19, మార్చి 2022, శనివారం

తపస్సు కాలం 3 వ ఆదివారం(2)

తపస్సు కాలం 3 వ ఆదివారం

నిర్గమ 3: 1-8, 13-15, 1 : కొరింతి 10: 1-6 , 10-12 , లూకా 13 : 1-9

ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క ఓర్పు, సహనం గురించి తెలుపుచున్నాయి. 

-ప్రజల యొక్క హృదయ పరివర్తనంకై దేవుడు మానవాళి పట్ల ఎంత ఓర్పుగా ఉన్నారో తెలుపుచున్నవి. 

-దేవుడు మానవులను అర్థం చేసుకొని వారియొక్క దీనస్థితికి జాలిపడి వారిపట్ల సహనంతో మెలగుతారు. 

-ఓర్పుగా ఉండటం దేవునియొక్క సహజ లక్షణం. అది దేవుని గొప్ప లక్షణం. తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్ష వేయరు. ఎందుకంటే సృష్టి ప్రారంభంలోనే ఆదాము అవ్వ తప్పు చేసిన సరే తన యొక్క మనస్సు బాధపెట్టిన సరే వారే వస్తారని, క్షమించమని అడుగుతారని దేవుడు సహనంతో ఎదురు చూస్తున్నారు. మరియొక సారి వారు రాకపోయే సరికి దేవుడే వారిని వెదకుచు వారిపట్ల సహనంతో ఉంటున్నారు. 

-ఇశ్రాయేలీయులయొక్క మార్పు కోసం కూడా దేవుడు ఎంతో ఆశగా సహనంతో ఉంటున్నారు. అందుకు కాబట్టే ప్రవక్తల తర్వాత ప్రవక్తలను పంపుతున్నారు. 

-దేవుని వలే మనకు కూడా సహనం కావాలి. ఏవిధంగానైతే  రైతు పంట కోసం  ఎలాగ సహనంతో ఉంటారో మనం కూడా మన పొరుగు వారి మార్పుకోసం సహనంతో ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి జీవించాలి.

-పునీత అగస్టీను గారి తల్లి కుమారుడి కోసం భర్త కోసం వారియొక్క మార్పుకోసం ఎన్నో సంవత్సరాలు సహనంగా ఉన్నారు.

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల చూపినటువంటి గొప్ప దయను గురించి చెప్పబడినది. 

-మోషే ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎన్నుకొంటూ, దేవుడి వరిపట్ల తనయొక్క దయను చూపిస్తున్నారు. 

-మోషే ప్రవక్త ఎప్పుడైతే దేవుని కొండయైన హోరేబు దగ్గరకు వచ్చారో అప్పుడు అతనిని దేవుడు ఎన్నుకొంటున్నారు. 

-దైవ పిలుపు ఎప్పుడు వస్తుందో ఎలాగ వస్తుందో ఎవరికి తెలియదు. 

-దైవ పిలుపునందుకొన్నది ఎందుకంటే దేవుని ప్రజలను నడిపించుటకు. ప్రజల యొక్క జీవితంలో పాపం యొక్క ఆవశ్యకతను తెలిపి, వారు దేవుని వైపు మరల్చే లాగ చేయుటమే దైవ ఇలుపు ఉద్దేశం .

-ఈనాటి మొదటి పతనం ద్వారా దేవుడు చాల విషయాలు మనకు తెలియచేస్తున్నారు. 

1. మనం దేవుని దగ్గరకు వస్తే మన జీవితాలు మారిపోతాయి. మోషే ప్రవక్త దేవుని కొండయైన హోరేబు  వద్దకు వచ్చారు. దేవుడున్న స్థలంకు వచ్చిన్నప్పుడు దేవుడు తనను ఎన్నుకుంటున్నారు, ఆయన ఎన్నిక ప్రత్యేకమైనది. 

-దేవుడు మోషేకు దైవ పిలుపును అందచేస్తున్నారు. మోషే జీవితంలో ఒక గొప్ప మలుపు కలిగేలా దేవుడు చేస్తున్నారు. 

- మోషేను అనేక మందికి నాయకుడిగా చేస్తున్నారు. ఆయన జీవితాన్ని మార్చుతున్నారు. 

-ఆయనకు దేవుడు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. తన ద్వారా ద్వారా బానిసత్వంలో ఉన్న ప్రజలకు స్వేచ్ఛనిస్తానన్నారు. 

- దేవునికి దగ్గరగా వచ్చిన వారి జీవితాలు చాలా మారిపోయాయి. జక్కయ్య యేసయ్యను చూడాలని వచ్చారు అప్పుడు ఆయన జీవితం మార్చబడుతుంది. 

-నతానియేలు దేవుని దగ్గరకు వచ్చారు దైవపీలుపును పొందుకున్నారు.

-మోషే దేవుని యొక్క స్థలం దగ్గరకు వచ్చారు దేవుని పని కోసం ఎన్నుకొనబడినారు. 

- మనం దేవుని దగ్గరకు వస్తే దేవుడు మన దగ్గరికి వస్తారు. యాకోబు 4 :8 . 

-మనం కూడా దేవునిదగ్గరకు రావాలి నిర్మలమైన మనసు కలిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనలను కూడా మార్చుతారు. అదేవిధంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలను మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. 

2. దేవుడు కనులారా ప్రజలయొక్క బాధలను చూశారు అని నిర్గమ 3 :7 వ వచనంలో చెప్పబడింది. ఈ మాట యొక్క అర్థమేమిటంటే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపాలకు పశ్చాత్తాప పడ్డారని వారిలో హృదయ పరివర్తనం చోటు చేసుకుందని, వారు దేవుని వైపు మరలినారని అర్థం. ఎన్నో సంవత్సరాలుగా  వారు మారతారని దేవుడు ఎదురుచూసిన సమయం వచ్చినదని కాబట్టియే వారిని విముక్తులను చేయుటకు దేవుడు వారికోసం మోషే ను ఎన్నుకొంటున్నారు. 

-మన జీవితాల నుండి దేవుడు అదేవిధంగా హృదయ పరివర్తనం కోసం ఎదురు చూస్తున్నారు. 

-దయ, కనికరం కలిగిన దేవుడు ప్రజల దగ్గరగా ఉంటూ వారి జీవిత మనుగడను పరిశీలిస్తు వారి మార్పుకోసం ఎంతో ఎదురుచూస్తాడు.  

3. దేవుడు మోషేతో అన్నారు ఇప్పుడు నీవున్న స్థలం పవిత్రమైనది నీ చెప్పులు విప్పుము అంటున్నారు. 

- విడవటం అంటే కేవలం చెప్పులు మాత్రమే కాదు పాపమును కూడా విడిచిపెట్టడం. 

చాలామందికి దేవునియొక్క స్థలం పవిత్రత విలువ తెలియటంలేదు. అందుకే దేవాలయాన్ని ఎలాపడితే అలా వాడుతున్నారు. 

- దేవాలయంలో మొబైల్స్ వాడటం, ఎక్కువగా ముచ్చట్లు పెట్టడం చేస్తుంటారు. ఇవన్నీకూడా మనం తరుచుగా దేవాలయంలో చేస్తుంటాం ఎందుకంటే మనకు నిజంగా దేవునియొక్క పవిత్రత విలువ తెలియటం లేదు. 

4.  మోషే ప్రవక్త దేవుడి పేరు అడుగుచున్నారు.

“నేను ఉన్నవాడను” అని దేవుడు సమాధానం ఇస్తున్నారు.

ఉన్నవాడను అంటే అన్ని సమయాలలో వున్న దేవుడు.

-సృష్టి కాక మునుపే ఉన్నవాడు. 

-సృష్టిని చేసినప్పుడు ఉన్నవాడు. 

-సృష్టిని నడిపిస్తున్నప్పుడు వున్నవాడు. 

-మన సంతోషంలో ఉన్నవాడు. 

-మన భాదలలో ఉన్నవాడు. 

-మన నిరాశలలో, సమస్యలలో ఉన్నవాడు. 

- తన ప్రజలకి ఎప్పుడు దగ్గరగా ఉన్నవాడు, వారిని రక్షించుటకు వున్నవాడు అని భావం. ఆయన నిద్రపోయే వ్యక్తికాదు. 

-యావే దేవుడు తనను తాను వున్నవాడనని సంబోధించుకుంటున్నారు. యేసు క్రీస్తుప్రభుని ఇమ్మానుయేలు అంటున్నారు అనగా దేవుడు మనతో ఉన్నారు అని అర్థం. మత్తయి 1 :22- 23 .

-యేసుప్రభువు అంటున్నారు ఎల్లప్పుడూ మీతో ఉండుటకు మీకు నేనొక ఆదరణ కర్తను పంపిస్తాను అని. యోహను 14: 16-17.

- ఈ మూడు వాక్యాలలో దేవుడు తనను తాను ఉన్నవాడనని సంభోదించుకుంటున్నారు. -

-మన దేవుడు మనతో ఉండేవారు కాబట్టియే వారిని ప్రత్యేకంగా మనం అంటిపెట్టుకొని జీవించాలి. 

-దేవుడు తన పేరు తెలియచేయటం ఒక గొప్ప విశేషం. మనం ఒక వ్యక్తి పేరు చెబితే వారి గురించి మొత్తం తెలుసుకుంటాం. వారియొక్క వ్యక్తిత్వం, స్వభావం అన్నియు. దేవుని పేరు తెలియ చేయటం ద్వార దేవునికి  గొప్ప స్వభావం, ఓర్పు కలిగిన స్వభావం తెలుస్తుంది. 

-యావే దేవుడు మోషేతో "నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, దేవుడను అని చెప్పుచున్నారు. అంటే దేవుడు వీరికి చేసిన వాగ్దానాలను జ్ఞప్తికి ఉంచుకొని వాటిని నెరవేర్చేదేవుడు , ప్రజల మధ్య నివసించే దేవుడని తెలియ చేయుటకు ప్రభువు ఈవిదంగా పలుకుచున్నారు. 

-ఈ నాటి రెండవ పఠనంలో పౌలుగారు కొరింతు ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదాలు మల్లి చేయరాదని హెచ్చరిస్తున్నారు. 

-పౌలుగారు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన మేలులన్నీ వివరిస్తున్నారు. ప్రభువైన యావే దేవుడు 40 సంవత్సరాలు మేఘము క్రింద ఎటువంటి ఇబ్బంది లేకుండా కాచికాపాడారు.

-ఎర్ర సముద్రం దాటుటకు మార్గం సిద్ధం చేశారు, ఎడారిలో వారికీ ఆహారం, నీరు సమృద్ధిగా ఇచ్చారు. 

-దేవుడు వారియొక్క జీవితంలో ఎటువంటి కొరత లేకుండా కంటికి రెప్పలా కాపాడిన కానీ ఇంకా వారిలో కొంతమంది దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. అవిశ్వాసులుగా జీవించారు. వారిలో చాలామంది వాగ్దానా భూమికి చేరలేదు అని పౌలుగారు వివరించారు. 

- ఇశ్రాయేలు ప్రజలు పడిపోయిన విధంగా కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలని పౌలుగారు తెలుపుచున్నారు. 

-మనం జాగ్రత్తగా ఉంటే పడిపోకుండా ఉంటాం. చాల సందర్భాలలో జాగ్రత్తగా చూసుకొని  నడువు అని చెబుతారు ఎందుకంటే మనం జాగ్రత్తగా నడిస్తే గమ్యం చేరతాం. ఎటువంటి ప్రమాదంలో పడిపోకుండా.

-మనయొక్క   ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస జీవితంలో మనం కూడా జాగ్రత్తగా ఉంటే  

 పాపంలో  పడిపోము  దేవుని  అంటిపెట్టుకొని  జీవిస్తాం .

-మనకన్నా ముందుగా జీవించిన వారు మనకు ఎప్పుడు సుమాత్రుకగా ఉంటారు కొంతమంది మంచి ఉదాహరణగా ఉంటారు. కొందరు చెడుకు ఉదాహరణగా ఉంటారు అంటే అలాంటి చెడు జీవితం జీవించకూడదు అనుటకు ఉదాహరణగా ఉంటారు. 

-ఇశ్రాయేలు ప్రజలకు ఉదాహరణగా పౌలుగారు చెప్పినప్పుడు మనందరి జీవితాలను పరిశీలించుకోమంటున్నారు వారి వలె కాకుండా మనం కూడా మంచి విశ్వాసులుగా ఉండుటకు ప్రయత్నయం చేయాలి.   

-దేవుని సొంత ప్రజలమని ఎవ్వరు అధిక విశ్వాసం వ్యక్త పరచకుండా మనల్ని మనం తగ్గించుకొని మన యొక్క జీవితంలో వినయం కలిగి జీవించాలి.

- ఈనాటి సువిశేష పఠనంలో యేసుప్రభువు మనందరి యొక్క హృదయ పరివర్తనం కోసం ఎంత సహనంగా ఉంటున్నారో అర్థమగుచున్నది.

-మన మందరం పాపాత్ములమే అందరుకూడా దేవుని శిక్షకు పాత్రులే కానీ దేవుడు మనందరి హృదయ పరివర్తనం కోసం ఇంకా మనలను సజీవులుగా ఉంచుతున్నారు మనయొక్క మార్పుకై.

-యేసుప్రభువు తానూ సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు చెప్పిన మొదటి ప్రసంగం "కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించమని ప్రభువు ప్రసంగించారు. మార్కు 1 : 15 .

-ప్రస్తుత సమాజంలో చాల మంది హృదయ పరివర్తన కోసం ఎదురుచూస్తుంటారు. 

-ఒక భార్య తన భర్త వ్యసనాలు మానుకొని జీవించాలనుకొంటుంది. 

-ఒక తల్లి తన బిడ్డ చెడు మార్గం విడిచి పెట్టి మంచి మార్గమును అనుసరించాలని కోరుకుంటుంది. 

-అలాగే మనం పని చేసే చోట మన యాజమానుడు మరలనుకుంటాం. 

-తల్లిదండ్రలు మారాలని బిడ్డలు, బిడ్డలు మారాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. 

-మనం పొరుగువారియొక్క హృదయ పరివర్తనంకోసం ఎదురుచూస్తున్నట్లు దేవుడు మనయొక్క హృదయ పరివర్తనం చెందటానికి ఎదురుచూస్తున్నారు.

-మనయొక్క పనుల్లో మార్పు ఉండాలి, ప్రార్థించే విధానంలో మార్పు ఉండాలి, మాట్లాడే విధానంలో మార్పు ఉండాలి, ఇతరులతో జీవించే విధానంలో అన్ని విషయాలలో హృదయ పరివర్తనం అవసరం. హృదయ పరివర్తనం క్రొత్త జీవితానికి నాంది.

హృదయ పరివర్తనం చెందాలంటే రాతిగా వున్న హృదయం మాంసపు ముద్దలాగా మారాలి. యెహెఙ్కేలు 36 :26.

-హృదయ పరివర్తనం చెందనిచో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. లూకా 13 : 5 .

-దేవునియొక్క ప్రేమ మనపై దిగిరావాలంటే మనలో హృదయ పరివర్తనం చోటుచేసుకోవాలి. 

-యేసుప్రభువు అంటున్నారు హృదయ పరివర్తనం అవసరం లేని 99 గొర్రెల కంటే హృదయ పరివర్తనం అవసరమున్న ఒక్క గొర్రె చాలు అని లూకా 15: 7.

-మనం హృదయ పరివర్తనం చెందుటకు దేవుడు చాల అవకాశాలను ఇస్తుంటారు. మన కన్నా మంచిగా ఉన్నవారు చనిపోయి మనం మాత్రమే బ్రతికి ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి నాకు కూడా మరణం వస్తుంది, నేను ఇలా ఉంటె పరలోకంలో ప్రవేశించను అందుకే నా జీవితం మార్చుకోవాలి అనే ఆలోచన చేయాలి. 

-మన యొక్క పాపపు జీవితం నుండి హృదయ పరివర్తన చెందాలి. 

-మనయొక్క అపద్దపు సాక్ష్యములనుండి, మనయొక్క కపట వేష ధారమునుండి, మనయొక్క అన్యాయపు మార్గాలనుండి, మనయొక్క ఇహలోక వంచాలనుండి మనం హృదయ పరివర్తనం చెందాలి.

-యేసుప్రభువు రెండు ఉదాహరణలను తీసుకుంటున్నారు, పిలాతు గలిలీయులను చంపిన విధానము మరియు సిలోయము బురుజు కూలి మరణించినవారు. 

-పిలాతు గలిలీయ దేశస్తులు బలులు అర్పించేటప్పుడు వారిని హత మార్చాడు. విప్లవం లేవదీసే గలిలీయులను పిలాతు నాశనం చేశారు. చనిపోయిన వారు మిగతా వారికంటే పాపాత్ములు కారు అని తెలుపుచున్నారు. 

-సిలోయము బురుజు కూలి 18 మంది చనిపోయారు అలా మరణించిన వారు మిగతా వారికంటే పాపాత్ములు కారు అని ప్రభువు తెలుపుచున్నారు. 

-ఈ రెండు సంఘటనలు అనుకోకుండా హఠాత్తుగా జరిగినవి. కాబట్టి వారు హృదయ పరివర్తనం చెందారో లేరో తెలియదు కానీ ఇది మన జీవితాలకు ఒక హెచ్చరిక.

- మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మనం మారాలి అని ప్రభువు తెలుపుచున్నారు.

- హృదయ పరివర్తనం అందరికి అవసరమే కాబట్టి దేవుడిచ్చిన తపస్సు కాలంలో హృదయ పరివర్తనం చెంది జీవించాలి. 

-రెండవ సంఘటన అత్తి చెట్టును చూపిస్తూ ప్రభువు మన పట్ల ఎంత సహనంగా ఉంటున్నారో తెలియ చేస్తున్నారు. 

మన జీవితాలు ఫలించటానికి దేవుడు ఎంతో ఓపికగా ఎదురుచూస్తుంటారు. దేవుని అనుగ్రహాలు దొరుకుతున్నాయి అయినా ఇంకా ఫలించుటలేదు. 

-అత్తి చెట్టును ఇశ్రాయేలు ప్రజలకు పోలికగా ఉంది. హోషేయ 9 : 10, మీకా 7 : 1, యిర్మీయా 8 : 13, 24 : 1 -10.

- దేవుడు ఆశించిన విధంగా వారు ప్రతి ఫలించలేదు. దేవుడు వారిని ఐగుప్తు దాస్యం నుండి విమోచించి, శత్రువుల నుండి రక్షించి వారి సొంత భూమినిచ్చారు అయినా కానీ వారు విగ్రహారాధనను పాల్పడి ఆశించిన ఫలములు ఇవ్వలేదు. నిర్గమ 32 : 1 -10 .

 -వాస్తవానికి అత్తి చెట్టు సంవత్సరానికి మూడుసార్లు ఫలముల నివ్వాలి కానీ ఇక్కడ మూడు సంవత్సరములు ఎటువంటి ఫలముల నివ్వలేదు. 

-ఆ చెట్టు ఫలించటానికి యజమానుడు అన్ని సకాలంలో ఇచ్చారు అయినా మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కనీసం మూడవ సంవత్సరం ఎటువంటి ఫలితం నివ్వలేదు. 

-అన్ని చేసినప్పుడు అది ఫలము ఇవ్వక పొతే మనం కూడా నిరాశ చెందుతాం. యజమానుడు మాత్రమే సహనంతో మూడు సంవత్సరములు ఎదురు చూశారు. 

-మూడు సంవత్సరాలు ఎదురు చూడటం అనేది ఎందుకంటే ఇజ్రాయెలీలు బానిసత్వంలోనికి వెళ్ళకముందు మూడు సంవత్సరాలు హృదయ పరివర్తనం చెందమన్నారు.

-బాప్తిస్మ యోహాను మూడు సంవత్సరాలు పరిచర్య, అలాగే యేసుప్రభువు యొక్క మూడు సంవత్సరములు బహిరంగ సువార్త వ్యాప్తి   కూడా హృదయ పరివర్తనకోసమే ప్రభువు ఎదురు చూశారు కాబట్టి మనం ఫలించాలి.

- మనం దేవుని యొక్క వాక్యం ఆలకించి అనుసరించి జీవించి ఫలించే వారిలాగా ఉండాలి దాని కోసం దేవుడు ఎదురుచూస్తున్నారు.

-దేవుని వలె ఒకరిపట్ల ఒకరు సహనం కలిగి జీవించి హృదయ పరివర్తనం చెందుదాం. క్రొత్త జీవితం జీవించుదాం.

  Rev. Fr. Bala Yesu OCD

18, మార్చి 2022, శుక్రవారం

తపస్సు కాల 3 వ ఆదివారం

తపస్సు కాల 3 వ ఆదివారం 

నిర్గ 3:1-8,13-15  1 కోరింథీ 10:1-6, 10-12 లూకా 13:1-9  

క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా !ఈ నాడు మన తల్లి అయిన తిరుసభ తపస్సు కాల మూడవ ఆదివారంలోనికి  ప్రవేశిస్తుంది.  అయితే  ఈనాటి మూడు దివ్య గ్రంధ పఠనాలను  ధ్యానించినట్లయితే ముఖ్యముగా హృదయపరివర్తన గూర్చి భోధిస్తున్నాయి. 

