8, నవంబర్ 2024, శుక్రవారం

లూకా 16: 1-8

 లూకా 16: 1-8

యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "ఒక ధనవంతునివద్ద  గృహనిర్వాహకుడు  ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృథా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, 'నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహనిర్వాహకుడుగా ఉండ వీలుపడదు' అని చెప్పెను. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: 'ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తిలేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహనిర్వాహకత్వమునుండి తొలగింపబడినపుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను' అని యజమానుని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటివానితో 'నీవు నా యాజమానునికి ఎంత ఋణపడి ఉన్నావు? అని అడిగెను. వాడు 'నూరు మణుగుల నూనె' అని చెప్పెను. అపుడు అతడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము' అని చెప్పను. అంతట అతడు రెండవ వానితో 'నీవు ఎంత ఋణపడి వుంటివి?' అని అడిగెను. వాడు నూరుతూముల గోధుములు' అని  బదులుపలికెను. అపుడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, ఎనుబది అని వ్రాసికొనుము'  అనెను. ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజలకంటే యుక్తిపరులు. 

యేసు ప్రభువు ఒక అవినీతి పరుడైన ఒక  గృహ నిర్వాహకుడి గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఒక గృహ నిర్వాహకుడు తన భవిష్యత్తు కొరకు ఎలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడో,  తన ఉద్యోగం పోయినట్లయితే తను  ఎలా జీవించాలో ఎంతో ముందు చూపు కలిగి ఉన్నాడో ప్రతి ఒక్కరు ఆత్మకు సంబంధించి ఈ  లోకానికి చెందిన వారు ఈ లోకమునకు చెందిన జీవితం గురించియే ఇంత ముందు చూపు కలిగి ఉంటె వెలుగు పుత్రులు పరలోక జీవితం  పొందాలనుకునేవారు ఇంక ఎంత ముందు చూపు కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు ప్రభువు.  ఒక సంపన్న యజమాని తన సంపదను నిర్వహిస్తున్నా గృహ నిర్వాహకుడు తన సంపదను వృథా  చేస్తున్నాడు అని తెలుసుకొని తనని పని నుండి తీసివేయ నిశ్చయించుకున్నాడు. గృహనిర్వాహకుడిని  యజమాని తీసివేయదలుచుకున్నది, తనలో నిజాయితీ లేదు అని మరియు తన సంపదను వృథా చేస్తున్నాడని,  నిజాయితీ లేకపోవడం, వృథా చేయడం, ఆ పనికి అతడు సరికాదు అని తెలుపుతున్నవి. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి పని కూడా ఈ కోవలోనికే వస్తుంది. ప్రతి వ్యక్తికీ  దేవుడు ఇచ్చిన బాధ్యత నిజాయితీగా ఉండటం మరియు  దేవుడు  ఇచ్చిన ఏ సంపదను కాని ప్రతిభను కాని వృథా చేయకుండా మన ఉన్నతికి మరియు  ఇతరుల ఉన్నతికి వాడాలి. 

 యజమాని గృహ నిర్వాహకున్ని తొలగించే ముందు అతని పనికి సంబంధించిన లెక్కలను  కోరుతున్నాడు. ప్రభువు ప్రతి వ్యక్తిని కూడా లెక్కను అడుగుతాడు. ఇక్కడ గృహనిర్వాహకుడు  త్వరలో ఉద్యోగం నుండి తీసివేయబడుతుందని  గ్రహించి, తన భవిష్యత్తు కోసం ఒక తెలివైన ప్రణాళికను రూపొందించుకున్నాడు. అది ఏమిటంటే తన యజమానునికి ఋణపడి ఉన్న వారిని పిలిచి వారి ఋణములను తగ్గించాడు దానిద్వారా ఈ ఋణస్థుల నుండి లభ్ది పొందవచ్చని అనుకుంటున్నాడు. గృహ నిర్వాహకునకు  తన గురించి తనకు  మంచి అవగాహన ఉంది, తాను ఎవరిని యాచించలేడని, మరియు శ్రమించుటకు శక్తిలేనివాడనని తెలుసుకున్నాడు. అప్పుడు తన భవిష్యత్తు కోసం  ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు. మన జీవితం గురించి కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. నా భవిష్యత్ ఏమిటి, నా ధ్యేయం ఏమిటి?  క్రీస్తు అనుచరునిగా నేను పరలోకం పొందటం నా ధ్యేయం.  

