11, నవంబర్ 2023, శనివారం

 

                   32 సామాన్య ఆదివారం

మొదటి పఠనము : సీర ; 6 : 12 - 16,             

రెండవ పఠనము : 1 తేస్సా ; 4: 13 - 18,

 సువిశేష పఠనము : మత్తయి  25: 1-13

           

క్రీస్తు నాధునియందు ప్రియా సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ 32 సామాన్య ఆదివారాన్ని కొనియాడుతున్నది. ఈనాటి దివ్య గ్రంథపాఠనాలు  మనకు మూడు ముఖ్య అంశాలను ధ్యానిoచమని కోరుతున్నది.

    1. జ్ఞానం కొరకు అన్వేషించాలి.

    2. నిరీక్షణతో ఎదురు చూడాలి.

    3. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి.

 1. జ్ఞానం కొరకు అన్వేషించాలి.

           జ్ఞానం అనేది దేవుడు ఇచ్చే ఒక వరం. యొక్క జ్ఞానాన్ని "దేవుడు సృష్టి కంటే ముందుగా సృష్టించాడు." సీర 1:5. కావున ఈనాటి మొదటి పఠనము మనకు జ్ఞానం వెతికే వారలుగా జీవించమని  తెలియపరుస్తుంది. జ్ఞానం వెతకలనంటే ముందుగా యొక్క జ్ఞానాన్ని ప్రేమించాలి. యొక్క ప్రేమ ద్వారానే జ్ఞాన్నాన్ని పొందగలము . ఉదాహరణకు సొలొమోను మహారాజు జ్ఞానాన్ని ప్రేమించాడు కాబట్టే లోకంలో ఎవరికీ లేని ఉత్తమమయిన జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు . కావున ప్రియా విశ్వాసులారా మనం కూడా జ్ఞానాన్ని ప్రేమించినట్లయితే దేవుని చేత యొక్క అనుగ్రహము మనకు కూడా ఒసగబడుతుంది అని ఈనాటి మొదటి పఠనము మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా జ్ఞానము వెతికిన వారికే దొరుకుతుంది. వెతకని వారికి ఇది దొరకదు. ఈనాటి సువిశేష పఠనములో కూడా మనం చూసినట్లయితే వివేకంతో ఎదురు చూస్తున్న ఐదుగురు కన్యకలను మాత్రమే ప్రభువు తన సన్నిధిలోనికి ఆహ్వానించారు. అవివేకంతో వున్నా మిగతా ఐదుగురు కన్యకలను త్రోసిపుచ్చారు. కావున ప్రియమయిన విశ్వాసులారా మనంకూడా వివేకంతో ఎదురు చూస్తున్న ఐదుగురు కన్యకలవలె సిద్హపాటు కలిగి ప్రభువు యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలి.

2. నిరీక్షణతో ఎదురు చూడాలి        

     ప్రియా విశ్వాసులారా ఒక వ్యక్తి లక్షణాన్ని చెప్పాలంటే వ్యక్తి యొక్క నిరీక్షణ గుణం ఎలాంటిదో పరీక్షించాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఓపిక పట్టడం, సహనము కలిగి ఉండటం. ఇది నిరీక్షణ యొక్క లక్షణాలు. కష్టాలలోను శ్రమలలోను ఓర్పు కలిగి ఉండటం పరీక్షలు ఏదురయినప్పుడు ఆంతాయిపోయింది అన్న పరిస్థితులు తారసిలినప్పుడు కూడా ఓర్పు సహనము కలిగి ఉండటం.  దేవుడు అద్భుతం చేస్తాడు నన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అని నమ్మడం నిరీక్షణ యొక్క లక్షణo. దీనికి మన పీత మహుడు అబ్రాహాము గొప్ప నిదర్శనం. కావున మన జీవితం లో ఎన్ని సమస్యలు ఎదురయినా ఓర్పుతో సహనంతో నిరీక్షణతో ఎదురుకొన్నప్పుడే మన జీవితం అనేది ధన్యం  అవుతుంది. అందుకే ఈనటి రెండవ పట్టణములో పునీత పౌలు గారు తెస్సాలోనికా ప్రజల మధ్యలో వున్నా సమస్యలలో గురించి తెలియపరుస్తూ వీటిని ప్రేమతో అధిగమించినప్పుడే మన ప్రభువు యొక్క రాకడలో పాలుపంచుకోగలము.

3. రెండవ రాకడ కొరకు ఎదురు చూడటం

            ప్రియా విశ్వాసులారా పరిశుద్ధ గ్రంథ పరంగా చూసినట్లయితే ప్రభువు యొక్క రాకడ అనేది మనము ఊహించని ఘడియలలో అకస్మాత్తుగా వస్తుంది. మనము ఇక్కడ గుర్తుంచుకోవాలిసిన అంశం ఏమిటిఅంటే పెళ్లి కుమారుడు అంటే క్రీస్తు ప్రభువే. వివాహము అనేది ప్రభువు యొక్క రాకడను గుర్తుంచుకోవాలి. చాలామంది బోధకులు ప్రభువు యొక్క రాకడ లేదు అని బోధిస్తూ వుంటారు. కానీ అది దగ్గరలోనే వుంది అని అది తప్పని సరిగా వస్తుందిఆ అని మనం గుర్తుంచుకోవాలి. మన క్రియలను బట్టి మనకు తీర్పు అనేది విధించబడుతుంది. పరలోకమం చేరాలి అంటే అత్యంత ప్రధానమయిన ప్రమాదము ఒకటి వున్నది అది సోమరితనం. దీన్ని దగ్గరికి రానివ్వకూడదు ఇది భయంకరమయినది. క్రైస్తవ విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో సోమరితనం ఉంటే అదే అనర్ధము. ఈనాటి సువార్తలో. ఐదుగురు వివేకవంతులు సిద్దపడి వున్నారు. మిగతా ఐదుగురు అవివేకవంతులు మాత్రం సోమరితనంగా, కష్టపడకుండా వున్నారు కాబట్టే వివేకవంతులు పరలోక రాజ్యాన్ని పొందారు. అవివేకవoతులు మాత్రం దానిని దక్కించుకోలేదు కావున మన నిత్యా జీవితం లోకూడా సోమరితనాన్ని అలవరచకుండా కస్టపడి వివేకవంతులవలె పరలోక రాజ్యాన్ని పొందాలి.

