని"(యిర్మీ:29 : 11 ).
    అయితే ఆ బంగారు భవిష్యత్తును మనం పొందాలంటే ఏం చేయాలి?
         1 .యేసుప్రభువునందు విశ్వాసం కలిగి జీవించాలి.
                         ఈ విశ్వాసమే ఈలోకంలోఉన్న ప్రతిఒక్కరిని దేవునిలో ఏకం చేయగలదు.అందుకే రెండవపఠనంలో పు.పౌలు గారు ఇలా అంటున్నారు:"యూదులము, అన్యులము అయినా మనము అందరము, క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము".అందుకే ఈనాడు ఎంతోమంది ప్రజలు వివిధ గ్రామాలనుండి దేవునివద్దకు  వచ్చి ఎన్నోమేలులను పొందుచున్నారు.ఇది కేవలం వారి విశ్వాసం వలననే.ఆనాడు ఈ యూదులు అన్యులు ఎంతో  శత్రువులుగా వుండి,వారి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, ఒకరిపై ఒకరు యుద్ధము చేసుకొనుచుండెడివారు. కానీ “క్రీస్తు వీలందరికోసం ఒక్కడే ఈ లోకానికి వచ్చి సిలువపై ఘోరాతి గోరంగా మరణించి,ఆ వైరమును రూపు మాపెను” (పు.పౌలు:2 :16 ).  అలా, ఈ అన్యులను, యూదులను ఒక్కటిగా మార్చాడు.వీరిని దేవునియొక్క సమక్షంలో నడిపించాడు.స్నేహితులుగామార్చడు.అదేవిధంగా,వీరందరికి ఒకే నియమం కల్పించాడు. చివరికి అందర్నీ ఒక్కటిగా కలిపాడు.
      2 .భాద్యత కలిగిన కాపరులుగా లేక వ్యక్తులుగా మెలగాలి.
                మోషే ప్రవక్త నలుబది సంవత్సరములు భాద్యత కలిగిని కాపరిగా ఉండి,ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనాను దేశమునకు నడిపించాడు.దావీదు మహారాజు నలుబది సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు బాధ్యత కలిగిన రాజుగా ఉండి వారిని దేవుని వైపు నడిపించాడు.అలాగే, ఎంతోమంది ప్రవక్తలుకూడా బాధ్యత కలిగిన కాపరులుగా ఉండి దేవుడు వారి జీవితములో నియమించిన పనిని వారు పూర్తి విధేయతతో,  భాద్యతగా చేసారు.అదే విధంగా ఈనాడు నువ్వు నేను కూడా ఒక నాయకుడిగా,అధికారిగా,ఉపాధ్యాయుడిగా,గురువుగా,ఒక తల్లి తండ్రిగా,మనకు నియమించబడిన పనిని సక్రమంగా నెరవేర్చినపుడే మనం బాధ్యతకలిగిన కాపరులుగా పిలువబడడానికి అర్హులమవుతాం. 
       ౩. ఐక్యతా వారధులుగా ఉండాలి.
                ఈనాటి రెండవ పఠనంలో, పు.పౌలు గారు, చెల్లాచెదురైన మానవజాతిని ఏకం చేయడానికి క్రీస్తు ప్రభువు తన జీవితాన్నే త్యాగం చేసాడని వివరిస్తున్నాడు. వీరులు ఎప్పుడైతే రాజ్యంలో ఐక్యతను కోరుకుంటారో,అప్పుడే రాజ్యం సుఖ సంతోషాలతో అలరాలుతుంది.యేసుప్రభువు తన మరణము ద్వారా ద్వేషాన్ని,విభజనా శక్తిని నాశనం చేసి, నూతన మనిషిని, నూతన కుటుంబాన్ని రూపొందించాడు.పు. పౌలు గారు ఇలా అంటున్నారు:"పూర్వము మీరెట్లుండిరో స్మరింపుడు.ఒకప్పుడు మీరు శారీరకంగా అన్యులై ఉంటిరి, కానీ ఇప్పుడు క్రీస్తుయేసు నందు ఏకమగుటతో, దూరస్థులగు మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసికొనిరాబడితిరి"( ఎఫె:2 :11 ,13 ).  అందుకే ఈనాడు క్రైస్తవ మతం అంటే ఐక్యత కలిగిన మతంగా పిలువబడుతోంది.అయితే ఈనాడు మన జీవితములో కూడా ఐక్యత కలిగి ఉండాలంటే లేక ఐక్యత వారధులుగా ఉండాలంటే,ఒకరినొకరు అర్ధం చేసుకొంటూ,శాంతి, సమాధానాలతో,కరుణతో మెలిగినపుడే,మనలో ఐక్యత ఏర్పడి, ఐక్యత వారధులుగా మెలుగుతాము. 