ఈ ఉపమానములో  ఆసక్తిని రేకెత్తించేది ఏమిటంటే, యేసు ప్రభువు ఆ గృహ నిర్వాహకునికి   మెచ్చుకొంటున్నాడు.  యేసు ప్రభువు గృహ నిర్వాహకుని నిజాయితి లేకపోవడాన్ని మెచ్చుకోవడం లేదు. తాను  ఉద్యోగం కోల్పోతే ఎలా బ్రతకాలో ముందుగానే ఆలోచించి యుక్తిగా ప్రవర్తించడాన్ని మెచ్చుకుంటున్నాడు.  ఈ లోకపు వ్యక్తులు  వెలుగుకు చెందిన వ్యక్తుల కంటే  వారి భవిష్యత్తు గురించి భరోసా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.  యేసు ప్రభువు తన అనుచరులను కూడా వారి జీవితాలు పరిశీలించుకోవాలని  ఈ లోకానికి చెందిన విషయాలయందే ఇన్ని జాగ్రత్తలు తీసుకొనే వీరికంటే, పరలోక విషయాలను కోరుకునే వారు ఎక్కువగా తమను తాము పరిశీలించుకుంటూ, సంస్కరించుకుంటూ, పరలోకానికి అర్హులుగా మరాలని కోరుకుంటున్నాడు. 

ఈ ఉపమానం మనకు ఇవ్వబడిన సమయాన్ని, ప్రతిభను మరియు ఇతర అనుగ్రహములను  దేవుని చిత్తమునకు  అనుగుణంగా ఉపయోగించామో లేదో  పరిశీలించమని అడుగుతుంది. పూర్తిగా ప్రభువు చిత్తమునకు అనుకూలంగా వాడకపోయినట్లయితే ఒకసారి ఈలోక వ్యక్తులను చూసి, అల్పమైన వాటికోసమే ఎంతగానో ప్రణాళికలు వేసుకునే వారిని చూసి , నిత్య జీవం ఇచ్చే ప్రభువును పొందడం కోసం తగిన ప్రణాళిక వేసుకోమని చెప్తుంది. క్రీస్తు అనుచరులుగా ఆయనను పొందుటకు  ప్రణాళికబద్దంగా జీవిస్తూ,  జాగరూకత కలిగి నిజాయితితో కూడిన జీవితం జీవిస్తూనే, ఆధ్యాత్మిక సంపదను సంపాదించుటకు పాటుపడుదాం. 

ప్రార్ధన: ప్రభువా! మిమ్ములను తెలుసుకొని, మీరు మాకు ఇచ్చే గొప్ప అనుగ్రహాలు పొందుకుంటూ   వాటిని సరియైన విధంగా వాడుకోలేకుండా ఉన్నాము. మీరు ఇచ్చిన సమయాన్ని, ప్రతిభను  దుర్వినియోగం చేస్తున్నాము. అటువంటి సందర్భాలలో మమ్ము క్షమించండి. మీ అనుగ్రహాల విలువ తెలుసుకొని వాటిని మీ చిత్తము కొరకు వాడే వారినిగా మమ్ము దీవించండి.  అనేకసార్లు అవివేకంతో ధ్యేయం లేకుండా జీవిస్తున్నాము. అటులకాకుండ మిమ్ములను పొందాలని, మీ పరలోకంలో స్థానము పొందేందుకు ప్రణాళికతో జీవించేలా దీవించమని వేడుకొంటున్నాము. ఆమెన్. 

2, నవంబర్ 2024, శనివారం

31 వ సామాన్య ఆదివారము

31 వ సామాన్య ఆదివారము 
ద్వితియెపదేశకాండము 6:2-6
హెబ్రీయులు 7:23-28
మార్కు 12:28-34
            ప్రియా దేవుని బిడ్డలరా ఈ రోజు మనమందరము కూడా 31వ ఆదివారంలోనికి ప్రవేశించి యున్నాము. ఈనాటి మూడు పఠనలు కూడా మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తాయి అదేమిటంటే దేవుని పట్ల భయభక్తులను  చూపించటం, యేసు క్రీస్తు ద్వారా క్షమాపణ పొందటం మరియు జీవిత కాలం ప్రేమతో జీవించడం వంటి వాటి గురించి తెలియజేస్తుంది. ఈ ప్రేమ మరియు భక్తి మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందంటే మనము దేవుని దగ్గరకు  మరింతగా చేరడానికి, ఆయన అనుగ్రహంలో నివసించడానికి ఉపయోగపడతాయి.

