22, జనవరి 2022, శనివారం

మూడవ సామాన్య ఆదివారం

 మూడవ సామాన్య ఆదివారం 

నెహెమ్యా  8:2-4,5-6,8-10 1 కోరింథీ 12:12-30 లూకా 1:1-4,4:14-21 

నేటి దివ్య పఠనాలు  దేవుని  యొక్క వాక్కు వినేటటువంటి  ప్రజలు ఎలాంటి జీవితం జీవించాలి అనే అంశం గురించి తెలుపుతున్నాయి.  దేవుని యొక్క వాక్కు యొక్క గొప్పతనం  శక్తిని  గ్రహించి దేవుని ప్రజలు ఐక్యత, సక్యత  కలిగి  జీవిస్తూ దేవున్ని అంటి పెట్టుకొని  జీవిస్తూ  దేవుని సేవ చేయాలని కూడా  ఈనాటి పఠనాలు  మనకు తెలుపుచున్నాయి. 

ఈనాటి  మొదటి పఠనంలో  దేవుని వాక్కు యొక్క గొప్పతనం గురించి చదువుకుంటున్నాము. మొదటి పఠనం యొక్క చరిత్ర మనం గ్రహిస్తే, ఆనాటి  పర్షియా రాజు కోరేషు బాబిలోనియా ప్రజలను  జయించిన తరువాత బానిసత్వంలో  దాదాపు 70 సంవత్సరాలు గడిపిన యూదులను  వారి సొంత భూమి అయిన యెరుషలేముకు పంపించారు. 

తిరిగి వచ్చిన యూదులు యెరుషలేము  దేవాలయంణు పునర్నిమించారు. ఎజ్రా 6:15-17 అదే విధంగా ఆ పట్టనపు గొడలు కూడా కట్టడం ముగించిన  పిదప  దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు.  దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు. దేవుని యొక్క వాక్యం చదివినది ఎజ్రా. ఆయన  ధర్మ శాస్త్ర భోధకుడు , యాజకుడు అదే విధంగా  మత సంబంధిత నాయకుడు (నెహెమ్యా 8:9)

అదేవిధంగా నెహెమ్యా  రాష్ట్ర పాలకుడు  దేవునితో మంచి  అనుభందం  కలిగిన వ్యక్తి, దైవ భయం  వున్న వ్యక్తి ,దేవుడు ఎజ్రాకు  మరియు నెహెమ్యాకు  ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పజెప్పారు. ఆదేమిటంటె  దేవుని యొక్క  వాక్కును ప్రకటించుట, ప్రకటించుట మాత్రమే కాదు ప్రజలను ప్రేరేపించాలి. 

ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు  విషయాలు గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్కు మనం ప్రకటించాలి, ఇతరులను దైవ వాక్కుతో ప్రేరేపించాలి. ఈ మొదటి పఠనంలో యిస్రాయేలు  ప్రజలు దేవుని యొక్క వాక్కును వినుటకు కనబరిచిన ఆసక్తి గొప్పది. 

దేవుని యొక్క వాక్కు వినాలని ఎంతో ఆశతో వున్నారు. దేవుని యొక్క వాక్కు దేవునితో సమానమని భావించారు. బానిసత్వంలో  బహిరంగంగా దేవుని వాక్కు ఆలకించే  అవకాశం లేదు అందుకే ఇప్పుడు  దొరికిన  అవకాశంను  బట్టి వారు ఆ వాక్కుకై తయారై వున్నారు. ఎజ్రా దేవుని వాక్కు చదివినప్పుడు ఉదయం నుండి  మధ్యాహ్నం వరకు అందరుకూడా సావదానంగా విన్నారు. వారు విసుగు చెందక, అలసట పొందకు  అదే పనిగా ఎలాగా  వినగలిగారు. అంటే ఆ వాక్కులు  ఆ ప్రజలకు వినసొంపుగా వున్నాయి.  ఆ వాక్కు వల్ల  దేవుని తెలుసుకోవచ్చు అం గ్రహించారు. కీర్తన 119:103 

ఆ వాక్యములు  వారికి  వెలుగును , చూపేలా ఉన్నాయి. అందుకే వాటిని వినడానికి చాలా ఇష్టపడుతున్నారు. దేవుని వాక్కు  యొక్క  ఔనత్యాన్ని తెలుసుకున్నారు. అందుకే  ఎటువంటి  ఇబ్బంది లేకుండా విన్నారు. వారి యొక్క  ఆధ్యాత్మిక జీవితంకు  దైవ వాక్కే ఆహారం. దేవుని యొక్క వాక్కు  సృష్టించే వాక్కు అని. దేవుని యొక్క వాక్కు  ఆదరించే  వాక్కు అని ,దేవుని యొక్క వాక్కు నేర్పించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు స్వస్థత నిచ్చే వాక్కు అని వారు గ్రహించారు.

మనం దేవుని  వాక్కుకు  ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం? దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి చదవడానికి  ఎంత మందికి ఆసక్తి ఉంది.  యూదుల కాలంలో అందరి దగ్గర దేవుడు మోషే ద్వార ఇచ్చిన  ధర్మ శాస్త్రం  లేదు అయినప్పటికీ అయినప్పటికీ అవకాశం ఉన్న చోటల్లా దేవుని వాక్కు వింటున్నారు. మనందరికీ  ఇప్పుడు బైబుల్  గ్రంధం ఉంది. ఎంత మంది  చదువుతున్నారు? చదువు లేకపోయినా చదువుకున్న బిడ్డల దగ్గర ఎంతమంది చదివించుకొని వింటున్నారు. 