           కాబట్టి ప్రియ విశ్వాసులారా! ఈనాడు మన జీవితములలోకి, మంచికాపరి ఐన మన యేసు ప్రభువుని ప్రగాఢమైన విశ్వాసముతో ఆహ్వానించి,భాద్యత కలిగిన కాపరులుగా జీవిస్తూ, ఐక్యత కలిగి జీవిస్తూ,ఒక మంచి క్రీస్తుననుసరించు వ్యక్తులుగా జీవించడానికి ప్రయత్నిదాం.అప్పుడే మన జీవితానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది. ఆమెన్.

             Nandigama Sunil mario

15, జులై 2021, గురువారం

కార్మెల్ మాత మహోత్సవం

కార్మెల్ మాత మహోత్సవము 

పాలస్తీనాలోని కార్మెల్ కొండలు చాలా ప్రసిద్దమైనటువంటివి. ఇక్కడ బైబిల్ లోని ప్రసిద్ద సంఘటనలు జరిగాయి. మరి ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటి అంటే ఏలియా ప్రవక్త  యవే దేవుని మహిమను, మహోన్నతను చూపిస్తూ బాలు ప్రవక్తలను చంపినది ఈ పర్వతము మీదనే. అదే విధముగా కీర్తన గ్రంధములో ఈ పర్వతము యొక్క అందాన్ని వివరించడము  మనము చూస్తాము. ప్రవక్తలు ఈ పర్వతము గురించి మాటలాడుతారు. ఈ పర్వతము నిజ దేవుని మహిమను చాటుతుంది.  ఈ పర్వతములో పుట్టిన టువంటి ఒక సన్యస కుటుంబమే కార్మెల్ సభ. ఈ సభకు ఈ పేరు అక్కడ మరియమాతకు అర్పించినటువంటి ఒక చిన్న దేవాలయము నుండి వచ్చింది. ఆ పర్వతము మీద ఉన్న టువంటి దేవాలయము పేరు కార్మెల్ మాత దేవాలయము.  

     ప్రతి సన్యాస సభ తన యొక్క పేరును ఒక స్థలం నుండి లేక  వారి పునీతుని నుండి పొందుతుంది. కార్మెల్ అనేది పాలస్తీనా లో ఉన్నటువంటి ఒక కొండ . సిలువ యుద్దాలు జరిగిన తరువాత 11 మరియు 12 వ  శతాబ్దాలలో ఈ కొండలలో సన్యాస జీవితము ప్రబలిల్లీనది. సిలువ యుద్దాలలో పాల్గొన్న టువంటి  కొంతమంది సైనికులు దేవునికి తమ జీవితాన్ని  అంకితము చేస్తూ అక్కడ ఉన్న కొండ గృహాలలో ప్రార్దన జీవితము జీవిస్తూ బ్రతికారు.  వీరు తమ జీవితాలను మఠవాసులు కంటే ఎక్కువగా  ప్రార్దన జీవితానికి కేటాయించారు.  ఎక్కువ సమయము ధ్యానము చేస్తూ  మౌనమును పాటిస్తూ జీవించారు. వీరిలో మనకు   ఈజిప్టు ఎడారిలో ఉన్నటువంటి ఆదిమ క్రైస్తవ సన్యాసుల జీవన శైలి కనుపడుతువుండేది. వీరు ఎక్కువగా వారి వారి గదులలో ఒంటరిగా జీవిస్తూ  ప్రార్దనకు ప్రాముఖ్యత ఇస్తూ జీవించేవారు. వీరిని  కార్మెల్ మాత సహోదరులు అనే పేరుతో  పిలుస్తారు. ఇది  వారు మరియమాతకు ఇచ్చే ప్రాముఖ్యతను సూచిస్తుంది.  కార్మెల్ కొండలలో ఉన్న ఈ  సభ ఇస్లాం ప్రభావము వలన ఆ ప్రాంతాన్ని వదలి ఐరోపా కు వెల్ల వలసి వచ్చినది . కేవలము కార్మెల్ సభ సభ్యులు మాత్రమే కాక అనేక సభల వారు ఆక్కడనుండి వేరే ప్రదేశాలకు వెళ్ళేరు. 