బైబుల్ పరంగా రెండవ రాకడ ఏవిధంగా వస్తుంది అంటే దూతల సమీక్షంగా మేఘరూపుడై వస్తాడు. ప్రియమయినటువంటి సహోదరులారా అటువంటి వంటి  రాకడకు సిద్దపడి ఉండాలి అని, మెళుకువకలిగి ఉండాలి, వేచివుండాలి, మరియు ఎదురు చూడాలి అని  ఈనాటి పఠనాలు మనకు బోధిస్తున్నాయి.

BRO. SAMSON OCD

32 వ సామాన్య ఆదివారం

32 వ సామాన్య ఆదివారం
సొలోమోను జ్ఞాన గ్రంధం 6:12-16
1తెస్సలోనిక 4: 13-18
మత్తయి 25:1-13
ప్రియమైన దేవుని విశ్వాసులారా రోజుకి మనము దైవార్చన సంవత్సర చివరి రోజులకి సమీపించుండగా తల్లి శ్రీ సభ మనందరినీ ధ్యానించమని తెలిపే అంశము ఏమిటి అంటే మన యొక్క చివరి రోజుల గురించి, మన మరణం, తుది తీర్పు, పరలోకం నరకం గురించి తెలుపుచున్నాయి. ఈనాడు మనం 32వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదివార దివ్య గ్రంథములు మన యొక్క చివరి రోజుల యొక్క ప్రభావం గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠణం సొలోమోను జ్ఞాన గ్రంథం నుండి తీసుకొనబడింది జ్ఞాన గ్రంథం అని ఎందుకు పిలుస్తారు అంటే జ్ఞానము ద్వారా మన జీవితంలో చాలా మేలులు జరుగుతూ ఉంటాయి కాబట్టి దీనిని జ్ఞాన గ్రంధం అంటారు. సొలోమోను తన జీవితంలో దేవుడిని అర్ధించినది కేవలం జ్ఞానము కొరకే, జ్ఞానం సంపాదించుట వలన కలుగు ప్రయోజనములు, జ్ఞానము సంపాదించుటవలన పెరుగు కీర్తి, జ్ఞానము సంపాదించడం వలన ఒక వ్యక్తి జీవితంలో పొందే గొప్ప ఆశీర్వాదం తెలుసుకున్న వ్యక్తి మన అందరిని కూడా జ్ఞానమును వెతకమని చెబుతూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో మనందరం కూడా చెబుతుంటాం "ఒక్క ఐడియా మీ జీవితమనే మార్చి వేయను అని"అనగా జ్ఞానముతో తీసుకున్న ఒక ఆలోచనా నిర్ణయం వలన వారి జీవితమే మార్చబడుతుంది. మనకు జ్ఞానము ఉన్నట్లయితే దాని ద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనము అభివృద్ధి చెందగలుగుతూ ఉంటాం. ఎందుకంటే జ్ఞానము మనకు అంతయు కూడా సమకూర్చబడేలాగా చేస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ జ్ఞానమును వెతకమని రచయిత తెలుపుచున్నారు. ఆయన చెప్పే మాటలు ఇంకా ఏమిటంటే ఎవరైతే ఈ జ్ఞానము కొరకు వెతుకుతుంటారో, ఎవరైతే జ్ఞానము కొరకు ఆశ పడుతూ ఉంటారో, ఇంకా ఎవరైతే జ్ఞానమును ప్రేమిస్తూ ఉంటారో అది సులువుగా దొరుకును అని తెలుపుతున్నారు. జ్ఞానం కొరకు ఎవరైతే గాలిస్తూ ఉంటారో వారికి అది తనంతట తాను తలుపు తీయును అని తెలుపుచున్నారు కావున మనం కూడా మన యొక్క అనుదిన జీవితంలో జ్ఞానం యొక్క ప్రాధాన్యత తెలుసుకొని దాన్ని పొందుట కొరకై ప్రయత్నం చేయాలి. జ్ఞానమును కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడితో పోల్చితూ ఉంటారు కలిగి ఉండాలి. దేవుడు అనే జ్ఞానం మనందరం కూడా కలిగి ఉండాలి.
 ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక  ప్రజలకు క్రైస్తవ పునరుత్థానము గురించి తెలియజేస్తున్నారు. తాము ప్రేమించిన వారిని కోల్పోయిన సందర్భములో మరణము తర్వాత  మరియొక జీవితము ఉన్నది అని అంశమును తెలియజేస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు యొక్క మరణ, పునరుత్థానము మన అందరి యొక్క పునరుత్థానమునకు నాంది పలికినది కావున పౌలు గారు విశ్వాసమును కోల్పోవద్దు అని తెలియజేస్తున్నారు. ప్రభువు యొక్క రాకడకై సంసిద్ధతను కలిగి జీవించమని తెలుపుచున్నారు ఎందుకంటే ఆయన కొరకు సంసిద్ధముగా ఉన్న వారిని తాను ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటారు.
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు పదిమంది కన్యల యొక్క గురించి తెలియజేస్తున్నారు. ఈ పదిమంది కన్యకల యొక్క సువిశేష భాగము ద్వారా మనందరినీ కూడా ప్రభువు తన యొక్క రాకడకై సంసిద్ధులై జీవించాలని కోరుతున్నారు. ఆయన గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు అకస్మాత్తుగా ఆయన వచ్చేస్తారు. కాబట్టి మనందరం కూడా అప్రమత్తులై ఆయన రాకకై మనం సంతోషముతో ఎదురుచూస్తూ ఆయనకు స్వాగతం పలకాలి.యూదుల సంప్రదాయం ప్రకారం పెండ్లి ఏడు రోజులపాటు కొనసాగుతుంది. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ను ఆమె ఇంటికి వచ్చి తనను తీసుకొని వెళ్తాడు అయితే పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు పెండ్లి కుమార్తెకు ఎవరైతే అతి సన్నిహితులుగా (కన్యలు) ఉంటారో, వారు పెండ్లి కుమారుడికి ఎదురేగి ఆహ్వానించుట అలనాటి సంప్రదాయం. ఒకరోజు జరిగిన పెండ్లిలో, పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైనది అతని రాక కోసమై పదిమంది కన్యలు ఎదురుచూస్తున్నారు కానీ ఐదుగురు మాత్రమే ఆయన ఎప్పుడూ వచ్చినా సరే ఆయనను కాగడాలతో ఆహ్వానించుటకు వారితోపాటు నూనెను కూడా తీసుకొని వెళ్లి ఉన్నారు. మిగతా ఐదుగురు వారు ఊహించిన సమయమునకు భిన్నముగా పెండ్లి కుమారుడు రాలేదు. కావున వారు తమతో పాటు ఎక్కువ నూనె తీసుకొని పోలేదు అందువలన అతడిని ఆహ్వానించలేకపోయారు. మన జీవితంలో మనకి ఎప్పుడూ ఏమి జరుగునో అని ముందుగానే తెలిస్తే మనము దానికి సంసిద్ధమై ఉంటాము.ఉదాహరణకు బస్సు ఏ సమయమునకు వచ్చునో తెలిసిన యెడల మనము దాని ప్రకారంగా సిద్ధంగా ఉంటాం. సినిమా ఏ టైం కు ప్రారంభిస్తారని తెలిసిన యెడల దానికి కూడా ముందుగానే సిద్ధమై ఉంటాం కానీ ప్రభువు యొక్క రాకడ ఊహించని గడియలో జరుగును కాబట్టి దానికి ప్రతి రోజు కూడా మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఈ పదిమంది కన్యలు మన క్రైస్తవ సంఘమునకు ఒక సూచన. పెండ్లి కుమారుడిని ఆహ్వానించడానికి పదిమంది కూడా వెళ్లి ఉన్నాను కానీ చివరికి ఐదుగురు మాత్రమే తనతో పాటు లోనికి ప్రవేశించి ఉన్నారు. అనగా కేవలము ఎవరైతే తమ జీవితములను తాము తయారు చేసుకుని ఉన్నారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని అర్థం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టం కేవలము తమ జీవితాలను దేవుని కొరకు సంసిద్ధం చేస్తున్న వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు.
ఈ సువిశేష పఠణంలో మనము కొన్ని విషయములను చూస్తున్నాం:
1. ఆయన రాకడ కొరకై సంసిద్ధత కలిగి జీవించుట-ఐదుగురు వివేకవతులు పెండ్లి కుమారుడు ఏ సమయములో వచ్చినా సరే ఆయనను ఆహ్వానించుటకు వారు తమతో పాటు అన్నీ కూడా తీసుకుని వచ్చి ఉన్నారు అది ముందుచూపు కలిగి ఉండటానికి ఒక నిదర్శనం. మనము కూడా మన జీవితంలో మన యొక్క గమ్యం ఏమిటి అని ముందుచూపు కలిగి జీవించినట్లయితే మనందరం కూడా ఒక మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాం.
2. ఆయన రాకడ తథ్యం అని నమ్మడం-పెండ్లి కుమారుడు ఏదో ఒక సమయమును తప్పనిసరిగా వస్తాడు అని వారు నమ్మి ఉన్నారు అందుకని ఆయన రాక కోసం అక్కడే ఎదురుచూస్తున్నారు.
3. సహనం కలిగి ఉన్నారు-ఈ పదిమంది వివేకవతులు పెండ్లి కుమారుడి ఎడల సహనంతో ఉన్నారు ఎందుకంటే ఆయన రాక ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో వినయము, సహనము కలిగి ఆయన కొరకు ఎదురుచూస్తున్నారు.
అదే విధముగా ఈ సువిశేష భాగములో మనము గమనించే ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే "నూనె". నీ నూనెను వివిధ రకాలైన గుర్తులతో పోల్చి వేద పండితులు చెబుతూ ఉంటారు అవి ఏమిటంటే 
1. ఈ నూనె దేవునితో మనకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధమును తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి సంబంధం చాలా ముఖ్యమైనది అది లేకపోతే మన క్రైస్తవ జీవితం ఫలించదు అదేవిధంగా దేవుడితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనము వేరే ఒకరి దగ్గర నుండి కాబట్టి మన జీవితం ఫలించాలి అంటే మనందరికీ కూడా దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి.
2. నూనెను క్రైస్తవ విలువలతో కూడా పోల్చి చెప్తూ ఉంటారు, అవి వేరే వారి దగ్గర నుండి అరువు తెచ్చుకొనలేము. మనందరం కూడా క్రైస్తవ విలువలు కలిగి జీవించాలి.
3.నూనెను క్రైస్తవ విశ్వాసముతో కూడా పోల్చి చెబుతూ ఉంటారు విశ్వాసము లేనిదే దేవుడు రాజ్యంలో ప్రవేశించలేము.
4. నూనెను క్రైస్తవ జీవితములో ఉన్న ప్రేమ, క్షమాపణతో కూడా పోల్చి చెబుతూ ఉంటారు ఈ రెండును పాటించకపోతే మన జీవితంలో పరలోక రాజ్యములో ప్రవేశించలేము .
ఎవరి జీవితమునకు వారే బాధ్యులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాకడకై సంసిద్ధతను కలిగి జీవించాలి అప్పుడే మనందరం కూడా నిత్య పెళ్లికొడుకు అయిన క్రీస్తు ప్రభువుతో ఆయన రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం.