మొదటి పఠనములో  మోషే ప్రవక్తను యిస్రాయేలీయుల  బానిసత్వం నుండి విడిపించుటకై ఎన్నుకుంటున్నాడు. ఇతని ద్వారానే తమ పూర్వులు కొలిచినటువంటి యావే దేవుని గూర్చి  తెలియ చేస్తున్నాడు. 

రెండవ పఠనములో  మనం చూస్తే  ఈలోక  సంబంధమైన  విషయములపై , వస్తువులపై విగ్రహములపై మన మనస్సులను  లగ్నం చేయక,  ఆధ్యాత్మిక శిలయగు యేసు క్రీస్తునందు జాగ్రత్త కలిగి జీవించాలి అని తెలియజేస్తుంది. 

సువిశేష పఠనములో మనం చూస్తే, హృదయ పరివర్తనం గురించి మరియు ఫలభరితమైన జీవితం గురించి భోదిస్తుంది. 

మొదటి పఠనం :- 

ఈనాటి మొదటి పఠనములో ముఖ్యముగా మోషే ప్రవక్త ఎన్నికను మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు మోషేను ఎన్నుకున్నాడంటే, యిస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు బానిసత్వంలో మునిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. వారిని ఎంతో ఘోరంగా చూసెడివారు. వారిని బానిసలుగా ఎంచి ఇటుకలు చేయడానికి ఇల్లు కట్టడానికి ఇలా ఎన్నో రకాలుగా వారిని వాడుకుంటూ చిత్ర హింసలకు గురిచేసెడివారు. నిర్గ 2:23. అటువంటి సమయంలో యిస్రాయేలు ప్రజలు దేవుని సహాయాన్ని అర్ధించారు. అప్పుడు ఆర్తనాదాలు దేవుని చెవిన పడి వారిని రక్షించడానికి ఈ మోషే ప్రవక్తను ఒక పనిముట్టుగా ఉపయోగించుకున్నాడు. 

మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే, నిర్గ 3:1 లో ఇతను తన మామ అయినటువంటి యిత్రో మందలను మేపెడివాడు. తనకంటూ ఏమి లేదు. తన మామ దగ్గర సేవకుడుగా జీవించాడు. తన గొర్రెల నిమిత్తం మోషే హోరెబు కొండకు  వెళ్ళాడు. ఈ హోరెబు  కొండ అంటే దేవుని కొండ అని అర్ధం. దేవుడు నివసించే  ప్రదేశమునకు దేవుని చేత కొండకు నడిపింపబడ్డాడు. ఎప్పుడైతే మోషే  ఆ కొండ దగ్గరికి వచ్చాడో అక్కడ  దేవుని సాక్షాత్కారాన్ని చూసాడు. నిర్గ 3:2.  అక్కడ ఒక పొదనడిమి నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత  అతనికి సాక్షాత్కారించేను. యోష  6:1-2 లో చూస్తే  ప్రభువు ఉన్నతమైన సింహాసనము పై  ఆసీనుడై ఉండెను. అతనికి పై భాగమున జ్వలించుచున్న  సెరాఫీము దేవ దూతలు నిల్చియుండిరి అని చదువుచున్నాం. అదే విధంగా సమువేలు కూడా దేవుని దర్శనములు ఎప్పుడు లభించుచునే ఉండెను. 1 సమూ 3:21. ఇలా ఎంతో మందికి దేవుడు ప్రత్యక్షమవుతూ ఆయన యొక్క మహిమను తెలియ చేస్తున్నాడు. 

ఎందుకు దేవుడు తన పనికి ఎంతో మందిని పిలుస్తున్నాడు? 1. శ్రమలలో ఉన్న వారికి విడుదల కలుగ చేయడానికి.(నిర్గ 3:7-8) 2. పాపములో ఉన్న వారిని దేవుని మార్గంలో నడిపించడానికి (యోనా 3:4-6) 3. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి (నిర్గ 3:14) 

దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమంటే, దేవుని  గూర్చి భోధించాలి. కానీ ఈ సమాజంలో మనం చూస్తే ఎంతో మంది దేవుని మాటలను వినడానికి, దేవుని చెంతకు రావడానికి, ఆయనను గురించి  భోదించదానికి వెనకాడుచున్నారు. మోషే ప్రవక్త జీవితంలో చూస్తే ఆయన దేవుని మాట శిరస్సా వహించి 1. ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో ఉన్నవాడైన దేవుని గురించి తెలియ చేశాడు. 2. ఫరో రాజు దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క ప్రణాళికను అతనికి తెలియజేసి ఎన్నో విపత్తుల తర్వాత ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు తీసుకెళ్ళాడు. 3. దేవుని ఆజ్ఞలను వారికి అందించాడు. 4. వారి గురించి ప్రార్దన చేశాడు. 

ఈనాడు నీవు నేను కూడా క్రైస్తవులుగా పిలవబడుతున్నాం. క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరిస్తున్నవాడు. కాబట్టి మనం కూడా మోషే ప్రవక్తవలే , ఇంకా ఇతర ప్రవక్తల వలె దేవుని మాట శిరస్సా వహించి, దానిని పఠిస్తూ, పాటిస్తూ దానిని ఇతరులకు పంచుదాం. దేవుని యొక్క ప్రేమను ప్రణాళికను తెలియచేద్దాం. 

సువిశేష పఠనం లూకా 13: 1-13 

ఈనాటి  సువిశేష పఠనం ముఖ్యంగా హృదయ పరివర్తన గురించి తెలియచేస్తుంది. దేవుడు ఎలాగా వారిపై జాలి చూపిస్తున్నాడు. తన కరుణను తెలియచేస్తున్నాడని తెలుపుతుంది. అయితే ఈ సువార్త పఠనం లూకా 12 వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే లూకా 12 వ అధ్యాయంలో మొదటి మూడు వచనములలోకపట ప్రవర్తనను గూర్చి జాగరూపులై ఉండాలి అంటున్నాడు. 

4 నుండి 7 వ  వచనములలో  ఎవరికి మనం భయ పడాలి. ఎవరికి భయ పడకూడదని  తెలుపుచున్నాడు. మనం ఎవరికి భయ పడాలి అంటే  మన శరీరమును నాశనం  చేయు వారికి భయపడకూడదు. కానీ మిమ్ము చంపి నరక కూపములో పడవేయగల వానికి భయ పడాలి అని తెలుపుచున్నాడు. 

8 వ వచనం నుండి 12 వ వచనములలో  దేవునికి బహిరంగ సాక్షులుగా మారాలి అని భోదిస్తున్నారు. అట్టి వాడిని దేవదూతల ఎదుట  అంగీకరించును, వారు ఎట్లు మాట్లాడవలయునో పవిత్రాత్మ ద్వారా తెలుపబడును. 

ఇలా జీవించుటద్వారా  ఈ లోక సంబంధమైన విషయములపై , లోకాశలపై చింతించక దేవుని రాజ్యమును, నీతిని వెదుకుతారు అప్పుడు వారికి అన్నియు సమకూర్చబడును అని 13 వ వచనం నుండి 31 వరకు తెలుపుచున్నది. 

మరి ఎందుకు దేవుడు తన రాజ్యమును ఇస్తాడు అంటే ఇది తన ఇష్టం ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము దానిని చేద పురుగులు తినివేయవు. లూకా 12:32-33. 

ఈ రాజ్యం కోసం ప్రతి ఒక్క సేవకుడు  సిద్ధ పాటు కలిగి జీవించాలి. లూకా 12:32. ఎందుకంటే మనుష్య కుమారుడు ఏ గడియాలో వస్తాడో తెలియదు. లూకా 12:40. ఈ సిద్ద పాటు ద్వార ప్రతి ఒక్క సేవకుడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. లూకా 12:43. అలా జీవించనిచో తన యజమాని చేతిలో కొరడా దెబ్బలతో కఠిన శిక్ష ఉంటుంది. లూకా 12: 47-48. 

అప్పుడు తమ జీవితంలో విభేదాలు ఏర్పాడుతాయి. ఈ విభేదాలు ద్వార  తండ్రి కుమారున్నీ, కుమారుడు తండ్రిని,  తల్లి  కుమార్తెను , కుమార్తె తల్లీని, అత్త కోడలని, కోడలు అత్తని ఎదురిస్తారు. లూకా 12:53. ఇలా జరగకుండా ఒకరినొకరు సఖ్యత కలిగి జీవించినట్లయితే దేవుని శిక్షకు అర్హులు కాక ప్రేమకు పాత్రులవుతారు. 

ఇప్పుడు మనం సువిశేష పఠనం క్లుప్తంగా  పరిశీలిద్దాం. ఈనాటి సువిశేష పఠనం  ఒకే అంశము గురించి చర్చించిన  రెండు భాగాలుగా విభజింపబడింది. 1. ఇతరులను వ్రేలుఎత్తి  చూపడం 2.మనల్ని మనం మార్చుకోవడం. 

1. ఇతరులను వ్రేలెత్తి చూపడం : హృదయ కాఠిన్యం :- మొదటి వచనంలో చూస్తే, కొంత మంది యేసు ప్రభువు దగ్గరికి కొంత మంది వచ్చి గలీలియా విదేశీయలను చంపిన వదంతులను తెలియ చేస్తున్నారు. అప్పుడు యసు , గలిలీయా  సిలోము బురుజు కూలి  ప్రజల మరణం వారికి తెలియ చేస్తూ , హృదయ పరివర్తన  చెందనిచో అందరు అట్లే  నాశన మగుదురు అని చెప్పుచున్నారు. లూకా 13:1-5. 

అయితే ఇక్కడ పిలాతు గలీలియ దేశీయులను ఎందుకు చంపిస్తున్నాడంటే, సలోమోను  కాలంలో పిలాతు ఒక నూతన  జెరుషలేమును నిర్మించాలి అనుకున్నప్పుడు ఆ  ప్రజల దగ్గరకు వెళ్ళి వారు దేవునికి సొమ్ములో కొంత భాగం  పిలాతుకు ఇవ్వాలని వార్తనందించాడు. కానీ ప్రజలు దానికి అంగీకరించలేదు. అటువంటి సమయంలో పిలాతు తన సైనికులను వారి దగ్గరకు మారు వేషంలో పంపించి బలులు అర్పించు సమయంలో వారి మీద పడి చంపించేశాడు. 

అదే విధంగా  శిలోయములో మరణించిన ప్రజల జీవితాలలో చూస్తే  అక్కడ కాల వైపరీత్యం వల్ల అక్కడ నిర్మించినటువంటి బురుజు కూలి మరణిస్తున్నారు. అయితే మరణం  ఎప్పుడు, ఎలాగా , ఎటువంటి సమయంలో సంభవిస్తుందో తెలియదు. కాబట్టి దానికంటే ముందు మనం మార్పుచెందాలి. 

అయితే ఇక్కడ ప్రజల ఏ విధంగానైతే  గలీలియ ప్రజల మరణంను  వ్రేలెత్తి చూపకుండా, దేవుని యొక్క రాకడ కోసం సిద్దపాటు కలిగి జీవించాలి. అప్పుడే మనం  హృదయ పరి వర్తనం చెంది మారు మనస్సు పొందుతాం.  

ఆమోసు 1:3,6,9,11,13 వచనములలో మనం చూస్తే అక్కడ ప్రజలపై జాలి లేకుండా దమాస్కు , గాజా , తూరు ప్రజలు తరచూ పాపం చిసిరి కాన నేను వారిని దండించి తీరుతాను అని దేవుడు పలుకుచున్నారు. వారు ఏమి చేస్తున్నారంటే 

ఆమోదు ప్రజలు గిలాదు గర్భవతుల కడుపులు చీల్చివేశారు. ఆమోసు 1:13 

మోవాబు ప్రజలు ఏదోము రాజు ఎముకలను బుగ్గి అగునట్లు కాల్చి వేశారు. ఆమోసు 2:1-2 

యూదా ప్రజలు దేవుని ఉపదేశములను తృణీకరించారు. ఆజ్ఞలను పాటింపలేదు. ఆమోసు 2:4-5 వారి పితరులు కొలచిన దేవతలను కొలిచి అపమార్గము పట్టారు. 

యిస్రాయేలు ప్రజలు బాకీలు తీర్చలేని సజ్జనులను చెప్పుల జోడు కరీదు కూడా చేయలేని పేదలను బానిసలుగా అమ్మివేశారు. ఆమో 2:6 

ఈ ఆమోను, మోవాబు , యూద  యిస్రాయేలు ప్రజలు ఇతరులను ఎలాగైనా  నాశనం  చేయాలని పూనుకొని ఇంత ఘోర పాపానికి ఒడి గట్టారు. మరి అటువంటి వారి మీదకు నిప్పులు కురిపింతును అని పలుకుచున్నారు. వారి హృదయంలో కాఠిన్యం కారణముగానే వారు ఇంత పాపానికి ఒడి గట్టారు. 

యవేలు 2:12 లో ప్రభువు  ఇట్లనుచున్నాడు. ఇప్పుడైనను  మీరు పూర్ణ హృదయముతో  నా చెంతకు మరలిరండు మీ బట్టలు చించుకొనుట చాలదు. మీ గుండెలను వ్రయ్యలు చేసి కొనుడు అంటున్నాడు. 

కాబట్టి తపస్సు కాలంలో  నీవు నేను దేవుని చెంతకు పూర్ణ హృదయముతో వచ్చి మనం చేసిన పాపములను ఒప్పు కోవాలి అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు. 

ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో కాల విపత్తుల ద్వారా భూకంపము, రోగములు, సునామీ వర్షము , కరొన  ఎంతో మంది మరణిస్తున్నారు. ఇలా మరణించడం వారి తప్పిదముల వల్ల కాదు కానీ ఈ లోక వైపరీత్యాల వల్ల జరుగుతుంది అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇదే మొదటి భాగంలో దేవుడు అనేది. ఆట్లు చంపబడిన గలీలియ వాసులకంటే, శీలోయము బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది  తక్కిన యెరుషలేము నివాసులకంటే ఎక్కువ పాపులని, అపరాధులని ఎంచుచున్నారా?అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఇతరులను నిందించకుండా సిద్దపాటు కలిగి పాశ్చాత్తాపములో దేవుని చెంతకు తిరిగి రావాలి. 

2.  మనల్ని మనం మార్చుకోవాలి :-

ఇక్కడ రెండవ భాగంలో  అంజూరపు చెట్టు గురించి తెలియచేస్తున్నాడు. అయితే ఈ అంజూరపు చెట్టును యూదా ప్రజలకు ఉదాహరణగా తీసుకొనుచున్నాడు యేసు ప్రభువు లూకా 13:6 లో చూస్తే ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించేను అంటున్నాడు. ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును సూచిస్తుంది. దేవుడు ఈ లోకములో ఉన్నటువంటిలో కెల్ల యూదా ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకోంటున్నారు. ఎందుకంటే వారికి సురక్షితమైన జీవితాన్ని ఇవ్వడానికి.  ఈ సురక్షిత జీవితం ద్వార వారు ఎప్పుడు దేవునికి వినయ విధేయత చూపిస్తూ, పండ్లు అను మంచి పనులను వారి నుండి  ఆశించాలనుకున్నాడు. కానీ వారు ఎప్పుడు వారి స్వార్ధం కోసమే జీవిస్తూ, దేవునికి దూరంగా వెళ్ళి పోతున్నారు. ఆది కాండం 2:1 లో ఈ విధంగా ఆకాశం భూమి సమస్త వస్తువులతో సంపూర్ణంగా  రూపొందెను అని తెలుపుచున్నాడు. ఇదంతా సృష్టించిన తరువాత దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోట వేసి అందులో తాను సృజించిన నరుని ఉంచాడు. ఆదికాండం 2:8. వారు సంతోషముగా జీవించుటకు, తినుటకు  తియ్యని పండ్లనిచ్చు చెట్లను ఆ తోటలో పెరుగునట్లు చేశాడు. తరువాత నరుని సంతోషం కోసం స్త్రీని సృష్టించాడు.

 దేవుడైన  యావే వారిని సృష్టించిన తరువాత ఈ నేలపై అన్ని రకాలైన  మృగములను , పక్షులను సృజించి వాటిపై మానవునికి ఆధికారాన్ని కలుగజేశాడు. దేవుడు వారిని ఎంతో ప్రేమించి ముందుగా 1. ఈ లోకాన్ని సృష్టించి,2. సమస్త వస్తువులను రూపొందిచాడు, 3. వారు నివసించుటకు ఏదేను తోటను ఎన్నుకొన్నాడు. 4. ఆ తోటలో నరునికి నివాసం ఏర్పరిచాడు. 4. రుచికరమైన పండ్లనిచ్చాడు. 6. ఆయన సంతోషం కోసం స్త్రీని సృష్టించాడు,7. తరువాత వారికి అన్నింటిమీద ఆధికారం కల్పించాడు. 

దేవుడు ఇన్ని చేసిన కానీ దేవుడు చెప్పిన మాటకు విరుద్దముగా జీవించారు. వారిని తినవద్దని చెప్పిన పండును తిన్నారు. దీని ద్వారా వారిని ఆ తోట నుండి పంపివేస్తున్నాడు. 

మరి ఈనాడు సువిశేష పఠనంలో  దేవుడు అంజూరపు చెట్టు పై తన అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. తన తోట మాలితో ఇదిగో నేను మూడెండ్లనుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చు చున్నాను. కాని నాకు ఏమియు దొరకలేదు అంటున్నాడు. దేవుడు దేవుడు ఎన్నోసార్లు మనం మారుమనస్సు పొందాలని ఎదురుచూశాడు కానీ మనం మాత్రం  మారు మనస్సు పొందకుండా  స్వార్ధపు జీవితాన్ని దూరంగా వేదలిపోతున్నాం. యోష 1: 2 లో చూస్తే " భూమి, ఆకాశములారా! వినుడు, నేను పెంచి పెద్ద చేసిన ప్రజలే నన్ను విడనాడిరి అంటున్నాడు. దేవుడు ఎంతో బాధతో ఆకాశము, పక్షులతో  మాట్లాడుతున్నారు. తనతో ఉండటానికి మానవుణ్ణి సృష్టిస్తే మనం మాత్రం  మన స్వార్ధం కోసం చూసుకుంటున్నాం. 

తరువాత వచనంలో  దీనిని నరికి వేయుడు (లూకా 13:7  )  ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అని అంటున్నాడు. 

అప్పుడు తోటమాలి తన యజమానికి ప్రార్ధన చేస్తున్నాడు. అయ్యా !ఇంకొక యేడు ఓపిక పట్టుడు అంటున్నాడు. పాత నిబందనలో చూసినట్లయితే అబ్రహాము గారు దేవుడు సొదొము, గోమోర్ర ప్రజల పాపం పెరిగిపోయినప్పుడు దానిని నాశనం చేయపునుకొనినప్పుడు అబ్రహాము గారికి దాని గురించి వివరించాడు. ఎందుకంటే, 1. సర్వ శక్తి వంతమైన ఒక మహా జాతి ఇతని వల్ల ఏర్పడుతుంది. 2. భూమండలమందంతట సకల జాతి జనులు దీవెనలు పొందుతారు. 

మరి ఆటువంటి వ్యక్తికి దేవుడు తన ప్రణాళికను తెలియజేస్తున్నాడు. అప్పుడు అబ్రహాము ప్రభువుకి ఆరు సార్లు ప్రార్దన చేయుచున్నాడు. వారికి శిక్ష ఎలాగైనా పడకుండా చూడాలని 50 మంది నుండి 45 కు చేశాడు, 45 నుండి 40 కి చేశాడు, 40 నుండి 30 కి, 30 నుండి 20 కి , 20 నుండి 10 కి చేసి వారిని ఎలాగైనా రక్షించాలని ఎంతో ధైర్యం చేశాడు. కానీ వారి పాపం వలన వారిని అగ్ని దహించి వేసింది. 

ఈనాటి సువిశేష పఠనంలో కూడా ఇలాంటి సన్నివేశాన్ని చూస్తున్నాం. యజమానుడు అనే యావే దేవుడు, తోటమాలి అనే యేసుప్రభువుకు అంజూరపు చెట్టు అనే జనాంగాన్ని యిచ్చియున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు మరిచిపోతూ ఇష్టానుసారంగా జీవిస్తూ హృదయ పరివర్తనం చెందకుండా పశ్చత్తాపపడకుండా దేవుని నుండి దూరమైపోతున్న వారికోసం ప్రార్థన చేస్తున్నాడు లూకా 13:8; అయ్యా ఇంకొక ఏడు ఓపికపట్టుడు నేను దీని చుట్టూ పాదుచేసి, ఎరువు వేసెదను అంటున్నాడు.

పాదుచేయటం అంటే యేసుప్రభువు మూడు సంవత్సరములు తన శ్రమలు, మరణము, మరియు పునరుత్తానముల ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది అని తెలియజేసాడు.

దేవుడంటున్నాడు యెషయా 14:18 నేను మిమల్ని ఆనాధులుగా విడిచిపెట్టను. నేను మీ యొద్దకు వత్తును. మన దేవుడు ఫలభరితముగా ఉన్న మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయనకు ఎప్పుడు అంటుకట్టుకొని జీవించు బిడ్డలుగా మారుస్తాడు.నేను ద్రాక్షావల్లిని మీరు నా కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను వాని యందు ఉందును అతడు అధికముగా ఫలించును యోహాను 15:5.