    అనతి కాలములోనే ఈ  సభ అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందడము జరిగింది. ఐరోపా ఖండములో ఈ సభ సభ్యలు వారి క్రొత్త దేవాలయాలను కార్మెల్ మాత పేరున ఏర్పాటుచేయడము జరిగినది. కార్మెల్ సభ  మరియమాతకు అంకితము చేయబడియన ఒక సన్యస సభ ,అది సంపూర్తిగా మరియమాత సభ  totus marianus est . చారిత్రకముగా కార్మెల్ కొండలలో ఉన్నటువంటి  సన్యాసులు వారీ పేరును ,గుర్తింపును వారు ఏర్పాటు చేసుకున్న చిన్న మరియమాత దేవలయము నుండి పొందేరు. మారియమాత భక్తి అనేది వారి జీవితాలలో ఒక ప్రదాన అంశము. 14 వ శతాబ్దములో ఉన్నటువంటి  కార్మెల్ రచనలలో వారి జీవిత విదానము మరియమాత వలె ఉండాలి అని కోరుకునేవారు. మరియ మాత  కార్మెలీయులకు సోదరి మాత్రమే కాదు వారి తల్లీకూడ.   ఆమెలో వారు చూసెదీ ఏమిటి అంటే ఏ విధముగా ఆమె జీవితాన్ని దేవుని కోసము జీవించినది అని, ఒక సారి ఆమె జీవితము చూసినట్లయితే ఆమె జీవితములో దేవుడు ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంటాడు. ఆమె దేవుని కోసము పరితపిస్తుంది . ఆమె మనస్సు  , ఆమె ఇంద్రియాలను, ఆమె శక్తి యుక్తులను మొత్తన్ని దేవుని కోసమే ఆమె హెచ్చించినది. ఆమె మనస్సు  దేవుని చూడడానికి ఆయన ఇష్ట ప్రకారముగా జీవించడానికి ప్రాముఖ్యతను ఇస్తుంది. కార్మెల్ సభ సభ్యులు కూడా మరియమాత వలే జీవించడానికి ముఖ్యముగా , ఆ  ఆధ్యాత్మిక జీవితాన్ని, మౌన జీవితాన్ని , ధ్యాన జీవితాన్ని మారియమాత నుండి  పొందుతారు లేక నేర్చుకుంటారు. వీరు పరిశుద్ద కన్య మరియ సహోదరులు అను  పేరును కలిగిఉన్నారు.  ఆమె ప్రేమకు, సేవకు  అంకితము చేయబడ్డ ఒక సన్యాస  సభకూ చెందినవారు కనుకనే. మరియమాత తో ఈ ప్రత్యేక సంభందము వీరి జీవితలను పరిపూర్ణ ప్రేమను చేరే విధముగా చేస్తుంది. మరియమాత  సాన్నిధ్యం  ఈ సభ చరిత్ర మొత్తము ఉన్నది. ఈ సభ దాని పుట్టుపూర్వోత్తరాలు  ఈ కొండ మీదనే జరుగుతున్నాయి. మరియమాతను  ప్రార్దనకు  మరియు దేవునికి జీవితాన్ని అంకితము చేయటములో మాతృకగా తీసుకొని వీరు జీవిస్తారు. అదే విధముగా  మరియమాతను దేవుని వాక్కును ఎల్లప్పుడూ ధ్యానిస్తూ జీవించే వ్యక్తిగా మరియు దేవుని చిత్తానికి సంపూర్తిగా అర్పించుకున్న వ్యక్తిగా చూస్తారు. ఈ  సభ అందరి వలె ప్రార్దన చేస్తుంది. కానీ ఈ సభ ముఖ్య ఉద్దేశమే ప్రార్ధనలో దేవుని కనుగొని  ఆయనను అనుభవపూర్వకముగా తెలుసుకొని ఈ అనుభవాన్ని ఇతరులకు చెప్పడము.  మరియమాత అడుగు జాడలలో నడుస్తూ దేవుని ఏ విధముగా  చేరుకోవాలి , దేవుణ్ణి ఈ లోకములోనే ఉండగా ఏ విధముగా  ఆయనలో ఐక్యము కావాలి  అని నేర్పిన వారు ఈ సభ పునీతులయిన  ఆవిలపూరీ తెరేసమ్మ , పునిత సిలువ యోహాను గార్లు అధె  విధముగా చిన్న తెరేసమ్మ గారు కూడా చిన్న చిన్న పనులు చేస్తూ దేవుని ఏ విధమూగ చే రుకోవలో చెపుతుంది ఈమె కూడా ఈ సభ పునీతురాలే. వీరి  జీవితము మరియమాతను అనుసరించి ఉంటుంది. దైవ ప్రేమ, దైవ అన్వేషణ వీరిలో మనము ఎక్కువగా  చూస్తాము. పునీత సిలువ యోహాను గారు రాసిన రచనలలో మరి ముఖ్యముగా కార్మెల్ పర్వత ఆరోహణము , ఆంధకార రాత్రి, ఆధ్యాత్మీక గీతం  మరియు  సజీవ ప్రేమాగ్ని జ్వాల అనే పుస్తకాలలో మనము దేవుని అన్వేషించడము,  ఆయనను  చేరుకోవడము చూస్తూంటాము. ఇది నిజానికి చాలా గొప్ప జీవితము, మరియమాత  వలె వేరొక చింతన లేకుండా కేవలము  దైవ చింతనతో జీవించే ఒక జీవితము. అందుకె  మరియమాత తన ఉత్తరియాన్ని విరికి ఇవ్వడము జరిగినది.   తిరుసభలో ఉన్నటువంటి వెదపండితులలో నలుగురు మాత్రమే స్త్రీలు, వారీలో  ఇద్దరు  ఆవిలపూరి తెరజమ్మ  మరియు చిన్న తెరేజమ్మ ఈ సభ  వారే. కార్మెల్ మాత పండుగకు ఈ సభకు  చాలా  విడదీయయరాని బందాన్ని మనము చూస్తాము. ఎప్పుడైతే ఈ సభ ఇటువంటి  జీవితాన్ని విడనాడి దాని సభ్యులు వారి ఇష్ట  ప్రకారముగా జీవిస్తూ ఉన్నారో అప్పుడు ఆ సభ పెద్దలు అయిన పునీత సైమన్ స్టాక్ గారు ప్రతిరోజూ ప్రార్దన చేస్తు మరియమాత  సహాయాన్ని కోరుతూ తన సభను  కాపాడుకోమని కోరేవాడు. ఒక రోజు ఆమె ఆయనకు ఆ సభకు  అభయమిస్తూ ఆమె ఉత్తరియాన్ని పునీత సైమన్ స్టాక్ గారికి ఇచ్చింది. ఈ  ఉత్తరియాన్ని ఇస్తూ ఎవరియతే దీనిని ధరించి చనిపోతారో వారిని  కాపాడుతాను అని అభయము ఇచ్చింది. అప్పటి నుండి  మనము ఉత్తరియము  ద్వారా మారియమాత ఇచ్చిన  అభయాన్ని పండుగగా  జరుపుకుంటున్నాము. 

