9, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాల రెండవ ఆదివారం

ఆగమన కాల రెండవ ఆదివారం
యెషయా 40:1-5,9-11
2 పేతురు 3:8-14
మార్కు1:1-8
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు రక్షకుని రాకడకై మన హృదయం అనే ఇంటికి మార్గమును సిద్ధము చేయుట అనే అంశం గురించి బోధిస్తున్నాయి. ప్రభు మన యొక్క జీవితంలోకి రావాలి అంటే మనందరం కూడా ఆయన కొరకు ఒక మార్గమును సిద్ధం చేయాలి. ఆ మార్గము హృదయ పరివర్తనంతో కూడిన మార్గం అయి ఉండాలి అదేవిధంగా పవిత్రత కలిగిన మార్గమై ఉండాలి.
ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త  బాబిలోనియా బానిసత్వంలో ఉన్న యూదులను ఓదారుస్తున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ బాబిలోనియా బానిసత్వం నుండి దేవుడు తన ప్రజలకు స్వేచ్ఛనిచ్చి వారిని యెరుషలేమునకు పంపిస్తున్నారు. ఇకమీదట ఇశ్రాయేలు ప్రజలకు  దేవుడు ఒక కాపరిగా తోడుండి వారిని నడిపిస్తారు అనే అంశమును తెలుపుచున్నారు. ప్రవక్త దేవుని యొక్క మాటలను ఈ విధంగా తెలుపుచున్నారు "ఇశ్రాయేలు ప్రజల బానిసత్వం ముగిసినదనియు, వారు తమ పాపములకు రెండింతలుగా శిక్షను అనుభవించారని,వారి శిక్ష ముగిసినదని తెలిపారు. యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వమునకు వారి యొక్క పాపము జీవితమే కారణం చెప్పుటకు నిరాకరించలేదు ధైర్యంగా వారికి చేసిన తప్పిదమును తెలియజేశారు. ప్రభు వారికి విముక్తిని కలుగజేస్తూ ఆయన యొక్క రాకడ కొరకు మార్గమును సిద్ధం చేయమంటున్నారు. ఈ మొదటి పఠణంలో ఒక స్వరం ఈ విధంగా పలుకుచున్నది "ఎడారిలో ప్రభువులకు మార్గం సిద్ధం చేయుడు, మరో భూమిలో మన దేవునికి రాజ పదమును తయారు చేయుడు. ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి పర్వతము చదును చేయబడాలి అదేవిధంగా మిట్ట పల్లములు సమతలముగా చేయాలి". ఈ మాటలు వాస్తవానికి ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవితమునకు చెందినటువంటివి.
- ఎడారిలో మార్గమును సిద్ధము చేయుట అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఎడారిలాగా మారినది అంతా కోల్పోయారు, జీవము లేని విధంగా మారినది. దేవుడు లేనటువంటి జీవితం ఎడారి జీవితంలో లాంటిది. అందుకే ఇశ్రాయేలు ప్రజల  యొక్క జీవితం నిర్జీవంగా మారినది, శాంతి లేదు, సమాధానం లేదు కేవలము నిరాశ, నిస్పృహ మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే ప్రవక్త అంటున్నారు ఎడారి వలె నిర్జీవముగా ఉన్నటువంటి వారి జీవితములో దేవుని రాకకై మార్గాలు సిద్ధం చేయమంటున్నారు. దేవుడు వారి జీవితము గుండా ప్రయాణిస్తాను అని అంటున్నారు.
- మరు భూమిలో దేవునికి రాజ్యమార్గమును సిద్ధము చేయమంటున్నారు అనగా ఫలించలేనటువంటి జీవితంలో విశ్వాసముతో దేవునికి ఒక మార్గాన్ని సిద్ధం చేయమంటున్నారు.
- ప్రతి లోయ పూడ్చబడాలి అనగా ప్రతి ఒక్కరిలో ఏది కొరతగా ఉన్నదో దానితో వారి జీవితము నింపుకోవాలి అది వినయమైన కావచ్చు, సహనమైన కావచ్చు, ప్రేమ అయినా కావచ్చు, క్షమాపణ అయిన కావచ్చు లేదా ఇతర సుగుణములు ఏవైనా కావచ్చు, కాబట్టి మనలో ఉన్న లోయలను ఈ సుగుణములతో నింపుకోవాలి.