గుడికి వచ్చినప్పుడు యాజకులు బైబుల్ గ్రంధం మొత్తం  వివరించలేరు ప్రసంగంలో , అందుకే  దేవున్ని  తెలుసుకోవాలంటే మన జీవితాలు సన్మార్గంలో నడిపించు కోవాలంటే మనం దేవుని వాక్కు చదవాలి, వినాలి. 

చదివితే మరియు వింటేనే మనలో విశ్వాసం పెరుగుతుంది. రోమి 10:17. ఆనాటి యూదా ప్రజలు సమయం గురించి ఆలోచించలేదు. దేవుని వాక్కు గురించి మాత్రమే  ఆలోచించారు. మనం కూడా పవిత్ర గ్రంధం చదువుట ద్వారా దేవుని ప్రేమ, క్షమా, త్యాగం చాల విషయాలు నేర్చుకోవచ్చు.

అలంటి ఆసక్తి మనలో ఉందా?

2. రెండవది గా దేవుని ధర్మ శాస్త్రమునకు ఇచ్చిన గౌరవం అందరం ధ్యానించుకోవాలి.

నెహెమ్యా 8: 5-6  ఎప్పుడైతే ఏజ్రా గ్రంధమును విప్పారో అప్పుడు అందరుకూడా లేచి నిలబడ్డారు, దేవుణ్ణి స్తుతించి అదేవిధంగా ఆ ప్రభువుని ఆరాధించారు.

- ఆ గ్రంధం గురించి వారికి తెలుసు కాబట్టియే ఆ పుస్తకం కు అంత ప్రాధాన్యత ఇచ్చారు.

-మరి ఈ రోజు మనం పవిత్ర గ్రంథం ను ఎలాంటి స్థలాల్లో ఉంచుతున్నాం?

-కొంతమంది ఎక్కడెక్కడో పెడతారో. అది కాదు మనం చేయాల్సింది, ఆ గ్రంధం దేవుడే కాబట్టి మనం మంచి స్థలం ఇవ్వాలి.

- విలువ గ్రహిస్తే ప్రాధాన్యత ఇస్తాం. ఇశ్రాయేలు ప్రజలు గ్రహించారు కాబట్టియే  అది చేయగలిగారు.

-చర్చిలో నిలబడ్డ సమయంలో కొన్నిసార్లు బైబిలు మన కాళ్ళ దగ్గరఉంటుంది. అది కూడా మనం పట్టుకొని నిలబడితే అప్పుడు ఆ వాక్కు కు మనం గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.

- ప్రతి ఒక్కరు పవిత్ర గ్రంధమును దేవాలయానికి తీసుకురావాలి.

-దేవునియొక్క వాక్కును చదివిననప్పుడు వారియొక్క హృదయాలు చలించి పోయాయి. అందుకే దుఃఖం పట్టలేక ఏడ్చిరి . నెహెమ్యా 8:9

- దేవుని ఆజ్ఞలు మీరు జీవించినందుకు ఏడ్చి ఉండవచ్చును.

- వారు బోరున ఏడ్చారు. దేవుని వాక్కును విన్న సమయంలో దేవుడి ప్రేమ వారికి గుర్తుకు వచ్చింది.

-దేవుడు వారిని ఒక కాపరిగా, తండ్రిగా నడిపించిన విధానం గుర్తుకు వచ్చింది.

-వారికి బానిసత్వం వచ్చింది ఆయన యొక్క వాక్కును ధిక్కరించడం వల్లే అని గ్రహించి ఉండవచ్చును.

- వారికి ఇచ్చిన మన్నా, పూరేడు పిట్టలు, సమృద్ధిగా స్వేచ్ఛ జీవితం గుర్తుకు వచ్చింది.

- వారు దైవమును కాదని అన్య దైవములను ఆరాధించిన పాపపు జీవితం గుర్తుకు వచ్చింది.

-దేవుని యొక్క వాక్కు వారి జీవితాలకు అన్వయించారు కాబట్టియే వారియొక్క బలహీనతలు, పాపపు మచ్చలు గుర్తుకు వచ్చాయి.

మనం కూడా దేవుని వాక్కును మన జీవితాలకు అన్వయించుకుంటేనే  మనలో కూడా హృదయ పరివర్తనం అనేది కలుగుతుంది.

- కొన్నిసార్లు మనం కొంతమందిని చూస్తాం ప్రసంగం చెప్పేటప్పుడు ఏడుస్తారు ఎందుకంటే ఆ వాక్యం వారిని తాకింది.

అదేవిధంగా వారియొక్క పాపపు జీవితం గుర్తుకు వచ్చినప్పుడు, ఏడుస్తారు.

-పాపపు జీవితం ద్వారా, స్వార్ధపు జీవితం ద్వారా ఇతరులను దేవుడిని బాధ పెట్టిన సమయాల గురించి వాక్యంతో భోదించినప్పుడు సాధారణంగా అందరూ ఏడుస్తారు. మనం కూడా ప్రభువు యొక్క వాక్కు విన్న సమయంలో భాద కలిగి మార్పు కలగాలి.

1.సౌలు విన్నాడు హృదయ పరివర్తనం చెందాడు. (పౌలు)

2.దావీదు నాతాను ప్రవక్త యొక్క దైవ వాక్కులు విన్నాడు పశ్చాత్తాప పడ్డారు.