ఎరువు వేయటం :-    

యేసుప్రభువు తన జీవితం ద్వారా మనకు దృఢతవాన్ని కలుగచేస్తునాడు. ఇది ఎలాంటి ఎరువు అంటే ప్రార్ధన అనే ఎరువు, ఉపవాసం అనే ఎరువు, ధన రుణ అనే ఎరువు, క్షమాపణ అనే ఎరువు, వినయం అనే ఎరువు, విశ్వాసం అనే ఎరువు.

ఇలాంటి ఎరువుల ద్వారా దేవుడు మనలో హృదయ పరివర్తన కలిగించి మనలను ఫలవంతముగా చేస్తుంటాడు. ఇలా ఫలవంతంగా మారిన మనము ఇతరులకు ఆహారముగా మారుతుంటాము. దీని ద్వారా ఇతరులకు మంచికార్యాలు  చేస్తూ దేవునికి సాక్షులుగా జీవిస్తుంటాం. ముందు చూపినట్లుగా కపట ప్రవర్తనను మార్చుకొని జాగరూకులై ఉంటూ ఈలోక సంబంధమైన వ్యక్తులకు, వస్తువులకు భయపడకుండా ఎన్నో శ్రమలు అనుభవించినాకూడా సిద్ధపాటు జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవునికి బహిరంగ సాక్షులుగా జీవిద్దాం. ఆలా జీవించనిచో ఈ అంజూరపు చెట్టును ఏవిధంగానైతే ఫలించకపోతే కొట్టి పారవేస్తారో మన జీవితంకూడా అదేవిధంగా జరుగుతుంది.ఈ నాటి రెండొవ పఠనంలో కూడా పునీత పౌలుగారు అదే బోధిస్తున్నారు.

రెండవ పఠనము :-1 కొరింతు 10 : 1-6 , 10 - 12

మన పూర్వులు మేఘముక్రింద ఉండినపుడు వారు సముద్రమును దాటి సురక్షితముగా అవతలకి చేరారు కానీ  వారు ఎప్పుడైతే దేవునిమీద సణుగుకొని దేవునికి విరుద్ధముగా జీవించారో  విగ్రహములను ఆరాదించారో, వ్యభిచరించారో అప్పుడు 25 వేలు మంది మరణించారు. పాము కాటుతో ఎంతోమంది మరణించారు కాబట్టి ఈ చిట్టచివరి రోజులలో తపస్సు కాల రోజులలో ప్రార్ధన, ఉపవాసం, దాన ధర్మ క్రియలను పాటించు రోజులలో మనం దేవునితో, దేవుని సన్నిధిలో మనం మన నివాసాన్ని దేవునితో ఏర్పరుచుకొని, ఆయనకు వినయ, విధేయతను చూపిస్తూ జాగ్రత్తగా అయన యొక్క రక్షణ ప్రణాలికను మన సాక్షపు జీవితం ద్వారా తెలియజేయాలి అప్పుడే మన జీవితం ఫలవంతమవుతుంది.



బ్రదర్ . జోసెఫ్  మారియో ఓ.సి.డి.

12, మార్చి 2022, శనివారం

తపస్సు కాలం 2 వ ఆదివారం

తపస్సు కాలం 2 వ ఆదివారం

ఆది 15: 5-12, 17-18,  ఫిలిప్పి 3: 17,4: 1 , లూకా 9: 28-36.

-ఈ నాటి దివ్య పఠనాలు మన యొక్క రూపాంతరం గురించి భోదిస్తున్నాయి.
-మనం దేవునితో జీవించే సమయంలో మన యొక్క జీవితాలు కొంచెమైనా మారాలి. ఈ తపస్సు కాలం రెండవ వారంలో తల్లి శ్రీ సభ రూపాంతరం చెందమని కోరుతుంది.
-మన యొక్క ఉపవాస, ప్రార్థన, ధాన ధర్మాలు చేస్తూ మన జీవితాలు మార్చుకొంటూ దేవునికి దగ్గరై జీవించాలి.
-ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా తమ జీవితంలో మార్పును కోరుకుంటారు, కావాలనుకుంటారు.
-మనయొక్క జీవితాలు రూపాంతరం చెందాలంటే మనలో దైవాను గ్రహం ఉండాలి. దైవాను గ్రహం మనలోకి రావాలంటే మనం దేవుడ్ని విశ్వసించాలి. దేవుడ్ని వెంబడించి జీవించాలి. అదే విధంగా పవిత్రాత్మ దేవునికి మనం సహకరించుకొని జీవిస్తే మన జీవితాలు నిజంగా రూపాంతరం చెందుతాయి.

-ఈ నలభై రోజులు ధీక్షాకాలా సమయంలో మనం కూడా ఏదో ఒక విధంగా రూపాంతరం చెందాలి. బహుశా ప్రార్థించుటలోనో, విశ్వసించుటలోనో, చదువుటలోనో, బాధ్యత కలిగి జీవించుటలోనో ఏదో ఒక విధంగా మనం మారాలి.
-గొంగళి పురుగు గూడులో ఉండి కొన్నిరోజుల తరువాత సీతాకోక చిలుక అయినా విధంగా విశ్వాసులుకూడా రూపాంతరం చెందితే దేవుడు ఆనందిస్తారు.

ఈ నాటి మొదటి పఠనంలో దేవుడు అబ్రామును, అబ్రహాముగా మార్చుటను అదేవిధంగా అబ్రహాముతో చేసుకొన్న మొదటి ఒడంబడికను గురించి భోదిస్తుంది.
-దేవుడు ఎప్పుడు కూడా ప్రజలకు చేరువలోనే ఉంటారు. మానవుడు దేవుడ్ని విస్మరించి తప్పు చేసినప్పటికీ మళ్లీ మానవులతో సంబంధం కలిగి ఉండుటకు వారితో ఒడంబడికను చేసుకొంటున్నారు.

-అబ్రహాము కు దేవుడు ప్రత్యక్షమై తనకు సంతానం కలుగుతుందని చెప్పుచున్నారు.
-అబ్రహామునకు వయస్సు మల్లినది ముసలి ప్రాయంలో వున్నారు. అతని భార్య కూడా గొడ్రాలుగ ఉన్నారు. ఎన్నో సంవత్సరములు సంతానం కోసం ఎదురు చూశారు. కానీ ఫలితం దక్కలేదు.
-యావే దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చి నీకు ఆకాశమునందలి నక్షత్రములవలె, సముద్ర తీరమునందలి ఇసుకరేణువులవలె సంతానం కలిగి వృద్ధి చెందుతావు అని వాగ్దానం చేస్తున్నారు.
-ఆయన యొక్క జీవితాన్ని వృద్ధి చెందిస్తానని, వారికి కానాను దేశమును ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు.

-అబ్రహాము వాస్తవానికి అన్యుడు అయినప్పటికీ యావే దేవుని యొక్క మాటలు విశ్వసించారు. ఎటువంటి అనుభవం లేనప్పటికిని, అసంభవంగా ఉన్నప్పటికినీ అబ్రహాము  దేవుడ్ని నమ్ముచున్నారు.  
-అబ్రహాము దేవుని యొక్క మాటలను పూర్తిగా విశ్వసించారు అందుకే ఆయనను విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాం. ఆయన విశ్వాసమును బట్టియే నీటి మంతుడుగా పరిగణించ బడుతున్నారు .
-దేవుడు అబ్రహం తో చేసుకొన్న ఒడంబడిక బలమైనది అని తెలుపుటకు కొన్ని జంతువులను నడిమికి కోస్తున్నారు, వాటిని ప్రక్క ప్రక్కన పెడుతున్నారు. 

-ఆ కాలపు నియమాల ప్రకారం ఒప్పందం చేసుకొనేవారు నరకబడిన జంతువులమధ్య నడుస్తారు. అలా ఎందుకు చేసేవారంటే ఒక వేళా ఎవరైనా ఒప్పందం కు అవిధేయులై, మరిచి పోయి జీవిస్తే వారికి కూడా అలంటి దుస్థితి వస్తుందని వారియొక్క ఆచార నమ్మకం.
-ఇదే సాంగ్యం యొక్క విధానం యిర్మీయా 34: 18 - 19 లో కూడ చదువుతున్నాం.
-దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, ఒడంబడికను బలపరచడానికి ఆ మామాసపు ఖండలు నిప్పుతో కదిల్చారు. ఆ యొక్క నిప్పు దేవుని యొక్క సాన్నిధ్యంకు గుర్తు.
-ఈ మొదటి పఠనంద్వారా అబ్రహాం దేవుడి మీద ఉన్న గొప్ప నమ్మకమును వెల్లడిచేస్తున్నారు. ఆది 15 : 6 .

-ఈ యొక్క ఒడంబడిక ద్వారా దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చుతున్నారు.  పేరు మార్చుట ద్వారా అబ్రహాము దేవునితో ఒక క్రొత్త జీవితమును ప్రారంభిస్తున్నారు.
-అబ్రహాము దేవునియొక్క సాన్నిధ్యమును కనులార అగ్నిరూపంలో చూడగలుగుతున్నాడు. దేవుని యొక్క అనుభూతిని తన జీవితంలో పొందుకుంటున్నారు.

- మన యొక్క విశ్వాస జీవితంలో కూడ మనం దేవుడ్ని విశ్వసించాలి అబ్రహాము వలె దేవునితో క్రొత్త జీవితం ప్రారంభించాలి, దేవునితో చేసుకొన్న ఒడంబడిక ప్రకారం జీవించాలి.
-అబ్రహాము కూడ దేవుని యొక్క కార్యం ఎలాగ జరుగునని ఒక వివరణ అడుగుచున్నారు. అబ్రహాము వలె మరియ తల్లి కూడ దేవుని యొక్క జన్మం గురించి ఎట్లా జరుగును అని అడిగారు. వీరిద్దరియొక్క ఆలోచనలకు తగిన విధంగా దేవుడు వారికి అంతా విశిదీకరిస్తున్నారు. ఇద్దరుకూడా దేవుడ్ని సంపూర్ణంగా నమ్మినవారే.

-ఈనాటి రెండవ పఠనంలో పునీత పౌలు గారు మనందరం పరలోక పౌరులమని గుర్తు చేస్తున్నారు. 
-భూలోక సంభందమైన విషయాల గురించి కాకుండా పరలోక సంభందమైన విషయాలు ఆలోచిస్తూ వాటి ప్రకారం జీవిస్తే మర్త్య శరీరములైన మన శరీరములను దేవుడు దివ్య శరీరం లుగా మార్చుతానని పౌలు గారు బోధిస్తున్నారు.
-మన యొక్క మర్త్య శరీరంలు వాటంతట అవే దివ్య శరీరములుగా మారవు పవిత్రాత్మ శక్తితోనే అది సాధ్యమవుతుంది.
-మన యొక్క శరీరాలు దివ్య శరీరాలుగా మార్చ బడాలంటే మనం శరీరం కు తగిన విధంగా కాకుండా ఆత్మకు తగిన విధంగా నడుచుకోవాలి. శారీరక వాంఛలకు దాసులు కాకూడదు అందుకు మనం పవిత్రాత్మ సహవాసం లో జీవించాలి. 

-జ్ఞానస్నానం ద్వారా మనం పవిత్రతను పొందాము ఇంకా పరిపూర్ణం గా పవిత్రులు కావాలంటే అనుదినం ప్రయత్నిఇంచాలి.
-పౌలు గారు అనేక మార్లు విశ్వాసులకు తెలియ చేస్తున్నారు. శరీరాను సారంగా కాకుండా ఆత్మను సారంగా జీవించమని .రోమి 8 : 5 -13 , గలతి 5 : 16 .

మన యొక్క జీవితంలో ఆత్మను సారంగా జీవిస్తే దేవున్ని సంతృప్తి పరచవచ్చు. పరలోక పౌరులు పరలోక ఆలోచనలు కలిగి జీవించాలి.
-మనం పరలోక పౌరులం అని మరిచి పోతున్నాం. ఈ లోకంలో ఉన్నప్పటికీ మనం దేవుని యొక్క వాకు అనుసారంగా జీవించటానికి ప్రయత్నఇంచాలి. 
-ఇహలోక దేహ వాంఛలకు లోనైనా వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు.
-ఆదాము అవ్వ తమ యొక్క దేహ వాంఛలను తృప్తి పరుచుకొన్నారు (తినవద్దన్న పండు తిన్నారు). పరలోకం గురించి మరిచి పోయారు. దేవుడిని సంతృప్తి పరచలేదు.
-లోభియెక్క ఉపమానంలో లూకా 12 :13 -21. ఈలోకమే శాశ్వతం అని భావించి తన ఆత్మతో తాను మాట్లాడుతూ తినుము త్రాగుము అని చెప్పుకొంటున్నారు. ఈ లోకం కన్నా పరలోకం విలువైనది అని మరిచిపోతున్నాడు. 
 
-మనం కూడ ఈ లోకంలో పేరు ప్రతిష్ఠలకోసం, ఆస్తిపాస్తుల కోసం కొట్టు మిట్టాడుతున్నాం, కానీ పరలోక పౌరులం కాబట్టి పరలోకంలో ప్రవేశించాలంటే పుణ్య కార్యాలు చేయాలనే అంశం మరిచిపోతున్నాం.

-దేవుని బిడ్డలుగా పవిత్రులుగా, పరలోకం పౌరులుగా మారాలంటే యేసు ప్రభువు చూపిన ఆ నీతి మార్గంలో మనందరం నడవాలి.
-మానవ శక్తితో ప్రయత్నిస్తే మనం చాల సార్లు శరీరమునే సంతృప్తి పరుస్తాం. కాబట్టి దేవుని యొక్క శక్తితో నడిచి పరలోకానికి వెళదాం.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువుయొక్క రూపాంతరం చెందుటను మనం చదువుకున్నాం. 
-యేసుప్రభువు యొక్క దివ్య రూప ధారణ వలన తండ్రి దేవుడు యేసుప్రభువు తన యొక్క ప్రియమైన కుమారుడని తెలుపుచున్నారు. ఆయన యొక్క దైవత్వం ప్రకటిస్తున్నారు.
-దివ్య బలిపూజలో గోధుమ అప్పం, ద్రాక్షా రసము యేసుప్రభువు యొక్క శరీర రక్తలుగా రూపాంతరం చెందుతున్నాయి.

-జ్ఞానస్నాన దివ్య సంస్కారం మనల్ని దేవునియొక్క పుత్రులుగా రూపాంతరం చెందిస్తుంది.
-పాప సంకీర్తనం ద్వారా పాపి పవిత్రుడయ్యెలా చేస్తుంది, వ్యక్తి మార్పు చెందుతున్నారు. వారి జీవితం మరి గొప్పవారిగా చేయబడుతున్నారు.
-దేవుడిని కలుసుకున్న సమయాలలో ప్రతి ఒక్కరి జీవితం రూపాంతరం చెందుతుంది.

మోషే జీవితం రూపాంతరం చెందుతుంది.
సౌలు జీవితం
పేతురు యొక్క జీవితం
మగ్దలా మరియమ్మ జీవితం.
-ఇంకా చాలామంది యొక్క జీవితాలు మారుతున్నాయి.

-మన జీవితంలో కూడ యేసు ప్రభువు వలె పర్వత అనుభూతి కావాలి.
-తూర్పు దేశంలో ఆధ్యాత్మికత లో ఒక ప్రత్యేక స్థానం ఉంది.
-దేవునితో గడపటానికి, దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించటానికి అదేవిధంగా దేవునితో ఆత్మీయ అనుభూతిని పొందడానికి ఎత్తైన పర్వతాలు సరైన ప్రాంతం అని కొందరి యొక్క విశ్వాసం, నమ్మిక అందుకే పర్వతాల మీదకు వెళుతుంటారు. 
-దేవుడు ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడని కొందరి యొక్క నమ్మకం. కొన్ని శతాబ్దాలుగా ఈ నమ్మకం కొనసాగుతూనే ఉంది చాల మంది విశ్వాసులు దీనిని అనుసరిస్తున్నారు. కొండను ఎక్కి వెళ్ళటం ద్వారా దేవునికి మరింత దగ్గర అవుతామని కూడ కొంతమంది భావించేవారు. 
-పర్వతం పైన వున్న చల్లని వాతావరణం, గాలి, ప్రశాంతత కూడ దేవుడిని కలుసుకొనుటకు ఉపయోగపడును.

-పవిత్ర గ్రంధంలో కొన్ని సంఘటనలున్నాయి. దేవుడు మనుషులను కొన్న సమ్యలు.
మోరియా పర్వతం వద్ద అబ్రహాము దేవుడిని కలుసుకున్నారు.(ఆది 22 :11 -12 ).
సీనాయి పర్వతం పైన మోషే దేవుడిని కలుసుకున్నారు (నిర్గమ 24 :12 -18).
కార్మెల్ కొండమీద ఏలీయా దేవుడిని కలుసుకున్నారు (1 రాజులు 18: 31 -41).
తాబోరు కొండమీద శిష్యులు దేవుడిని కలుసుకున్నారు.
కల్వరి కొండమీద యేసు ప్రభువు నిజమైన దేవుడని సైనికుడు గ్రహిస్తూ ఆయన్ను కలుసుకున్నారు. 
-యేసు ప్రభువు యొక్క మరణం తరువాత కూడ శిష్యులు పర్వతం వద్దకు వెళ్లారు అని కొందరి నమ్మకం. 

మనం చుసిన అన్ని ఉదాహరణాలలో అందరూ పర్వతం ఎక్కిన తరువాతనే దేవుడు వారిని కలుసుకుంటున్నారు. 
-మనయొక్క విశ్వాస జీవితంలో కూడ 
పవిత్రత అనే పర్వతం ఎక్కాలి.
మంచితనం అనే పర్వతం ఎక్కాలి.
స్వార్థం విడిచి ముందుకు సాగాలి.
ప్రేమని అలవర్చుకుని పర్వతం ఎక్కాలి. 
శోధనలు అనే పర్వతం ఎక్కాలి. 
శ్రమలు అనే పర్వతం ఎక్కాలి.

-ఎప్పుడైతే మనం ఇహలోక కోరికలు, శోధనలు అధిగమించి మంచిగా ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క మాట ప్రకారం ఆయనకు విధేయత చూపుతూ ఆయనయొక్క ఆజ్ఞలు పాటిస్తామో అప్పుడు మనకు దేవుని దర్శనం, అనుభూతి కలుగుతుంది. ప్రయత్నం చేసినవారందరు పర్వతం ఎక్కలేరు కేవలం కష్టపడి, అన్ని ఇబ్బందులను అలసటలను ఎదుర్కొని వెళ్లే వారే  ఎక్కగలరు. 
-పర్వతం ఎక్కే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, కష్టపడాలి, అలిసిపోతాం, అయినా సరే ముందుకు వెళితే దైవ అనుభూతి కలుగుతుంది. మనయొక్క విశ్వాస జీవితంలో కూడ దైవ అనుభూతి కావాలంటే ఆధ్యాత్మికంగా మనం కష్టపడాలి. ఈలోక ఆశలు విడిచి పెట్టడానికి కష్టపడాలి, శోధనలలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి . అప్పుడే మనం దేవుడిని కలుసుకొనగలం.

-యేసు ప్రభువు తాబోరు పర్వతం ఎక్కినది తండ్రిని కలుసుకొనుటకు తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుటకు కావల్సిన శక్తిని, ధైర్యం ను పొందుటకు అలాగే తండ్రి యొక్క సమ్మతి తీసుకొనుటకు ఆయన పర్వతం మీదకు వెళ్లుచున్నారు.

-వ్యక్తిగతంగా తనను తాను సిద్ధం చేసుకొనుటకు, ప్రార్థించుటకు ప్రభువు పర్వతం మీదకు వెళ్లారు.
-తపస్సుకాల మొదటి ఆదివారంలో యేసుప్రభువు మానవ స్వభావంలో ఎదుర్కొన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రెండవ వారంలో యేసుప్రభువు యొక్క దైవత్వంను ధ్యానించుకోవాలి.  ఆయన నిజముగా దేవుని కుమారుడని తెలుసుకోవాలి.

-ప్రభువు శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నారా. ఆయనయే వారు ఊహించే మెస్సయ్య అని ఎరుక పరుచుచున్నారు. యేసు ప్రభువు పేతురు, యోహాను, యాకోబులను ఎందుకు పర్వతంకు తీసుకొని వెళుతున్నారంటే ఇద్దరు లేక ముగ్గురు చెప్పే సాక్ష్యం నిజమవుతుందని. (ద్వితీ 19 : 15 ) అంటే ఒక విషయాన్ని నిరూపించాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షులవసరం . అందుకే ప్రభువు ముగ్గురిని తీసుకొని వెళుతున్నారు. ఆయన యొక్క దివ్య రూప ధారణకు వారే సాక్ష్యులు.

-యేసు ప్రభువు ప్రార్థించే సమయంలో రూపాంతరం చెందుతున్నారు. మనయొక్క జీవితాలు కూడ ప్రార్థనలో రూపాంతరం చెందాలి.
-ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆనాటి యూదులు యొక్క నమ్మకం అలాగే పౌలు గారి యొక్క భోదన ఏమిటంటే నీతిమంతులు యొక్క శరీరాలు దివ్య శరీరములుగా మారె అవకాశం ఉందని తెలుపుచున్నారు. (1 కొరింతి 15 :49 , 2 కొరింతి 5 : 1 -10 ).

-నీతిమంతులు దేవుని యొక్క మహిమను పంచుకొంటారు. మోషే 40 రోజులు దేవునితో గడిపిన తరువాత ఆయన మహిమను పంచుకొంటున్నారు. (నిర్గమ 34 )
-మనం కూడ నీతిమంతులుగా జీవించాలి, అదియే దేవుడు మన నుండి కోరుకుంటారు.
-యేసుప్రభువు వస్త్రాలు తెల్లగా వున్నాయి. అవి ఆయన యొక్క పవిత్రతకు గుర్తు కాబట్టి.
-మోషే, ఏలీయాలకు కూడ పర్వతం మీద దేవుని యొక్క అనుభూతి కలిగినది అందుకే వారిద్దరూ అక్కడ దర్శనంలో కనిపించారు. 

-మండుచున్న పొదలో దేవుడు మోషేకు దర్శనం ఇచ్చారు, నిర్గమ 3: 1 -4.
-సీనాయి పర్వతం మీద దేవునితో గడిపారు. దేవునితో ఉన్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది.(నిర్గమ 24 :1 , 34 : 29 ).
-ఏలీయా హోరేబు కొండవద్ద కలుసుకున్నారు (1 రాజు 19: 9 -18).
-మోషే అలాగే ఏలీయాలు ఇద్దరు గొప్ప ప్రవక్తలు ఎందుకంటే మోషే దేవుని వల్ల వారికి ధర్మ శాస్త్రమును ఇచ్చారు. ఏలీయా ప్రవక్తలందరికి నాయకుడు వంటివారు అందుకే యేసు ప్రభువు యొక్క సిలువ శ్రమలు పొందటానికి సరైన సమయం అని తెలియచేయుటకు ఇద్దరు కనబడుచున్నారు.

-ఈ దర్శనంలో తండ్రి దేవుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు ఇతడిని ఆలకించండి అని పలుకుచున్నారు.
-ఆయన స్వరమును ఆలకించి జీవిస్తే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఆయన మాటలు వినక పొతే మన జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు.
-పవిత్ర గ్రంధంలో కొంతమంది దేవుని స్వరం విన్నారు. కొందరు వినలేదు, వారికి చివరి ఫలితం ఎలావుంటుందో కూడ మనకు తెలుసు కాబట్టి ఆయన మాటలు వినాలి.

-మనయొక్క జీవితంలో మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం దినమూ రూపాంతరం చెందాలి. ఈ తపస్సు కాలంలో మన జీవితాలు దేవునికి ఇష్టమైన విధంగా మారాలి. 
మనం మన యొక్క పాపపు జీవితం నుండి రూపాంతరం చెందాలి 
స్వార్థంనుండి, నిస్వార్థిగా రూపాంతరం చెందాలి.
లోక వ్యామోహాలనుండి దేవుని వైపుకు రూపాంతరం చెందాలి. 
అధికార వాంఛలనుండి, సేవా భావమునకు రూపాంతరం చెందాలి.
అసూయా, ద్వేషం నుండి ప్రేమించుటకు రూపాంతరం చెందాలి.
ప్రార్థించుటలో, ప్రేమించుటలో రూపాంతరం చెందాలి.
-దేవుని యొక్క అనుగ్రహం తో రూపాంతరం చెంది దేవునికి మనయొక్క తల్లిదండ్రులకు సంతోషమును ఇద్దాం.

REV. FR. BALA YESU OCD

తపస్సు కాల రెండవ ఆదివారము

తపస్సు కాల రెండవ ఆదివారము

ఆది 15 : 5 -12 , 17 -18, ఫిలిపీ త్రీ:17 - 4 :1,  లూకా 9 :28 -36.

క్రీస్తునాదునియందు ప్రియ దేవుని బిడ్డలారా  ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి అని తెలియచేస్తున్నాయి. తల్లి  శ్రీ సభ మనలనందరిని కూడా ప్రార్థన శక్తి ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించాలని   ఆహ్వానిస్తున్నాయి.

మొదటి పఠనంలో  విశ్వాసమున   తండ్రి  అయిన అబ్రాహామును రెండు విషయాలలో తన మాట మీద గురి ఉంచమని దేవుడు కోరుతున్నాడు.1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు 2) అబ్రాహాము సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని దేవుడు అబ్రాహామును వాగ్దానం చేస్తున్నాడు 

1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు:  దీనికి అబ్రాహాము, ప్రభు నువ్వు నాకు ఏమి ఈయగలవు నేను బిడ్డలు లేని వాడిని, నీవు నాకు సంతానం కలిగించలేదు అంటున్నాడు.ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహాము తనను తాను అనుమానించుకుంటున్నాడు, నేను ముసలివాడను నాకు సంతాన ప్రాప్తి లేదు అని అపనమ్మకం అబ్రాహాము వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహామును దేవుడు కల్దియా దేశం నుండి పిలిచి తనను ఒక గొప్ప మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నిన్ను దీవించేవారిని దివిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను,  నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దివిస్తాను అని వాగ్దానం చేసిన మాటలను మరచిపోయి కూడా అబ్రహాము దేవుని మీద  ఈ విధంగా పలికియున్నాడు.

 అప్పుడు దేవుడు అబ్రాహాముతో నీకు పుట్టినవాడే నీకు వారసుడవుతాడు అతడి సంతానం నక్షత్రములవలె అవుతుందని చెప్పినపుడు అబ్రాహాము నమ్మాడు, ఆయన  నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా చేసాడు. 

2) దేవుడు అతని సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని వాగ్దానం చేయుట:

       దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం, అబ్రాహాము దేవుడు తన యొక్క సంతతికి ఇస్తానన్న భూమిని తండ్రి దేవుడు మాట తప్పకుండా ఇస్తాను అని మాటిచ్చి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత, అబ్రాహాము దేవుని యెక్క మాటను విశ్వసముతో నమ్మాడు. విశ్వస ఒప్పందాన్ని 15వ అద్యాయములో చూస్తున్నాము.  దేవునిపై నమ్మకము ఉంచితే మనకు కావలిసినదంత దేవుడు మనకు ఇస్తాడని, మొదటి పఠనము మనకు తెలియజేస్తుంది.


3) సువిశేష పఠనము

   ఈ యొక్క పఠనంలో   క్రీస్తు యొక్క దివ్యరూపం దాల్చడం, క్రీస్తు యొక్క వస్త్రములు తెల్లగా ప్రకాశించడం మరియు ఆయనతో పాటు మరో ఇద్దరు దివ్య వ్యక్తులు మోషే మరియు ఏలీయా కనబడ్డారు అన్న విషయాన్ని  తెలియపరచటం మనము చూస్తున్నాము. ఈ యొక్క  ముగ్గురు వ్యక్తులుకూడా

1) మోషే: మంచి నాయకుడు పుణ్యాత్ముడు, దేవుని యొక్క ముఖాన్ని ముఖ్య ముఖీగా చూసినవాడు, అంతే కాకుండా దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి వాగ్దాన భూమివైపు నడిపించటం కూడా చూస్తున్నాము.

2) ఏలీయా: ఏలీయా అంటేనే ఒక గొప్ప మహాశక్తి పేరు పొందిన వాడు, దేవునితో  సంబాషించిన వ్యక్తి, ఏలీయా, బాలు ప్రవక్తలను మట్టు పెట్టి దేవుని యొక్క   కీర్తిని అందరికి పరిచయం చేసినవాడు. ఈయన అనేక అద్భుత కార్యములను, మనము రాజుల రెండవ గ్రంధములో చూస్తున్నాము. ఈయన  మరణించకుండానే పరలోకమునకు కొనిపోబడినట్లు మనం రాజుల రెండవ గ్రంధంలో చూస్తున్నాము.

దేవుని ధర్మ శాస్త్ర  చట్టాల ప్రతినిధిగా మోషేను, ప్రవచనాల ప్రతినిధిగా ఏలీయాను  ఉన్న వారి ముందు  క్రీస్తు దివ్యరూపం ధరిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా క్రీస్తు పొందబోయేటటువంటి  శ్రమలను , కష్టాలను మరియు బాధలను సిలువ మరణము గురించి క్రీస్తుతో సంభాషించటం చూస్తున్నాము.

 వీటినన్నిటిని గ్రహించినటువంటి పేతురు క్రీస్తు దగ్గరకు వచ్చి మనము ఇక్కడ ఉండుట సమంజసము  అందుకని మీకు, మోషే మరియు ఏలీయాకు గుడారములను నిర్మిస్తాం అని పేతురు క్రీస్తు ప్రభువుతో పలుకుచున్నాడు. ఇది ఇలా ఉండగా ఆకాశము నుండి తండ్రి దేవుడు ఈయన నా కుమారుడు ఈయనను చూచి  నేను ఆనందించుచున్నాను,  ఈయనను ఆలకించండి అని దేవుడు మనల్ని ఆదేశిస్తునాడు, అంటే క్రీస్తు చెప్పిన ప్రతిమాటను కూడా పాటిస్తూ, అనుసరిస్తూ, జీవించాలని తండ్రి దేవుడు మననందరికి తెలియజేస్తున్నాడు.

కాబట్టి ప్రియాయమైన క్రైస్తవ విశ్వాసులారా ఈ నాటి పఠనాలు అన్ని కూడా మానవులమైన మనం, ఎటువంటి స్థితిలో ఉన్నాకూడా క్రీస్తు యొక్క మార్గములో పయనిస్తూ, క్రీస్తుయొక్క అనుచరులుగా జీవించాలని మరియు దేవుడు  మనందరిని కూడా అయొక్క బాటలో నడపాలని , ఆశీర్వదించాలని ఈ నాటి దివ్యబలి పూజలో పాల్గొందము.

Br.Simon


4, మార్చి 2022, శుక్రవారం

తపస్సుకాలం మొదటి ఆదివారం (2)

 తపస్సుకాలం మొదటి ఆదివారం

ద్వితీ 26:4-10, రోమి 10:8-13, లూకా 4:1-13 

ఈనాటి దివ్య పఠనాలు  విశ్వాస  జీవితంలో ఎదురయ్యే శోధనలు  గురించి  భోధిస్తున్నాయి. ఈనాటి  తపస్సు కాల మొదటి వారంలోనే శోధనలు గురించి మాట్లాడుటకు గల కారణమేమంటే  శోధనలు  అందరి జీవితంలో  సర్వ సాధారణం. కేవలం  యేసు  ప్రభువు  యొక్క  జీవితంలో మాత్రమే కాదు, శోధనలు వచ్చింది. 

సృష్టి ప్రారంభం నుండి దేవునితో కలిసి,  దేవుని కొరకు జీవించే దేవుని  ప్రజలకు శోధనలు ఎదురయ్యాయి. శోధనలు  ఏదురైనప్పుడు  సాతాను బంధాలకు  లొంగకుండా  దైవ శక్తితో, ప్రార్ధనాయుదంతో శోధనలు జయించాలని నేడు ప్రభువు  మనకు  తెలియజేస్తున్నారు. 

ఈ 40  రోజులు  పాటు ఎంతో మంది  ఉపవాస, ప్రార్ధన  ధాన ధర్మల ద్వారా పుణ్యకార్యాలు చేస్తుంటారు. ఆయితే  ఇలాంటి మంచి  కార్యాలు చేసేటప్పుడు మనలో ఎదురయ్యే  శోధనలకు పడిపోకుండా  జీవించాలన్నదే దేవుడు మనకు నేర్పించేది. 

శోధనలు జయించినప్పుడే మనం యొక్క నిజమైన విశ్వాసం, అనుసరణ ఎలాంటిది అని తెలుస్తుంది. పేతురు గారు తాను వ్రాసిన మొదటి లేఖ 1:7 వచనంలో  బంగారం కన్నా విలువైన మీ విశ్వాసం  పరీక్షించబడాలి అని తెలుపుచున్నారు. 

సైతానుడే మన జీవితంలో శోధనలు పెడతాడు యాకోబు 1:13. మన యొక్క విశ్వాస జీవితంలో సైతానుతో పోరాడాలి మనం చేసే ఉపవాసం, ప్రార్ధన ధాన ధర్మాల ద్వారా  సైతాను శక్తిపై విజయం సాధించాలి. 

ఈ నలభై  రోజుల తపస్సు కాల యాత్ర మనందరిలో దైవ శక్తిని నిపుతుంది. ఏ విధంగానైతే  యేసు ప్రభువు సైతాను శక్తిని జయించారో అలాగే 40 రోజులు జీవితం ద్వారా  మన యొక్క బలహీనతలను మనం అధిగమించాలి, వ్యాసనాలను విడిచిపెట్టాలి, పుణ్య మార్గంను అనుసరించాలి. 

సైతాను యొక్క శోధనలు  జయించడానికి  మనందరికీ ప్రార్ధన శక్తి అవసరం. శోధన  జయింప అను క్షణం ప్రార్ధించమని ప్రభువు పలికారు. మత్తయి 26:41. 

ప్రార్ధన వలన మనం దేవునితో ఐక్యమై ఆయన యొక్క సహకారం పొందగలం, ఉపవాసం ద్వారా శారీరక వాంఛలను, ఐహికాకర్షణలను మనం అదుపులో వుంచుకోగలం అదే విధంగా  త్యాగ జీవితం ద్వారా మన యొక్క స్వార్ధాన్ని త్యజించి తోటి సోదరులకు  సహాయ పడగలం. 

ఈనాటి  మొదటి  పఠనంలో  దేవుడు చేసిన మేలులకు ప్రతీ ఫలంగా మొదటి ఫలములను దేవునికి సమర్పించే  అంశం గురించి భోధిస్తుంది. 

తమ యొక్క  పంటలో  మొదటి ఫలములు దేవునికి సమార్పించే ముందు దేవునిపట్ల  తమకున్న విశ్వాసాన్ని భక్తి, శ్రద్దలతో ప్రకటించాలని మోషే ప్రవక్త  యిస్రాయేలియులకు  తెలుపుచున్నారు. మోషే ప్రవక్త దేవుని యొక్క గొప్పతనం గురించి అలాగే ఏ విధంగా  దేవుడు యిస్రాయేలుణు ప్రేమించి  బయటకు తీసుకొని వచ్చారు అనే అంశం గురించి తెలుపుచున్నారు. ప్రభువైన దేవుడు వారి కోసం  చేసిన మహాత్కార్యాలు  అని  వివరిస్తున్నారు. 

ఆరాము దేశంలో  లాబాను వద్ద అనేక సంవత్సరాలు సేవలు చేయడం వలన యాకోబుకు  ఆరామియుడు అనే పేరు వచ్చింది. యాకోబు యొక్క  వంశము ఎలాగ వృద్ది చెందినది అని మరొకసారి వివరిస్తున్నారు ప్రవక్త. 

యిస్రాయేలుప్రజలు బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టిన్నప్పుడు దేవుడువారిని కాపాడారు. వారిని తన యొక్క ప్రజలుగా  స్వీకరించి వారిని నడిపించారు. ఎడారిలో 40 సంవత్సరాల  ప్రయాణంలో  తోడుగా నీడగా ఉండి పాలు తేనెలు జాలు వారు నేలను బాహుమానంగా ఇచ్చారు. అన్నీ చేసిన దేవునికి ప్రధమ ఫలములు సమర్పించు అని మోషే అంటున్నారు. 

దేవునికి సమర్పించే  ఆ ప్రధమ ఫలములు వారిపట్ల  దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత వెల్లడి చేయుటయే. దేవుడు కేవలం  వారిని బానిసత్వం  నుండి బయటకు తీసుకొని రావడమే కాదు చేసింది, వారి యొక్క విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధనలలో వారిని బలపరిచారు దేవుడు. ఇంకా ఎన్నో  గొప్ప గొప్ప  కార్యాలు  వారికి చేశారు. అందుకే ప్రధమ పంటను సమర్పించాలి. 

మొదటి ఫలమును బలి పీఠము ముందుంచిన సమయంలో యావే దేవుడు చేసిన గోప్ప కార్యాలు అన్నీ ఉచ్ఛరించాలి. ఆ మహత్తర కార్యలేమిటంటే  యిస్రాయేలును దేవుని బిడ్డలుగా ఒక ప్రజగా చేసిన మహత్తర కార్యాలు. 

1. మెసపటోమియా నుండి కానాను దేశంకు అలాగే ఐగుప్తుకు  ప్రయాణం. అబ్రహాము నుండి యిస్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమి చేరుకొను సమయం వరకు. 

2. ఐగుప్తు నుండి యిస్రాయేలు  స్వేచ్ఛ స్వతంత్రులను చేసిన కార్యం, బానిసత్వం నుండి బయటకు తెచ్చిన కార్యము. 

3. యిస్రాయేలుతో సినాయి వద్ద చేసుకున్న  ఓడంబడిక 

4. దేవుని యొక్క వాగ్దాన భూమినిచ్చుట - పాలు తేనెలు జాలు వారు దేశం 

5. దేవుడు వారి పట్ల దయ చూపుతూ  తోడుగా ఉండే కార్యం 

6. దేవున్ని తండ్రిగా కలిగిన గొప్ప అద్భుతం. యిస్రాయేలుకు దేవుడు మంచి దేశంను  కానుకగా ఇచ్చినందుకు  దేవుని ఓడంబడికకు  బద్దులై  వారు ప్రతి సంవత్సరం దేవునికి కృతజ్ఞతలను  ప్రధమ ఫలములు  సమర్పించుట  ద్వారా  తెలిపేవారు. వాస్తవానికి యిస్రాయేలు  ప్రజలు ఈ విధంగా  సమర్పించుట  ద్వారా వారు దేవున్ని  జ్ఞాపక పరుచుకొంటున్నారు.  అలాగే దేవుడు ఎలాగ వారిని అభివృద్ది  పరిచారో  అవన్నీ  గుర్తుకు  తెచ్చుకుంటున్నారు. దేవుడు సమృద్దిగా  ఇచ్చిన విధానం  గుర్తుకు  తెచ్చుకుంటున్నారు. 

 ఈ తపస్సు  కాలంలో  అడుగు పెట్టిన మనము కూడా యిస్రాయేలు  ప్రజల జీవితం నుండి నేర్చుకోవాలి. 

1. మనం కూడా అంధకారం నుండి  వెలుగులోనికి ప్రయాణం చేయాలి. బానిసత్వం నుండి స్వేచ్ఛ లోనికి వెళ్ళాలి. పాపం నుండి పుణ్య మార్గం అనుసరించాలి. 

2. దేవునితో కలిసి జీవిస్తామని, దేవునికొరకు అన్నీ సమర్పించి  జీవిస్తామని నిర్ణయం తీసుకోవాలి. దేవునితో ఓడంబడిక  చేసుకోవాలి. 

3. దేవుడిచ్చిన దివ్య సత్ప్రసాదంను  స్వీకరిస్తూ  దేవున్ని కలిగి జీవించాలి. 

4. దేవుడు మన కోసం సిద్దం చేసిన  పరలోక రాజ్యంకు  అర్హత  కలిగి జీవించాలి. 

5. దేవుడు చేసిన మేలులకు  ఎల్లప్పుడు  కృతజ్ఞులై  జీవించాలి.  చాలా  సందర్భాలలో మనం దేవునికి ఆయన చేసిన మేలులకు ప్రధమ ఫలాలను సమర్పించం. దేవునికి ఇవ్వాలనుకునే సమయంలోమనకు శోధనలు  వస్తాయి. ఇంత ఖరీదైనది, మెలిమయినది దేవునికి ఇవ్వలా , వద్దా అనే సందేహాలు, శోధనలు  వస్తాయి వాటిలో మనం మునిగిపోతాం. 

దేవునికి ఇవ్వాల్సిన  సమయంలో  ఇచ్చుటకు  మనం సిద్ధంగా ఉండాలి. చాల మందిలో  మనం ఇచ్చేది  దేవునికే గా  ఏది ఇస్తే  ఏముందిలే అని  ఆలోచిస్తారు. 

1. మనం ప్రధమ సమయం దేవునికి ఇవ్వాలి - ఎందుకంటె  దేవుడే  మనకు  మరొక  రోజును సమర్పించారు కాబట్టి ప్రధమ సమయం అంటే  ఉదయం లేచిన సమయం. 

ప్రధమ ఫలములు - కూరగాయలు , కాయ పండ్లు అధే విధంగా  ఏదైతే  ప్రధామముగా వస్తుందో దానిని ప్రభువునకు  సమర్పించాలి. సమార్పించేముందు దేవుడు చేసిన గొప్ప కార్యాలు గుర్తుకు తెచ్చుకోవాలి. 