    అనేక దేశాలలో ముక్యముగా ఐరోపా , లాటిన అమెరికాను దేశాలలో చాలా గొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. పతన స్థితిలో ఉన్న కార్మెల్ సభ మరలా ఏ విధముగా పునరుద్దరిచబడిందో అదే విధముగా మన జీవితాలు కూడా పునరుద్దరిచబడాలి  అని ఆ మరియమాత  ఉత్తరియాన్ని ధరించి , ఆమె మద్యస్థ  ప్రార్ధన ద్వార  వేడుకొందాము. 

Fr. Amrutha Raju OCD

4, జులై 2021, ఆదివారం

14 వ సామాన్య ఆదివారము

 

14 వ సామాన్య ఆదివారము 

యెహేజ్కెలు 2  : 2  - 6 / 2  కొరింతి 12 : 7  - 10 /  మార్కు 6 : 1  - 6 

 

క్రిస్తునాధుని యందు ప్రియమైన స్నేహితులారా  ఈ నాదు మనము పధ్నాలుగోవా సామాన్య ఆదివారములోనికి ప్రవేశించియున్నాము ఈ నటి పరిశుద్ధ గ్రంథ పఠనలద్వారా త తండ్రి  దేవునికి మన పై ఉన్నటువంటి ప్రేమను తల్లి శ్రీ సభ మనకి తెలియజేస్తుంది 