3.నినెవె  పట్టణ  వాసులు విన్నారు దుఃఖం తో జీవితాలు సరిచేసుకున్నారు

4.అగస్టీను దేవుని యొక్క వాక్కు విన్నాడు -హృదయ పరివర్తనం చెందాడు. మనం కూడా  అలాగే  మన జీవితాలు మార్చుకోవాలి.

-వాక్యం చదవటానికి, వినటానికి సమయం కేటాయించాలి. అప్పుడే దేవుని గురించి తెలుసుకొని జీవిస్తాము.

-దేవుని వాక్కు చదివితే ఆ వాక్యమే మనలను నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. మనం ఎలా జీవించాలి అని తెలుపుతుంది.

- దేవుని యొక్క వాక్కు లేని లోపం వారు తెలుసుకున్నారు. అందుకే ఎంత సమయమైనా కాని పట్టించుకోకుండా శ్రద్ధగా విన్నారు, ప్రభువునందు ఆనందించారు. అలాంటి విశ్వాసం, ఆశ మనలో కూడా ఉండాలి.

రెండవ పఠనంలో

దేవుని బిడ్డలు, దేవుని వాక్కు వినేవారు చదివేవారు జీవించవలసిన విధానం గురించి పౌలుగారు తెలుపుచున్నారు.

-కొరింతు ప్రాంతంలో భిన్నమైన ప్రజలు జీవిస్తుండేవారు వారిలో బేధాభిప్రాయాలు ఎక్కువగానే ఉండేయి. ఐతే పౌలు గారు వారందరు కూడా ఐక్యంగా కలిసి జీవించుటకు శరీరం మరియు దానిలో వున్నా అవయవములు ఉదాహరణ తీసుకొని ఐక్యతను గురించి తెలుపుచున్నారు.

-జ్ఞానస్నానం పొందిన ప్రతి యొక్క విశ్వాసి దేవుని యొక్క పవిత్రమైన శరీరంలో భాగమే.

- జ్ఞాన స్నానం స్వీకరించుటకు ముందు మనలో ఎన్నోరకాలైన భావాలూ భేదాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని జ్ఞానస్నానం పొందిన తరువాత విడిచిపెట్టాలి అని పౌలుగారు వివరిస్తున్నారు. (1కొరింతి12: 12-13 )

-మన శరీరంలో వున్న ప్రతియొక్క అవయవం ముఖ్యమైనది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. కొన్ని అవయవాలు పెద్దవి అయివుండవచ్చును కొన్ని చిన్నవి అయి ఉండవచ్చు, అయినప్పటికీ దేని ప్రాముఖ్యత దానికి ఉంది.

-కాబట్టి ఒక్క అవయవం ఇంకొక్క దానికి సహకరిస్తూ జీవిస్తే అక్కడ మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది.

-మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తేనే మనందరం బాగుంటాం. ఏది బాగా లేకపోయినా మనం సంతోషం గా ఉండలేము. అలాగే మనందరం కూడా దేవుని శరీరంలో  భాగస్తులం మరి మనం కూడా ఐక్యంగా జీవించాలి.

చేయి నోటికి సహకరించకపోతే మనం తినలేం

-కన్ను కాలికి సహకరించకపోతే మనం నడవలేం

-నోరు చెవులకు సహకరించకపోతే మనం వినలేం.

అందుకే ప్రతి ఒక్క అవయవం అవసరం, ప్రతి అవయవం శరీర అభివృద్ధి కోసం, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడాలి.

-ప్రతి ఒక్క వ్యక్తి తాను శ్రీసభ (శరీరం) కోసం తన వంతు తాను కష్టపడాలి. అప్పుడే శ్రీసభ  ఆనందంగా ఉంటుంది.

- శ్రీ సభ శిరస్సు క్రీస్తుప్రభువే ఆయన లేకుండా మనం లేము. కాబట్టి ఆ శరీరం గొప్పతనం గ్రహించి , సహకరించి జీవించాలి.

-మనందరం కూడా ఐక్యత కలిగి జీవించాలి. పౌలుగారు అంటారు జ్ఞానస్నానం పొందినవారందరు దేవుని బిడ్డలే అందుకే వారు ఐక్యంగా జీవించాలి.

-సాధారణంగా సమాజంలో మనం చుస్తే ఇంకా చాలామందికి జాతి, మత, కుల భేదాభి ప్రాయాలు వున్నాయి. బహుశా ఇంకా వారిని దేవుని యొక్క వాక్కు తాకలేదు.

-స్వయంగా యేసు ప్రభువే తనను తాను తగ్గించుకొని పాపులతో, సుంకరులతో కలిసి జీవించారు.

-పౌలు పరిసయ్యుడు అయినప్పటికీ అన్యులకు సేవచేసారు. ఆయన్ను దేవుని వాక్కు మార్చింది.

-దేవుని వాక్కు అతనికి వివేకాన్ని అందించింది అందుకే భేదాభి ప్రాయాలు లేకుండా జీవించారు.

-మనం దేవుని బిడ్డలం, ఆయన మన తండ్రి మనందరం ఒకే కుటుంబంలో ని బిడ్డలం కాబట్టి అందరితో కలిసి మెలసి ఐక్యంగా జీవించాలి.

-శ్రీ సభ అభివృద్ధి కోసం సహాయపడాలి. అందరుకూడా విలువైన వారే ధనిక -పేద వ్యత్యాసం లేకుండా .

-మనందరం దేవుని వాక్కు చదివి, ధ్యానించి ఆ వాక్కు అనుసారం జీవించాలి, ఎలాంటి భేదాలు మనలో వుండవు. వాక్యమును చదువుకొని జీవించుద్దాం, ఐక్యంగా కృషిచేద్దాం.

-ఈనాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క పంపబడిన విధానం తెలుసుకుందాం.

-ప్రభువు ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డారు అని తెలుపుచున్నారు.

సువార్త ప్రారంభంలో లూకా గారు ఈ సువార్త తెయోఫిలుకు వ్రాస్తున్నారు. అదేవిధంగా అందరి విశ్వాసుల కోసం వ్రాస్తున్నారు.

-తెయోఫిలు బహుశా నీటి గలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు, మంచి పేరు కలిగిన వ్యక్తి కావచ్చు, లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగి లూకా గారిని యేసు ప్రభువు గురించి వ్రాయమని అడిగివుండవచు.

-బహుశా దేవునియందు విశ్వాసం ఉంచి క్రొత్తగా జ్ఞానస్నానం పొందిన వ్యక్తి అయి ఉండవచ్చు.

-తెయోఫిలు అంటే (a friend of God) దేవునికి స్నేహితుడు, దేవుణ్ణి ప్రేమించువాడు అని అర్థం.

-దేవుణ్ణి ప్రేమించు ప్రతిఒక్కరికి లూకా గారు ఈ సువార్తను వ్రాస్తున్నారు.

-వారియొక్క విశ్వాసంలో దృడంగా ఉండటానికి ఈ విధంగా వ్రాస్తున్నారు.

-సువార్తలో మనం వింటున్నాం లూకా 4:14-15 యేసు ప్రభువు చేసినా సువార్త పరిచర్య గురించి

-ఆయన కేవలం ప్రార్థించుటకు మాత్రమే కాకుండా వీలైన ప్రతి సమయంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.

-ప్రకటించిన వాక్యంకు ప్రతి ఫలం ఉండాలి. యేసుప్రభువు తండ్రి గురించి సువార్తలో తెలిపారు. ఆయన యొక్క జీవిత లక్ష్యం, ప్రణాళిక తెలిపారు.

-ప్రభువు ప్రతి ప్రాంతమునకు వెళ్ళేది అందరూ కూడా దేవున్ని తెలుసుకొని, హృదయ పరివర్తనం చెంది, రక్షణ పొందాలి అనే ఉద్దేశంతోనే.

యేసు ప్రభువు చదివిన మాటలు యెషయా 61:1-2 నుండి తీసుకొనబడినవి.

- ఈ మాటలు మోషే ఎన్నికకు దగ్గరగా వున్నాయి. నిర్గమ 3:7-10 మోషేను ఎందుకు ప్రభువు ఎన్నుకున్నారు అని తెలుపుచున్నారు.

-18 వచనం ద్వారా దేవుని ఎన్నిక దేని నిమిత్తం అని అర్థమవుతున్నది.

1. దేవుని  ఆత్మ  ఆయన పై ఉన్నది.

2. పేదలకు సువార్తను భోధించుటకు అభిషేకించారు.

3. చెరలో వున్న వారికి విడుదలను దయచేయుటకు.

4. గ్రుడ్డివారికి చూపును నిచ్చుటకును

5. పీడితులకు విమోచనం కలిగించుటకును

6. ప్రభు హిత సంవత్సరమును ప్రకటించుటకు ఆయన్ను అభిషేకించారు.

-దేవుని కార్యముల కోసం, సువార్త వ్యాప్తి కోసం మూడు రకాల ప్రజలు అభిషేకించబడ్డారు.

1.రాజులు

2.యాజకులు

3.ప్రవక్తలు

1.సమువేలు సౌలును, దావీదును రాజులుగా అభిషేకిస్తున్నారు. దేవుని యొక్క ప్రతినిధులు వుంది దేవుని కార్యములు నెరవేరుచుటకు.

2. యాజకులు ప్రతి ఒక్క యాజకున్ని దేవుడు అభిషేకిస్తారు దేవుని యొక్క యాజకులు ఆరోను దేవుని యొక్క యాజకులు ఆరోను అతని కుమారులు దేవుని సేవకోసం ప్రత్యేకంగా కేటాయించబడిన వారు - 2 రాజులు 29, 30 అధ్యాయాల్లో చెప్పబడినవి.

3. ప్రవక్తలు - దేవుడే  వారికి స్వయంగా పిలుపునిస్తున్నారు. దేవునికి మానవులకు మధ్యవర్తులుగా ఉండటానికి దేవుడు ఏలియాతో ఏలిషాను అభిషేకించడానికి చెప్పారు. 1 రాజులు 19:16-19 వీరందరూ దేవుని యొక్క పనికోశం అభిషేకించబడిన వారే, వారికి అధికారం , శక్తి, ఆత్మ వరములు ఇవ్వబడ్డాయి. కాబట్టి వారు చేసే సువార్త  అంగీకరించి  జీవించాలి. 

1. దేవుని ఆత్మ అభిషేకించబడిన వారి మీద ఉన్నది. దేవుని ఆత్మచె వారు నడిపించబడాలి. యేసు ప్రభువు నాపై ప్రభుని  ఆత్మ ఉన్నది అని పలికారు. ఆ ఆత్మ శక్తిచే శోదనలు  జయించారు, ఆత్మ శక్తిచే  సువార్తను ప్రకటించారు. కష్టలు ఓదార్చుకున్నారు. దేవుని ఆత్మ  తనను పరిచర్యకు సంపూర్ణంగా సిద్దం చేసింది. 