రెండవ పఠనంలో  పునీత పౌలు గారు యూద మాతము క్రైస్తవులుగా మారిన వారికి ఒక విధమైన భోధన  చేస్తున్నారు. మళ్ళీ విశ్వాస జీవితంలో యూద మతంలోనికి వెళ్లాలనే శోధన నుండి బయటకు రావాలని పౌలుగారు వారికి భోధన  చేస్తున్నారు. మోషే ప్రవక్త ఇచ్చిన శాసనములకు బద్దులై  జీవించాలనే శోధన నుండి బయటకు రావాలని పౌలు గారు తెలియ జేస్తున్నారు. 

యేసు క్రీస్తు ప్రభువు  అని ఒప్పు కుంటే ఆయన మృతులలో నుండి లేచాడని విశ్వసిస్తే  నీవు రక్షించ బడుదువు అని అన్నారు. 

పాలు గారు మనంతట మనం నీతిమంతులం కాలేము కానీ హృదయములో దేవుని విశ్వసించి జీవిస్తే ఆయన యొక్క  కృప ఫలితమున నీతిమంతులము అవుతాము అని తెలుపుచున్నారు. 

యేసు క్రీస్తు నందున్న విశ్వాసంను  మాటల ద్వారా  క్రియాల ద్వారా  మరియు  మన యొక్క జీవితం ద్వారా  వెల్లడించాలి. ఆయనను విశ్వసించే వారు సిగ్గుపడనవసరం లేదు ఎందుకంటే ఆయనయె లోక రక్షకుడు కాబట్టి  ఆయన దేవుడు కాబట్టి ఎవరు కూడా  బాధపడనవసరం లేదు. 

దేవుడు ఒక్కడే కాబట్టి  ఆయనను  అందరు విశ్వసించి జీవించాలి. ప్రభువుకు ప్రార్ధించుట ద్వారా దీవెనలు సమృద్దిగా దొరుకుతాయని పౌలు గారు  తెలుపుచున్నారు. యేసు క్రీస్తు నామమున ప్రార్ధించే వారు అందరు రక్షింపబడుతారు. 

కావున మన యొక్క  విశ్వాస జీవితంలో  యేసు ప్రభువు  యొక్క పునరుత్థానంను  ఆయన దేవుడని అందరు కూడా  బహిరంగంగా ఒప్పుకొంటూ మన యొక్క  జీవితం ద్వారా దానిని చాటి చెప్పాలి. 

మన జీవితంలో  శోధనలు వచ్చినప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభువును ప్రకటించాలి. మన యొక్క జీవితం ద్వారా మిగతా వారికి మన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు ఎదుర్కొన్న శోధనల గురించి మనం వింటున్నాము. యేసు ప్రభువు తండ్రి యొక్క కార్యమును కొనసాగించుటకు  ముందు 40 రోజులు ఏకాంతంగా ఉపవాసం, ప్రార్ధన చేస్తూ ఎడారిలో తండ్రితో గడిపారు. యేసు ప్రభువు యొక్క  శోధనలు మూడు విధాలుగా వర్ణించబడ్డాయి. 

ఎందుకని మూడు శోధనలనే ప్రత్యేకంగా  తెలుపుచున్నారు అంటే  ఈ మూడూ శోధనల గురించి పాత నిబంధన గ్రంధంలో వింటున్నాం. 

సైతాను యేసు ప్రభువును శోధించినప్పుడు  ప్రతిసారీ  పాత నిబందన  యొక్క వాక్యం ద్వారా  సైతాను యేసు ప్రభువును శోధిస్తుంది. ఇది ఎందుకంటే  పూర్వ నిబందన  గ్రంధంలో  యిస్రాయేలు ప్రజలు ఎడారిలో మూడు ముఖ్యమైన  శోధనలు గురియయ్యారు ఆ మూడు సందర్భలలో  వారు విఫలమైయ్యారు. 

ఇవే మూడు శోధనలు నూతన యిస్రాయేలు  అయిన యేసు క్రీస్తును కూడా  సైతాను పడవేయాలనుకున్నది. తండ్రికి దగ్గరైయె కొద్ది  అమనం జీవితంలో  సైతానుడు ప్రవేశించి మనలను ఆయన నుండి పడవేయాలనుకుంటాడు. అందుకే శోధిస్తుంటాడు. 

 ఈ సువిశేషం గమనించినట్లయితే  ఇక్కడ చాలా విషయాలు అర్ధమవుతాయి. మొదటిగా యేసు ప్రభువు పవిత్రాత్మ  పరిపూర్ణుడాయేను. ఎప్పుడైతే యోర్ధనులో  బాప్తిస్మమం పొందారో అప్పుడు మరొక సారి తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు మానవ దైవ స్వభావం కలిగిన క్రీస్తు ప్రభువును బలపరిచారు. 

ఆత్మ ప్రేరణ వలన ఏడారికి నడిపింపబడ్డాడు. ఎందుకు ఎడారికి నడిపించబడ్డారు అంటే  ఎడారి విశాలవంతమైన స్థలం, నిశబ్దంతో కూడిన స్థలం, దేవునికి యొక్క సాన్నిధ్యం అనుభవించుటకు వీలుగా ఉన్న స్థలం. అందుకే దేవుడు ఎన్నుకొన్నారు. ఏకాంతంగా ఉంటూ ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా తనను తాను దైవ కార్యంకు సిద్ధం చేసుకోవడానికి అక్కడకి వెళ్లారు. 

రెండవది యిస్రాయేలు ప్రజలు ఎడారిలో కలిగిన శోధనల్లో పడి పోయారు. వారి యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో శోదనల్లో పడి దేవున్ని విస్మరించారు. అదే ఎడారి ప్రాంతంలో మానవునిగా జన్మించిన క్రీస్తు ప్రభువు  శోధనలు జయించుటకు అక్కడకు నడిపించబడ్డారు. 

యేసు ప్రభువును సైతాను 40 రోజులు శోధించుచుండెను. పవిత్ర గ్రంధంలో చూసిన వాక్యాలు బట్టి సైతానుడు రెండవ సారి యేసు ప్రభువును తుదముట్టించాలను కుంటున్నాడు. బాల యేసు గా జన్మించినప్పుడు సైతాను హెరోధును శోధించి, ప్రేరేపించి చంపాలనుకున్నాడు. కానీ విలుపడలేదు. ఇప్పుడు మరొకసారి  యేసు ప్రభువును తన యొక్క తండ్రి కార్యం నుండి సంపూర్ణంగా వైదొలగే లాగా చేయాలనుకుంది. అందుకే శోధిస్తుంది. 

సైతానుడు మనల్ని కూడా ఈ 40 రోజుల్లోనే ఎక్కువగా శోధిస్తాడు. మరీ ముఖ్యంగా దీక్ష  తీసుకున్న వారిని ఎందుకంటే వారు దైవ ప్రేరణ వలన దీక్ష తీసుకున్నారు, కాబట్టి వారిని ఆటకం పరుచుటకు సైతానుడు శోధిస్తాడు. 

ఎవరినైతే దేవుడు తన యొక్క పనికోసం వినియోగించుకుంటున్నారో  వారి జీవితాలను 40 రోజులలో దేవుడు  ఎంచుకుంటున్నారు. నోవా యొక్క జీవితం  40 రోజుల వర్షంతో మారింది. మోషే  సినాయి  పర్వత మీద 40 రోజులు ప్రార్ధనా అనుభవం ద్వారా మారిపోయారు. 

ఏలియా దేవుడు ఒసగిన  40 రోజులు రొట్టెద్వారా మారిపోయారు, 40 రోజులు  విశ్వాస  ప్రార్ధన  ద్వారా నినివే పట్టణ వాసులు మారిపోయారు. 40 రోజులు ఉపవాస  ప్రార్ధన ద్వారా యేసు ప్రభువు దేవుని శక్తిచే క్రొత్తగా నింపబడుతున్నారు. ఈ 40 రోజుల్లో  తండ్రి, పవిత్రాత్మ యేసు  ప్రభువును తన పని కోసం సిద్దం చేశారు, క్రొత్తగా చేశారు, బలవంతుణ్ణి చేశారు. 

యేసు ప్రభువు యొక్క మొదటి శోధన: 

ఆహరం గురించి, శారీరక వాంఛ గురించి -  మనం ఎక్కడ బలహీనులమో అక్కడే సైతాను ఎక్కువగా శోధిస్తుంది. యేసు ప్రభువు 40 వది రోజులు ఉపవాసం చేశారు. ఆకలితో ఉన్నారు అందుకే అక్కడ శోధించింది. 

పూర్వ వేదంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకలికి సంబంధించిన శోధన ఎదురైనప్పుడు మోషేను దూషించి దేవునికి పాపం చేశారు. దేవుడు అప్పుడు వారికి మన్నాను ఒసగుతూ నేర్పించిన పాఠమేమిటంటే  కేవలము రొట్టెవలనే కాదు, కానీ దేవుని యొక్క వాక్యం వలన కూడా జీవిస్తారని తెలిపారు. ద్వితీ 8: 3 , నిర్గమ16:2-3 భోజనము గురించి. 

శరీరానికి సంభందించిన శోధనలలో మనం చాలా సార్లు పడిపోతాం. మన పంచేంద్రియాల పంచేంద్రియాలు వలన పడిపోయే సమ్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలి. 

ఈ మొదటి శోధన తన యొక్క దైవత్వంను నిరూపించుటకు సైతాను శోదిస్తున్నాడు. వాస్తవానికి సైతాను యేసుప్రభువు తన యొక్క శక్తులను తన సొంత అవసరాలకు వినియోగించు  కుంటాడా లేదా అని శోధించింది. అయితే ప్రభువు శారీరక వాంఛలకు లొంగకుండా తన యొక్క శక్తిని స్వంత లాభం కోసం వాడలేదు. యేసు ప్రభువు   ఈ లోక శారీరక సుఖాల వలన సంతృప్తి చెందరు, ఆయన యొక్క నిజమైన ఆనందం తండ్రిని సంతృప్తి పరచటం, తండ్రి యొక్క కార్యం నెరవేర్చుటయే. 

రెండవ శోధన-  అధికారం గురించి 

ఈలోక సామ్రాజ్యాలను చూపించి తనను ఆరాధిస్తే అటువంటి సామ్రాజ్యాలను సైతాను ఇస్తానని యేసుతో అంటున్నారు.యేసుప్రభువు యొక్క సిలువ మార్గాన్ని అడ్డుకోవాలనుకున్నది. మత్తయి16: 22 . ఈలోకంలోనే ఆయన్ను ఉంచి తనకు లోబరుచుకోవాలనుకున్నది సైతాను. 

ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఇతర దేవుళ్లను ఆరాధించారు. ఎడారిగుండా వారిని ఆదిపిన ఎవుణ్ణి వారు మరిచిపోయారు. ఒక బంగారు దూడను ఆరాధించారు నిర్గమ 32:16 , విగ్రహ ఆరాధనా చేశారు.  ఇక్కడ వీరు విగ్రహ ఆరాధన చేయటం మాత్రమే కాదు దేవునికి చెందవలసిన స్తానం ప్రాముఖ్యత వస్తువులకు ఇస్తున్నారు.

అధికారం కోసం మనం కొన్నిసార్లు ఏదైనా చేస్తాం ఎక్కడికైనా వెళతాం. కానీ యేసు ప్రభువు అందుకు ఒప్పుకోలేదు లోక సంపదలు అన్నింటిని కంటే దేవుడే ముఖ్యమని ఆయన మీదనే జీవించాలని తెలియచేస్తున్నారు.  అధికారం కోసం కొన్నిసార్లు ఎవరి కళ్ళైనా మొక్కుతాం ఎంతకైనా దిగజారతాం. కానీ ఇక్కడ ప్రభువు నేర్పించేది ఏమిటంటే, అధికారం కోసం సంపదల కోసం దేవుడిని విడిచిపెట్టకూడదు.

మూడవ శోధన దేవుడ్ని పరీక్షకు గురిచేయుట 

యిస్రాయేలు ప్రజలు దేవుడ్ని అనేకసార్లు పరీక్షించారు, ఆయన శక్తిని పరీక్షించారు. యేసు ప్రభువు కింద పడితే ఏమి కాదని, దుఃఖమని సైతాను ఎవుని శక్తిని పరీక్షించింది. యిస్రాయేలు ప్రజలు దేవుడ్ని మస్సా, మెర్రిబ్బాల వద్ద పరీక్షించారు. నిర్గమ17: 1-7, దేవుడు మనతో ఉన్నాడా  లేడా అని. యేసుప్రభువు ఎన్నడును దైవ శక్తిని పరీక్షించలేదు ఆయనకు తండ్రి మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది కాబట్టియే దేవుడ్ని పరీక్షించలేదు. 

మనయొక్క విశ్వాస జీవితంలో శోధనలు వచిన్నపుడు దేవుడ్ని చాల సార్లు పరీక్షిస్తాం. దేవుడా నీవు నాకు వరం ఇస్తేనే గుడికి వస్తాం అని పరీక్షిస్తాం. పరీక్షలో మంచి మార్కులు వస్తే గుణదలకు వస్తానని పరీక్షిస్తాం. ఇంకా చాల విధాలుగా మనం దేవుడ్ని పరీక్షిస్తాం. అన్నిటి కన్నా కావలసినది దేవుడ్ని పరీక్షించటం కాదు దేవుని మీద ఆధారపడి జీవించుట, ఆయనయందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించుట.

కాబట్టి మనయొక్క విశ్వాస జీవితంలో శోదనలు వచ్చినప్పుడు, దైవశక్తితో ప్రార్థనతో వాటిని జయించుదాం.

-యేసు ప్రభువు వారు అన్ని చోట్ల శోధించబడ్డారు. అయినా కూడా సైతానుకు లొంగలేదు. 

పవిత్ర గ్రంథంలో   శోధించబడినవారు 

-ఆదాము శోధించబడ్డారు, సైతానుకు పడిపోయాడు. 

-అబ్రాహాము శోధించబడ్డాడు, సైతానును జయించాడు.

-ఇశ్రాయేలియులు సైతాను మాయలో పడ్డారు.

-దావీదు శోధించబడ్డారు ఆయనకూడా పడిపోయారు కొన్నిసందర్భాలలో. 

-సొలొమోను, సంసోను శోధించబడ్డారు వారుకూడా పడిపోయారు.

-యేసు ప్రభువు కూడా శోధించబడినప్పటికిని సైతాను వలలో చిక్కుకొనక అన్ని శోధనలు జయించారు.

-మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు మనం కూడా శోధనలు జయించాలి. 

-మనయొక్క శక్తిని మించి మనం శోధించబడం. (1 కొ రింతి 10:13), కాబట్టి దైవ శక్తితో శోధనలు ఎదుర్కొందాం. దేవునికి సాక్షులై జీవించుదాం. 

-మనకు వచ్చే శోధనలలో దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ మనయొక్క విశ్వాస జీవితమును కొనసాగించుదాం. 

-మన జీవితంలో ఒక దాని తరువాత ఒక శోధన వస్తూనే ఉంటుంది. వాటన్నిటిని దైవశక్తితో జయించుదాం.

Rev. Fr. Bala Yesu OCD

3, మార్చి 2022, గురువారం

తపస్సు కాల మొదటి ఆదివారం

  సాతాను శోధనలు - క్రీస్తును విజయము 

క్రీస్తు  నాధుని యందు  మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా  ఈనాడు  తల్లి తీరుసభ  మనలను అందరిని కూడా తపస్సు కాలపు మొదటి ఆదివారము లోనికి ఆహ్వానిస్తుంది. ఈనాటి పరిశుద్ద పఠనాల ద్వారా  మనలను అందరిని కూడా సాతానుకు బానిసలు కాకుండా, దేవుడు ఇచ్చిన స్వేచ్చతో జీవించమని లేదా దేవుని స్వతంత్ర బిడ్డలుగా జీవించమని కోరుతుంది. 

ఎందుకంటే ఈ యొక్క పాపము లేదా సాతాను కీడులలో నుండే కదా క్రీస్తు ప్రభువు తన శ్రమలు, మరణ, పునరుత్థానల ద్వారా మనలను స్వేచ్ఛ పరులను చేసెను. క్రీస్తు తన మరణ పునరుత్థానాల ద్వారా  సైతాను పై  ఆధిపత్యం  చూపించలేదా? తన మరణ  పునరుత్థానాల ద్వార  మనకు రక్షణ తెచ్చెను గదా?  మనలకు  పాప విమోచనగావించే కదా?

మరి మనము  ఆ పాపపు  జీవితాన్ని జీవించడం ఎంత మాత్రం సమంజసమో! మనం అందరం ఆత్మ పరిశీలన జేసుకోవాలి. ఈనాటి పరిశుద్ద గ్రంధ పఠనాలలో  చూస్తే, శోదనల గురించి వింటున్నాము. మరి ముఖ్యంగా  సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువును ఆ సైతాను ఏవిధంగా  శోధించిందో చూస్తున్నాం. 

 యిస్రాయేలు ప్రజలు, ఎడారి ప్రాంతంలో వారికి  తినడానికి ఏమి  దొరకనటువంటి సంధర్భంలో  వారు శారీరక  ఆకలితో, దేవున్ని మరియు  మోషే ప్రవక్తను నిందిస్తున్నారు. 

ఏదైన మేలు జరగనప్పుడు  మనం దేవుని నిందించాలనుకోవడం ఒక శోదనే. ఉదా: మనము యొబు జీవితం చూసుకున్నట్లయితే  తన భార్య, తన చెంతకు వచ్చి, నీవు సర్వాన్ని  కోల్పోయావు, నీవు జీవించడం వ్యర్ధము, కాబట్టి  నీ దేవున్ని శపించి నీవు కూడా చచ్చిపో, అన్నప్పుడు  యొబు  ఆ శోదనకు వెళ్ళి , దేవునితో గొడవ పడతాడు, నీవు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని. నా జీవితం ఎందుకు ఇలా అవుతుందని. 

కానీ చివరికి తన తప్పు తెలుసుకుంటాడు, దేవుని క్షమాపణ కోరతాడు. మరి మనం జీవితంలో కూడా యిస్రాయెలు  ప్రజల వలె యొబు వలె  మనకు మేలు  జరగని  సందర్భాలలో  మనం  దేవుడిని  నిందిస్తున్నామా? విశ్వాసాన్ని, లేదా నమ్మకాన్ని కోల్పోతున్నమా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ఎందుకంటే ఈ సాతాను అవకాశం కోసం  పొంచి ఉంటుంది. మనకు ఏమైనా కొదవఅయినప్పుడు , దేవునకు మనం ప్రార్దన చేసిన విననప్పుడు, దేవుడు మనలను విడనాడినట్లు ఉన్నప్పుడు, మనం బాధలలో, కష్టాలలో ఉన్నప్పడు, సాతాను మనలను దేవుడిని నిందించమని శోధిస్తుంది. 

సువిశేషం పఠనంలో చూస్తే  :-  క్రీస్తు ప్రభువుకి సాతాను శోదన మనం చూస్తున్నాం .  క్రీస్తు ప్రభువుకి ఈ శోదనలు ఒక్కసారి మాత్రమే వచ్చినవి కావు, అవి అనునిత్యం  క్రీస్తు జీవితంలో ఉన్నవే. తాను కన్ను మూసేంత వరకు, అంతా సమాప్తమైనది  అనేంత వరకు కూడా శోధింపబడ్డారు. 

ఎలా అంటే : - మనుష్య కుమారునిగా, ఒక సాదారణ వ్యక్తిగా మరణించే ముందు తండ్రి దేవుడు తనని  వీడనాడాడు లేదా తనని  వేరు చేశాడని భావించి ఉండవచ్చు కాబోలు. అందుకే నా దేవా నా దేవా , నన్నేల విడనాడితివి  అని బిగ్గరగా ఏడ్చాడు. 

కానీ :-  క్రీస్తుకు తెలుసు, ఇది  తండ్రి చిత్తమే అని , అందుకే  తండ్రి ! నా ఆత్మను నీకు సమర్పిస్తున్నాను .  అంతా సమాప్తమైనది అని అంటున్నాడు. 

ఈరోజు  సువిశేషంలో  చూస్తే 

 సాతాను మొదటి ప్రయత్నం :-  క్రీస్తు ప్రభువు  నలువది దినాలు ఉపవాసమున్నాడు,  ఈ  యొక్క  సందర్భాన్ని  ఉపయోగించుకోవాలని  ఆలోచించి, ఆ సాతాను క్రీస్తుని శారీరక ఆకలి తీర్చడం కోసం శోధిస్తుంది. 

ఇక్కడ సాతాను మూర్ఖత్వం కాకపోతే క్రీస్తు 4,000 మందికి 5,000 మందికి ఆకలి తీర్చిన దేవుడు తన ఆకలి తీర్చుకోలేడా ! సాతానును లెక్క చేయలేదు, సాతాను ఓడిపోయింది. 

సాతాను రెండవ ప్రయత్నం  :- రాజ్యాలన్నీ నీకిస్తాను, ఆధికారాన్ని నీకిస్తాను, నాకు మ్రొక్కు అంటుంది. ఇక్కడ కూడా సాతాను మూర్ఖత్వమే. ఎందుకంటే, సకల సృష్టిని సృజించిన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఈ లోకాధిపతి, సర్వ అధికారికి, ఆయన ముందు సాతాను కుప్పిగంతులు. క్రీస్తు ప్రభువు బహుశా నవ్వుకొని ఉండవచ్చు కాబోలు సాతాను యొక్క మూర్ఖత్వాన్ని చూసి అప్పుడు కూడా  క్రీస్తు ప్రభువు లొంగలేదు. పైగా సాతానుకి " నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించుము, సేవించుము"  అని వ్రాయబడి ఉన్నదని  గుర్తు చేస్తాడు. 