Fr. Bala Yesu OCD

4, నవంబర్ 2023, శనివారం

31వ సామాన్య ఆదివారం

31వ సామాన్య ఆదివారం
మలాకీ  1:4-2,8-10
1 తెస్సలోనిక 2:7-9,13
మత్తయి 23:1-12
ఈనాటి దివ్య పఠణములు దేవుని సేవకులైన యాజకుల యొక్క బాధ్యతలను వారు జీవించవలసిన విధానములు గురించి తెలియజేస్తున్నాయి. మనము ఈ లోకంలో వివిధ రకములైనటువంటి నాయకులను చూస్తూ ఉంటాం. మత బోధకులను చూస్తుంటాం. కొంతమంది తాము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి జీవిస్తూ ఉంటారు. చాలామంది ఒకటి చెప్పి ఇంకొకటి అనుసరించేటటువంటి వారు ఉంటారు. ఈరోజు ప్రభువు తన ప్రతినిధులందరికీ కూడా తెలియచేసే అంశము ఏమిటంటే వారి జీవిత విధానము దేవుని యొక్క చిత్తానుసారముగా ఉండాలని. కేవలము ఈ యాజకుల యొక్క జీవితం మాత్రమే కాకుండా ఎవరైతే ఒక ప్రతినిధిగా ఉంటూ ఉన్నారో వారి గురించి కూడా మాట్లాడుతున్నారు. దేవుడు ఇచ్చిన బాధ్యతలు  సరియైనటువంటి రీతిలో నెరవేరుస్తున్నారా? లేదా అని ప్రభువు మనలను సవాలు చేస్తున్నారు. దానితోపాటు దేవుని యొక్క సేవకులు జీవితం నీ స్వార్థ జీవితంగా అదేవిధంగా విశ్వాసము - చేతలు కలిగిన జీవితముగా ఉండాలి అని ప్రభువు తెలుపుచున్నారు.
ఈనాటి మొదటి పఠణంలో బాబిలోనియా బానిసత్వం నుండి తిరిగి వచ్చిన మతాధికారులను అదేవిధంగా యాజకులను ఉద్దేశించి మాట్లాడుచున్నారు. దేవుడు మలాకీ ప్రవక్తను క్రీస్తుపూర్వం 515 వ సంవత్సరంలో ఎన్నుకొని తన రక్షణ సందేశమును అంద చేయుటకు నియమించి ఉన్నారు. దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా ఆనాటి అసత్య బోధకులు, మత నాయకులైన యాజకులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దేవుడు వారి యొక్క స్వార్థపు జీవితమును చూసి వారిని శిక్షిస్తానని తెలుపుతున్నారు. ఎందుకు దేవుడు తాను ఎన్నుకున్నటువంటి వారిని శిక్షిస్తానని చెబుతున్నారంటే ఈ యాజకులు దేవుడి యొక్క పనిని కాకుండా, ఆయన చిత్తమును కాకుండా, తమ ఇష్టానుసారముగా స్వలాభము కోసం జీవించి ఉన్నారు అందుకనే వారిని ప్రభువు శిక్షిస్తానని తెలుపుచున్నారు. మలాకీ ప్రవక్త యొక్క కాలంలో యాజకుల యొక్క కపటత్వమును ఖండిస్తున్నారు. బాబిలోనియా నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు  ప్రజలు యెరూషలేము దేవాలయమును రెండవసారి పునః నిర్మించి ఉన్నారు అప్పుడు యాజకులు వారి యొక్క విధులను నెరవేర్చుటలో విఫలమయ్యారు. వివిధ రకములైనటువంటి చెడు మార్గములను అవలంబించారు. అదే కాకుండా ప్రజలకు న్యాయం చేయుటకు బదులుగా అన్యాయం చేశారు. వితంతువులను ఆదుకొనుటకు బదులుగా వారిని నిరాకరించారు. ఈ యాజకులు దేవుని సందేశమును బోధించకుండా అలాగే ఆయన చిత్తమును నెరవేర్చకుండా తమ యొక్క సొంత ప్రణాళికలను అదేవిధంగా రాజుల యొక్క ప్రణాళికలను నెరవేర్చారు. అందుకనే వారి యొక్క జీవితములను చూచిన ప్రభువు కోపపడుతూ వారిని శిక్షిస్తానని తెలుపుచున్నారు.
 ఒక విధముగా చెప్పాలంటే వారు దేవుని యొక్క మార్గము నుండి వైదొలిగి జీవించి ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుటలేదు. అందుకనే మలాకీ ద్వారా దేవుడు మరియొకసారి యాజకులను ఖండిస్తున్నారు. వారు దేవునికి సమర్పించేటటువంటి ఆ యొక్క బలి అర్పణలో కూడా వారు మేలైనది దేవునికి సమర్పించకుండా అనారోగ్యంతో ఉన్నటువంటివి దేవునికి సమర్పించేటటువంటివారు. ప్రభువు చాలా బాధపడుతూ పలికినటువంటి మాట ఏమిటంటే "యాజకులు దారి తప్పితిరి" అని తెలుపుచున్నారు అనగా దేవుని యొక్క మార్గములకు వ్యతిరేకంగా జీవించుటకు ఇష్టపడ్డవారు.వాస్తవానికి దేవుడే వారిని ప్రత్యేకంగా ఎన్నుకొని తన యొక్క సేవ చేయుటకు నియమించి ఉన్నారు కానీ వారే దేవునికి విరుద్ధముగా జీవిస్తూ, ప్రజలను కూడా పాపములోనికి నడిపించి ఉన్నారు కాబట్టి ప్రభువు అట్టి వారిపట్ల అసహనమును వ్యక్తపరుస్తున్నారు. ఆనాటి కాలంలో కూడా అసత్య ప్రవక్తలు ఉన్నారు సత్య ప్రవక్తలు ఉన్నారు. దేవుని కొరకు జీవించేవారు ఉన్నారు. దేవుని కొరకు జీవిస్తున్నామని చెప్పుకొని నటించేవారు కూడా ఉన్నారు.