ఐతే  మొదటిపఠనములో మనము గమనించినట్లు ఐతే ప్రభువైన యావే యెహేజ్కెలు ప్రవక్తతో పలుకుచున్న మాటలను మనము వింటున్నాము నర పుత్రుడా ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసిరి వారు  మొండివారిగా నన్ను లెక్కచేయతలేదు వారి మధ్యకు నిన్ను పంపుచున్నాను వారితో ప్రవక్త వున్నాడని గ్రహించి ఐన దేవునివైపు మారులుతారు అని మనకి అర్ధమగుచున్నది  

  ఈ ఇశ్రాయేలీయులు ఎవరయ్యా అంటే ఇక స్వరముతూ యావెను స్తుతించినవారే యావెను నమ్మినవారే ప్రభు నిన్ను పోలినదేవుడు ఎవరు అని పలికిన వారే నీవే అద్భుతకార్యములను  చేసినవాడవు అని ముక్త కంఠముతో స్తుతించినవారు ఈ ఇశ్రాయేలీయులు [నిర్గమ 15 : 11 ]  అహాబు రాజు పరిపాలన కాలములో బాలు దేవతలు పూజిస్తూ ప్రభువుని మరచిపోయి అందరు ప్రష్టులైపోయారు పాపముతో నిండి పోయారు పూర్తిగా వారి జీవన వ్యాపారములో మునిగి పోయారు త్రాగడం సుకించడం అనేదే వారి జీవిత వాంఛగా మారినిది వారి పనులలో దేవుని యొక్క ప్రస్తావనే లేదు దేవుడిని మరచి పోయారు ఇశ్రాయేలీయుల గురించి ప్రభువైన యావే ప్రవక్త అయినటువంటి ఎహేజ్కెళుతో పలికెళిన మాటలను మనము ఈనాటి మొదటి పట్టణములో వింటున్నాము దేవుడు తన ప్రజల తప్పులను ఏత్తిచూపిన విధానం ఆసక్తి కరంగా ఉంటుంది వారు కేవలం విశ్వాసం లేని వారు అవిధేయులు మాత్రమే కారని వారు తిరుగుబారు దారులని మొండి వారని ప్రభువు ప్రవక్తకు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దేవుడు పలికిన ఈ పలుకులు ఇశ్రాయేలీయుల పట్ల అనాదిగ అయన చూపిన ప్రేమ పరోక్షముగా వెల్లడిస్తాయి అయినప్పటికీ తాను ఎన్నుకున్న ప్రజలలో తాను కోరుకున్న మార్పు వస్తుంది అన్న ఆశతో ప్రవక్తని పంపించడం దేవుని  యొక్క ప్రేమకు నిలువెత్తు సాక్షం. ఏదో ఒకనాటికి వారిలో హృదయ పరివర్తనం కలుగుతుంది తమ మధ్య గల ప్రవక్తను వారు గురుతిస్తారు తెలుసుకుంటారు అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రభువైన దేవునికి వారిమీద గల నమ్మకం.