- పర్వతములు, కొండలు నేలమట్టం కావలెను అని ప్రవక్త అంటున్నారు ఈ యొక్క మాటలకు ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే పర్వతములైన, కొండలైనా(hight) ఎత్తుగా ఉంటాయి ఇవి మనలో ఉన్నటువంటి గర్వమునకు, అహంకారంకు చూచనగా ఉన్నాయి కొంతమంది గర్వంతో, అహంకారంతో జీవిస్తుంటారు ఆ యొక్క గర్వము అహంకారం నేలమట్టం అవ్వాలని ప్రవక్త తెలుపుచున్నారు.
- మిట్ట పల్లములు సమతలము కావలెను అనగా మనలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా సరి సమానులే, దేవుని బిడ్డలే అనే ఆలోచనతో కలిసిమెలిసి జీవించాలి.
ప్రజలను పరిపాలించే రాజు వస్తున్నాడు కాబట్టి ఆయన కొరకై మనందరం మన జీవితంలో ఒక మార్గమును సిద్ధపరచినట్లయితే ప్రభువు మన జీవితము గుండా ప్రయాణిస్తూ ఉంటారు. మార్గము ఏర్పరిచినప్పుడు మాత్రమే ప్రయాణము సులువుగా కొనసాగుతుంది అదేవిధంగా మన జీవితమును దేవుని రాక కొరకై సిద్ధం చేసుకున్న సమయంలో మాత్రమే దేవుడు మన గుండా వెళుతుంటారు. కాబట్టి మన కాపరి అయిన దేవునికి మనందరం మన జీవితాలను తయారు చేసుకుందాం.
ఈనాటి రెండవ పఠణంలో పేతురు గారు ఏసుప్రభు యొక్క రాకడను గురించి తెలియజేస్తున్నారు ఆయన యొక్క రాకడ దొంగ వలె వచ్చును కాబట్టి సహనంతో ఉండమని తెలుపుతున్నాను. ప్రభు యొక్క దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరములకు అదేవిధంగా వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉండును. ఆయన యొక్క రాక ఆలస్యం ఎందుకంటే అనేకమంది విశ్వాసులను రక్షించుటకు ఆయన ఆలస్యంగా వస్తూ ఉంటారు కావున మనము ఆయన యొక్క దినముకై వేచి చూస్తూ మన యొక్క జీవితాలను మనము తయారు చేసుకోవాలి.
ఈనాటి సువిశేష భాగములో బప్తిస్మ యోహాను గారు ప్రజలకు హృదయ పరివర్తనము చెంది పాప క్షమాపణకై జ్ఞాన స్నానము పొందాలని తెలుపుచున్నారు. బప్తిస్మ యోహాను గారు ప్రజలకు భిన్నమైన జీవితమును జీవించారు. అంతయు త్యాగం చేసి ఎడారిలో తన సమయమును దేవునితో గడిపారు అదే విధముగా ఆయన తన సమయమును ఎక్కువగా ప్రార్థించుటకై వినియోగించారు, రోమముల వస్త్రములను ధరించారు, నడుమునకు తోలు పట్టి కట్టుకొని మిడతలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచుండెను. ఆయన ప్రజలను యేసు ప్రభువు యొక్క రాకడ కొరకై సిద్ధం చేస్తున్నారు. యోహాను గారు తన యొక్క సువార్త పనిని ఎడారిలో ప్రారంభించడానికి కారణం ఏమిటంటే పూర్వ వేదంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో నివసించుచున్న కాలాన్ని ప్రత్యేకంగా దైవ వరప్రసాద కాలమని యూదులు భావించేవారు. దేవుడు తన ప్రజలకు అతి సన్నిహితంగా ఉన్నాడు అని తెలిపే కాలం అది. దైవ రాజ్యం మొదటిగా ఎడారిలో స్థాపింపబడుతుందని అచటనే మెస్సయ్య ప్రత్యక్షమవుతారని యూదులు భావించేవారు అందుకే బప్తిస్మ యోహాను తన యొక్క బోధనలను ఎడారిలో ప్రారంభించి అనేక మందిని ఉదయ పరివర్తనం చెంది ఎలాగ చేశారు. హృదయ పరివర్తనము చెందితే గాని మన దేవుడిని మనలోనికి ఆహ్వానించలేము. కాబట్టి దేవుడే స్వయంగా మన యొక్క హృదయములోనికి రాబోతున్నారు కావున మన పాపపు జీవితమును, పాత అలవాటులను, కోరికలను, అభిప్రాయాలు వదిలేసి దేవునితో కొత్త జీవితం ప్రారంభించాలి. యోహాను గారు ప్రభువు రాకడ కొరకై ప్రజల జీవితాలను సిద్ధం చేసిన విధంగా మనం కూడా దేవుని రాకకై మన జీవితాలను సిద్ధం చేయాలి.