ఈ మొదటి పఠణము ద్వారా మనము తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే యాజకుల వలె దేవుడు  మనందరికీ కూడా బాధ్యతలను ఇచ్చి ఉన్నారు కాబట్టి అట్టి బాధ్యతలు మనము ఎలాగ మన జీవితంలో కపటత్వము లేకుండా నెరవేరుస్తున్నాము అని ప్రశ్నించుకోవాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజల యొక్క విశ్వాస జీవితము గురించి తెలియజేస్తున్నారు వారి మధ్య సువార్తను ప్రకటించే సందర్భంలో దేవుని యొక్క సువార్తను వారు అందరు కూడా స్వీకరించి ఉన్నారు ఆ సందేశమును బట్టి వారు తమ జీవితములను మార్చుకున్నారు. వారి జీవితంలో పౌలు గారు అదేవిధంగా మిగతా సేవకులు బోధించిన వాక్యము మానవ సంబంధమైన వాక్యము కాదు దైవ సంబంధమైన వాక్కు అని వారు గ్రహించి ఉన్నారు కాబట్టి దాని ప్రకారముగా వారి జీవితములను సరి చేసుకుంటూ జీవింపసాగారు అందుకుగాను పౌలు గారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పౌలు గారు తెస్సలోనిక ప్రజల మధ్య జీవించే సమయములో ప్రజల మీద ఎటువంటి భారము మోపకుండా వారిని ప్రేమిస్తూ, వారికి సుమాత్రకుగా జీవిస్తూ, వారికి దైవ ప్రణాళికలను సందేశమును అందజేసి ఉన్నారు. మనందరం కూడా తెస్సలోనికా ప్రజల యొక్క జీవితము నుండి నేర్చుకోవలసిన సందేశం ఏమిటి అంటే వారు అపోస్తుల నుండి ప్రకటింపబడిన సత్యము, దేవుని సత్యము, సందేశము అని గ్రహించి దాని ప్రకారముగా జీవింప సాగారు అలాగే మనము కూడా యాజకులు బోధించిన దైవ సందేశము ప్రకారముగా జీవింప సాగాలి.
ఈనాడు మనము చదివిన సువిశేష భాగములో ప్రజలను ధర్మ శాస్త్ర బోధకుల, పరిసయ్యుల  యొక్క కపటత్వము గురించి జాగరుకులై ఉండమని తెలుపుతున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు అనేక సందర్భంలో కేవలం నీతి వాక్యములను బోధించే వారు కానీ ఆచరించే వారు కాదు. పరిసయ్యులో దాదాపు 7 వర్గాలు కలిగినటువంటి లేదా ఏడు మనస్తత్వములు కలిగిన  వ్యక్తులు ఉన్నారు. 
- కొంతమంది మోషే ధర్మ శాస్త్రమును పాటిస్తూ మంచి క్రియలను చేసేటటువంటి వారు. వీరు కేవలము ప్రజల పొగడ్తలకై ఇష్టపడేవారు.
-కొంతమంది కేవలం మాటలు మాత్రమే చెప్పి క్రియలు చేయ కుండా సాకులు చెప్పేవారు.
- కొంతమంది ఇతరుల ఎదుట పుణ్యాత్ములనపించుకొనుటకు నటించేవారు. వారు నడిచేటప్పుడు ఎవరైనా స్త్రీలు కనపడినప్పుడు వారిని చూడకుండా తమ యొక్క శరీరములను గాయపరచుకుంటారు అట్టివారిని ప్రజలు చూసినప్పుడు వారు నిగ్రహ శక్తి కలిగిన వారు, మంచివారు అని అనుకొనుటకు నటించేవారు.
-ఇంకా కొంతమంది వినయాన్ని వ్యక్తపరచుటకు గూని వాని వలె వంగి నడిచేవారు మీరు కూడా ప్రజల యొక్క దృష్టిలో మంచివారు అనిపించుకొనుటక ఇట్లా జీవించేవారు.
-కొంతమంది దేవుని నుండి మెప్పు పొందుటకై సత్కార్యాలు చేయటానికి ఇష్టపడేవారు. వారి యొక్క స్వార్థం కొరకే ఇలాగ జీవించేవారు.
-మరి కొంతమంది దేవుని శిక్షకు భయపడేటటువంటివారు అనగా బయటకు మంచిగా జీవిస్తూ అంతరంగికంగా తాము చేసిన తప్పులకు బాధపడేవారు.
-చివరిగా కొంతమంది పరిసయ్యులు దైవభయం కలిగి దేవుని ప్రేమిస్తూ సేవిస్తూ ఆయనకు విధేయులై జీవించేవారు. పైన చెప్పబడినటువంటి పరిసయ్యుల యొక్క జీవితము దాదాపుగా ఇతరులకు చూపించట కొరకే గానీ వారు తమ జీవితంలో ఒక్క నిజాయితీని గానీ,నిజమైన విశ్వాసమును గాని ప్రకటించుట చాలా అరుదు అందుకే ప్రభువు కేవలం వారి యొక్క బోధనలను పాటించమని చెబుతూ ఉన్నారు వారి యొక్క క్రియలను కాదు ఎందుకంటే చాలా సందర్భాలలో బోధించేవారు ఇతరులకు సుమాత్రుకగ ఉండరు. అది వారి బలహీనత వలన కావచ్చు, వారి యొక్క స్వార్థం వలన కావచ్చు, లేదా వారి యొక్క శోధన వల్ల కావచ్చు కాబట్టి ఈ ధర్మశాస్త్ర బోధకులు గాని పరిసయ్యులు గాని అదే విధముగా యాజకులు గాని బోధించిన ఏ మంచి సందేశమైన మనము స్వీకరించటానికి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. కానీ అనేక సందర్భంలో మనము వారి జీవితాన్ని చూస్తాము కానీ వారి యొక్క మాటలను బోధనలను మన జీవితంలో అనుసరించడానికి ఇష్టపడము కానీ ఈ సువిశేష ప్రారంభంలోనే ప్రభువు వారి జీవితము కాక వారి బోధనలను పాటించమని తెలియజేస్తున్నాను కాబట్టి మనకు మంచిని ప్రకటించినప్పుడు దానిని ఆచరించడానికి సిద్ధపడుతూ జీవించుదాం. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి బాధ్యతను కపటం లేకుండా నీతిగా నిజాయితీగా నిర్వహించుదాం.
Fr. Bala Yesu OCD