ఈ నాటి రెండవ పట్టణములో పునీత పాల్ గారు నా శరీరములో ఒక ముళ్ళు గ్రుచ్చ బడినది అది సైతాను దూత అంటారు. ఏమిటి ఆ ముళ్ళు? ఎవరు ఈ సైతాను దూత? [2 కొరింథీలు 11 : 12 - 15  ]  పౌలు అసత్యపు ఆపోస్టులను సైతాను ప్రతిరూపాలతో పోలుస్తున్నాడు. అసత్యపు ఆపోస్టులలో ఒకడు శరీరములో ముల్లువలె పౌలును బాధించేవాడు పౌలు సువార్త పరిచేర్యకు అడ్డు పడుతూనేఉన్నాడు కనుక ఆ అసత్యపు అపోస్తులను ఉదేశించి పౌలు శరీరములో ముళ్ళు అని అన్నాడు నిజానికి క్రీస్తు ప్రభువు బలహీనులైన వ్యక్తులద్వారానే  తన శ్రీసభ నిర్మాణం కొనసాగిస్తూ ఉంటారు అందుకే పౌలు తన బలహీనతల గురించి యంత ఎక్కువగా ప్రకటిస్తూ ఉండేవాడో అంత ఎక్కువగా ప్రజలు ఆయనలో పునరుతనా క్రీస్తును దర్శించ గలిగేవారు ఒక్క మాటలో చెప్పాలంటే వేద ప్రచారములో పౌలు ఎన్ని వేదనలకు గురి అయ్యాడో ఏవిందంగా తిరస్కరించ బడ్డాడో ఈ నాటి రెండవ పఠనం తెలియజేస్తుంది. యేసు క్రీస్తు ప్రభువే సొంత ప్రజలతో తృణీకరించ బడినపుడు పౌలు వంటి సువార్తికులు బోధకులు ప్రభువు అడుగు జడలలో నడిచే క్రెస్తవ విశ్వాసులు ఏదో ఒక్క రూపములో తిరస్కారానికి గురికావడం సహజమేనని ఈనాటి సువిశేషములో స్పష్టమగుతుంది. యేసు ప్రభువు తన సొంత ఊరు నజరేతుకు వెళ్లారు సొంత ప్రజలే ఆయనను నిరాకరించారు తృణీకరించారు బోధకుడిగా అయన చేసిన బోధనలను కూడా తిరస్కరించారు యేసు ప్రభువు తన సొంత ప్రదేశానికి నజరేతుకి రాకమునిపే ఆ పట్టణ ప్రజలు యేసు బోధనలు చేస్తున్నాడు అని అద్భుతాలు కూడా చేస్తున్నాడని చెప్పుకున్నారు. ఈ నాటి సువిశేషములో యేసు ప్రభువు ప్రధానమందిరములో బోధించడంతో ప్రారంభమై పరిసర గ్రామాలలో బోధించడం ముగుస్తుంది.

యేసు ప్రభువు గల బోధన సామర్ధ్యాన్ని జ్ఞానాన్ని చూసి నజరేతువాసులోతో సహా ప్రజలందరూ ఆచార్య పోయారు అయితే అయన బోధిస్తున్నవి సత్యసందేశాలు అయినప్పటికీ ప్రజలు వాటిని ఆమోదించలేక పోయారు మన మధ్య పుట్టి పెరిగినవాడు మనకే బోధన చేస్తాడా అన్న చులకన భావం వలన వారు బోధకుడిగా యేసు ప్రభుని అదరణిచలేక పోయారు తృణీకరించారు

ప్రియమైన స్నేహితులారా క్రీస్తు ప్రభు పలికిన ప్రతి మాట నిత్యా సత్యమని విశ్వసించాలి ఎందుకంటె పలికిన వాడు పురాతనుడైన ప్రభువు మహిమాన్వితుడైన తండ్రి దేవుని సన్నిధానంలో ఉన్నారు. ఈ సత్యాన్ని మనసారా నమ్మి ప్రభు మాటలను త్రికరణ శుద్ధిగా పాటించక పోతే అనజరేతు ప్రజలు తిరస్కరించిన దానికంటే మనము ఏవిధముగా మెరుగైన వరమని అనిపించుకోము తనని నమ్మి వచ్చిన రోగులను స్వస్థ పరిచారు క్రీస్తుప్రభువు. మనము కూడా ఆయనను నమ్మి క్రీస్తు సువార్తలో పాలుపంచుకోవాలని మహిమలు చూడాలని ఈ నాటి పరిశుద్ధగ్రంధ పఠనాలు మనకు తెలియచేస్తున్నాయి ఆమెన్.

                                                                                      -BR. MANOJ

 

 

 

 

28, జూన్ 2021, సోమవారం

పద మూడవ సామాన్య ఆదివారం


సో, జ్ఞాన 1 : 13  - 15 , 2 : 23  - 24 
2 కొరింతి ౮: 7 , 9 , 13  - 15 
మార్క్ 5  : 21  - 43