దేవుడు తాను పిలిచిన వారిని బలపరుస్తారు. దేవుని యొక్క ఆత్మ వారిని నడిపిస్తుంది. 

2. పేదలకు సువార్తను భోధించారు. పేదలు అనగా లేని వారు. దేవుని గురించి అవగాహన లేనివారు. దైవ ప్రేమ లేని వారు, దేవుని సుగుణాలు లేని వారు ,దేవుని యొక్క ఆత్మ లేనివారు, దేవుని యొక్క మంచి తనం, గొప్పతనం తెలియని వారికి సువార్తను ప్రకటించుటకు యేసు ప్రభువును తండ్రి దేవుడు అభిషేకించారు. గురువులను కూడా అందుకే  అభిషేకించారు. 

3. చెరసాలలో ఉన్న వారికి విడుదల దయచేయుటకు ఈ లోక ఆశతో , వ్యామోహంతో బంధీలుగా ఉన్నవారిని పాప సంకీర్తనల ద్వారా విడుదల దయ చేయుటకు దేవుని యొక్క పరిశుద్ద వాక్కు ద్వారా విడుదల దయ చేయుటకు ఎన్నుకొనబడ్డారు. 

4. గ్రుడ్డి వారికి చూపు నిచ్చుటకు 

ఎవరైతే దేవుని యొక్క కార్యాలు చూడలేక పోతున్నారు. దేవున్ని తమ జీవితంలో గుర్తించలేక పోతున్నారు. ఎదుటి  వారిలో ఉన్న  ప్రేమను చూడలేని గ్రుడ్డి వారు కొంతమంది కనులుండి గ్రుడ్డి వారిగా ఉండే వాళ్ళు ఉన్నారు. వారు అనుకున్నదే సత్యం అనుకుంటారు అట్టి వారికి దేవుడు మాత్రమే చూపు నివ్వగలరు. 

కొందరికి దేవుడు ఆధ్యాత్మిక చూపు దయ చేస్తారు. 

5.  పిడితులకు  -విమోచనం -ఎవరైతే శారీరకంగా , మానసికంగా ,ఆధ్యాత్మికంగా పీడించబడుతున్నారో అలాగే దయాల చేత పీడించబడేవారికి ,విమోచనం కలిగిస్తారు. మానసిక గాయాలవల్ల పీడించబడే వారు , అణచి వేయబడినవారు , ఎదుటి వారి పట్ల హర్ట్ అయినవారికి  విమోచనం కలుగ చేయుటకు పంపించబడ్డారు. 

6.దేవుని సంవత్సరం ప్రకటించుటకు - దేవుని యొక్క రక్షణ సంవత్సరం అని అర్ధం లేక మెస్సీయ్య యొక్క రాక అని అర్ధం. దేవుడు వారి మధ్యలో ఉన్నారు, అని తెలిపే సంవత్సరం అది. కాబట్టి మనందరం కూడా  దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి, అనుసరించి ఆ వాక్కు చేత స్వతత్రం పొందుతు సన్మార్గంలో నడుస్తూ దేవునికి అంగీకార జీవితం జీవిద్దాం. సాధ్యమైనంత వరకు సువార్త వ్యాప్తి కోసం కృషి చేద్దాం, దేవుని రాజ్య స్థాపనకు కృషి చేద్దాం. 

REV.FR.BALAYESU OCD



15, జనవరి 2022, శనివారం

రెండవ సామాన్య ఆదివారం

రెండవ సామాన్య ఆదివారం 

 యోషయా 62:1-5,  1 కోరింథీ 12:4-11 యోహను 2:1-11 

ఈనాటి దివ్య పఠనాలు దేవునితో దేవునిలో  ఒక క్రొత్త జీవితం  జీవించాలి అనే అంశం గురించి  భోదిస్తున్నాయి. దేవుడు  మనలో ఉన్న  అలాగే మనం దేవునితో ఉన్న అప్పుడు  మన యొక్క జీవితంలో  నూతనత్వం కలిగి జీవించాలి. ఈనాటి మొదటి పఠనంలో  దేవుడు యిస్రాయేలు ప్రజలను  దీవించిన  విధానంను  అదే విధంగా వారి  పునరుద్దరణను గురించి తెలుపుతుంది. 

దేవునికి విరుద్దముగా పాపం  చేసినందువల్ల  యిస్రాయేలు ప్రజలు  బాబిలోనియాకు పంపబడ్డారు. అయితే దేవుడు వారిని అక్కడితో మరచి పోలేదు, విడిచి పెట్టలేదు. వారు క్రొత్త జీవితం జీవించడానికి మరలా పిలుస్తున్నారు. 

మొదటి పఠనంలో దేవునికి మరియు యిస్రాయేలు ప్రజలకు ఉన్న బంధం ఒక వివాహ బంధం వంటిదని తెలుపుచున్నారు. యోషయా 62:5 యిస్రాయేలును  వధువుగా సంభోధీంచుట ద్వార ఇక యిస్రాయేలు ఒంటరి కాదని, వదలివేయ బడదని , అలాగే చేయి విడచి పెట్టబడదని తెలుపుచున్నారు. 

ఒక వరుడు  ఏ విధంగా  తన యొక్క వధువు  పక్షమున నిలబడతాడో అదే విధంగా దేవుడు కూడా యెరుషలేము కొరకు నిలబడతాడు. ఇక వారిద్దరు  సంతోషముగా జీవిస్తారు. వారు జీవించబోయే  ఒక నూతన జీవితం పూర్తిగా  అది ఒక క్రొత్త అనుభందంతో  ముడివేయబడుతుంది. 