సాతాను మూడవ ప్రయత్నం :- నీవు ఈ శికరము పై నుండి క్రిందకు దూకు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, దూతలు తమ చేతులలో నిన్ను పట్టుకుంటారు, అని శోధిస్తుంది. ఒక్క మాటతో లోకాన్ని సృష్టించిన దేవుడు, ఒక్క మాటతో లాజరును జీవంతో ఇచ్చిన దేవుడు,  ఒక్క మాటతో స్వస్థతలు  చేసిన దేవుడు,  ఒక్క   మాటతో సముద్రాన్ని  శాసించిన, అద్భుతాలు, చేసిన క్రీస్తుకు,  ఇది ఒక శోధన. 

అప్పుడు కూడా క్రీస్తు ప్రభువు  సాతానుతో  ప్రభువైన  నీ దేవుని శోధింపరాదు అని చెబుతున్నారు. సాతాను మళ్ళీ ఓడిపోయింది. ఇలా క్రీస్తు ప్రభువు సీలువలో మరణించేంత వరకు కూడా శోధిస్తూనే వుంది. 

అద్భుతాలు, మహిమలు చేయగల  శక్తిగల దేవుడు క్రీస్తు ప్రభువు అయిన కూడా, తాను స్వార్ధంగా ఆలోచించలేదు. తన స్వంత ప్రయోజనాలకు, పేరుకు గాని ఎప్పుడు ఉపయోగించలేదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క  చిత్తాన్ని నెరవేర్చుటకు, ప్రజల సంతోషం కోసమే తన శక్తులను ఉపయోగించాడు. మరి మనం శక్తి సామర్ధ్యాలు ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం?ఆత్మ పరిశీలన చేసుకోవాలి? 

రెండవ పఠనం :-  పునీత పౌలుగారు రోమియులకు తెలియ చేస్తున్నారు. మనకు "ప్రభువుఒక్కడే "ఆయనను మన  హృదయంతో విశ్వసిస్తే, నీతిమంతులం అవుతాం. నోటితో ప్రభువే నా దేవుడు అని ఉచ్చరిస్తే రక్షింపబడతాం,  అని తెలియ చేస్తున్నారు. 

క్రీస్తు ప్రభువు చేసింది కూడా అదే. సాతాను వచ్చి నాకు మొక్కుము అన్నప్పుడు క్రీస్తు చెప్పిన మాటలు కూడా ఇవే మనకు దేవుడు ఒక్కడే ఆయనను మాత్రమే సేవిస్తాను అని. 

ఈనాడు మనము క్రీస్తువలె జీవిస్తున్నామా ? మనకు దేవుడు ఎవరు ధనమా , పేరు ప్రఖ్యాతలు, అధికారమా,  బందువులా, మిత్రులా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. పునీత సిలువ యోహను గారు కూడా ఇటువంటి  మాటలనే తన యొక్క జాగ్రత్తలు తెలియ చేస్తారు. ప్రతి మనిషి కూడా మూడు విధాలుగా శోధింపబడుతాడు, వాటిని జాగ్రత్తగా ఎదుర్కోనమని  తెలియచేస్తున్నారు. 

మొదటిగా : వ్యక్తిగతంగా,  ఎదురయ్యే శోధన , ఇది మానసికంగా కావచ్చు, శారీరక సుఖా:ల ద్వార కావచ్చు, లైంగిక శోధన , ఆహార శోధన , నిర్లక్ష్య కావచ్చు. 

రెండవదిగా : ఈ లోక సంబందమైన శోధన 

-బందువుల ద్వారా , స్నేహితుల ద్వారా కావచ్చు 

-సంపదల ద్వారా, ధనము ద్వారా కావచ్చు . 

మూడవదిగా : సాతాను శోధన 

వక్రబుద్ది జీవతం 

- ఆధికారం కోసం 

-గొప్పవారు కావాలని, పేరు పొందాలని, 

-ఎప్పుడు ఒకరి మీద పెత్తనం చేయాలని ఎంత నీచానికైనా మనిషి దిగజారుతాడు. 

ఇలాంటి మూడు సందర్భాలలో మనం దేవున్ని మర్చిపోతాం, దేవునికి దూరంగా జీవిస్తాం, అవే సర్వస్వం  అని నమ్మి మోసపోతాం. చివరికి జీవితం నాశనం చేసుకుంటాం. కాబట్టి వీటన్నింటికి  జాగ్రత్త కలిగి దేవునియందు విశ్వాసముంచి  జీవించమని తెలియచేస్తున్నారు. 

కావున మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ శ్రమలు అనునిత్యం ఉంటాయి. ఈ నలువది  రోజులు మాత్రమే నేను ఈ విధంగా జీవించాలి అని కాదు. ప్రతి నిత్యం కూడా మనం సాతానును గెలవాలి. 

చివరిగా ఏమిటంటే, క్రీస్తు ప్రభువు మనలను బానిసత్వం నుండి స్వతంత్రులను చేయుటకు ఈ లోకానికి వచ్చారు, మనలను విముక్తులను చేశారు. కానీ ఇంకా మనం సాతాను బానిసత్వంలోనే జీవిస్తున్నాం. కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకొని, దేవుని స్వతంత్ర బిడ్డలుగా జీవించుటకు ప్రయత్నిద్దాం. ఆమెన్ .

BR. SUBHASH 

26, ఫిబ్రవరి 2022, శనివారం

8 వ సామాన్య ఆదివారం (2)

8 వ సామాన్య ఆదివారం 

 సీరా 27:4-7, 1 కోరింథీ 15:54-58 లూకా 6:39-45 

నేటి దివ్య పఠనాలు మన యొక్క అనుదిన జీవితంలో వినియోగించే మనిషి యొక్క మాటల గురించి తెలియజేస్తుంది. 

యేసు ప్రభువు ఏ విధంగానైతే తన యొక్క భూలోక జీవితమంలో మంచి మాటలు  మాట్లాడుతూ అనేక మంది జీవితాలలో సంతోషంను నింపుతూ,   ప్రేమను పంచుతూ  జీవించరో మనం కూడా అలాగే మృదువైన  మాటలు మాట్లాడుతూ అందరి జీవితంలో మంచిని పంచాలి. 

మన యొక్క మాటతో పాటు మనస్సు కూడా మంచిగ ఉండాలి. దేవుడు మానవునికి మాటనిచ్చింది, ఆయనను స్తుతించడానికి, ఆయనను గురించి ఇతరులకు తెలియజేయడానికి, ఇది దేవుడు ఇచ్చిన గొప్ప వరం.

 మన యొక్కమాట ద్వారా తోటి ప్రజలతో స్నేహబంధం ఏర్పరుచుకొని వారితో సమాధానంగా  సంతోషంగా ఉండవచ్చు. 

 మన యొక్క ప్రతి వాక్కు ద్వారా మన భావాలను, ఆలోచనలను వ్యక్త పరచి  ఇతరులతో  స్నేహ బంధాన్ని కలిగి మన మాటలు  జీవించడానికి ఉపయోగపడతాయి

 దేవుడిచ్చిన మాటను  సద్వినియోగం చేసుకుంటే ఆ  జీవితం సుఖంగా ఉంటుంది 

మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువైనది మాట్లాడే ప్రతి మాట వెనుకు  తీసుకోవలేం, కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.

మాట్లాడే మాటలను  దుర్వినియోగం చేసుకుంటే అతని లేక ఆమె జీవితం కష్టాల పాలౌవుతుంది. 

మన జీవితంలో శాంతి సమాధానాలు లేకపోవడానికి కారణం మన యొక్కనోటి మాటయే. మన యొక్క సంభాషణలో  నోటి మాటలో శుద్ధి , సౌందర్యం లోపించినప్పుడు మన కుటుంబాలలో   కలహాలు మొదలవుతాయి. 

ఈనాటి మొదటి పఠనంలో సీరా ఎలియజర్ పుత్రుడైన యేసు రచయత మనిషి యొక్క  మాట తీరుకు అతడి మనసుకు ఉన్న సంభంధాన్ని తెలియచేస్తునారు. 

మనిషి మాట్లాడే ప్రతి మాట బయటకు మనకు  వినిపిస్తుంది. కాని అతని లేక ఆమె మనసు  మనకు కనిపించదు.  అయితే మనిషి మాట్లాడే మాటయే తన యొక్క అంతరంగమును  బయటకు వెల్లడిస్తుంది. 

సిరాకు  3 ఉపమానాల  ద్వారా మనిషి మాటలు, అంతరంగిక భావాల గురించి తెలుపుచున్నారు. 

1. జల్లెడ యొక్క ఉపమానం

2. కుమ్మరి పాత్రలు చేసే విధానం 

3. పండును బట్టి చెట్టు యొక్క స్వభావం 

  ఈ మూడు కూడా మన వ్యక్తిగత జీవితంలో రోజు చూసే ఉదాహరణలే.  ఇవి మనకు చాలా ముఖ్యమైన విషయాలు  నేర్పిస్తాయి. 

ఊపిన జల్లెడ - రైతు పంట కోసినప్పుడు మంచి గింజలనుండీ చెడు గింజలను వేరు పరచడానికి  రైతు వినియోగించే సాధనమే జల్లెడ. 

జల్లెడ పట్టడం ద్వారా మనకు మేలిమి  వస్తువులు దొరుకుతాయి.  అలాగే మనం మాట్లాడే ప్రతి  ఒక్క దానిలో  మంచి పదాలు  ఉంటాయి, అలాగే చెడ్డవి ఉంటాయి.

జల్లెడ క్రీంద పొట్టు కనబడినట్లు మన యొక్క సంభాషణలో కూడా  పోట్టు వంటి లోపాలతో కూడుకున్న పదాలు కనిపిస్తాయి. మన యొక్క మాటల్లో తప్పులు కనపడుతుంటాయి. 

   రెండవదిగా కుమ్మరి చేసే కుండలు : ఒకవేళ అతను మంచి మట్టిని వాడింది  లేనిది  వాటిని అవంలో వేసినప్పుడే అర్ధమవుతుంది. మంచి మట్టిని వాడక పోతే, అవి అగ్నిలో వేసినప్పుడే పగిలిపోతాయి. ఆవం లోని అగ్ని కుండ గట్టితనాన్ని పరిశీలించినట్లే ఒక వ్యక్తి యొక్క మాటతీరు , అతని సంభాషణ వలన అతను ఎలాంటివాడో అర్ధం అవుతుంది.  మట్టి పాత్రలు విలువ ఆవంలో తెలిసిన విధంగా మనిషి యొక్క విలువ ఆయన మాటలో  అర్థం అవుతుంది. 

 మూడవదిగా చెట్టు యొక్క పండు అది ఎలాగా ఫలములనిస్తుంది అని తెలుపుచున్నారు. చెట్టుకు అన్నీసక్రముగా ఇస్తే మంచి పండ్లనే ఇస్తుంది.  అంటే చిన్నప్పటినుండియే చిన్న బిడ్డలకు  మంచి విషయాలు నేర్పిస్తే  భవిష్యత్తులో మంచి మాటలు ప్రవర్తన కలిగి జీవిస్తారు. 

ఈ మొదటి పఠనము ద్వారా దేవుడు మన యొక్క మాటలు మంచిగా ఉండాలని తెలుపుతున్నారు. మానవ జీవితంలో మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువైనది. శరీరానికి  ఒక దెబ్బ తగిలితే ఆ గాయం తొందర్లోనే మాయం అవుతుంది. కానీ మాట ద్వారా మనసుకు అయిన గాయం మానటం కష్టం. 

మనం మాట్లాడే మాటలు మనకు  స్నేహితులను చేస్తుంది.  అదే మాటల వల్ల  మనకు శత్రువులు  కూడా తయారవుతారు. 

మనం మాట్లాడే మాటలు చాలా సార్లు జీవితాలు నిర్మిస్తాయి, నిలబెడతాయి  అవే మాటలు కొన్ని సార్లు జీవితాలను కూల్చుతాయి. 

 మన యొక్క వాక్కు ద్వారా ఎందరో జీవితాలలో  వెలుగు నింపవచ్చు,  ప్రేమించవచ్చు.  అదే మాట ద్వారా మనం కొందరిని ద్వేషించేవచ్చు. 

మాట్లాడిన ప్రతి మాటకి రెండు అర్థాలు ఉంటాయి positive మరియు negative  అయితే మనం ఎలాంటి tone  ఉపయోగించం  అన్నది కూడా ముఖ్యం. 

మన యొక్క సంభాషణల  ద్వారా ఇతరులలో నమ్మకం కలిగించవచ్చు, ఓదార్పును ఇవ్వవచ్చు, ప్రేరణ కలిగించవచ్చు . 

ఒకచిన్న అగ్గిపుల్లతో ఎలాగైతే ఒక పెద్ద అడవిని కాల్చి వేయవచ్చో అలాగే  మన యొక్క నాలుకతో మాట్లాడే మాటలు చాలామంది  జీవితాలను  కూల్చుతాయి.  ఇతరులను పాపంలోనికి నెట్టేది  కూడా మన యొక్క మాటలే ఎందుకంటే తప్పుగా మాట్లాడుట  వలన వేరే వాళ్ళు ప్రేరేపించబడి పాపం చేస్తారు. 

కాబట్టి మన యొక్క సంభాషణలో  మన మంచిగా ఆలోచనలు   చేసి మంచిగా మాట్లాడి జీవిస్తే ఈ లోకంలో శాంతి సమాధానాలు, ప్రేమ, ఆనందం ఉంటుంది. మన మాటలద్వారా ఆశీర్వదించవచ్చును శపించవచ్చును. సృష్టిలో కేవలం మానవులు మాత్రమే మాట్లాడే వారు. మనకు మాత్రమే గొప్ప వరం దేవుడు దయచేశారు. కావున మనం కూడా మాటలనే మాట్లాడాలి.

రెండవ పఠనంలో పౌలు గారు మరియొకసారి యేసుప్రభువు యొక్క పునరుత్తానం గురించి ప్రకటిస్తున్నారు. పౌలు గారు యేసు క్రీస్తు ప్రభువుకు మరణంను జయించగల శక్తి ఉన్నదని తెలుపుచున్నారు, అందువలనే యేసుప్రభువు మరణించిన తరువాత శరీరంతో పునరుత్తానమయ్యారు.

క్రీస్తు ప్రభువునందు జ్ఞానస్నానం పొందిన మన అందరంకూడా పవిత్రాత్మ ద్వారా ఇహలోకంలో దేవుని యొక్క అనుచరులుగా, విశ్వాసులుగా జీవించే మనందరం కూడా పునరుత్తానమవుతామని, దానికి నిదర్శనం యేసు క్రీస్తు పునరుత్తానమే అని పౌలు గారు తెలుపుచున్నారు.

ఈ లోకానికి మరణం పాపం చేయుట వలన వచ్చింది. పాపం చేయుటవల్ల అవిధేయులై, దేవుని చట్టాన్ని సరిగా పాటించలేం, ఇంకా పాపపు జీవితం నే కొనసాగిస్తాం. అయితే పాపంలో ఉన్నవారందరిని రక్షించడానికి ప్రభువు ఈలోకంలో జనిమించారు. ఎటువంటి పాపం చేయకుండా మన కోసం సిలువ శ్రమలు మరణం, పునరుత్తానం ద్వారా మనకు రక్షణ దయచేశారు అని పాలుగారు తెలుపుచున్నారు.

యేసుక్రీస్తుప్రభువు పాపమును జయించారు, మరణమును జయించారు, కాబట్టి మనం ఆయన యందు విశ్వాసముంచి ఆయన కార్యాలు నెరవేర్చాలి, ఆయన సేవ చేయాలని పౌలు గారు తెలుపుచున్నారు.

సువిశేష పఠనంలో యేసు ప్రభువు మనయొక్క జీవితంలో చాల విలువైన విషయాలను బోధిస్తున్నారు.

1. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివానికి మార్గం చూపించగలడా?

2. శిష్యులు గురువు కంటే అధికుడు కాదు

3. పరులను గూర్చి తీర్పు చేయకూడదు

4. అంతరంగిక శుద్ధి కలిగి మంచి మాటలు మాట్లాడుట, బోధించుట.


1. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివాడిని నడిపిస్తే ఏమవుతుందో అందరికి తెలుసు. వారిద్దరూ పడిపోయే అవకాశం ఉంది, దారి తప్పి పోతారు, గమ్యం చేరలేరు. చాల సందర్భాలలో మనం ఎలాంటి వారిని అనుసరిస్తున్నామో అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎవరిని వెంబడించాలో, ఎవరిని మన యొక్క నాయకులుగా అనుసరించాలో వారిపట్ల జాగ్రత్తగ ఉండాలి.

అన్ని తెలిసిన వ్యక్తులు మాత్రమే మనం అనుసరించాలి, మనలను సన్మార్గంలో నడిపించే వారినే వెంబడించాలి. దైవ జ్ఞానం లేని గ్రుడ్డివారిని, దేవుడంటే విశ్వాసం లేని వారిని తల్లిదండ్రులంటే భయభక్తులు లేని వారిని మనం అనుసరిస్తే మన జీవితాలు కూడా అంధకారంలోకి నడిపించబడతాయి.

ప్రతిఒక్కరు మొదటిగా తమ యొక్క జీవితాన్ని పరిశీలించుకుని, ఆ తరువాత ప్రజలను హెచ్చరించమని, నడిపించమని తెలుపుచున్నారు.

పరిసయ్యులు ప్రజలకు నాయకులుగా వ్యవహరించే వారు. అయితే పరిశయ్యులు తమ అంతరంగాన్ని చక్క పరచుకోనంతవరకు వారు గ్రుడ్డి నాయకులే. గ్రుడ్డి నాయకులు వేరే వారికీ దేవుని మార్గం ఎలాగా చూపించగలరు?

యేసు ప్రభువు మనందరియొక్క నాయకుడు ఎందుకంటే ఆయన మాత్రమే మనలను తండ్రి మార్గంలోకి నడిపిస్తారు. ఆయనయే ఈ లోకానికి వెలుగు. మన జీవితాలు మంచిగా ఉంచకుండా, వేరొకని మంచిగా జీవించమని చెప్పుట సరిఅయిన పద్దతి కాదు అని ప్రభువు తెలుపుచున్నారు.మంచి సమాత్రుకగా ఉన్నవారే వేరొకరికి మార్గం చూపించగలరు.

2. శిష్యుడు గురువుకంటే అధికుడు కాదు

 శిష్యులు ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికిని ఆయన పొందినది మొత్తం గురువు దగ్గర నుండియే .. కాబట్టి శిష్యుడు గురువు కన్నా అధికుడు కానేరడు. శిష్యుల యొక్క జీవితంలో వెలుగును నింపింది గురువే నేర్పింది గురువే, దరి చూపించింది గురువే, జీవితం జారీచేసింది గురువే కాబట్టి మనం ఎప్పుడు కూడా గురువుకన్నా చిన్నవారమే. మన గురువు దేవుడే ఆయన కన్నా మనం ఎప్పుడు చిన్నవారమే కాబట్టి మన గురువుకు విధేయించాలి, గౌరవించాలి.

3. మన కంటిలో దూలం ఉంచుకొని వేరొక వ్యక్తి కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపిస్తాం.

మనందరికీ గురువింద గింజ తెలుసు పైన ఎర్రగా ఉంటుంది, క్రింద నల్లగా ఉంటుంది. చాలా సందర్భాలలో మనందరం పైకి మంచి వరమని, పవిత్రులమని భావిస్తాం కానీ అది వాస్తవం కాదు. మనం వేరొక వ్యక్తుల మీదనే ఎక్కువ (focus, attention) శ్రద్ధ ఉంచుతాం కానీ మన జీవితాలను మనం పరిశీలించుకోము.

పరిసయ్యులు సామాన్య ప్రజల జీవితాల మీదనెను శ్రద్ధ (focus) పెట్టారు కానీ తమ జీవితాల గురించి మరిచి పోయారు. -ఇతరుల గురించి తీర్పుచేశారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ (యోహాను 8: 3-11) యొక్క సువిశేష భాగంలో అక్కడా అందరూ పాపం చేసినవారే కానీ ఆ స్త్రీ పట్టుబడింది కాబట్టి ఆమెను శిక్షించాలని అనుకున్నారు. మన పాపాలు మనం తెలుసుకోవాలి, శారీరక శుద్ధి మాత్రమే కాదు అంతరంగిక శుద్ధి అవసరం. ఇతరుల గురించి తీర్పు చేయుటకు మనం అర్హులము కాదు. దేవుడు ఒక్కరే సత్యవంతుడు , పవిత్రుడు. మనలో చాలా మంది ఇతరులలో ఉన్న తప్పిదాలే వెదుకుతారు కానీ మంచిని చూడలేరు. మనం ఎవ్వరిని తీర్పు చేయకుండా నిందించకుండా, ప్రేమతో జీవించాలి. దేవుడే మన తీర్పరి.

4. అంతరంగిక శుద్ధి కలిగి జీవించాలి

మనయొక్క అంతరంగ పరిశుద్ధంగా ఉంటే మన మాటలుకూడా పరిశుద్ధంగా మంచిగా ఉంటాయి. మనయొక్క మాటలు అన్ని హృదయంనుండి, మనస్సునుండి వెలువడతాయి. మన హృదయాంతరాళంలో ఏవయినా స్వార్థం, క్రోధం, అసూయా, పగలు, ద్వేషాలు వున్నట్లైతే వాటి ద్వారా మన మాటలు చేతలు, ప్రవర్తన అవినీతి కరంగా ఉంటాయి. అంతరంగ జీవితం కు బాహ్య జీవితం కు సంబంధం ఉన్నది. ఇది కూడా విశ్వాసం చేతలు లాంటిది, రెండూకూడా ముఖ్యమే ఒకటి ఉంటే సరిపోదు.

పరిసయ్యులు బాహ్య జీవితానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. అంతరంగిక జీవితం మర్చిపోయారు. మాటలు, బోధనలు మాత్రమే వున్నాయి కానీ చేతలు లేవు. మంచి జీవితం లేదు. అందుకే ప్రభువు వారిని కపట వేషధారులు అని అంటున్నారు.

ప్రజల యొక్క మెప్పుకోసమే అనేక కార్యాలు చేసేవారు, దేవుణ్ణి స్తుతించారు కానీ వారి యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మనం కూడా మంచి జీవితం అనగా అంతరంగికంగా మరియు బాహ్యంగా పవిత్రులై ఉండాలి.

మనందరం కూడా మంచి ఆలోచనలు కలిగి, మంచి మాటలు మాట్లాడుతూ ఒక మంచి విశ్వాసం జీవితం జీవించాలని ప్రభువు తెలుపుచున్నారు. మన సంభాషణలు యేసుక్రీస్తు సంభాషణల వలే మంచిగా పవిత్రంగా ఉండాలి.

Rev. Fr. Bala Yesu OCD

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

8 వ సామాన్య ఆదివారం

 మనిషి మాటే  - మనస్సు బాట 

సీరా 27:4-7, 1 కోరింథీ 15:54-58 లూకా 6:39-45 

క్రీస్తునాధుని యందు  ప్రియమైన దేవుని బిడ్డలారా , ఈనాడు తల్లి శ్రీ సభ  మనలను 8 వ ఆదివారం లోనికి ఆహ్వానిస్తుంది. ఈ నాటి పరిశుద్ద గ్రంధ పఠనములు ద్వారా మనకు ఇచ్చిన సందేశం మనిషి మాట ద్వారా మనస్సును తెలుసుకోవచ్చు అని మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. 

మొదటి పఠనం :- ఈనాటి మొదటి పఠనంలో మనిషి మాటకు -మనిషి మనస్సుకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియ చేస్తుంది. మనిషి మనస్సును మనం చూడలేముం వినలేము కానీ మనిషి మాట మనకు వినిపిస్తుంది. కనుక మనిషి మాటలే మనకు అతని మనస్సును మనకు తెలియ జేస్తాయి. మనిషి మనస్సు, గుణం, శీలం మనిషి మాటల ద్వారం ఏ విధంగా బయటపడతాయో ఈనాటి మొదటి పఠనం మనకు తెలియ జేస్తుంది. 

ఊపిన జల్లెడ- కుమ్మరి చేసిన కుండ, చెట్టు కాపు అనే మూడు ఉపమానములు చెబుతూ మనిషి యొక్క  హృదయనంతరంగమును తెలుసుకొనుటకు అతని మాటలే అని తెలియజేస్తున్నడు. కనుక ఏ నరున్ని అతన్ని మాట్లాడకముందు స్తుతించరాదు. 

1. ఊపిన జల్లేదలో మట్టి పెళ్లలు మిగులునట్లే మనిషి సంభాషణమున దోషములు కనిపించును మనిషి మనస్సులోని దోషములు  మాలిన్యాము. స్వార్ధము అతని మాటలలలోనే బయటపడుతాయి. 

2. కుమ్మరి చేసిన కుండకు అగ్ని పరీక్ష అవసరం, అగ్నిలో కాల్చబడాలి. అలాగే మనిషికి పరీక్ష అతడి మాటలే. 

3. చెట్టు కాపును బట్టి అదెంత  బలమైనదో ఊహించవచ్చు అలాగే మాట తీరును బట్టి అతడు మంచి వాడా , చెడ్డ వాడ అని అర్ధం చేసుకోవచ్చు. పండును బట్టి చెట్టు స్వభావమును తెలుసుకుంటారు. పండు మంచిదైతేనే చెట్టు మంచిదని, పండు చెడ్డదైతే చెట్టు మంచిది కాదని ఎలా అనుకుంటామో అలాగే మనిషి మాటలను బట్టి అతను ఎలాంటి వాడు, అతని స్వభావం ఏమిటి అని తెలిసిపోతుంది. 

మనిషికి ఉన్న మాట దేవుడిచ్చిన వరం. ఆ వరంతో దేవుడిని స్తుతించడానికి, ఇతరులకు తెలియచేయడానికి ఇతరులతో స్నేహ బంధాలు ఏర్పరుచుకొని వారితో శాంతి, సమాదానంతో జీవించడానికి వినియోగిస్తున్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఇచ్చే వరములను సద్వినియోగం చేసుకుంటే వారి జీవితం దేవునిలో వర్ధిల్లుతుందని, దానిని దుర్వినియోగం చేసుకుంటే జీవితం పాడైపోతుంది. 

మనిషికి మాట శుద్ది ఎంతో అవసరం : - 

మన హృదయం పవిత్రంగా ఉంటే మన మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. మన హృదయంలో  స్వార్ధము, కోపము, అసూయ,పగ, దురాశ ఉంటే మన మాటలు, చేతలు, ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. 

మన మాటలు మన హృదయాన్ని బహిర్గతం చేస్తాయి. our speach reveals our heart. తల్లి మాటలను బట్టి బిడ్డను ఎంత ప్రేమిస్తుందో అర్ధంచేసుకోవచ్చు.  ఇతరులు మాట్లాడే విధానమును బట్టి వారు అభిమానంతో , ప్రేమతో మాట్లాడుతున్నారా? లేదా అని అర్ధం చేసుకోవచ్చు. 

మనిషి నీతి న్యాయముతో కూడిన మాటలు ఆనందము, సంతోషముతో కూడిన మాటలు ఓదార్పు,సహనం ,ప్రోత్సాహపు మాటలు, శాంతికరమైన మాటలు, క్షమించమని అడిగేమాటలు దేవుని బిడ్డల నుండి వస్తాయి. మనము కూడా అలాంటి  వారికే ప్రాముఖ్యతను  ఇచ్చి వారినీ ఇష్ట పడటమే కాదు వారి వలె ఉండటానికి ప్రయత్నించాలి. అబద్దపు మాటలు చాడీలు , గొడవలు పెట్టె మాటలు, బూతు మాటలు ఇతన్నింటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. "ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్ధమైన మాటకు సమాదానం ఇవ్వవలసి ఉన్నది."మత్తయి 12:36 . అదే విధంగా నీ మాటలు బట్టి నీవు దోషివో , నిర్ధోషివో కాగలవు (మత్తయి 12:37). మన మాటలు మనం వ్యక్తిత్వాన్ని, మనస్సును తెలియ చేస్తాయి. గ్రీకు తత్వవేత్త సోక్రటీసు గారు చెప్పిన మూడు ద్వారములు : మనం నోటి మాట మూడు ద్వారములు దాటి బయటకు రావాలి, 1. మనము చెప్పే మాట నిజమేనా, 2. మనము చెప్పే మాట అవసరమేనా  మరియు 3. మనము చెప్పే మాట ఉపయోగమేనా. మన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెళువడును(లూకా 6:45). 

రెండవ పఠనం :-  1 కోరింథీ 15:54-58 

ఈనాటి రెండవ పఠనాన్ని  ధ్యానించుకుందాం. ప్రియమైన  స్నేహితులారా  రెండవ పఠనంలో పునీత పౌలుగారు కోరింథీ  ప్రజలతో మాటలాడుతున్న  మాటలు  మనం శ్రద్దగా పరిశీలిస్తే, ఆయన ఆ ప్రజలకు దేవునితో ఉండటానికిధైర్యాన్ని ఇస్తున్నారు. 1 కోరింథీ 15:58 వ వచనంలో మూడు ముఖ్యమైన మాటలను కోరింతి ప్రజలకు చెపుతూ మనోధైర్యాన్ని, దేవుని యందు ధృడత్వాన్ని వారికి అందిస్తున్నాడు. ఆ మూడు విషయాలను తమ జీవితంలో నెరవేరిస్తే  దేవునిలో నిలబడగలవు అంటున్నారు. ఆ మూడు విషయాలు  మొదటిది ప్రియతమ సోదరులారా , దేవుని బిడ్డలారా దేవునిలో ధృడముగా, స్థిరముగా నిలబడుడు అని అంటున్నారు. అంటే మనం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినను భాదలు వచ్చినను ఇబ్బందులకు గురి అయినను దేవుని  యెడల అపారమైన ప్రేమ, నమ్మకము , విశ్వాసము కలిగి ఉండమంటున్నారు. భౌతికమైన మన శరీరానికి అమరమైన క్రీస్తుని ధరించి ఆయనతో స్థిరంగా నిలబడమంటున్నారు పౌలుగారు. 

రెండవదిగా ప్రభువు కార్యములలో సర్వదా శ్రద్ద చూపుడు. ఈ మాటలకు అర్దం దేవునియొక్క పనులలో సంఘం యొక్క నడిపింపులో , దైవ జనులకు సహాయము చేయుటలో ప్రభువునకు సంభందించిన పనులు చేయుటకు ముందుండి ఆ దేవుని దైవత్వంలో పాలి భాగస్తులై ఉండమంటున్నారు. ఆత్మలను దైవ సన్నదికి నడిపించ ప్రభు సేవలో ప్రభుని కార్యములో సర్వదా శ్రద్ద చూపుచు ఈ లోక వ్యామోహాలకు, ఈలోక  విషయాలకు నీ హృదిలో చోటు ఇవ్వక ప్రభువునకు సంభందించిన ప్రతికార్యములో శ్రద్ద చూపాలని పౌలుగారు పలుకుతున్నారు. ఇక , మూడవదిగా ఈ రెండు కార్యములను నీ హృదయ పూర్వకముగా చేసిన యెడల మీరు చేసే ఎట్టి కార్యాలు నిష్ప్రయోజనం కాదని పౌలుగారు పలుకుతున్నారు. 

సువిశేషం :- లూకా 6: 39-45 

ఈనాటి సువిశేషంలో కూడా మొదటి పఠనంలో చూసిన విధంగా వృక్షములను బట్టి దాని ఫలములుండును. అదే విధముగా ఒక మనుజుని మాటలు ఆయన తలంపులను బయలుపరచుచుండు సిరా 27:6 లో చూస్తున్నాం. సువిశేషంలో ప్రభుని మాటలు  "మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు. లూకా 6:43. పండుని బట్టి ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు. కోరింద పొదలనుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుశ్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును.  "ఎలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. లూకా 6:43-45. 

మనం మాట్లాడే మాటలు మన హృదయం నుండి వస్తు వుంటాయి. మన అంతరంగం పవిత్రంగా ఉంటే మన మాటలుకూడా మంచిగా ఉంటాయి. మన హృదయంలో స్వార్ధం, క్రోధం, అసూయ , పగ , దురాశలు  ఉన్నప్పుడు మన యొక్క మాటలు, చేతలు ప్రవర్తన, నడవడిక అసభ్యంగా ఉంటాయి. అవినీతిగా ఉంటాయి. దురాశలతో నిండిన హృదయం నుండి మంచి మాటలు, చేతలు ఉద్భవించవు. మన ఆంతరంగిక జీవితానికి బహిరంగ ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పరిసయ్యుల బహిరంగ ప్రవర్తనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. వారికి మాటలు , చేతలు చట్ట పరంగా ఉంటే చాలు. ఆంతరంగిక ఉద్దేశాలు, బావాలు ఎలా ఉన్నా పర్వలేదు. యేసు ఈ పరిసయ్యులను ఉద్దేశించి ఈ పఠనములోని వచనాలు పలికారు. వారి యొక్క చెడు డాంబిక ప్రవర్తనను, భక్తి  కార్యాలను యేసు ఖండించారు. ప్రజల పొగడ్తలకై ఎన్నో చేశారు కానీ హృదయ పూర్వకంగా దేవుని ఆరాధించలేదు. వారు పెదవులతో దేవుని ఆరాధించేరే కాని వారి హృదయాలు ఆయనకు ఎంతో దూరంగా ఉన్నాయి. వారి కార్యలన్నీ చెట్ల పండ్లు వంటివే. ఎందుకంటే అవి అన్నీ వారి హృదయంతరిక భక్తి హీనత నుండి, అవినీతి నుండి ఉద్భవిస్తాయి. మానవుని యొక్క మాటకు, కార్యనికి  విలువను ఇచ్చేది అతని ఉద్దేశం. 

మన అంతరంగం పరిశుద్దంగా ఉన్నపుడే మన మాటలు కార్యాలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. క్రైస్తవులమైన మనము అనేక సార్లు ఆ పరిసయ్యుల వలె ప్రవర్తిస్తుంటాము. మన హృదయం అవినీతిలో,దురాశలతో నిండి ఉన్నప్పుడు పరిసయ్యుల వలె కాక మన హృదయాన్ని పరిశుద్ద పరచుకొని ఇతరులకు మార్గదర్శులం అవ్వాలి. అనగా క్రైస్తవుని హృదయంలో మన హృదయంలో పవిత్రత, నీతి , న్యాయం, ప్రేమ ,శాంతి ,సమాదానం, ఆనందం సహకారం  మొదలైనవన్ని నెలకొంటాయి, అప్పుడు మానవుడు పలికే ప్రతిమాట నిజమైన క్రైస్తవ స్వభావాన్ని నిరూపించగలదు. 

ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా హృదయ పరిపూర్ణత, పరిశుద్దత నుండే నోటి మాట వస్తుంది. లూకా 6:45. కాబట్టి మన హృదయాన్ని నిరంతరం (శుద్ది) ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడే మన ఆలోచన ,మాట , యుక్తవిధంగా ఉంటాయి. పది మందికి ఉపయోగపడుతాయి. 

Br. Manoj 

19, ఫిబ్రవరి 2022, శనివారం

7 వ సామాన్య ఆదివారం (2)

 7 వ సామాన్య ఆదివారం 

1 సామువేలు 26:2,7-9, 12-13,22-23,   1 కోరింథీ 15:45-49, లూకా 6:27-38 

నేటి దివ్య పఠనాలు దేవుడిచ్చిన బంగారు సూత్రం గురించి భోదిస్తున్నాయి. ఇతరులు మీకు ఎట్లు  చేయాలనుకుంటారో అట్లే  పొరుగు  వారికి చేయుటయే బంగారు సూత్రం. ఇంకోక విధంగా ఆలోచిస్తే ఆ బంగారు సూత్రం  సోదరి సోదరుల పట్ల ప్రేమ కలిగి జీవించుట. అది శత్రువులైన మిత్రులైన సరే మనం ఒకరినొకరు ప్రేమించుకొని జీవించాలని అని ప్రభువు తెలుపుచున్నారు. 

నేటి పఠనాలలో ప్రభువు శత్రువులను ప్రేమించి, క్షమించి వారి కోసం ప్రార్ధించాలి అనే అంశములు ఎక్కువగా కనబడుచున్నాయి. 

ఈనాటి మొదటి పఠనంలో దావీదు రాజు యొక్క మంచి మనస్సును మనం చూస్తున్నాం. దావీదు మహారాజు దేవున మనస్సు కలిగి తన శత్రువైన సౌలును కాపాడిన విధానమును మొదటి పఠనం ద్వార వింటున్నాము. దేవుడు  సౌలు తరువాత దావీదును  యిస్రాయేలు రాజుగా అభిషేకించిన తరువాత దావీదు యిస్రాయేలు ప్రజలకు ఎన్నో రకాలైన విజయాలు చేకూర్చారు, ప్రజల్లో సంతోషం నింపారు, వారిని రక్షించారు. 

సౌలురాజు కన్నా చక్కగా పాలన చేస్తూ ప్రజల యొక్క ఆధరాభిమానాలు పొందుతున్న దావీదు పట్ల సౌలుకు అసూయ కలిగింది, దానితో ఏ విధంగానైనా దావీదును చంపాలనుకున్నారు. తన యొక్క రాజ్యాధికారం పోతుందని సౌలు రాజు భయ పడ్డాడు. తన యొక్క కుమారులకు సింహాసనం దొరకదని ద్వేషంతో ఉన్నాడు. 

అసూయ ద్వేషం వల్ల ఎలాగైనా సరే సౌలు దావీదును హత్తమార్చాలని ఆ పనిలో మూడు వేల మందిని వెంటబెట్టుకొని దావీదు ఉన్న సీపు ఎడారి ప్రాంతమునకు సౌలు ప్రయాణమై పోయాడు. సౌలు దావీదును చంపాలనుకొని వెళితే దేవుడే సౌలును దావిదునకు అప్పజెప్పాడు. ఎందుకంటే దావీదు దేవునికి విధేయించినవాడు. దేవుని చిత్తాను-సారంగా నడుచుకున్న వ్యక్తి. ఒక విధంగా ఆలోచిస్తే  దేవుడు దావీదు పక్షమున నిలబడిన వారే. ఎందుకంటే దావీదు సౌలు శిబిరంలోకి ప్రవేశించే సమయానికి అందరు నిద్రమత్తులో ఉన్నారు. దేవుడే వారిని నిద్రించేలా చేసి ఉండవచ్చు. కనీసం ఒక్కరు కూడా మెళకువగా ఉండలేదు. 

సౌలుకు  దావీదు ఉన్న స్థలం తెలుసు కాని దావీదును చంపడానికి సౌలు వస్తున్నాడని బహుశా దావిదునకు దేవుడే ఎరుక పరచి ఉండవచ్చు. దావిదునకు వచ్చిన అవకాశమును ఆయన వినియోగించుకొనలేదు. తనను చంపాలనుకున్న సౌలును దావీదు రాజు  చంపలేదు. ఎందుకంటే దావీదు రాజు సౌలు దేవుని అభిషిక్తుడు అని గ్రహించాడు. 1 సమూ 24:10,కీర్తన 105:15.  

స్వయంగా దేవుడే అతన్ని రాజుగా అభిషేకించారని గుర్తించాడు. దేవుని యొక్క ప్రతి రూపం సౌలులో ఉందని తెలుసుకున్నారు. దేవుడే ప్రేమతో ఆయన్ను ఎన్నుకొన్నాడని గ్రహించాడు. దావీదు రాజు మాత్రము ఎప్పుడు కూడా సౌలును గౌరవించి జీవించిన వ్యక్తియే. అయిన కానీ సౌలు, దావీదు చేసిన అన్నీ మేలులు మరచిపోయారు. 

దేవుని అభిషిక్తుని తాకకూడదని, ఆయనకు హాని చేయకూడదని దావీదు భావించాడు, వెనుకకు తిరిగి వచ్చాడు. సౌలు పాపి అయినప్పటికిని అసూయ ద్వేషం, పగ కలిగి ఉన్నప్పటికీ బలహీనత ఉన్నప్పటికీ దావీదు ఆయనకు ఎటువంటి ముప్పు కలుగ చేయలేదు. ఆయన్ను తాక లేదు. 

మన యొక్క జీవితాలలో ఈ విషయం మరచిపోతాం. అభిషేకించబడిన వారికి వ్యతిరేఖంగా చాలా సంధర్భాలలో ఉంటాం. వారి యొక్క పేరు చెడగొడతారు, వారికి హాని కలుగ చేస్తారు. దావీదు సౌలును దేవుడు  అభిషేకించిన విధానం గ్రహించి ఆ అభిషేకంలో ఉన్న పవిత్రత తెలుసుకున్నారు, కాబట్టియే సౌలుకు ఎటువంటి కీడు తల పెట్టలేదు. మనం కూడా ఇది నేర్చుకోవాలి. సౌలుకు దేవుడు ప్రసాదించిన రాజ్యాధికారాన్ని దావీదు ఎప్పుడు గౌరవిస్తూనే జీవించారు. దావీదు సౌలును గౌరవించాడు, తన రాజుగా అంగీకరించాడు,తన యొక్క ప్రభువుగా తనను ప్రేమించి సేవలందించాడు. 

సౌలుకు ఎంత ద్వేషం ఉందో దావీదుకు సౌలు పట్ల అంత గౌరవం, ప్రేమ ఉన్నాయి. దావీదు శత్రువుల యెడల చూపిన ప్రేమ సౌలు జీవితం నే మార్చినది. శత్రువులను ప్రేమించుటయే దేవుని యొక్క మనస్సు, దావీదు దేవుని మనస్సు కలిగి జీవించాడు. దావీదు సౌలు వలె పవిత్ర గ్రంధంలో ఇంకొక ఉదాహరణ చూస్తాం. హమాను - మోర్ధకై .