క్రీస్తునాదునియందు  ప్రియమైనటువంటి సహోదరి సహోదయులారా ఈ నాడు మనమందరం కూడా పదమూడోవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేచించియున్నాము, ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లైతే ఇవి ముఖ్యముగా మానవునియొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన రెండు అంశాల గురించి మనకు తెలియజేస్తున్నాయి అవి ఏమిటంటే మరణము నుండి జీవమును మరియు అనారోగ్యం నుండి ఆరోగ్యము. ఈ రెండు అద్భుతాలు కూడా దేవుని యొక్క శక్తి ద్వారానే జరుగుతున్నటువంటివి మరియు అయన యొక్క హస్తం మనలను తాకటం ద్వారా ఈ యొక్క అద్భుతాల్ని మనం పొందుతున్నామని ఈ నాటి పఠనములు మనకు తెలియజేస్తున్నాయి.
ముందుగా మనం మరణము నుండి జీవమును చిసినట్లైతే మరణమనేది చనిపోయిన వ్యక్తిని తప్ప మగత అందరిని ఆడిపిస్తుంది కానీ జననం మాత్రం పుట్టిన వ్యక్తిని ఏడిపిస్తూ మిగతా అందరిని కూడా సంతోషపరుస్తుంది. ఎందుకంటే దేవుడు ఈ యొక్క లోకాని సృష్టించినప్పుడు అన్నిటిని కూడా సమానంగా సృష్టించియున్నాడు. అంతేకాక తాను సృష్టించిన దానిని అటువంటి స్వార్థం లేకుండా సృష్టించియున్నాడు. ఆలా సృష్టించడమే కాకుండా ఈ యొక్క సృష్టి కలకలం తన యొక్క ఆదీనంలో వుంచుకోవాలనుకున్నాడు కానీ దేవుడు సృస్టించనటువంటిది ఒకటి ఉంది అదే మరణము. ఈ యొక్క మరణం అనేది మనువుడు కొనితెచ్చుకున్నాడు.
మరణము
మరణం అనేది అవ్వ ద్వారా ఆదాముల పాపం ద్వారా ఈ యొక్క లోకానికి వచ్చింది, దేవుడు సృష్టించినపుడు మరణమనేది ఈ యొక్క లోకంలో లేదు, ఈ యొక్క మరణం ఎప్పుడు మానవులోకి వచ్చిందంటే మానవుడు ఎప్పుడైతే  దేవునికి వెతిరేకంగా తిరిగి పాపపు జీవితమును ఎంచుకున్నాడో అప్పుడే  మానవుల యొక్క జీవితంలోకి మరణమనే పదం సంభవించింది. ఈ యొక్క మరణం అనేది మానవుని యొక్క జీవితంలో చివరి గడియ అన్నమాట ఎందుకంటే మరణం అనేది నీటిపై ఉన్నటువంటి బుడగ వంటిది అది ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలియదు అదే విధంగా మానవునియొక్క జీవితంలో కూడా మరణమనేది ఎప్పుడు సంభవిస్తుందో మానవునికి తెలియకుండానే వస్తుంది. 
ఈ యొక్క మరణం ఎక్కడ నుండి వచ్చిందని మనం గమనించినట్లయితే ఇది సాతాను యొక్క అసూయవల్ల అంటే కాకుండా దీనికి మూలకారకుడు ఆ సాతాని. ఈ యొక్క మారానని మనం మొదటి పఠనములో చిసినట్లైతే 1 : 13 వ వచనంలో దేవుడు మరణమును సృష్టించలేదు, ప్రాణులు చనిపోవుట చూసి అయన సంతసింపడు అని. ప్రియా దేవుని బిడ్డలారా మానవులు చనిపోవుట దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే తాను సృష్టించిన సృష్టిలో వినాశనకరమైనది అది లేదు. అంతేకాకుండా దేవుడు సృష్టించిన విధానాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆ ప్రాణి మరణించదు. ఎందుకంటే దేవుడు సృష్టించిన దానిని ఎల్లపుడు తన యొక్క అధీనములో ఉంచుకోవాలని అనుకున్నాడు అంటే కాకుండా భౌతిక మరణానికి దూరంగా ఉంది తన యొక్క నిత్యా జీవితములో జీవించాలని మానవులందరికీ కూడా తన యొక్క జీవమును ఇచ్చి వున్నాడు. కానీ మానవుడు మాత్రం దేవుని యొక్క ప్రణాలికను ప్రక్కన పెట్టి సాతాను యొక్క అడుగు జడలో నడిచాడు.