Fr. Bala Yesu OCD

2, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం


యెషయా 63:16-17, 64: 1. 3-8
1 కొరింతి 1:3-9
మార్కు 13: 33-37
ఆగమన కాలం మొదటి ఆదివారం తో దైవార్చన కొత్త సంవత్సరము ప్రారంభమగుచున్నది. ప్రభువు యొక్క రాకడ ఎప్పుడు ఏ విధంగా జరుగునో ఎవరికీ తెలియదు కావున ఆయన యొక్క రాకడ కొరకు మనము సంసిద్ధులై జీవించాలి. ఆయన రావటము అనేది సత్యం ఎందుకంటే భూమ్యాకాశములు గతించిన గాని నా మాటలు గతించిపోవు అని ప్రభువు పలికారు ఆయన పలికిన ప్రతి మాట తప్పక నెరవేరును. పోయిన దైవార్చన సంవత్సరములో((Year A) ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకై తయారైన విధముగా మరొకసారి మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై తయారై ఉండాలి. 
ఈ యొక్క ఆగమన కాలంలో మనం ప్రభువు యొక్క జన్మము కొరకై ఎదురుచూస్తున్నాం. దేవుడు మన మధ్య మరియు మనలో జన్మించాలి అంటే మనందరం కూడా ఆయనకు ఒక నివాస స్థలమును మన మధ్య మరియు మన హృదయములో ఏర్పరచాలి. 
ఈనాటి మొదటి పఠణంలో  యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చేసిన పశ్చాత్తాప ప్రార్థన గురించి తెలుపుచున్నారు. పర్షియా దేశమునకు చెందిన సైరస్ రాజు ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛనిచ్చి యెరుషలేము దేవాలయం పునః నిర్మించుటకు అనుమతి ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైన విధానమును గ్రహించుకొని వారు పశ్చాత్తాపముచెంది మరొకసారి వారి మధ్య దేవుడిని దిగి రమ్మని ప్రార్థన చేస్తున్నాను. యావే దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయనను వారి మధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో ఒక మహా రాజ్యముగా రూపొందగలదని ఆశపడ్డారు, కానీ వారి యొక్క పాపపు జీవితం వలన దేవునికి దూరమైపోయి సర్వమును కోల్పోయారు. అలాంటి క్లిష్ట పరిస్థితులు యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైన వార్తను దయచేసి చేస్తున్నారు ఏమిటంటే, దేవుడిని నమ్ముకున్న ప్రజలకు ఆయన ఎప్పుడు చేరువులోనే ఉంటారు అని. దేవుని యొక్క గొప్ప లక్షణం , మంచితనము ఏమనగా ఆయన కొరకు ఎదురు చూసే వారికి తప్పనిసరిగా దర్శనం ఇస్తారు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు తప్పు చేసినప్పటికీ, అవిధేయత చూపించినప్పటికీ మాత్రము ఎన్నడు వారిని విడిచిపెట్టలేదు వారికి సహాయంగా ఉన్నారు. కేవలము వారి యొక్క హృదయ పరివర్తన కొరకై కొన్ని సందర్భంలో బానిసత్వంను అనుమతించారు అయినా వారికి తోడుగానే ఉన్నారు.