దేవుడు తనలో  ఉంటే  ఎంతో లాభం కలుగుతుంది. ఎందుకంటే యోషయా 62:1 చివరి భాగంలో ఆ నగరపు విజయము వేకువ  వెలుగు వలె ప్రకాశించును,  ఆ పట్టణ రక్షణము చీకటిలో దీపమువలే మెరయును. 

వారి జీవితంలో  ఎప్పుడు కూడా విజయము ఉంటుంది. ఈ వెలుగు సంతోషానికి గుర్తు, వారు ఎప్పుడుకూడా సంతోషముగా ఉంటారు. వారి జీవితం బానిసత్వం, అనే అంధకారం నుండి తొలగించ బడుతుంది. 

యెరుషలేము పట్టణం రక్షణము పొందును వారి యొక్క వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది. యిస్రాయేలు ప్రజలు దేవునితో ఒక క్రొత్త నిబంధనా జీవితాన్ని జీవించినప్పుడు వారిద్దరి మద్య అన్యోన్య ప్రేమ , విధేయత విశ్వాస పాత్రులుగా ఉంటారు. దేవుడు క్రొత్త  జీవితాన్ని ఒకరికి దయచేసినప్పుడల్లా వారి యొక్క పేరును కూడా మార్చుతున్నారు. ఉదాహరణకు అబ్రాముకు  అబ్రహము అని, యాకోబుకు యిస్రాయేలు అని , సీమోనుకు పేతరు అని మార్చుతున్నారు.  ఈ విధంగా దేవుడు క్రొత్త జీవితాన్ని యెరుషలేము ప్రజలకు దయచేస్తున్నారు. దానిని దాంపత్య బంధంతో పోల్చుతున్నారు. వారిరువురు కూడా ఇక ఒకే జీవితం పంచుకోబోతున్నారు. అది ప్రేమ జీవితం. 

యోషయా ప్రవక్త,  దేవుడు  ఎప్పుడు కూడా వారితో ఉంటారు అనే భరోసా ఇస్తున్నారు. దేవుడు ఎల్లప్పుడు యెరుషలేముకు  మంచిని చేస్తూ  విశ్వాస పాత్రుడైన వరుడుగానే ఉన్నారు. యిస్రాయేలు మాత్రం అవిధేయత వలన , అవిశ్వాసనీయత వలన దేవునికి దూరమయ్యారు, కాని మరలా దేవుడు తనను క్షమించి, అంగీకరించి ఒక క్రొత్త  జీవితానికి  ఆహ్వానిస్తున్నారు. 

వాస్తవానికి  వివాహ బంధంలో కూడా కొన్నిసార్లు  ఎవరైనా బలహీనతవలన తప్పు చేస్తే  క్షమించి అంగీకరించి ఒక క్రొత్త జీవితం జీవించాలే కాని ఒకరినొకరు నిందించుకోకూడదు. దేవుడు  యిస్రాయేలుతో మెలిగిన విధానం అలాంటిదే  ఆయన వారి బలహీనతను అర్ధం చేసుకున్నారు. పవిత్ర గ్రంధం  ఒక వివాహ బంధం ద్వారా ప్రారంభమౌతుంది. అదే విధంగా క్రీస్తు ప్రభువు జీవితం కూడా ఒక వివాహం తోనే  ప్రారంభమగుచున్నది. యేసు ప్రభువే స్వయంగా కానా పల్లెలో జరిగిన పెండ్లి లో వరుడు వధువును ఆశీర్వధించారు. 

రెండవ పఠనంలో పౌలు గారు  దేవుని యొక్క ఆత్మ వరములను గురించి  భోధిస్తున్నారు. దేవుడిచ్చిన వరాలు మనం ఇతరులతో పంచుకోవాలి. 

దేవుడు ప్రతి ఒక్కరికి దీవెనలు ఒసగివున్నారు ఆ  దీవెనలు అందరితో మనం పంచుకోవాలి, అని పౌలుగారు తెలియచేసారు. కృపా వరములు చాలా వున్నాయి కాని  వాటిని ఇచ్చేవాడు మాత్రము దేవుడు. ఈ కృపా వరముల యొక్క ఉద్దేశం ఒక్కటే అది  మంచి చేయడానికి. 

దేవుడు తన జీవితాన్ని మనకు ఇచ్చారు అంటే తన వద్ద ఉన్న కృపా వరములు అన్నీ మనతో పంచుకుంటున్నారు. అలాగే   దేవుడు ఉచితంగా ఇచ్చిన జీవితం మనం కూడా మంచిని చేయడానికి వినియోగించాలి. మన జీవితాలు అభివృద్ది చెందడానికి కారణం  దేవుడు అన్నీ ఇచ్చింది ఆయనయే. మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు  ఏమి తీసుకొని రాలేదు. కాబట్టి మన జీవితంలో మనం ఏమి సంపాదించిన అది దేవుని వరమే. 

మనకు దేవుడు ఒసగిన ఆత్మ వరములు వివేకం, విజ్ఞానం , విశ్వాసం , స్వస్త పరచు శక్తి , అద్భుతాలు చేయు శక్తి, ప్రవచన శక్తి , ఆత్మలను వివరించు శక్తి, వివిధ బాషలలో మాట్లాడే శక్తి, బాషల అర్ధం వివరించే శక్తి . ఈ కృపా వరాలు అన్నీ స్వంత లాభం కొరకు కాకుండా ఇతరుల మేలు కొరకు ఉపయోగించాలి. 

ఆత్మ వరాలు పొందిన వారు , అవి తమ గొప్ప తనం వల్లనే లభించినవని గర్వించడానికి గాని , పొంగిపోవడానికి కానీ కాదు అహంకారంతో విర్ర వీగుతూవేరె  వారిని చిన్న చూపు చూడకూడదు. 

మన శరీరంలో గుచ్చ బడిన ముల్లు మనల్ని అది ప్రతిసారి  disturb చేస్తుంది , అది మనకు గుర్తు చేస్తుంది. అది మనకు గుర్తు చేసిన సమయంలో మన యొక్క బలహీనత మనకు గుర్తుకు రావాలి. మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా , ఎంత మంచి చేసినకాని మనం గర్వంగా గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకంటే అది అంతా  దేవుని కృపా వరమే. 

దేవుని యొక్క కృప  మనతో ఉంటే చాలు ఆ కృప వలన మనం జీవించగలుగుతాం.  ఆ కృప వలన మంచి కార్యాలు చేయవచ్చు. మనం గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఉదారంగా పొందినది , ఉదారంగా ఇస్తే మనం ఇంకా దీవించబడుతాం. చాలా సందర్భాలలో ఇవ్వడానికి మనం ముందుకు రాలేము. అదె విధంగా చాలా సందర్భాలలో మనం గొప్పలు చెప్పుకుంటాం. 

గొప్పలు చెప్పుకోవడం కొందరికి అలవాటు కాని పౌలు గారు గొప్పలు చెప్పుకొనవసరం లేదని తెలుపుచున్నారు. ఎందుకంటే మనలను గొప్ప వానిగా చేసింది దేవుడే కాబట్టి ఆయనను మనం పొగడాలి,  ఆ దేవుడిని ఘన పరచాలి, స్తుతించాలి.  

-ఈనాటి సువిశేషం లో యేసు ప్రభువు చేసిన మొట్ట మొదటి అద్భుతం గురించి చదువు చున్నాం.క్రీస్తు ప్రభువు తన దగ్గర వున్నా దివ్య వరములు తమ పొరుగువారితో పంచుకొనుటను తెలుసుకుంటున్నాం.

- తాను ఈ లోకంలోకి వచ్చింది తనకు వున్నది మనకు ఇవ్వటానికి,

-తన జీవం ఇచ్చారు

-తన ప్రేమనిచ్చారు

-తన సేవనిచ్చారు

-తన క్షమను ఇచ్చారు

-తన వరములు వారములు ఇచ్చారు.

-ఈ లోకంలో దేవుడు ఈ అద్భుతం ద్వారా తన కుమారుని ద్వారా మరలా సృష్టించే శక్తిని గురించి తెలుపుచున్నారు.ఆయనకు సృష్టించే శక్తి మరియు ఉత్పత్తి చేయగల శక్తి ఉంది. కానా పల్లెలో జరిగిన ఆ పెండ్లి యొక్క విధానం మనం తెలుసుకోవాలి.ఆ పెండ్లి ప్రతి ఒక్కరి కుడా కుడా ఆనంద దాయకమైనది. అందరూ కూడా సంతోషంగా  ఉంటారు.యూదుల ఆచారం ప్రకారం జరిగే పెండ్లి దాదాపుగా వారం ఉంటుంది. అక్కడ వారికి కావలసిన దంతా పెండ్లి వారే చూసుకోవాలి. ఈనాటి సువిశేషంలో విన్న అంశం, వారి పెండ్లి జరుగుతున్నప్పుడు ద్రాక్షా రసము తక్కువగా వున్నది అని.

- ఈ పెండ్లికి యేసు ప్రభువు, తల్లి మరియమ్మగారు ఆహ్వానించబడ్డారు. వారితో పాటు ఆంద్రెయ, పేతురు , యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమియా(నతానియేలు )  కూడా  వివాహ వేడుకలో పాల్గొన్నారని ఒక (Coptic Gospel )లో చెప్పబడింది .ఆ యొక్క సువిశేష ఆదారంగా చెప్పబడే అంశం ఏమిటంటే వరుడు మరియమ్మగారి చుట్టం. వరుడు పేరు "సీమోను" కానాకు చెందిన సీమోను.అతడు యాకోబు, యుదాల యొక్క సోదరుడు. అలాగే మరియమ్మ గారి అక్క  యొక్క కుమారుడు అందుకే బహుశా మరియమ్మ గారు ఎక్కువగా ఆసక్తి తీసుకొని ఆమె యే అంతా నడిపిస్తున్నారు. ఇది ఒక విధమైన భావన.

-ఇంకొక విధంగా ఆలోచిస్తే యేసుప్రభువు మొట్ట మొదటిగా తనయొక్క మహిమను వ్యక్త పరుస్తున్నారు.

-మరియమ్మ గారి ద్వారా ఈలోకంలోకి వచ్చిన యేసు ప్రభువు మళ్ళీ అదే తల్లి యొక్క మధ్య వర్తిత్వం ద్వారా సహాయం చేస్తున్నారు, అద్భుతం చేస్తున్నారు. వివాహం లో ఎందరో ఉన్నప్పటికీ అక్కడ అవసరం గుర్తించింది, తల్లియే గుర్తించటం మాత్రమే కాదు, ఆ అసమానత కొరతను, అవసరతను తీసివేయమని తన కుమారున్ని వేడుకొంది. మరియమ్మ గారు తాను విశ్వసించింది, తన కుమారుడు వారిని నిందలనుండి మరియు అక్కడున్న అవసరతనుండి రక్షిస్తాడు, వారిని ఆనందంగా ఉంచుతాడు అని ఆ తల్లి విశ్వసించినది   కాబట్టే  మొదటిగా  ఆయన దగ్గరకు  వెల్లింది. వేరే వాళ్ళ దగ్గరకు  వెళ్లి  ద్రాక్షా  రసము  కొనమని  చెప్పలేదు కానీ  తన కుమారుని  అడిగింది. మన  జీవితంలో  అవసరాలు  వున్నప్పుడుఎదో   కావాలి  అని అన్నప్పుడు  మనం మొదటిగా  దేవుని  దగ్గరకు  రావాలి.