28, అక్టోబర్ 2023, శనివారం

30 వ సామాన్య ఆదివారం

30 వ సామాన్య ఆదివారం
 నిర్గమ  22: 20-26, 1 తెస్సలోనిక 1:5-10, మత్తయి 22‌‌:34-40

ఈనాటి దివ్య పఠణములు క్రైస్తవ జీవితంలో అనుసరించవలసిన రెండు ప్రధానమైన ఆజ్ఞల గురించి తెలియజేస్తున్నాయి అవి దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ ఆజ్ఞలను పాటించుట. ఈ రెండు ఆజ్ఞలను పాటించుటయే నిజమైన క్రైస్తవ జీవితం. ఈ రెండు ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ పాటించుట విఫలమైన అది సంపూర్ణమైన క్రైస్తవ జీవితం కాదు. ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు ఇచ్చిన రెండవ ఆజ్ఞ అయిన సోదర ప్రేమను పాటించమని తెలియజేస్తుంది. మొదటి వచనము(22) మనము గమనించినట్లయితే ఈ యావే దేవునికి కాదని అన్యదైవములకు బలులు సమర్పించిన వారిని కఠినంగా శిక్షించాలి అని తెలియజే స్తునారు. వేరే దేవుళ్ళు లేరు అని దీని యొక్క అర్థం వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకుని వచ్చినది యావే దేవుడు కాబట్టి అతనికి మాత్రమే బలులు సమర్పించాలి అని ప్రభువు కోరుచున్నాను. పాత నిబంధన గ్రంథములో అనేక సందర్భంలో ప్రభువు తెలియచేసిన అంశం ఏమిటి అంటే దేవుడు ఒక్కరే, అది కూడా యావే దేవుడు మాత్రమే, ఇక ఏ దేవుడు లేరు అని అర్థం.. రెండవదిగా ప్రభువు పరదేశులకు ఎటువంటి హాని చేయవద్దు అని తెలుపుచున్నారు అంటే యూదులు కాకుండా మిగతా అన్యులకు ఎవరికి కూడా ఎటువంటి అపాయము కానీ అన్యాయం కానీ చేయకుండా వారిని ప్రేమించమని పలుకుతున్నారు. సోదర ప్రేమ అనే అంశము గుర్తు చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఏ విధముగా పరదేశులుగా జీవించి ఉన్నారో అక్కడ వారు దేవుని యొక్క ప్రేమను పొందుకున్న విధముగా అదే ప్రేమను వ్యక్తపరచమని తెలుపుతున్నారు. మూడవదిగా సమాజంలో ఉన్నటువంటి వితంతువులను, అనాధలను ప్రేమించమని తెలుస్తుంది. వితంతువులు,అనాధలు ఎటువంటి బలము లేనటువంటి వారు దేవుడే వారికి అండగా నిలబడుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా వారి యెడల జాలి, దయ, ప్రేమను చూపిస్తూ మెలగవలసినదిగా ప్రభువు కోరుచున్నారు. ఎవరైతే వితంతువునుగాని పరదేశులు గాని అనాధలను కానీ భాదిస్తూ ఉంటారో వారి యొక్క బాధను చూసిన ప్రభు తప్పక బాధపెట్టే వారిని శిక్షిస్తాను అని తెలియజేస్తున్నాను కాబట్టి
ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత పొరుగువారి యెడల ప్రేమను వ్యక్తపరిచి జీవించుట. ఇంకా ప్రభువు చెప్పే మాట ఏమిటంటే ఏ వ్యక్తికి అయితే మనము అప్పు ఇస్తూ ఉంటామో ఆ వ్యక్తి దగ్గర ఎటువంటి వడ్డీ కూడా తీసుకోవద్దు తెలియజేస్తున్నారు ప్రస్తుత కాలంలో ఎవరు కూడా వడ్డీ లేకుండా ఏ అప్పు ఇవ్వటలేదు. ఎందుకు ప్రభువు ఈ విధంగా చెప్పారు అంటే మనకు ప్రేమ ఉన్న యెడల ఎదుటివారి మీద మనము భారము వేయము. వడ్డీ తీసుకొనుట ఒక విధముగా వారి మీద భారం వేసినట్లే కాబట్టి ప్రభువు వడ్డీని కూడా తీసుకోవద్దని తెలియజేస్తున్నాను. అప్పుడే మనం ఎదుటి వ్యక్తి మీద  ప్రేమను వ్యక్తపరుస్తుంటాం. ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనియ ప్రజల యొక్క విశ్వాస జీవితాన్ని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే  మొదటిగా వారు అన్యులైనప్పటికిని, వేరే సాంప్రదాయములు అనుసరించినప్పటికిని దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ప్రభువు యొక్క సువార్తను ప్రేమతో స్వీకరించి, దేవుని యొక్క వాక్యం అనుసారంగా జీవించినందుకు వారి యొక్క విశ్వాసము గొప్పదిగా ఉన్నందుకు పౌలు గారు వారి జీవితమును మెచ్చుకుంటున్నారు. విశ్వాసము కొరకై అనేక బాధలు అనుభవించినప్పటికిని కూడా ప్రభువు నందు విశ్వాసము కోల్పోకుండా జీవించినందుకు పౌలు గారు వారిని మెచ్చుకుంటున్నారు అదేవిధంగా సోదర ప్రేమను కలిగి జీవించమని తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగములో పరిసయ్యులు యేసు ప్రభువుని ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడుగుతున్నారు ఇది కేవలము యేసు ప్రభువుని పరీక్షించుట కొరకై వారి ఈ విధంగా అడుగుతున్నారు ఎందుకంటే వాస్తవానికి ఏసుప్రభు సద్దుకయ్యలు నోరు మూయించారని తెలుసుకొని పరిసయ్యులు కూడా ఏసుప్రభుని పరీక్షించాలనుకున్నారు అందుకే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమి అని అడుగుతున్నారు. ఆ కాలంలో యూదులకు దాదాపు 613 ఆజ్ఞలు ఉండేవి. యావే దేవుడు మోషేకు సీనాయి పర్వతం దగ్గర ఇచ్చిన 10 ఆజ్ఞలు కాలక్రమేనా 613 ఆజ్ఞలుగా చేయబడ్డాయి అందుకనే ప్రజలు ఏ ఆజ్ఞ ముఖ్యమో, ఏ ఆజ్ఞముఖ్యము కాదో తెలుసుకొన లేకపోయారు అందుకు ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుచున్నారు అందుకు ప్రభువు మొట్టమొదటిగా దేవుడిని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి అని తెలుపుచున్నారు. మనము దేవుడిని ప్రేమించిన ఆయన యొక్క ఆజ్ఞలలో పాటిస్తాము, ఆయన యొక్క చిత్తమును నెరవేరుస్తాను అదేవిధంగా ఆయన కొరకు జీవిస్తూ ఉంటాం. ప్రభు ప్రేమించమని తెలుపుచున్నారు ఎందుకంటే ప్రేమకు సమస్తము సాధ్యము కాబట్టి. మనము ప్రేమ కలిగి జీవించినట్లయితే దేవుని కొరకు ఏమి చేయటానికైనా సిద్ధపడి ఉంటాము. ప్రభువు మన నుండి పూర్ణ ప్రేమ కోరుచున్నాను. కొన్ని కొన్ని సందర్భాలలో స్వార్థంగా ఉంటాం. దేవునికి ఇవ్వవలసినది పూర్ణంగా ఇవ్వలేము, చందాలు వేసేటప్పుడు కానీ, దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ మనము పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవునికి సమర్పించు కాబట్టి అది సగం సగం గానే సమర్పించబడుతుంది ఆ యొక్క సగం ప్రేమ మాత్రమే మనము దేవుడి మీద చూపిస్తుంటాం కాబట్టి మనము దేవుడిని నిస్వార్థంతో సంపూర్ణంగా ప్రేమించాలి.
 రెండవ ఆజ్ఞ నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు తలుపుచున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో మొదటి ఆజ్ఞను పాటించుట  చాలా తేలిక ఎందుకంటే దేవుడిని ప్రతి ఒక్కరూ ప్రేమించగలరు. కానీ పొరుగు వారిని ప్రేమించుట మాత్రం కష్టం. దేవుడు కనపడరు కావున ఆయన ప్రేమిస్తారు కానీ కనిపించేటటువంటి తోటి మానవుడిని ప్రేమించుట అసాధ్యం. అనేక సందర్భాలలో ప్రభువు మనకు తెలియచేసిన విషయం ఏమిటంటే మీ శత్రువులను ప్రేమించమని కోరుతున్నారు, హింసించే వారి కొరకు ప్రార్థించమంటున్నారు అదేవిధంగా ఏ వ్యక్తి అయితే దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటారో అట్టి వ్యక్తి తన తోటి వారిని ప్రేమించకపోతే అసత్య వాది అని తెలుపుచున్నారు కాబట్టి మనము దేవుడిని ప్రేమిస్తున్నాము అని ఎప్పుడూ నిరూపిస్తాము అంటే దేవుని యొక్క ప్రేమ తోటి మానవాళి మీద చూపించినప్పుడే మనకు దైవ ప్రేమ ఉన్నది. దేవుడిని ప్రేమించే వారు తప్పనిసరిగా తమ పొరుగు వారిని కూడా ప్రేమించాలి ఎందుకంటే పొరుగు వారిని ప్రేమించుట అనేది దైవ ప్రేమ నుండి జన్మించినది కాబట్టి మనందరం కూడా దైవ మానవ ప్రేమ కలిగి సోదర భావంతో జీవించాలి.