ఇతరులకు కీడు తల పెట్టాలని భావించి తామే ప్రమాదంలో  పడిన వ్యక్తులు, మనం చాలా మందిని చూస్తాం. వారిలో సౌలు వలె హమాను కూడా వస్తారు. హమాను  యొక్క మనస్తత్వం ఏమిటంటే అందరు నా క్రింద అణగి ఉండాలని, తనకు తలవంచి  మిగతవారు జీవించాలి అనే అహం తో జీవించేవాడు. మోర్ధకై మాత్రం దేవుడినే ఆరాధించే వ్యక్తి, దేవునికి మాత్రమే తల వంచి , విధేయించి  జీవించే విశ్వాస పాత్రుడు. 

మోర్ధకై తనకు తల వంచ లేదని హమాను మోర్ధకై జాతిని నాశనం చేయాలనుకున్నాడు.  చివరకి తాను చేయించిన ఉరి కంబానికి తానే వ్రేలాడాడు. తాను ఏ అపాయం అయితే ఇతరులకు తల పెట్టాలనుకున్నాడో దానిలో అతనే పడిపోయాడు. తాను తీసిన గోతిలో తానే పడిపోయాడు. మనం కూడా సాధ్యమైనంత వరకు హాని చేయకుండా మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. 

దావీదు రాజు తనకు అపకారం చేయదలచిన సౌలుకు ఉపకారం చేశాడు. అపకారం చేసిన వారికి అపకారం చేయక ఉపకారం చేయాలి అని స్వయంగా పౌలు గారు తెలుపుచున్నారు. రోమి 12:17-20. అపకారం చేసిన వారికి ఉపకారం చేయటయే దైవ లక్షణం కాబట్టి మనం కూడా అలాంటి దైవ లక్షణం కలిగి జీవించాలి. 

రెండవ పఠనంలో  పౌలు గారు మొదటి ఆదాము , చివరి ఆదాము మధ్య గల  తేడాను వివరిస్తున్నారు. మొదటి ఆదాము ఈ లోకంలో సృష్టించబడిన వ్యక్తి , ఆయన ఈ లోకానికి చెందిన వ్యక్తి అని పౌలు గారు వివరిస్తున్నారు. 

కొరింతు సంఘంలో ఉన్న విశ్వాసులకు, శరీరం యొక్క ఉత్తనమునకు సంభందించిన కొన్ని సందేహాలు ఉన్నాయి. యేసు క్రీస్తు వలె తాము  కూడా శరీరంతో పునరుత్థానము చెందుతామా?లేదా? అన్నది వారి యొక్క ప్రశ్న. 

దానిలో భాగంగానే పౌలు గారు చక్కటి వ్యత్యసాలను ప్రజలకు వివరిస్తున్నారు. మొదటి ఆదాము భౌతిక జీవి, చివరి ఆదాము ఆత్మ సంబంది. ఆయన పరలోకం నుండి వచ్చిన వారు. వీరిద్దరి మధ్య తేడా ఉంది. ఒకరు భూలోక సంబంధులు , రెండవ వ్యక్తి పరలోక సంబంధులు. భువి నుండి పుట్టిన వానిని  పోలిన మనము దివి నుండి వచ్చిన వాని పోలీకను పొందగలము. మన జీవితాలు పరలోకం నుండి వచ్చిన దేవుని పోలికను పొందగలవు, మన జీవితాలు మార్చుకున్నప్పుడు.  

మన శరీరాలు కూడా పునరుత్థానం అవుతాయి, అందుకే క్రీస్తు ప్రభువు మానవ శరీరమున జన్మించి, శ్రమలు అనుభవించి, మరణించి, పునరుత్థానం అయ్యారు. మనం కూడా చివరి ఆదాము అయిన క్రీస్తు ప్రభువును పోలి జీవించాలి. అలా పోలిక కలిగి జీవిస్తామని దేవుడే స్వయంగా పౌలు గారు ద్వారా పలుకుచున్నారు. 

ప్రతి మనిషి కూడా ఆదాము యొక్క మానవ స్వభావంతో, పాపంలో భాగస్తులై జీవించిన విధంగా క్రీస్తు నందు జ్ఞాన స్నానం పొందిన తరువాత ఆయన యొక్క ఆధ్యాత్మిక స్వభావం కలిగి జీవిస్తాం. కాబట్టి మనం కూడా పునరుత్థానం చెందగలం. 

మనం జ్ఞాన స్నానం పొందడం ద్వారా క్రీస్తు నందు  ఉన్నాము. క్రీస్తు సంబంధులం అయ్యాము . కాబట్టి మనకు పునరుత్థానం నిరీక్షణ ఉంది. 

సువిశేష పఠనంలో యేసు ప్రభువు మానవ జీవితంలో కొన్ని కష్ట తరమైన పనులు చేయమంటున్నారు. మానవ ఆలోచనలతో జీవిస్తే అవి కష్టం కానీ దైవ మనస్సు కలిగి జీవిస్తే ఇది సాధ్య పడుతుంది. 

సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మాటలు అందరిని ఆశ్చర్యచకితులను చేశాయి. ఇప్పటి వరకు విన్న మాట ఏమిటంటే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది కానీ ఇప్పుడు ప్రభువు శత్రువులను ప్రేమించమని పలుకు చున్నారు. ఈ మాటలు ఏ వ్యక్తియు చెప్పలేదు. ఇంత వరకు మొట్ట మొదటి సారిగా యేసు ప్రభువు చెపుతున్నారు. 

పూర్వ వేదంలో పొరుగు వాడు అంటే కేవలం ఒక యూదుడుకి ఇంకొక యూదుడు పొరుడు వాడు. ఒక యూదునకు అన్యుడు పొరుగువాడు కాదు శత్రువే. 

యేసు క్రీస్తు ప్రభువు పొరుగు వారు అనే పదంకు  క్రొత్త అర్దం ఇస్తున్నారు. మానవులంతా మన పొరుగువారే. మిత్రులు మాత్రమే కాదు శత్రువులు కూడా మన యొక్క పొరుగువారే అని తెలుపుచున్నారు. ఇక్కడ మనం ఒక  విషయం గమనించాలి యేసు క్రీస్తు ప్రభువు 

-శత్రువులను ప్రేమించమంటున్నారు

-శపించే వారిని ఆశీర్వదించమంటున్నారు 

-ద్వేషించే వారికి మేలు చేయండి అని అంటున్నారు. 

-బాధించే వారికోసం ప్రార్ధించమంటున్నారు 

- ఒక చెంప మీద కొట్టిన వానికి ఇంకొక చెంప చూపించండి 

-పై బట్టను ఎత్తుకొని పోయేవానికి అంగీని కూడా ఇవ్వమన్నారు. 

- అడిగిన ప్రతి వానికి ఇవ్వమంటున్నారు 

ఇవ్వన్నీ  కూడా మానవులుగా సాధ్యమయ్యేనా 

-మనల్ని  తిరస్కరించిన వారిని ఎలా అంగీకరిస్తాము?

-మనకు కీడు చేసె వారికి ఎలా మేలు చేస్తాం? 

- మన నాశనం కోరుకున్నవారిని ఎలా ప్రేమిస్తాం?

-శత్రువుల కోసం ఎలా ప్రార్ధిస్తాం 

-మనకు హాని చేసే వారితో ఎలా స్నేహం చేయగలం 

ఇవ్వన్నీ కూడా మానవులుగా కష్టతరమైన పనులే. అయినప్పటికీ ఒక క్రైస్తవునిగా మన యొక్క జీవితం భిన్నంగా ఉండాలి. 

మానవ స్వభావం ధరించి జీవించే మనకు ఇది అసాధ్యం కాని దేవుని దేవుని స్వభావం ధరించి జీవిస్తే సాధ్యమే. మనకు సన్నిహితులైన బంధు మిత్రులను ప్రేమించినట్లు మన శత్రువులను ప్రేమించలేం. అది అసాధ్యం కాని దేవునిలో ఏకమై జీవించినప్పుడు ఇది సాధ్యం. 

-ప్రభువు అంటున్నారు, నేను లేక మీరు ఫలింపజాలరు -యోహను 15:5. ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండవ చెంపను కూడా చూపించట నిజంగా గొప్పతనమే. మన జీవితంలో ఇది చక్కగా పాటిస్తే ఎదుటి వారు మారు మనస్సు పొందుతారు. 

మాటకు మాట, దెబ్బకు దెబ్బ సూత్రం పాటిస్తే ఈ లోకంలో మిగిలేది అశాంతియే, గొడవలు మాత్రమే మిగులుతాయి. అందుకే మన జీవితాలు మార్చుకొని దేవుడు చూపిన బాటలో నడవాలి. మన జీవితంలో నిస్వార్ధమైన ప్రేమను మనం పంచాలి. నిస్వార్ధమైన ప్రేమ అంటే ఎవ్వరిని కూడా వేరు చేయకుండా అందరిని ప్రేమించాలి. నిస్వార్ధ ప్రేమను మనం వ్యక్త పరిస్తే, అది  నిజంగా మనం దేవుని బిడ్డలమని నిరూపిస్తుంది. 

దేవుడు ఎలాగైతే శత్రువుల మీద కూడా వర్షాన్ని ,ఎండను కురుపిస్తూ ప్రేమను పంచుతూ ఉన్నారో అలాగే మనం కూడా దుష్టులకు మేలు చేయాలి. దేవుడు మనలను ప్రేమించిన విధంగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి. మనం పాపం చేసి ఆయనకు శత్రువులైనప్పటికి ఆయన మనలను ప్రేమించారు. 

యేసు క్రీస్తు ప్రభువు  తన శత్రువులను ద్వేషింపక ప్రేమించారు,  క్షమించారు. అలాగే వారి కోసం ప్రార్ధించారు. ఆయన యొక్క గొప్ప ప్రేమతో వారి జీవితమునే మార్చారు. శత్రువులను ప్రేమించుట కష్టమైన పని, అసాధ్యం అనిపిస్తుంది. అయితే ప్రభువు వారికి తన జీవితం ద్వార సుమాతృకను ఇస్తున్నారు. 

సువిశేషంలో చెప్పబడిన విషయాలు అన్నీ మానవ స్వభావంతో ఆలోచిస్తే కష్టమే కాని దేవుని వలె జీవిస్తే తప్పని సరిగా సాధ్యం అవుతుంది. 

-యేసు క్రీస్తు ప్రభువు శత్రువులను  ప్రేమించారు. 

-ద్వేషించే వారికి మేలు చేశారు 

-బాధించిన వారి కోసం ప్రార్ధించారు 

-శపించిన వారి బిడ్డలను దీవించారు. 

మానవ జీవితంలో క్రైస్తవ జీవితం, క్రీస్తు అనుచరుడిగా ఉండే వారు భిన్నంగా ఉండాలంటే ఇవ్వన్ని పాటించాలి.  మనందరం ఈ లోకం ఆశలు , ఆలోచనలు మించి దైవరాజ్య స్థాపన  కోసం, దేవునిలో ఐక్యమై జీవించుటకు కృషి చేస్తే ఇది సాధ్య పడుతుంది. 

మనం జీవితంలో దేవునితో  అంటుకట్టబడితే  మనం మారిపోతాం, దేవుని వలె ప్రేమిస్తాం. అసాధ్యమైనవి సుసాధ్యమవుతాయి. మనం జీవితం ప్రత్యేకంగా ఉండాలంటే  ద్వేషాలు, పగలు అసూయలు విడిచిపెట్టి ప్రేమను అలవరుచుకోవాలి. ప్రేమతో జీవిస్తే కష్టమైన పనులు అన్నీ సక్రమంగా చేయవచ్చు. 

నేటి పఠనాల ద్వారా దేవుడు మనందరిని ఒక క్రొత్త జీవితమునకు ఆహ్వానిస్తున్నారు. దైవ స్వభావం కలిగి, క్రీస్తులో ఐక్యమై క్రీస్తుకు సాక్షులుగా జీవించుదాం . 

Rev. Fr. Bala Yesu OCD  

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

7 వ సామాన్య ఆదివారం

7 వ సామాన్య ఆదివారం


1 సామువేలు 26:2,7-9, 12-13,22-23,   1 కోరింథీ 15:45-49, లూకా 6:27-38 

నేను మీతో చెప్పుచున్నది ఏమన్నా: మీ శత్రువులను  ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించించిన వారికీ మేలు చేయుడు లూకా: 6 : 27 

* క్రీస్తు నాదునియందు ప్రియ దేవుని బిడ్డలారా మరియు క్రైస్తవ విశ్వాసులారా. ఈ నాడు తల్లి శ్రీసభ  సామాన్యకాలపు ఏడవ  ఆదివారంలోనికి ప్రవేశిస్తుంది. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు శత్రువులను ప్రేమించుట మరియు  క్షమించుట అను అంశం  గురించి తెలియజేస్తున్నాయి. 

* క్రైస్తవ సంఘం  అంటేనే ప్రేమ, ప్రేమ లేనిదే క్రైస్తవ సంఘం  లేదు. ఈ ప్రేమ అనేది మన సొంతవాళ్లకి, దగ్గర వాళ్ళకి మాత్రమే కాదు, ఈ ప్రేమ అనేది విశ్వవ్యాప్తంగా ఉండాలని తల్లి శ్రీసభ మనందరిని కూడా ఆహ్వానిస్తోంది.

* లూకా 6 :36 లో అంటున్నారు మీ తండ్రి వలెనే మీరు కనికరం గలవారై యుండుడి అని, ఎందుకంటే మనలను ద్వేషించే వారికీ మేలు చేయాలి, మనలను శపించువారిని ఆశీర్వదించాలి, బాధించువారికై  ప్రార్ధించాలి.  ఇతరుల నుండి మనం ఏమి కోరుకుంటామో అదే మనము ఇతరులకు చేయాలి అప్పుడే  దేవుడు చెప్పినటువంటి ప్రేమ నెరవేరుతుంది. 

* ఆలా కాకుండా మనలను ప్రేమించిన వారినే ప్రేమిస్తే, తిరిగి ఇవ్వగలిగినవారికే సహాయం చేయగలిగితే అందులో ఎటువంటి ప్రత్యేకత లేదు అని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. 
* ఈనాటి మొదటి పఠనంలో  దావీదును చంపాలనుకున్న సౌలును సహితం దావీదు  క్షమించి సౌలును వదలివేయటం మనం చూస్తున్నాము.

* అదే విధంగా క్రీస్తు యొక్క జీవితం ద్వారా సువిశేష  పఠనంలో క్రీస్తు ప్రభు  అంటున్నారు నియొక్క శత్రువును ప్రేమింపుము అని చెబుతున్నారు, ఎందుకంటే క్రీస్తు ప్రభువును ఎంతగానో ద్వేషించి, క్రూర హింసలు పెట్టి, కొట్టి, తిట్టి, బళ్ళేముతో తన ప్రక్కన   పొడిచిన కూడా క్రీస్తు ప్రభువు వారికీ తిరిగి  హాని చేయలేదు , వారిని ప్రేమతో క్షమించి తండ్రి దేవునికి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. తాను జీవించి ఉన్నంత కాలం ప్రేమతోనే జీవించాడు, ప్రేమలో జీవించాడు, ప్రేమిస్తూనే జీవించాడు, అదే ప్రేమను మరణము మరియు పునరుత్తనం  వరకు తీసుకోని వెళ్ళాడు, అదే ప్రేమను ఇప్పుడు పొందుతున్నాడు.

మనము మొదటిపఠనములో చూసినట్లైతే శత్రువును ఎలా ప్రేమించాలి, క్షమించాలి అనే అంశం గురించి తెలియజేస్తుంది. దావీదును చెంపలనుకున్న సౌలు రాజునూదావీదు ఏ విధంగా క్షమించాడో, చంపకుండా వదలివేసాడో మనము మొదటిపఠనములో ఆలకిస్తున్నాము.

1 ) సౌలు ఎవరు 
* బెన్యామీను గోత్రమునకు చెందిన వాడు 
* ఇశ్రాయేలీయుల మొదటి రాజు 
* సమూవేలు సౌలును ఆభిషెకించి ఇశ్రాయేలీయులకు రాజుగా చేసెను 
* 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు 
*దేవుని యొక్క ఆజ్ఞను దిక్కరించాడు.

దావీదు ఎవరు  
* యూదా గోత్రమునకు చెందిన వాడు 
*ఇశ్రాయేలీయుల రెండొవ రాజు 
*సమూవేలు  ఆభిషెకించిన కూడా దావీదు మాత్రం దేవుడు ఇచ్చేటి వంటి సమయం కోసం వేచిచూసాడు 
*40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు 
*దేవునికి అను గుణంగా జీవించాడు 
*యోనాతానును మంచి స్నేహితుడు.

ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు, వారియొక్క జీవితంలో అసలు సౌలు దావీదును ఎందుకు చంపాలని అనుకున్నాడు అంటే దావీదుపైన అసూయతో-చంపాలనుకున్నాడు. అందుకు తాను 
ప్రయత్నించాడు. అది తెలుసుకున్న దావీదు సౌలుకు దొరకకుండా అరణ్యములో దాగుకున్నాడు. అది తెలుసుకొన్న సౌలు దావీదును చంపుటకు మూడువేలమంది యోధులను వెంటపెట్టుకొని చంపుటకు బయలుదేరాడు. అలా దావీదును వెదకి దొరకక అలసిపోయినటువంటి సౌలు సైనికులతో కలసి విశ్రాంతి తీసుకుంటూ నిద్రించినప్పుడు సౌలుని చూసి చంపడానికి వచ్చినపుడు, దావీదుమాత్రం సౌలును చంపుటకు నిరాకరించాడు. ఎందుకంటే సౌలురాజు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి.  దావీదు సౌలు రాజు యొక్క ఈటెను, మంచినీటి కుండను ఆయనతోపాటు తీసుకుని పోయాడు.కాబట్టి ఈయొక్క మొదటి పఠనంలో క్షమాగుణం అనే అంశం గురించి తెలియజేస్తుంది. 
 
సువార్తా పఠనము :లూకా :
నేటి సువార్తాపఠనమును చూసినట్లయితే, ఈ సువార్తను క్రీస్తు ప్రభువు రెండు విధాలుగా విభజించాడు:

మొదటిది:
మనలను ద్వేషించినవారికి మేలుచేయాలి.(  వచనము).
మిమ్ము శపించినవారిని ఆశీర్వదింపుడు(  వచనము).
మిమ్ము భాదింపువారికై ప్రార్ధింపుడు(  వ వచనము)

రెండవది: 
నీపైబట్టలను ఎత్తుకొని పోవువాడికి నీ అంగీనికూడా తీసుకొనిపోనిమ్ము 
నిన్ను ఒకచెంపపై కొట్టిన వానికి నీ రెండవ చేంపను కూడా చూపుము.
నిన్ను అడిగిన ప్రతివారికి ఇమ్ము, నీసొత్తును ఎత్తుకొని పోవువాడిని మరలా అడగవద్దు.

 ఈ రెండిటిలో మనము ముఖ్యముగా క్షమించేగుణాన్ని తెలుసుకుందాం.  శత్రువులను ఎలా ప్రేమించాలో యేసు ప్రభువు మనకు చూపించియున్నారు.

 దేవుడు తన వ్యక్తిగత జీవితముద్వారా  తన  ప్రేమను మనలో పెంచి  మనలను తన బిడ్డలుగా చేసుకున్నట్టుగానే క్రైస్తవులైన మనమందరము కూడా ఇతరులతో అలా మెలగడమే దేవుడు ఆశించే క్రైస్తవ నీతి  లేదా జీవితము.
సువార్తాపఠనంలో ప్రేమించండి, మంచిచేయండి, ఇవ్వండి అనే అంశాలను గురించి తెలియజేస్తుంది. కాబట్టి దేవునియొక్క బిడ్డలమైనటువంటి మనము అంటే క్రైస్తవులము, దేవుడు ఇచ్చినటువంటి  ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని యేసుప్రభువు సువిశేషములో స్పష్టం చేసాడు.

  క్రైస్తవ జీవితం అనేది సోదర ప్రేమ, క్షమా గుణము .  మనము ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తామో అప్పుడే మనలను కూడా అదేవిధముగా ప్రేమిస్తారు అని దేవుడు ఈనాడు తెలియజేస్తున్నాడు.
 చివరిగా మనము దేవునియొక్క శిష్యులుగా పిలువబడాలి అంటే, అందరినీకూడా (శత్రువులను) సమానముగా ప్రేమించగలగాలి. క్రీస్తు ప్రభువు ఏవిధముగానయితే సిలువపై వ్రేలాడుతూ కూడా తన ప్రేమను వ్యక్తపరిచారు, అందరికోసం ప్రార్ధన చేశారు. అదేవిధముగా మనం కూడా చేయాలి. శత్రువులను ప్రేమించడము అంటే, వారిని మనస్ఫూర్తిగా క్షమించడం. వారికి మంచిజరగాలని కోరుకోవడం.వారికి మనము చేయగలిగిన మంచిచేయడం, వారిని దేవుడు దీవించాలని ప్రార్ధన చేయడం. అలా అందరినీ ప్రేమించినందులకు దేవుడు మనకు ఒసగే గొప్ప బహుమానము మనం పొందుతాము. 

Br. Johannes 

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...