-దేవుడే అన్నారు యిర్మీయా 17: 7 - తన మీద ఆధార పడితే దీవిస్తానని.

-అడగండి ఇస్తాను అన్నారు - మత్తయి 7: 7

-సమస్యలలో వుంటే తన చెంతకు రమ్మన్నారు- మత్తయి 11: 28

మనం   మాత్రం  బంధువుల  దగ్గరకు  ధనవంతుల దగ్గరకు  ఇంకా  వేరే  వాళ్ళ  చెంతకు  వెళతాం  కానీ  మరియ  తల్లి  తన  దేవుడైన  తన  కుమారుని  చెంతకు  వెల్లింది . అది  ఆమె  యొక్క  విశ్వాసం , నమ్మకం,  గొప్పతనం , వినయం. పాలస్తీనాలో    పెండ్లి జరిగేటప్పుడు ద్రాక్షా రసము చాలా అవసరం. నీటిని చాలా తక్కువగా అవసరమైతేనే వాడేవారు. ఎందుకంటే మధ్య తూర్పు ప్రాంతాలలో అంత మంచి నీరు దొరకదు. అందుకనే నీటికి బదులుగా ద్రాక్షా రసమును ఎక్కువగా వాడేవారు.

ఒక వేళా ఈ వివాహంలో ద్రాక్షా రసము లేకపోతే వారు సంతోషంగా వుండే వారు కాదు. వారు నిందలు, అవమానాలు భరించవలసి వచ్చేది, కానీ దేవునియొక్క సాన్నిధ్యం ద్వారా అలాగే మరియతల్లి యొక్క మధ్య వర్తిత్వం ద్వారా అవేమి జరగకుండా వారు సంతోషంగా వివాహమును కొనసాగించారు. మరియ తల్లి ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తూనే వుంటారు.యేసు క్రీస్తు అద్భుతం చేయకముందు ఆమె పలికిన మాటలు " ఆయన చెప్పినట్లు చేయుడు"వాస్తవానికి ఆయన చెప్పినట్లు చేస్తే మన అందరం కూడా సంతోషంగా ఉంటాం.

-ఆయన చెప్పినట్లు - పొరుగు వారిని ప్రేమించాలి, క్షమించాలి, సహించాలి, విధేయత కలిగి ఉండాలి, హృదయ పరివర్తన చెందాలి, దైవభయం కలిగి ఉండాలి.

-మరియ తల్లి మనతో వుంటే మనకు మేలు కలుగుతుంది. ఎందుకంటే ఆమె మన అవసరతలను గ్రహిస్తుంది. ఆమె మన కొరకు తన కుమారున్ని ప్రార్థిస్తుంది., మనకు సహాయం చేస్తుంది.

-నిందలు, అవమానాలు, సమస్యల్లో మనకు ఆదరువుగా ఉంటుంది.

-నీటిని ద్రాక్షా రసముగా మార్చుతాడని తల్లి ముందే గ్రహించింది. యేసు ప్రభువు వారు తన యొక్క సమయం రాకున్నా కానీ తల్లి అడిగినది కాబట్టియే అద్భుతం చేస్తున్నారు. అది ఆయనకు తన తల్లి మీద ఉన్న ప్రేమ, గౌరవం. దీని ద్వారా యేసు క్రీస్తు తన తల్లి అంటే తనకు చాలా ఇష్టం అని కూడా తెలుపుచున్నారు. తల్లి తన హృదయంకు  దగ్గరగా ఉన్నది కాబట్టియే ఆమె కొరకు అద్భుతం  చేస్తున్నారు. తల్లి అడిగితే కుమారుడు తప్పక దయచేస్తారన్నది మరియమ్మ గారి నమ్మకం.

-మనం కూడా మరియమ్మ గారిని యేసుప్రభువును మన ఇంటికి ఆహ్వానించాలి అప్పుడు మన కుటుంబాలు కూడా దీవించబడతాయి.

-మన జీవితాలు దేవుడికి సమర్పిస్తే అవి శ్రేష్ఠంగా దేవుడు చేస్తారు.

-పాత పాపపు జీవితం తీసివేసి క్రొత్త పవిత్ర జీవితం దయచేస్తారు.

- ఈ సువిశేషంలో సేవకులు విధేయత చూపారు, యేసు ప్రభువును నమ్మారు.

వాస్తవానికి ఈ సేవకులు విందు పెద్ద చెప్తేనే చేసేవారు కానీ ఎప్పుడైతే మరియమ్మ గారు ఆయన చెప్పినట్లు చేయమన్నారో వారు అలాగే చేశారు. అది వారియొక్క విధేయత  మరియు విశ్వాసం. దేవుడు మన కుటుంబంలో ఉంటే మనం దీవించ బడతాం. కాబ్బట్టి మరియమ్మ గారిని, యేసు ప్రభువుని మన గృహంలోకి ఆహ్వానించుకుందాం.

Rev. Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...