Fr. Bala Yesu OCD

21, అక్టోబర్ 2023, శనివారం

29 వ సామాన్య ఆదివారం

29 వ సామాన్య ఆదివారం
యెషయ 45:1,4-6, 1 తెస్సలోనిక 1:1-5, మత్తయి 22:15-21

ఈనాటి పరిశుద్ధ గ్రంధం పఠణములు మానవుని యొక్క బాధ్యతలను గురించి తెలుపుచున్నది. మానవులు దేవుని యెడల నెరవేర్చవలసిన బాధ్యతలను అదే విధముగా ఈ లోక ప్రభుత్వం యెడల నెరవేర్చవలసిన బాధ్యతలను గురించి తెలుపుచున్నది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా జీవించడం చాలా ముఖ్యం అది దేవుని పట్లయినా లేదా తమ యొక్క దేశము పట్లయినా. ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడని కాకుండా ఆయన మానవులందరికీ కూడా దేవుడు అని తెలుపుతున్నాను. ప్రభువు అన్యుడైన పర్షియా దేశపు సైరస్ రాజును అభిషక్తునిగా చేస్తున్నారు. చరిత్రలో మొదటిసారిగా యావే దేవుడు యూదులను కాకుండా అన్యులను అభిశక్తునిగా చేస్తున్నారు. సైరస్ రాజు యావే దేవుడిని ఆరాధించనప్పటికిని ఆయనను ఎన్నుకుంటున్నారు ఎందుకంటే ఆయనలో ఒక ప్రత్యేకత అది ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తుపూర్వం 587 వ సంవత్సరంలో బాబిలోనియా బానిసత్వంలో జీవించేవారు అప్పుడు వారు తమ యొక్క సొంత మత విధి విధానాలు అనుసరించడానికి అవకాశం ఉండేది కాదు కానీ దాని తర్వాత క్రీస్తుపూర్వం 539లో సైరస్ రాజు బాబిలోనియాను జయించి ఇశ్రాయేలు ప్రజలకు ఒక విధమైన స్వేచ్ఛను కలిగించారు అది మాత్రమే కాదు యూదులు ప్రత్యేక విధంగా యావే దేవుడిని ఆరాధించటకు ప్రోత్సహించాడు, వారి యొక్క భక్తికి ఎటువంటి ఆటంకం చెప్పలేదు అదేవిధంగా వారికి ఆర్థికంగా సహాయం చేశారు వారి యొక్క దేవాలయమునకు కావలసిన వాటిని కూడా సైరస్ రాజు సమకూర్చాడు. యావే దేవుడు తెలియనప్పటికీ కూడా ఆయన కొరకు అంతా చేయటానికి అనుమతిచ్చారు. అందుకే ఆయన యొక్క మంచితనమును చూసి ప్రభువు తనను అభిశక్తునిగా చేస్తున్నారు.
 అభిశక్తునిగా చేయటం అంటే దేవుడు అతనిని ఒక ప్రత్యేకమైనటువంటి పనికి ఎన్నుకుంటున్నారు ఆ ప్రత్యేకమైనటువంటి పని ఏమిటంటే యూదులకు స్వేచ్ఛనిచ్చుటకు దేవుడు అతడిని నియమిస్తున్నారు అదేవిధంగా ప్రభువు ఈ మొదటి పఠణంలో తాను ఒక్కడే దేవుడు ఇక ఏ దేవుడు లేరు అనే అంశములు కూడా తెలియజేస్తున్నారు. పదేపదే ప్రభువు నేను ఒక్కడినే అని తెలుపుచున్నారు,ఆయన్ని మాత్రమే ఆరాధించాలి అని తెలుపుతున్నాను ఈ మాటలు దేవుడు మనకు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రథమ ఆజ్ఞ గురించి తెలుపుతున్నది. అది ఏమిటంటే సర్వేశ్వరుడుని మాత్రమే ఆరాధించదువుగాక దేవుడు ఒక్కడే అని తెలుసుకొని ఆరాధించాలి. పాత నిబంధన మొత్తం కూడా దేవుడు ఒక్కడే అని తెలుపుచున్నది. నేను రోషము గల దేవుడు అని ప్రభువు తెలిపారు,నేను తప్పా ఇంకొక  దేవుడు లేడు అని ప్రవక్తల ద్వారా తెలిపారు. చాలా సందర్భాలలో మనందరం కూడా ఈ సత్యాన్ని మరచిపోతూ ఉంటాము ఎందుకంటే మనందరం వివిధ రకాలైనటువంటి విశ్వాస పద్ధతులను అనుసరిస్తాం కానీ దేవుడు ఒక్కరే. ఒకవేళ మనం వేరే మత సాంప్రదాయాలను అనుసరించినట్లయితే అది దేవునికి విరుద్ధముగా జీవించినట్లే. కాబట్టి దేవుడు ఒక్కరే అని తెలుసుకొని ఆయనను మనం విశ్వసించి అనుసరించాలి. ఈనాటి 
రెండవ పఠణంలో పౌలు గారు తెస్సలోనిక ప్రజల యొక్క విశ్వాస జీవితాన్ని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే వారు అక్కడ పరిచర్య చేసినటువంటి సందర్భంలో అన్ని విధాలుగా సహకరించి నందుకు అదేవిధంగా దేవుని ఎడల విశ్వాస పాత్రలుగా జీవించినందుకు. పౌలు గారు తెస్సలోనిక ప్రజల యొక్క విశ్వాసం, ప్రేమ, నిరీక్షణను మెచ్చుకుంటున్నారు.
ఈనాటి సువిశేష పఠణంలో పరిసయ్యులు ఏసుప్రభువును సుంకము గురించి అడిగినటువంటి ప్రశ్న తెలుసుకుంటున్నాం. ఏసుప్రభువు చక్రవర్తికి సుంకమును చెల్లించాలా? లేదా అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నారు దానికి ప్రతిఫలముగా ప్రభువు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే నాణెము మీద ఉన్న రూపంను బట్టి సుంకములు చెల్లించవలసిందిగా తెలుపుతున్నారు. వాస్తవానికి వీరు యొక్క ఉద్దేశం ఏంటంటే ఏసు ప్రభువుని ఏ విధంగానైనా సరే పట్టించాలి అనే ఆలోచన. ఒకవేళ ఏసుప్రభు సుంకము చెల్లించవద్దు అని అన్నట్లయితే ఆయన రోమా చక్రవర్తులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అని ఆయన మీద కుట్ర పన్ని ఆయనను శిక్షించాలని అనుకుంటున్నారు. ప్రభువు వారికి చక్కగా సమాధానం ఇచ్చారు. నాణెము మీద చక్రవర్తి రూపము ఉన్నది కాబట్టే అతనికి సుంకము చెల్లించవలసిన అవసరత ఉన్నది అదేవిధంగా మనందరం కూడా దేవుని యొక్క రూపంలో సృష్టించబడ్డాము కాబట్టి మనము ఆయనకు(దేవునికి) చెందినటువంటి వారమైట్లయితే మరి ఆయన యెడల ఉన్నటువంటి మన యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నామా? దేవుడు మన జీవితంలో మనకు కావలసినవి ఇచ్చారు మరి మనం ఆయన యెడల ఎలాంటి విశ్వాసం వ్యక్తపరుస్తున్నాము? ఏ విధముగా ఆయన యొక్క ఆజ్ఞ పాటిస్తున్నా మీ? ఏ విధముగా ఆయన చిత్తమును మన జీవితంలో నెరవేరుస్తున్నాము?. మనందరి యొక్క జీవితంలో దేవుని యొక్క రూపం ఉన్నది కాబట్టి మనము దేవునికి చెందిన వారము కావున దేవుడి యొక్క మాట ప్రకారముగా మనం జీవించటకు ప్రయత్నం చేయాలి.
మనకి భూలోక పౌరసత్వము అదేవిధంగా పరలోక పౌరసత్వం ఉన్నది కాబట్టి మనము ఈ లోకానికి చెందినటువంటి ప్రభుత్వమునకు సంబంధించినటువంటి బాధ్యతలను నెరవేర్చాలి అదేవిధంగా దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలను కూడా నెరవేర్చాలి.
Fr. Bala Yesu OCD

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...