ఈ యొక్క పాపా జీవితం ఎక్కడ నుంచి వచ్చిందయ్యా అని మనం ధ్యానించినట్లైతే ఇది పాత నిబంధనలో అవ్వ అధములనుంచి వచ్చింది, ఆ యొక్క పాపమే ఇప్పటి వరకు కూడా మానవుని విడిచిపెట్టటం లేదు.
అసలు ఈ యొక్క మారానని ఎవరు తెచ్చారంటే సాతాను, సాతానుకు మరియు మారానని కి సంభందం ఏమిటి అని చుస్తే, దవుడు మరియు మానవులు ఏవిధంగానైతే సమానంగా జీవిస్తున్నారో అంటే కాకుండా మానవుడు దేవునికి అనుగుణంగా జీవిస్తున్నాడని చుసిన సాతాను, ఎలాగైనా దేవుని మరియు మానవుని వేరు చేయాలనుకున్న చేదు ఆలోచనతోటి పన్నాగం పొంది మానవుని ఈ యొక్క లోక ఆశలకు బానిసగా చేసి పాపని ఈ యొక్క లోకం లోనికి ప్రవేశపెటింది. ఈ యొక్క పాపం ద్వారా మానవుని దేవునికి దూరం చేసి ఈ యొక్క ఆత్యాద్మిక మరణానికి కారకుడయ్యాడు. 
ఈ విధంగా సాతాను చేసిన పనికి ఈ యొక్క లోకంలోని మానవ జాతికి ఆధ్యాత్మిక మరణం సంభవించి దేవుడు ఇచ్చినటువంటి నిత్యా జీవ భాగ్యాన్ని కోల్పోయారు. ఈ యొక్క ఆద్యద్మిక మరణం ఏమిటి అంటే మానవుడు తన స్వార్థం కొరకు తాను బాగుండాలన్న ఆలోచనతోటి ఇతరులను నాశనం చేసి పాపముల ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక మారానని కొని తెచ్చుకున్నాడు.
మరణం అనేది మూడు రకాలు 
1 ) మానవునికి మరణం తథ్యం 
2 ) మరణము పాప ఫలితమే 
3 ) ఆధ్యాత్మిక మరణము
జీవము 
దేవుడు సృష్టించినపుడు మానవుని, జంతువులను అన్నిటిని కూడా జీవముతోనే సృష్టించియున్నాడు, ఈ యొక్క జీవం ద్వారా మానవునికి అంతం లేదు.
మనము మొదటిపఠనములో చుసిన విధంగా మృత్యువును దేవుడు కలిగింపలేదు, సాతాను అసూయా వలన అది లోకం లోనికి ప్రవేశించియున్నది అని మనకు మొదటి పఠనము స్పష్టం చేస్తోంది. కానీ జీవం ప్రసాదించగల శక్తి యేసు ప్రభువుకు ఉందని సువార్త పఠనం తెలియజేస్తుంది.
మరణం తరవాత జీవం పొందినవారిని మన చూసినట్లయితే నూతన నిభందనలో నలుగురి వ్యక్తులు  ఉన్నారు వారు  ఎవరు అంటే   
1 ) యాయిరు కుమార్తె 
2 ) నాయిని విధవరాలి కుమారుడు 
3 ) లాజరు 
4 ) దొర్కా 
1 ) యాయిరు కుమార్తె :- యాయిరు అనే వ్యక్త్తి  ప్రార్థన మందిర అదేక్షుడు యేసు వద్దకు వచ్చి, యేసు పాదాలపైపడి మరణావస్థలో ఉన్నటువంటి తన కుమార్తెను స్వస్థత పరచడానికి తన ఇంటికి యేసును రమ్మని ప్రాధేయపడ్డాడు, తన యొక్క విశ్వాసాన్ని చూసినటువంటి యేసు తన యొక్క ఇంటికి వెళ్లి బాలిక యొక్క గదిలోనికి ప్రవేశించి మరణించినటువంటి బాలికను చాయి పట్టుకొని "తలీతాకుమీ" అన్నారు, దాని అర్థం ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్తం. వెంటనే బాలిక లేచి తన పడకపైనుంచి దిగి తనకేమి జరగనట్లుగా వ్యవహరించింది. ఎందుకంటే లెమ్మంటా అనేది పునరుతనా జీవనానికి సమానం ఈ యొక్క జీవం అనేది యేసుక్రీస్తు యొక్క పునరుత్తానికి గుర్తు.
కాబ్బటి ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవులమైన మనమందరం కూడా విశ్వాసంతో జీవిస్తామో అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడని ఈ నటి పఠనములు మనకు తెలియజేస్తున్నాయి.
                                                                                                               - BR. JOHANNES

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...