 మొదటిపఠనములో ద్వితియెపదేశకాండం గురించి మనం వింటున్నాం. దేవుడు మానవులయినటువంటి మనందరికి కూడా  అయన ప్రేమనిచ్చి, ఆయన ఆజ్ఞలను ఎల్లపుడు మన జీవితాలలో  పాటించాలని పిలుపునిచ్చాడు. ఎందుకంటే దేవుని వాక్యం నీ  దేవుడైన యావేను   నీ పూర్ణ హృదయంతో , ఆత్మతో ప్రేమించుము అని చెబుతున్నాడు, దీని ద్వారా మనమందరమూ కేవలం హృదయం గానీ లేదా మనసు గానీ కాకుండా సంపూర్ణంగా దేవుని పట్ల ప్రేమను చూపించాలని చెప్పబడుతుంది. ఈ ప్రేమ మనం పాటించేటువంటి ఆజ్ఞల ద్వారా, మన ప్రేమ దేవుని దగ్గర వ్యక్తమవుతుంది. మనం దేవుని వాక్కును లేదా అయన మాటలను మన హృదయాలలో నిలిపి, ప్రతి సందర్భంలో ఆయనను అనుసరించడంలో మన బలాన్ని పెంచుకోవాలని  ఈ మొదటిపఠనం తెలియజేస్తుంది.

      రెండొవ పఠనములో హెబ్రియులకు వ్రాసిన లేఖలో యేసు క్రీస్తు మనకందరికూడా ఒక గొప్ప శాశ్వత యాజకుడు అని. ఆయన మన కొరకు తన జీవితన్నే  శాశ్వతంగా త్యాగం చేసి, దేవుని దగ్గర లేదా అయన సన్నిధిలో మనకు ప్రత్యక్ష ప్రతినిధిగా ఉంటాడని, అంటే అయన యాజకత్వం వలన మనకు శాంతి మరియు విముక్తి లభిస్తుంది. క్రీస్తుప్రభువు  యొక్క త్యాగం ద్వారా మన జీవిత పాపాలకు నిరంతర క్షమాపణను మరియు మన రక్షణకు మార్గం చూపిస్తుందని రెండొవ పఠనము తెలియజేస్తుంది. 

                  చివరిగా సువిశేష పఠనములో రెండు ఆజ్ఞలా గురించి  అందరికి క్లుప్తంగా వివరిస్తున్నాడు, అ రెండు ఆజ్ఞలు ఏమిటంటే దేవుని పట్ల ప్రేమ మరియు సాటి మనువుని పట్ల ప్రేమ.

   ముందుగా మొదటిది దేవుని పట్ల ప్రేమను మనం చుసినట్లయితే, దేవుని పట్ల సంపూర్ణ ప్రేమను చూపించటం యేసు మొదటగా చెప్పిన ఆజ్ఞ, ఎందుకంటే నీ దేవుని సంపూర్ణ హృదయంతో, ఆత్మతో మరియు బలంతో ప్రేమించుము అని అంటున్నారు. ఏ విధంగానంటే ఇది మనము  దేవుని పట్ల కలిగి ఉండాల్సిన భక్తి మరియు విధేయతను సూచిస్తుంది. దేవునితో ప్రేమ బంధం అనేది మన జీవితంలో కలగలిపి ఉండాలి. ఈ ప్రేమతో మనం దేవుని ఆజ్ఞలను గౌరవిస్తూ, ఆయన మార్గంలో నడవగలుగుతాము. అంతే కాకుండా యేసు క్రీస్తు చెప్పినటువంటి ఈ ప్రేమ కేవలం మాటలలోనే కాకుండా మన  జీవితాలలో కూడా ఉండాలని అంటున్నారు. ఇది మొదటి ఆజ్ఞ.
మరి రెండొవ ఆజ్ఞ ఏమిటంటే మానవుని పట్ల ప్రేమ: ఈ ఆజ్ఞ అనేది మన చుట్టూ ఉన్నవారిని, మనలను ఇష్టపడేవారిని లేదా మనలను ఇష్టపడని వారిని, మన స్నేహితులకే కాకుండా ప్రతీ ఒక్కరిని ప్రేమించడం అనేది క్రైస్తవుల జీవితంలో మరియు ధర్మంలో ప్రధానమైనది. మనము ఏ  విధంగానైతే దేవుని ప్రేమను అనుభవిస్తామో అదే విధమైనటువంటి ప్రేమను ఇతరులకు పంచడంలోనే ఈ ఆజ్ఞ అనేది ఉంటుంది.

      కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు కూడా క్రైస్తవులమైనటువంటి మనకి దైవభక్తిని, యేసు యొక్క శాశ్వత యాజకత్వాన్ని మరియు మానవుని జీవితంలో ప్రేమను ఒక దేవుని పోలి  అనుసరించడానికి ఆహ్వానిస్తున్నాయి. దేవుని ప్రేమలో జీవిస్తూ, యేసు ద్వారా శాంతి పొందుతూ, మన హృదయంలోని ప్రేమను ఇతరులకు పంచుకోవడం ద్వారా మనం నిజమైన క్రైస్తవులమని  నిరూపించవచ్చు.

ఫా.  జ్వాహాన్నెస్  OCD 

యేసు ప్రభువుని వ్యక్త పరచుట- శిష్యుల కర్తవ్యం

  యోహాను 13: 16-20 దాసుడు తన యజమానునికంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుక...