9, జులై 2022, శనివారం

15వ సామాన్య ఆదివారము

15 సామాన్య ఆదివారము

ద్వితీ:- 30:- 10-14, కొలిసి:- 1:- 15-20, లూకా:- 10:- 25-37

క్రిస్తునాధునియందు ప్రియా దేవుని బిడ్డలారా  నాడు తల్లి తిరుసభ 15 సామాన్య ఆదివారంలోనికి అడిగిడుతుది.
 నాటి   దివ్య గ్రంథపఠనాలు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే దేవుని ప్రేమ మరియు 
మానవుని ప్రేమ. 

మనము దివ్య గ్రంధాన్ని మొదటినుంచి చివరివరకు క్లుప్తంగా పరిశీలించినట్లైతే అనగా ఆదికాండము నుంచి దర్శనగ్రంధం వరకు పరిశీలించినట్లయితే మనకు ముఖ్యముగా అతి ప్రధానముగా తెలిపేది లేదా బోధించేది ఏమిటంటే దేవుని ప్రేమ మరియు పొరుగువాని ప్రేమగురించి బోధిస్తుంది.
ఆదికాండములో ఆదాము మరియు అవ్వ సృష్టిల ద్వారా దేవుని ప్రేమను చూస్తాముదేవుడు ప్రేమతో తన రూపంలో ఆదామును తయారు చేయటం తరువాత తాను ఎన్నుకొన్న మనుషుల ద్వరా ప్రవక్తల ద్వారాన్యాయాధిపతుల ద్వారారాజుల ద్వారా దేవుడు తన యొక్క ప్రేమను తెలియజేస్తున్నాడునూతన నిబంధనలో మానవుల మీద తనకు ఉన్న ప్రేమతో కుమారుని సైతము భూమికి పంపి థన ప్రేమను తెలియజేస్తున్నాడు.

 కుమారుడు భూమికి వచ్చి తన తండ్రి ప్రేమను వెల్లడించి పంచి చివరకు తండ్రి మీద ప్రేమతో మన మీద ప్రేమతో సిలువ శ్రమలను సహితము పొంది సిలువలో తన రెండు చేతులను చాచి మరణించి కుమారుడు మరియు తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నారో చూపించాడు.
 ప్రేమతో విడిపోయినతెగిపోయిన బంధాన్ని కలిపాడు యొక్క ప్రేమను  శిస్యులకు పంచాడుకుమారుడు పంచిన  ప్రేమను శిష్యులు అనేక మంది ప్రజలకు పంచి వారుకూడా కుమారునివలె వేదసాక్షి మరణాన్ని పొందారు.

ఇలా ఎవరైతే దేవుణ్ణి మరియు పొరుగువారిని ప్రేమించలేకపోతున్నారో  నాటి మొదటి పటనములో అట్టి వారికీ ప్రభువు పలికే మాటలు " నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణఆత్మతోనుప్రేమింపుము" అని  యొక్క ఆజ్ఞలు ప్రభువు మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినపుడు వాటిని పాటించడములో వారు విఫలమయ్యారు.
విఫలంకావటమేకాకుండా దబ్బర దేవతలను పూజించడం ఆరంభించారు దానికి ఫలితం వారు బానిసత్వానికి తీసుకొనిపోబడినారువారు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రభువు వారిని మందలిస్తూ ఓదార్పు మాటలను చెబుతున్నారుమీరు అన్ని మరచి నా చెంతకు తిరిగి వత్తురేని మిమ్ములను దివిస్తాను అని పలుకుతున్నాడు విధేయతతో ధర్మశాస్త్రములో లికించబడిన వాటిని పాటించమని అడుగుతున్నాడు ఇంతకు ముందులాగ అవిధేయతతో కాకా విధేయతతో పూర్ణ హృదయముతోపూర్ణ మనసుతోపూర్ణ ఆత్మతో పాటించమని ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను కోరుతున్నారు ఎందుకంటే  ఆజ్ఞలుధర్మశాస్త్రము వారికీ క్రొత్త కాదు కాబట్టి అవిధేయతతో కాకవిధేయతతోపాటించమనిప్రభువుచెపుతున్నాడుధర్మశాస్త్రాన్నిజ్ఞలను విధేయతతో పాటిస్తున్నామని చెపుతూ పొరుగువారు ఎవరో కూడ తెలియని ప్రజలకు ఈనాటి సువిశేషములో   ఓకే మంచి సమరియుని ఉపమానం ద్వారా యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు.

ప్రభువు అన్నట్లు "నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమిస్తున్నాడునా తండ్రిని ప్రేమించువాడు నన్ను ప్రేమిస్తున్నాడు వాడు నా తండ్రిచే ప్రేమించబడుతున్నాడు". దేవున్నీ ప్రేమిస్తున్నానని చెప్పి పొరుగువారు ఎవరో తెలియక పొతే మనం దేవున్నీ ఏవిదంగా ప్రేమించినట్లు అట్టివాడు దేవునితో ఎలా ప్రేమింపబడతాడు. నూతన నిబంధనలో ప్రభువు చెప్పేటటువంటి ముఖ్యమైన రెండు ఆజ్ఞలు నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ మనసుతో ప్రేమించు, నీవలె నీ పొరుగువారిని ప్రేమించు.  రెండు ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు ఇమిడిఉన్నాయి. వీటిని పాటించువాడు నిత్యజీవం పొందుతాడు అని ప్రభువు పలుకుతున్నాడు.
పొరుగువారు ఎవరో తెలియని వారికీ మంచి సమరియుని ఉపమానము ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి మార్గముగుండ పోవుచుండగా వాడు దుండగులతో కొట్టబడ్డాడు అటుగుండా యాజకుడు మరియు లేవీయుడు వెళ్లారుకాని సహాయం మాత్రం చేయలేదు కానీ సమరియుడు వారికీ సహాయం చేసాడు.

ఒక్క సారి  ప్రాంతం మరియు యూదులు, సమరియుల చరిత్రను పరిశిలించినట్లైతే యూదులకు, సమరియులకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు ఇష్టపడరుయూధులు  మార్గంగుండా వెళ్ళటానికి ఇష్టపడరు అందులోను  మార్గం చాలా ప్రమాదకరమైనది ముఖ్యముగ చీకటి పడితే  మార్గగుండా పయనించడానికి భయపడతారు ఎందుకంటె దొంగలుదుండగులు వచ్చి కొట్టి ఉన్నవన్నీ తీసుకొని పోతారు  సమయములో ఉన్న పరిస్థితిని బట్టి ప్రభువు  ఉపమానాన్ని చెప్పారు.
మొదటిగా  మార్గంగుండా యాజకుడు పయనించినపుడు పడిపోయి ఉన్న మనిషిని పాటించుకోకుండా వెళ్ళిపోయాడు ఎందుకంటే వాడు చనిపోయాడు అని అనుకోని చనిపోయిన వారిని పట్టుకుంటే మాలినమవుతాడు దేవాలయములో యాజకునిగా నిర్వర్తించవలసిన పని ఆగిపోతుందని అవకాశాన్ని కోల్పోతాను అని యాజకుడు వెళ్ళిపోయాడు. యాజకుడు మలినమై ఉండకూడదు అట్టివారిని ఉద్దేశించి ప్రభువు అంటున్నాడు "స్నానం చేసినవాడు చేతులు కడుగుకొంటే చాలు కానీ మరల స్నానం చేయనవసరంలేదు"

హృదయశుడికావాలి కానీ బాహ్యశుద్ది కాదు
నోటిలోనికివెళ్ళేది కాదు మాలినపరిచేది నోటినుండి వెలువడేది మాలిన పరచేది

సున్నం కొట్టిన సమాధివలె అందంగా ఉన్న లోపల కుళ్ళు, దురవాసన అలానే ఉంటుంది
రెండవదిగా లేవీయుడు  మార్గంగుండా వెళ్లుచు వ్యక్తిని చూసికూడా పాటించుకోకుండా వెళ్ళిపోయాడు. పడిపోయిఉన్న వ్యక్తిని చూడటానికి వెళితే  లోపల దొంగలు వచ్చి ఏమైనా చేస్తారని ముందుగానే తన జాగ్రతను చూసుకొని వెళ్ళిపోయాడు.

మూడవదిగా సమరియుడు నిజానికి అతడు సమరియుడు కాదు ఎందుకంటె సమరియులకు, యూదులకు ఎక్కడ పొత్తుకుదరదు కానీ  వ్యక్తి దయకలిగిన వాడిలా వ్యక్తిని సత్రంలోనికి తీసుకెళ్లాడు. సత్రం అధికారి ఇతనను నమ్మాడు. యూదులు యేసు ప్రభువుని సమరియుడు అని పిలుస్తారు. ధర్మశాస్త్రాన్ని పాటించని వారిని, ఆజ్ఞలను ఊల్లంగించువారిని సమరియుడు అని పిలుస్తారు.
సమరియుడు అనబడు  వ్యక్తి పదిపోయిన వ్యక్తిని బాగుచేయటానికి తన దెగర ఉన్నదంతయు ఇచ్చాడు.

వ్యక్తి ఎవరైనా దేవుని ప్రేమ  తన హృదయంలో ఉన్నది కావున పడిపోయిన వ్యక్తిని పొరుగువానిగా భావించి తనకు సహాయంచేసాడు.
"తన స్నేహితునికొరకు ప్రాణమును సహితము ధారపోయువాడు నిజమైన స్నేహితుడు". ఇటువంటి స్నేహితుడిని మనము ఈనాటి రెండవ పటనములో చూస్తాము.

 నాటి రొండోవ పటనములో పాలుగారు కొలిసి ప్రజలకు క్రీస్తు ప్రభుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడం చూస్తున్నాము. దేవుని కుమారుడు, తండ్రి దేవుని ప్రతిరూపము అన్నింటిమీద ఆధిపత్యము కలిగిన వ్యక్తి, ఈయన మరణముద్వారానే మనము రక్షణ పొందాము ఈయన ఉతనముద్వారా తెగిపోయిన ప్రేమను మరల పొందగలిగాము. ఈయనకు పొరుగువారి మీద ఉన్న ప్రేమవలననే తండ్రి దేవునిచే ప్రేమించబడుతున్నాముప్రభువు అంటున్నాడు నీసహోదరునితో ఏమైనా తగాదాలుకలహాలు ఉంటె నీవు తెచ్చిన అర్పణలను అక్కడే వదిలివేసి మొదట నీ సహోదరునితో సఖ్యతపడి అటు తరువాత వచ్చి నీ అర్పణలను సమర్పించు.
దేవుని ప్రేమిస్తున్న అని చెప్పుకొనటం కాదు సహోదరునికుడా ప్రేమించినపుడే దేవునిచే ప్రేమింపబడతావు.

"నీ దేవుడైన ప్రభువుని పూర్ణ మనసుతోపూర్ణ హృదయముతోపూర్ణ ఆత్మతో  ప్రేమింపుము నీ వలె నీ పొరుగువారికి ప్రేమించు".
                                                                                                                బ్రదర్. లూకాస్. ఓసిడి

5, జులై 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి సువార్త 9: 32-38

మూగదయ్యమును  వెడలగొట్టుట మరియు క్రీస్తు కారుణ్యము.

32. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. 33. పిశాచము వెడలగొట్టబడిన యంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అపుడు అచటి ప్రజలు ఎల్లరు ఆశ్చర్యపడుచు, "ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము" అనిరి. 34. కాని పరిశయ్యులు, "పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టు చున్నాడు" అని ఈసడించిరి. 

35. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి, ప్రార్థన మందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధి భాదలనెల్ల పోగొట్టుచుండెను. 36. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొఱ్ఱెలవలె  చెదరియున్న జనసమూహను చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. 37. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ. 38. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను  పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు" అని పలికెను.

ధ్యానము: పరిశయ్యులయొక్క నిర్లక్ష్యము, అసూయ, మరియు క్రీస్తు ప్రభువు దేవుని పనిని నెరవేర్చుట.

ప్రియ స్నేహితులారా ! ఈ నాటి సువిశేష పఠనాన్ని మనము ధ్యానించినట్లైతే మనకు రెండు విషయాలు అర్థమవుతాయి. మొదటిగా “పరిశయ్యులయొక్క నిర్లక్ష్యము, అసూయ, మరియు క్రీస్తు ప్రభువు దేవుని పనిని నెరవేర్చుట, లేదా క్రీస్తు తన సువార్త పరిచర్యను” నెరవేరుస్తున్నటువంటి సారాంశమే  మనకు అర్థమవుతుంది.

ఎందుకంటే, మన అందరికి తెలిసిన విధంగా పరిశయ్యులంటే సంఘ కాపరులు, లేదా ప్రజలను అనునిత్యం కాపాడేవారు, వారి బాగోగులు చూసుకునే వారు.

కాని వారిజీవిత నడవడిక మాత్రం, వారి పదవికి వ్యతిరేకంగా ఉంటుంది, లేదా వారు బోధించే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటుంది. వారు ఎప్పుడు కూడా కపట వేషధారులవలె, పేరుకు మాత్రమే భోదకులుగా జీవించే వారు, నిజానికి అమాయక ప్రజలమీద, శాస్త్రాలయొక్క భారాన్ని మోపేవారు, ప్రజలను ఎప్పుడు కూడా సక్రమైన మార్గములో నడిపించే వారు కాదు. ఇశ్రాయేలు ప్రజలు, తమ వ్యక్తి, తమలో ఒకరయినటువంటి క్రీస్తు మీద, ఈర్ష, అసూయ చెందుతున్నారు.

ఎందుకంటే క్రీస్తు ప్రభువుకి వారికంటే, పరిశయ్యులకంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేసే శక్తి ఉంది, ప్రజలుకూడా క్రీస్తు ప్రభువు వైపే వెళుతున్నారు అని అసూయ చెందుతున్నారు.

దేవుని శక్తి మనలో లేనప్పుడు మనము సాతానుని వెళ్ళొగొట్టలేము. సాతాను, సాతానును వెళ్లగొట్టగలడా?

క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు కాబట్టి, దేవుని శక్తి తనలో ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువుకు ఆ సాతాను లొంగి పోయింది.

పరిశయ్యులు కూడా దేవుని యొక్క బిడ్డలే, కాని వారు ఎప్పుడు క్రీస్తు వలె, నిజమైన దేవుని రాజ్యాన్ని బోధించే వ్యక్తిగా లేదా అధికారులుగా, సంఘ కాపరులుగా జీవించలేదు. అందుకే దేవుని శక్తి, దేవుని మహిమ వారు చేయలేకపోయారు.

మరి పరిశయ్యులు, అంతా తెలిసినవారే కదా, దేవుని ధర్మశాస్త్త్రాన్ని అనుసరించే వారేకదా, దేవునిచే ఎన్నుకొనబడినవారే కదా, మరి వారి ప్రజలలో ఒకరు అస్వస్థతకు గురి అయినప్పుడు, పరిశయ్యులు ఎందుకు అద్భుతాలు చేయలేదు, స్వస్థతలు చేయలేదు? ఎందుకంటే వారు పేరుకు మాత్రమే సంఘపెద్దలు, లేదా కాపరులు.

దేవుని ప్రమేయమున్నపుడే, శాతానును మనము జయించ గలము లేదా ఓడించగలము. సాతాను తనకు తానుగా ఎలా ఓడించుకుంటుంది. పిశాచముల నాయకుడు అంటున్నారు, మరి పిశాచముల నాయకుడు అయితే మంచి కార్యములు, అద్భుతములు ఎలా చేస్తాడు? సాతాను నుండి అయితే మంచి పనులు చేయకూడదు కదా.

రెండవదిగా: క్రీస్తు ప్రభువు కారుణ్యము లేదా క్రీస్తు ప్రజలయొక్క నిస్సహాయతను, అమాయకత్వాన్ని చూసి, వారియొక్క భడాలను చూసి జాలి చెందుతున్నాడు.

క్రీస్తు ప్రభువు, గ్రామాలు గ్రామాలు తిరుగుచున్నారు, దేవుని రాజ్యాన్ని బోధిస్తున్నారు, స్వస్థతలు, అద్భుతాలు, చేస్తున్నారు., కాని ప్రజలందురు కూడా కాపరిలేని గొఱ్ఱెలవలె, త్రోవ తప్పిన వారివలె జీవిస్తున్నారు. సంఘ కాపరులు వారిని పట్టించుకోవట్లేదు, నాయకులు, ప్రజల బాగోగులు చూసుకోవట్లేదు. అందుకే ప్రజల జీవితాలు ఈవిధంగా ఉన్నాయని బాధపడుతున్నాడు.

దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఇంకా చాల గ్రామాలు ఉన్నాయి వాటన్నిటిలో అద్భుతాలు చేయాలి, దేవుని రాజ్యాన్ని బోధించాలి, అందుకనే క్రీస్తు ప్రభువు, పంట విస్తారము, కోతగాండ్రు కావాలి అంటున్నారు, అంటే, తన సువార్త పరిచర్యలో మనలనుకూడా, బాగస్తులను అవమాని ఆహ్వానిస్తున్నారు.

దేవుడంటే తెలియని గ్రామాలు చాలాఉన్నాయి, దేవుని సేవచేయుటకు, దేవుని రాజ్యాన్ని లోకమంతట వ్యాపింప చేయుటకు, శిష్యులు కావాలి, కాబట్టి ఈ నాటి సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభువు మనందరిని ఆహ్వానిస్తున్నారు.

ప్రియ స్నేహితులారా! మనము ఈ సువిశేషాన్ని గమనించినట్లయితే, భాద్యత కలిగినటువంటి అధికారులే(పరిశస్యులు), ఏ భాద్యత లేకుండా, ప్రజలను భాదలతో, కష్టాలలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోవడంలేదు.

కాని దేవుడు కారుణ్యము కలవాడు కాబట్టియే, తనలో దైవత్వం ఉందికాబట్టియే, దేవుని కుమారుడు కాబట్టియే, తన ప్రజలచెంతకు వెళుతున్నాడు, వారికీ స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్నాడు. ఒక భాద్యత కలిగి జీవిస్తున్నాడు. దేవుని కార్యాన్ని, చిత్తాన్ని నెరవేరుస్తున్నారు.

ఎందుకంటే తనప్రజలు కష్టాలతో, బాధలతో సతమతమవుతుంటే దేవుడు ఓర్చుకోలేడు, చూస్తూ ఊరుకోడు. తమ ప్రజలకు న్యాయము చేస్తాడు.

ప్రియ స్నేహితులారా ఇప్పుడు మనందరమూ ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము పరిశయ్యుల వలె జీవిస్తున్నామా? లేదా క్రీస్తు వలె ఇతరులకొరకే, దేవునిరాజ్యాన్నిభోధించుటకే జీవిస్తున్నామా?

ఎందుకంటే మనం, మన సాధారణ జీవితంలో, ఇలాంటి సన్నివేషాలను చాల చూస్తూనే ఉంటాం, మన గ్రామాలలో, అనారోగ్యం తో బాధపడేవారిని, కష్టాలలోఉన్నవారిని, నిస్సహాయులును, మానసికంగా, శారీరకంగా బాధపడే వాళ్ళను మనము చూస్తూవుంటాం. కాని అందరమూ కూడా పరిశయ్యులవలె, పట్టించుకోము, నిర్లక్ష్యము చేస్తాము. 

ఆ త్రియేక దేవుడు, మనందరిలో జీవిస్తున్నాడు, మనందరిలో కూడా  దైవత్వం ఉంది. కాని మనము, మనలో ఉన్న దైవత్వానికి ప్రాముఖ్యతను ఇవ్వము. అందుకే మనము స్వస్థతలు, అద్భుతాలు చేయలేక పోతున్నాం, అంతేకాక, దేవుడు చేసిన అద్భుతాలను మనం నమ్మలేక పోతున్నాం, ముందుగా వాటిని గ్రహించలేక పోతున్నాం.

మనంకూడా క్రీస్తు వలె అద్భుతాలు చేయగలము, ఎప్పుడైతే మనం దేవుని విశ్వసిస్తామో, దేవుని పై ఆధారపడి జీవిస్తామో. 

ప్రియ స్నేహితులారా చివరిగా మనం గ్రహించాలిసింది ఏమిటంటే, సాతాను క్రియలు నాశనము చేయడానికే, కాని క్రీస్తు చేసే పనులు దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి.

ప్రార్థన: కరుణామయుడవైన దేవా! మాలో ఉన్నటువంటి మీ దైవత్వాన్ని మేము గ్రహించలేక పొతున్నాం.

మాజీవితాలు కూడా చాలా సార్లు పరిసయ్యులవలె ఉంటున్నాయి, పేరుకు మాత్రమే నేను, క్రైస్తవునిగా, సంఘంలో ఒకవ్యక్తిగా జీవిస్తున్నాను, దేవుని రాజ్యాన్ని, సువార్తను, నా జీవితం ద్వారా ఇతరులకు భోదించలేక పోతున్నాను, నా సహోదరులను నిరాకరిస్తున్నాను. ఇకనుండి అయినను నేను నీవలె జీవించుటకు, ఇతరులుకొరకు జీవించుటకు నాకు శక్తిని, మంచినే చేసే కరుణగల హృదయాన్ని నాకు ప్రసాదింపుము, అని ప్రార్థన. ఆమెన్.

Br. Subhash

3, జులై 2022, ఆదివారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి సువార్త 9 : 18 - 26

18. ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు అధికారి ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరించి, "నా కొమార్తె ఇపుడే మరణించినది. కాని, నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన ఆమె బ్రతుకును". అని ప్రార్థించెను. 19. అపుడు యేసు లేచి, శిష్యసమేతముగా అతనిని వెంబడించెను. 20. అప్పుడు పండ్రేండేళ్ల నుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్నఒక స్త్రీ వెనుకనుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. 21. ఏలన, "యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును" అని ఆమె తలంచుచుండెను. 22 . యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, "కుమారీ! ధైర్యము వహింపుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచెను". అని పలుకగా ఆమె ఆక్షణముననే ఆరోగ్య వంతురాలాయెను.

23. పిమ్మట యేసు, ఆ అధికారి ఇంటికి వెళ్లెను. అచట వాద్యములు మ్రోయించువారిని, అలజడిగనున్నజన సమూహమును చూచి, 24. "మీరందరు ఆవలికి పొండు. ఈ బాలిక మరణించలేదు. నిదురించుచున్నది" అని పలికెను. అందులకు వారందరు ఆయనను హేళన చేసిరి. 24. మూగియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్లి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. 26. ఆ వార్త ఆ ప్రాంతము అంతట వ్యాపించెను.

ధ్యానము: "నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరుచును".

క్రీస్తు నాధుని యందు ప్రియ స్నేహితులారా, ఈ నాటి సువిశేష పఠనాన్నిమనము ధ్యానించినట్లయితే, మనము ఒక  స్వస్థతను మరియు ఒక అద్భుతము గురించి మనము చదువుతున్నాము. మొదటిగా పండ్రేండేళ్ల నుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్నఒక స్త్రీ, తన శారీరక రోగమునుడి స్వస్థత పొందుతుంది.

ఈ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే, ఈ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఆమెకు ఉన్నటువంటి ధైర్యాన్ని, లేదా సాహసాన్ని, విశ్వాసాన్ని క్రీస్తు ప్రభువు అభినందిస్తున్నారు. క్రీస్తు నందు విశ్వాసముంచి, భయం భయంగా దేవుని యొక్క వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. క్రీస్తు ప్రభువు, ఆమె యొక్క విశ్వాసముగల సాహసానికి, మెచ్చి, ఆమెతో "కుమారీ! నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని పలికాడు."

ఈ స్త్రీ, క్రీస్తు ప్రభువు యొక్క అంగీ అంచును, ఒకే ఒక్కసారి,  తాకగానే స్వస్థత కలిగింది.

మరి మనము ప్రతి రోజుకూడా క్రీస్తుని మన హృదయములోకి, మన ఆత్మలోకి  దివ్య సత్ప్రసాద రూపంలో, మనం స్వీకరిస్తున్నాం. మరి ఎన్ని సార్లు మనం స్వస్థత పొందాలి, ఎన్ని రోగాలనుండి మనకు స్వస్థతలు, అద్భుతాలు జరగాలి.  మరి మనది నిజమైన  విశ్వాసమా  లేదా పెద్దలు మనకు నేర్పించినటువంటి ఆచారము మాత్రమేనా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.

రెండవదిగా, క్రీస్తు ప్రభువుకు మరణము పై ఉన్న ఆధిపత్యాన్ని, లేదా జీవాన్ని ఒసగే శక్తి ఉందని మనము గ్రహించవచ్చు.

ఈ వచనంలో మనము రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు, మొదటిగా అధికారికి ఉన్నటువంటి వినయము, విశ్వాసము, రెండవదిగా జనసమూహము యొక్క అవిశ్వాసము. ఇక్కడ అధికారి మోకరించి, క్రీస్తునందు పూర్తి విశ్వాసముంచి, ప్రార్థిస్తున్నారు, కాని జనసమూహము హేళన చేస్తున్నారు, దేవుడిని నమ్ముటలేదు, ఒక పిచ్చివానిగా చూస్తున్నారు. ఎందుకంటే "మరణించిన వారిని నిదురిస్తున్నారు" అంటే ఎవరైనా హేళనచేస్తారు, వెక్కిరిస్తారు, వాస్తవమే. కానీ వారు మాత్రం క్రేస్తుప్రభువు దేవుడన్న సంగతిని గ్రహించుటలేదు.

ఇక్కడ వారు క్రీస్తు ప్రభువుకు, జీవాన్ని ఇచ్చే శక్తి, అధికారం ఉందని గ్రహించలేదు. అందుకు కాబోలు, ఆ జనసమూహము క్రీస్తుని హేళన చేశారు.

కానీ క్రీస్తు ప్రభువు వారి మాటలను హేళనను లెక్క చేయకుండా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మరణించిన ఆ బాలికను జీవంతో లేపుతున్నారు.

ఆ సన్నివేషాన్ని చూసి జనసమూహము  అశ్చర్యంతో నిండిపోయారు, అవును. సహజంగా ఆ జనసమూహము, ఇప్పటి వరకు మరణించిన వారిని జీవముతో లేపటం, వినివుండరు, బహుశా చూసివుండరు కూడా. అందుకే వారు అలా ప్రవర్తించి ఉండవచ్చు. తరువాత వారు, క్రీస్తు చేసినటువంటి ఆ అద్భుతాన్ని ఆ ప్రాంతమంతయు చాటిచెప్పారు.

ఈ రెండు సన్నివేషాల ద్వారా మనందరమూ గ్రహించవలసినది ఏమిటంటే, ఏవిధంగా నైతే, ఆ అధికారి మరియు జబ్బునపడినటువంటి స్త్రీ వలే,  మన జీవితాలలో అద్భుతాలు, స్వస్థతలు జరగాలంటే, మనము కూడా, ధైర్యము వహించి, దేవుని యందు విశ్వాసము ఉంచి, దేవుని చెంత మోకరించి ప్రార్థించాలి, అప్పుడే, దేవుడు, మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మెచ్చుకొని, మన ప్రార్థనలు, విన్నపాలను ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు.

క్రీస్తునాడుని యందు ప్రియ స్నేహితులారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం.

మన జీవితాలు ఏవిధంగా ఉన్నాయి, ఆ అధికారి, మరియు ఆ స్త్రీ వలే, దేవుని యొక్క మనజీవితాలలో చూడాలనుకుంటున్నాయా లేదా, ఒక వేల ఆ జనసమూహము వలే క్రీస్తుని మనము హేళన చేస్తున్నామా?

ప్రార్థన : ఓ దయా సంపన్నుడా! మా జీవితాలు కూడా ఎన్నో సంవత్సరాలుగా, అనేక విధాలైన రోగములనుండి, కోపము, పగ, ద్వేషము, అసూయా, క్రోధము, వ్యామోహము,  దొంగతనము, గర్వము, సోమరితనం, ఇంకా అనేక విధములైన శారీరక, ఆత్మీయక రోగములనుడి నశించి పోతుంది. మాకు మాత్రం, వాటన్నిటినుండి, బయటకు రావాలని ఉంది, స్వస్థతను పొందాలని ఉంది. కానీ నా బలహీనతలే, నా లోని అవిశ్వాసము, అధైర్యము, గర్వము, నన్ను నీదరికి చేరనీయుట లేదు.

మీ యొక్క దయార్ద హృదయము వలన, నాకు విమోచనము కలుగ చేయుము, నాలొఉన్నటువంటి, అస్వస్తతలను తీసివేయుము. మీరు ఒక్క మాట పలికిన, నా శరీరము, నా ఆత్మకూడా స్వస్థత పొందును. కావున, మాకు కూడా, మిమ్ము హేళన చేసిన జనసమూహము వలే కాకుండా, ఆ అధికారి, మరియు ఆ స్త్రీ వలే, ధైర్యమును, విశ్వాసమును కలుగ చేయుము అని ప్రార్థించుచున్నాము. కావున మేముకూడా మీ యొక్క మహిమను చాటి చెప్పే విధంగా మాకు అనుగ్రహము దయచేయుమని ప్రార్థిస్తున్నాము. ఆమెన్.

Br. Subhash

2, జులై 2022, శనివారం

పునీత తోమాసు గారి పండుగ

పునీత తోమాసు గారి పండుగ

ఈ రోజు తల్లి తిరుసభ అపోస్తులుడైన తోమాసుగారి పండుగను కొనియాడుచున్నది. 

పునీత తోమాసుగారు భారత దేశపు పాలక పునీతుడు ఒకవిధంగా చెప్పాలంటే ఈ నాడు మనం క్రైస్తవులుగా వున్నాం అంటే అది పునీత తోమాసుగారి సువార్త సేవా ఫలితమే.

భారత దేశంలో ఉన్న అనేక మందికి విశ్వాసంను ప్రకటించిన వ్యక్తి , భారత విశ్వాసులకు తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే తోమాసుగారు మాత్రం భారత దేశంలో వున్న క్రైస్తవ విశ్వాసులందరికి తండ్రి. 

విశ్వాసుల నమ్మకం ప్రకారం తోమాసుగారు కేరళ రాష్ట్రంలో 7 దేవాలయాలు నిర్మించారు. 

యోహాను సువార్తికుడు తనయొక్క సువార్త చివరి భాగంలో పునీత తోమాసు గారియొక్క అచంచల విశ్వాస జీవితం గురించి తెలిపారు. 

పునీత తోమాసుగారు అందరికి ప్రభువు యొక్క పునరుత్తానంను సందేహించిన వ్యక్తిగానే తెలుసు కాని ఆయన మాత్రమే కాదు మిగతా శిష్యులు కూడా మొదట్లో  ఆయన పునరుత్తానంను  విశ్వసించలేదు. మార్కు 16 : 1 - 8 . 

స్త్రీలు వచ్చి ప్రభువు పునరుత్తానం గురించి వివరించినప్పుడు శిష్యులు తోమాసు గారి వలె నమ్మలేదు. లూకా 24 : 1 -12 .

-తోమసుగారు ప్రభువుయొక్క పునరుత్తానం నమ్మలేదు ఎందుకంటే ఆయనకూడా మిగతా శిష్యుల వలె వ్యక్తిగత అనుభూతి కావలి. అందుకే ప్రభువును చూస్తే కానీ నమ్మను అని అన్నారు. 

తోమాసు గారియొక్క సందేహం గురించి ఒక్క సారి ఆలోచిస్తే ఆయన యొక్క సందేహం చాలా నెగటివ్ గా భావించకూడదు అది పాజిటివ్ గా ఆలోచిస్తే మంచి అర్థం వుంది. పర్షియా సామెత ఒకటి ఉంది "doubt is the key of the knowledge ". సందేహం అనేది జ్ఞానం పొందుటకు దోహద పడుతుంది. 

మనకు సందేహాలు వున్నపుడే తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తెలుసుకొని మనం జ్ఞానం సంపాదించవచ్చు. మన సందేహాలు మనలను జ్ఞానం వైపునకు నడిపిస్తాయి. 

-దేవుడు సందేహించే వారిపట్ల సహనంతో ఉంటున్నారు. జెకర్యా దేవుని వాగ్దానం గురించి సందేహించారు అయినా కానీ దేవుడు ఆయనను సహించారు. 

-ఆదాము అవ్వ సందేహించారు 

అబ్రహాము భార్య సారా సందేహించింది. 

-బాప్తిస్మ యోహాను గారు కూడా నీవు మెస్సయ్యవా లేక మేము ఇంకొకరికొరకు ఎదురు చూడాలా అని సందేహించారు. ఈ సందేహించిన ప్రతి వారి పట్ల దేవుడు సహనంతో వున్నారు. అలాగే యేసు ప్రభువు యొక్క సందేహించిన తోమాసు గారి పట్ల దేవుడు సహనంతో ఉన్నారు. 

వాస్తవానికి మనకు ఉన్న సందేహాలతో మనకున్న విశ్వాసం పోరాడాలి . అప్పుడే విశ్వాసం గెలుస్తుంది. ఇది ఆయనకు ఉన్న సందేహాలు తన యొక్క విశ్వాసంతో పోరాడినప్పుడు చివరికి ఆయన సంపూర్ణ విశ్వాసం కలిగి, దైవ అనుభూతి కలిగి జీవించారు. 

ఇది కొందరికి నెగటివ్ గా అర్థం అయివుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో సందేహాలు ఉంటునే ఉంటాయి ఇక్కడ తోమాసు గారు బయటపడ్డారు మిగతా వారు బయట పడలేదు అయినప్పటికీ యేసు ప్రభువు ప్రత్యేకంగా ఆయనకోసమే మరొకసారి ప్రత్యక్షమయ్యారు. 

-పునీత గ్రెగొరీ ద గ్రేట్ అంటారు యేసు ప్రభువు తోమాసు గారి యొక్క సందేహామనే గాయంను మాన్పిన విధంగా ప్రభువు మనలో ఉన్న అనేక గాయాలు మాన్పుతారు  అని అన్నారు. మనందరిలో ఉన్న అపనమ్మకం అనే గాయాన్ని ప్రభువు నయం చేస్తారు. యేసుప్రభువు శిష్యులకు దర్శనం ఇచ్చిన సందర్భాలలో తోమాసు గారు by chance (ఒకవేళ ) అక్కడ లేక పోవడం కాదు దేవుడు తనయొక్క దయను చూపుటకు, ఆయన విశ్వాసం బలపరుచుటకు ఈ విధంగా చేశారని గ్రెగొరీ గారు పలికారు. 

తోమాసుగారికి దైవ దర్శనం కలిగిన తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు కూడా ఆయనకు యేసుప్రభువు అంటే గొప్ప నమ్మకం గౌరవం ఉన్నాయి.

ఈ రోజు ప్రత్యేకంగా ఆయనలో వున్న కొన్ని లక్షణాలు గుర్తుకు చేసుకోవాలి. 

1. తోమసుగారు ధైర్య వంతుడు -   తన యొక్క యజమాని, గురువు అయిన క్రీస్తుప్రభువు కొరకు చనిపోయేటంత ధైర్యం కలిగిన వ్యక్తి. లాజరు చనిపోయిన సందర్భంలో బెతానియాకు వెళ్ళేందుకు నిరాకరించిన వేళలో తోమాసుగారు రండి మనంకూడా వెళ్లి ఆయనతో మరణించుదాం అని పలికారు. మిగతా శిష్యులందరు మరణంకు భయపడ్డారు కాని తోమాసు గారు ధైర్యంతో ముందుకు వెళ్లారు. యోహాను 11 : 7 -16 . 

యేసు ప్రభువు మరణించిన తరువాత యూదుల భయముచే ఒక గదిలో దాగుకొని వున్న సమయంలో తోమాసు గారు మాత్రం బయట దైర్యంగా వున్నారు . యోహాను 20 :24 .

-దేవుని సువార్త కొరకు భారత దేశం వచ్చి  అనేక మందిని క్రైస్తవులుగా చేసి చివరికి వేదసాక్షిగా మరణించారు. తనకు వున్న దైర్యం వల్లనే దేవుని కొరకు జీవించి, మరణించారు. 

