23, ఆగస్టు 2024, శుక్రవారం

యెహెఙ్కేలు 37:1-14 మత్తయి 22:34-40

యెహెఙ్కేలు 37:1-14 మత్తయి 22:34-40


యేసు సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని, వారు అచటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయనను పరీక్షింపవలెనని "బోధకుడా! ధర్మ శాస్త్రము నందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది?" అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా "నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మ శాస్త్రము ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండాజ్ఞల పైననే ఆధారపడియున్నవి" అని సమాధానమిచ్చెను

క్రీస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనములో దేవుడు యెహెఙ్కేలు ప్రవక్తను ఎండిన ఒక లోయలోనికి పంపిస్తున్నాడు. ఆ ప్రవక్త  అటు ఇటు తిరుగుతూ దానినిండ ఉన్నా ఎండిన ఎముకలను చూసినప్పుడు ఆ అస్థికలు మరల జీవింపగలవా, అని దేవుడు  అంటున్నాడు.  అప్పుడు ఆ ప్రవక్త ఆ సంగతి నీకే తెలియును అని అంటున్నాడు.   

దేవుడు  ఆ ప్రవక్తతో ఇలా అంటున్నాడు నీవు ఈ అస్తికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో ప్రభువు పలుకులు ఆలింపుడు అని చెప్పుము. ఆ ప్రవక్త దేవుని వాక్కును, సందేశాన్ని వినిపించుచుండగా ఎముకలు ఒకదానితో నొకటి అతుక్కొన్నవి. దేవుడు ఎండిన ఎముకలకు మరల ఊపిరిని  పంపి జీవించేలా చేసాడు. మరల వారిని బ్రతికించేను. వారు మహా సైన్యమైరి. 

ప్రియ విశ్వాసులారా  దేవుడు అంటున్నాడు ఈ ఎముకలు యిస్రాయేలీయులందరికిని చిహ్నముగా ఉన్నవి. ఎందుకంటే వారు మేము అస్తికల వలే ఎండిపోయితిమి. మా ఆశ విఫలమైంది. మేము మృతులతో సమానమైతిమి అని పల్కుచున్నారు. అందుకు దేవుడు  మీ సమాధులను తెరచి మిమ్ము లేపినప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు అని అంటున్నాడు. మీరు జీవించునట్లు చేయుదును. మీరీ  దేశమున వసించునట్లు చేయుదునని మాట ఇస్తున్నాడు.

ప్రియా విశ్వాసులారా మనం కూడా మన జీవితాలలో బాధలు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మర్చిపోతం. అంత శూన్యం అనుకుంటాం. మన జీవితాలు ఎంత చీకటిమయం అయినా మన బ్రతుకులు అణగారిపోయిన  మన స్థితి ఎలా ఉన్నా దేవుడు ఒక్క మాటతో మనకు జీవం పోసి లేవనెత్తుతాడు. మనలను నడిపిస్తాడు.  మన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయనకు సమస్తము సాధ్యమే. జీవమునకు కర్త మన ప్రభువె.  మరి నీవు నేను నమ్ముతున్నామా , ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం ధర్మ శాస్త్రోపదేశకుడు క్రీస్తు ప్రభువును పరీక్షింపవలెనని  "బోధకుడా ధర్మ శాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది? అని అడిగాడు. అందుకు  క్రీస్తు ప్రభువు రెండు ప్రధానమైన ఆజ్ఞలను ఆ వ్యక్తికీ తెలియజేస్తున్నాడు. అవి ఏమనగా 1. నీ దేవుడైన  ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. అదే విధంగా నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. మోషే  ధర్మ శాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండు  ఆజ్ఞల పైనే ఆధారపడివున్నవి. 

ప్రియ విస్వసులారా మనం దేవుణ్ణి నిజమైన మనస్సుతో, పూర్ణ మనస్సు , పూర్ణ  హృదయంతో పూర్ణ  ఆత్మతో ప్రేమించగలుగుతున్నామా? మనలో చాలా మంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెపుతుంటాం, కాని పరిపూర్ణ హృదయంతో ప్రేమించలేకపోతున్నాం. ఈలోకాన్ని ఈ లోకంలో ఉన్న అందచందాలను  చూసి, వస్తువులను, సంపదలను, వ్యక్తులను ప్రేమిస్తూ, దేవునికి మొదటి స్థానము ఇవ్వలేకపోతున్నాము. అదేవిధంగా తోటివారిని ప్రేమించలేకపోతున్నాం. నేటి సమాజంలో ఎక్కడ చూసిన గొడవలు, హత్యలు, దోపిడీలు, కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారు. కాని తమ తోటి వారిని చూసి ప్రేమించలేక పోతున్నారు. సహాయం చేయలేకపోతున్నారు. ఇతరులను  నశనము చేస్తూ, భాదిస్తు ఇబ్బందుల పాలు చేస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ ఈలోకంలో కరువైపోతుంది. స్వార్ధ పరమైన ప్రేమలు నటనలు ఎక్కువై పోతున్నాయి. మరి మనం నిజంగా స్వచ్ఛమైం ప్రేమతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి  మన తోటి వారిని ప్రేమించగలుగుతున్నామా ఆలోచించండి. 

ప్రార్ధన: ప్రేమమయుడైన దేవా నీవు సర్వశక్తిమంతుడవు. జీవ నదిని మాలో ప్రవహింపచేసి మాకు జీవమును దయచేయుము.  నీవు మాకు ఒసగిన ఆజ్ఞలను మేము పూర్ణ మనస్సుతో , హృదయంతో, ఆత్మతో పాటించగల శక్తిని నాకు దయచేయండి తండ్రి ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

22, ఆగస్టు 2024, గురువారం

యెహెఙ్కేలు 36:23-28 మత్తయి 22:1-14

 యెహెఙ్కేలు 36:23-28 మత్తయి 22:1-14

యేసు ప్రజలకు మరల ఉపమానరీతిగా ప్రసంగింప ఆరంభించెను. "పరలోక రాజ్యము ఇట్లున్నది : ఓక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని  విందుకు బయలుదేరిరండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను కాని, వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో! నా విందు సిద్దపరుపబడినది. ఎద్దులను, క్రొవ్విన దూడలును వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. కనుక విందుకు రెండు అని మరియొకమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కాని పిలువబడినవారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన  పొలమునకు, మరి యొకడు తన వ్యాపారమునకు వెళ్లెను. తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టిచంపిరి. అపుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హత మార్చి వారి పట్టణమును తగులబెట్టించెను. అంతట, తన  సేవకులను పిలిచి నా విందు సిద్ధముగా ఉన్నది. కాని , నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులుకారు. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి, కనపడిన వారినందరిని పిలుచుకొనిరండు అని పంపెను. ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్లి మంచి , చేడు  తేడా లేక తమ కంటపడిన వారినందరను తీసికొనివచ్చిరి. ఆ కళ్యాణమండపము అతిథులతో నిండెను. అతిధులను చూచుటకు రాజు లోనికి వెళ్లి, వివాహవస్త్రము లేని వానిని ఒకనిని చూచి మిత్రమా! వివాహవస్త్రములేకయే నీవిచటికి ఎట్లు వచ్చితివి? అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించియుండెను. అపుడు ఆ రాజు తన సేవకులతో ఇతనిని కాలు సేతులు కట్టి వెలుపల నున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు విలపించుచు పండ్లు  కోరుకుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు కాని , ఎన్నుకొనబడినవారు కొందరే."

క్రిస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా! ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇలా అంటున్నాడు. మీరు మీ పాప జీవితముల ద్వారా అనేక జాతుల మధ్య నా మహానామమునకు అపకీర్తి తెచ్చిరి. కాబట్టి నా నామము పవిత్రమైనది అని అన్య జాతులకు తెలియజేస్తాను అని ప్రభువు  తెలియజేస్తున్నాడు. నేను పవిత్రుడను అని జనులు తెలుసుకుంటారు. అది మీ ద్వారానే అని ప్రభువు అంటున్నాడు. పవిత్ర జలమును చల్లి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను. కాబట్టి ప్రియ విశ్వాసులారా దేవుని పవిత్ర జలంతో మన పాపములను మాలిన్యములను దేవుడు శుద్ధి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపాల ద్వారా మనం పవిత్రమైన దేవుని మహా నామమును అపవిత్రం చేస్తున్నాం. దేవుడు మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. మన తండ్రి పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనందరిలో పరిశుద్ధాత్మను అనగా తన ఆత్మను మనలో ఉంచుతాడు. 

దేవుడు అంటున్నాడు, మీ నుండి రాతి గుండెను  తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. మనలో చాలా మంది రాతి గుండెను కలిగి ఉన్నాం. మనలో చాలా మందికి దైవ ప్రేమ లేదు, సోదర ప్రేమలేదు, స్వార్ధం, గర్వం, అసూయ అనేవి ఎక్కువైపోతున్నవి. మనుషుల మధ్య బంధాలు కూడా తగ్గిపోతున్నాయి. అందుకే దేవుడంటున్నాడు. మీలో నా ఆత్మను  ఉంచి నాఆజ్ఞలను పాటించునట్లు  చేయుదును. ఏమిటి దేవుని ఆజ్ఞలు అంటే అవి  దైవ ప్రేమ సోదర ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి. నీ దేవుణ్ణి ప్రేమించు నీ పొరుగు వానిని ప్రేమించు ఇవే దేవుని ఆజ్ఞల సారాంశం. ప్రియ విశ్వాసులారా మనందరం దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మతో నింపబడి పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నించుదాం. అప్పుడు మనము దేవుని ప్రజలం అవుతాము. ఆయన మన ప్రభువు అవుతాడు. 

ఈనాటి సువిశేష పఠనములో యేసు క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యము ఇలా ఉన్నది. అని ఉపమానాల  ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు. సిద్ధపరచిన పెండ్లి విందుకు రండి అని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా దేవుడు పరలోక రాజ్యపు విందునకు మనందరిని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఎన్నుకొని ఆహ్వానిస్తున్న, వారు మాత్రం ఆ విందుకు రావడం లేదు. దేవుడు తన సేవకులను పంపి మనందరిని ఆహ్వానిస్తున్నాడు. అనేక సార్లు  దేవుడు తన సేవకులను పంపినప్పటికీ చాల మంది ఆ ఆహ్వానాన్ని అర్ధం చేసుకోలేక ఆ విందుకు రాలేకపోతున్నారు.  అదేవిధంగా దేవుడు తన సేవకులను ఈనాడు మనందరి దగ్గరకు పంపిస్తున్నాడు. మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎంతమందిమి సిద్ధంగా ఉన్నాము,  ఆ పరలోక రాజ్యపు విందులో పాల్గొనడానికి ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

పిలువబడినవారు ఆహ్వానాన్ని లక్ష్య పెట్టకుండా, అంటే లెక్క చేయకుండా ఉన్నారు. మరి ఈనాడు నీవు నేను మనందరం దేవుని ఆహ్వానాన్ని స్వీకరించుచున్నామా లేదా ఆలోచించండి. లేదా అయోగ్యులుగా మారిపోతున్నామా? నీకు నాకు వివాహ వస్త్రము లేకపోతే దేవుడు నిన్ను నన్ను చీకటిలోకి త్రోసివేస్తాడు.  ఏమిటి  వివాహ వస్త్రం అంటే అది మన సిద్ధపాటు, మరియు  పవిత్రత.  మన జీవితాలలో, మన విశ్వాసపు ప్రయాణంలో ఈ విధమైన సిద్ధపాటు, అవిత్రత లేకపోతే మనం కూడా  చీకటిలోనికి త్రోసివేయబడతాం. కాబట్టి విశ్వాసులారా ధ్యానించండి, ఆలోచించండి మనం ఎలా ఉన్నాం. కేవలం పిలువబడిన వారిలా ఉన్నామా లేదా ఎన్నుకొనబడిన వారిలా ఉన్నామా ? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: పవిత్రుడవైన దేవా, నా పాప జీవితము ద్వారా నీ పవిత్ర నామమును అపవిత్రం చేసి నీకు ద్రోహము చేసి ఉన్నాము. మమ్ము క్షమించండి. ప్రభువా మాలో ఉన్న రాతి గుండెను తొలగించండి. మీ  ఆత్మతో  మమ్ము నింపండి మాంసపు గుండెను నాకు ప్రసాదించండి. మాకు పవిత్రతను, పవిత్ర జీవితమును జీవించే భాగ్యము మాకు దయచేయండి. మేము ఎన్నుకొనబడిన వారిగా ఉండే భాగ్యం మాకు ప్రసాదించండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం   యెషయా 6:1-6  1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...