ఈ మొదటి పఠణం  మొదటి భాగములో ప్రజలు దేవుడు తమ్మును విడిచి పెట్టారు అని భావించారు కానీ రెండవ భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన పట్ల ఏ విధముగా ప్రవర్తించారో తెలుపుచున్నారు. తన చెంతకు వచ్చిన వారిని, తనను సేవించే వారిని మరియు తన మీద ఆధారపడి జీవించే వారిని ప్రభువు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు అని తెలుపుచున్నారు. కేవలము ప్రజలే ఆయనను గుర్తించలేకపోయారు అని తెలిపారు. ఆయన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదని ప్రభువు పలికారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు మనకు ఒసగిన అనుగ్రహాలు గురించి తెలుపుచున్నారు. ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా మనందరికీ కృపానుగ్రహాలు వసగబడెను. ఇది కేవలము ఆయన మనకు ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం. మనము పాపాత్ములు అయినప్పటికీ కూడా ఆయనయే తన ప్రేమ వలన మనకు అనుగ్రహాలు ఇస్తున్నారు. ప్రభు యొక్క రాకడ కొరకై విశ్వాసముతో ఎదురుచూసే వారికి ఆయన యొక్క అనుగ్రహాలకు కొరత ఉండదు అని కూడా పౌలు గారు తెలుపుచున్నారు. అన్ని విషయములయందు వారిని ప్రభువు సుస్థిరం చేస్తారు.
ఈనాటి సువిశేష భాగములో యజమానుడు ఎప్పుడు వచ్చునో తెలియదు కాబట్టి ఆయన యొక్క రాకడకై సేవకులను జాగరుకులై ఉండమని ప్రభువు తెలుపుచున్నారు. ఈ సువిశేష భాగములో రెండు అంశములను ప్రధానంగా చూస్తున్న ఒకటి వేచి ఉండటం రెండు జాగరుకులై ఉండటం.
1. వేచి ఉండటం, ఎదురు చూడటం- వేచి ఉండటం, చూడటం అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం.
-తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎదురు చూస్తారు.
-చదువుకునే వారు మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తారు.
- ప్రయాణికులు వాహనముల కొరకు వేచి ఉంటారు.
-సంతానం లేని వారు పిల్లల కొరకు ఎదురు చూస్తారు.
- దేవుడు కూడా మన యొక్క హృదయ పరివర్తన కొరకు ఎదురు చూస్తారు
ఈ విధంగా చాలా సందర్భాలలో అనేక విషయాలలో ఎదురుచూస్తూ ఉంటాం. ఈ సువిశేషంలో యజమానుడు ఎప్పుడు వస్తారు అని సేవకులు ఎదురుచూస్తున్నారు. ఆయన యొక్క రాక ఊహించని సమయంలో జరుగును కావున వారికి ఇచ్చిన పనిని వారు సక్రమంగా చేస్తూ బాధ్యతాయుతముగా మెలగాలి. కాబట్టి దేవుడు మన యొక్క యజమాని కావున మనం ఆయన యొక్క రాకకు ఎదురు చూడాలి. ఈ భూలోకంలో మంచి పనులు చేస్తూ,  మంచి జీవితం జీవిస్తూ దేవుడిచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూడాలి.
2. జాగరుకులై ఉండాలి- అనేక సందర్భాలలో క్రీస్తు ప్రభువు జాగ్రత్త కలిగి ఉండమంటున్నారు.
శిష్యులను సువార్త సేవకై పంపించే సందర్భంలో మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపిస్తున్నాను జాగ్రత్తగా ఉండమంటున్నారు.
అనేకమంది నా పేరిట వచ్చి నేనే అతనిని చెబుతారు కానీ వారి వెంట మీరు వెళ్ళవద్దు జాగరుకులై ఉండమంటున్నారు.
ఈ లోక విపత్తుల ఎడల జాగరూకులై ఉండమంటున్నారు.
ప్రభు అనేక సందర్భంలో జాగరూకత కలిగి జీవించమంటున్నారు ఎందుకంటే మనము పాపములో పడిపోకూడదని, నశించిపోకూడదని, దేవుని యొక్క మార్గమును విడిచి వెళ్ళకూడదని దేవుని యొక్క కోరిక కాబట్టి ఈ ఆగమన కాలంలో క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై ఎదురుచూసే సమయములో ఆయన యొక్క జననం ఆధ్యాత్మికంగా మన హృదయం జరగాలంటే మనము కూడా దేవుడు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూడాలి. మనల్ని మనము ఆధ్యాత్మికంగా ఆయనను స్వీకరించుటకు తయారు చేసుకోవాలి. అదేవిధంగా జాగరుకత కలిగి పాపములో పడిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవించాలి.

Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...