ప్రభువును తెలుసుకొవాలనే తృష్ణ కలిగిన వ్యక్తి- కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభువు శిష్యుల కొరకు పరలోకంలో నివాస స్థానం సిద్ధం చేయుటకు నేను మీకన్నా ముందుగా వెళతాను అని చెప్పిన సమయంలో తోమాసు గారు నీవు వెళ్లే మార్గము మాకు తెలియదు నీ మార్గము గురించి తెలుపుము అని తోమాసు గారు యేసు ప్రభువును అడిగారు. యోహాను 14 : 6 .

మిగతా శిష్యులవలె దేవుని మార్గము తెలుసనీ నటించక తనకు తెలియదని ప్రభుని అడిగారు. తనయొక్క అజ్ఞానమును ప్రభువు ముంగిట ఉంచి దైవ జ్ఞానము పొందాలనుకున్నారు, తోమాసుగారు. 

దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తి - పునరుతానమైన ప్రభువు యొక్క గాయాలలో వ్రేలుపెట్టి చూడాలని కోరుకున్న తోమాసుగారు ఒక్క సారిగా ప్రభువు దర్శన మిచ్చిన సమయంలో యేసు ప్రభువును సంపూర్ణంగా విశ్వసించారు. అప్పటివరకు కూడా తోమాసు గారికి యేసుప్రభువు గురించి వివిధ రకాల ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన్ను ఈ భోలోక రాజుగా, మెస్సయ్యగా భావించాడు .

ఈ  భూలోకంలో  తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడని, ప్రజలయొక్క కష్టాలు తొలగిస్తారనే ఆలోచనలు కలిగివున్నాడు . కాని ప్రభువు మరణ పునరుత్తానం తరువాత మరీ  ముఖ్యంగా తనకు దర్శనం ఇచ్చిన సందర్భంలో ప్రభువు గాయంలో వ్రేలు పెట్టకుండానే ఆయన్ను చూసి సంతృప్తి చెంది విశ్వసించారు . ఆయన్ను విశ్వసించడం మాత్రమే కాదు తన దేవునిగా గుర్తించారు. అందుకే ఆయన "నాదేవ, నాప్రభువా" అని పలికారు. 

మిగతా శిష్యులవలె కాకుండా యేసయ్యను తన సొంత దేవునిగా అంగీకరించిన వ్యక్తి పునీత తోమాసుగారు. 

పట్టు విడువని వ్యక్తి - పునీత తోమాసుగారు తనయొక్క జీవితంలో పట్టువిడువని వ్యక్తి . ఏదైనా సాధించాలనుకుంటే దానిని తప్పనిసరిగా సాధిస్తారు. ఎందుకంటే మిగతా శిష్యులందరు కూడా మేము పునరుత్తాన ప్రభువును చూశాం అని చెప్పినప్పుడు ఆయన దానిని నమ్మి అలా విడిచి పెట్టలేదు వాస్తవానికి ఇద్దరు చెప్పే సాక్ష్యం బైబులు పరంగా నమ్మవచ్చు కాని ఇక్కడ తోమాసు గారికి ఎంత చెప్పినాసరే ప్రభువును చూడాలనే పట్టు విడువలేదు అందుకే ఆయన పట్టుదలవలన ప్రభువును చూడగలిగారు.  

కొందరికిది  మూర్కత్వముగా  అనిపించవచ్చు  కాని తోమాసు  గారికి  ఇది  ఒక  అనుభవం. ఇతరులకు  దక్కిన  వరం  తనకు  కూడా  దక్కాలనుకున్నారు . 

- యాకోబు  దేవుని  ఆశీర్వాదం  కొరకు  పట్టుదల  కలిగి  అడిగిన  విధంగా ,  ప్రభువుని చూడాలనే కోరికతో వున్నారు. ఆది 32 : 26 . 

-కననియ స్త్రీ పదే పదే ప్రభువుని పట్టుదలతో ప్రార్థించినవిధంగా . మత్తయి 15 : 21 -28 .

-పౌలు గారివలె సువార్త పరిచర్యలో పట్టుదల కలిగిన వ్యక్తి లాగ పునీత తోమాసుగారు కూడా ప్రభువును తప్పని సరిగా చూడాలనే పట్టుదల కలిగి వున్నారు.

- ఆయన ఎప్పుడు తన పట్టువిడువ లేదు ప్రభువు సువార్త వ్యాప్తి కొరకు మరణించటానికి సైతం సిద్ధంగా ఉన్నారు. ఇతరులు తాను చెప్పిన మాటలగురించి ఏమని అనుకుంటారు అని భావించలేదు ఏది ఏమైనా సరే ఆయన్ను చూడాలి అనే ఆశ ప్రభువును చూసేలా చేసింది.

బలహీనతను ప్రభువు ముంగిట ఒప్పుకున్న వ్యక్తి:

మూసిన తలుపులు మూసినట్లు ఉండగనే ప్రభువు దర్శనం ఇచ్చిన సమయంలో తోమాసుగారు శిష్యులతో కలిసి ఉన్నప్పుడు ప్రభువు మొదటిగా తోమాసు గారితో మాట్లాడుతున్నారు.

-తోమాసు హృదయం తెలిసిన ప్రభువు ఆయన పలికిన ప్రతి మాట తోమాసుతో చెప్పే సమయంలో ప్రభువు ముందు మోకరించి తనయొక్క అపనమ్మకమును ఒప్పుకున్నారు. తన గురువు పట్ల చేసిన తప్పిదాలు ఒప్పుకున్నారు. యేసు ప్రభువుకు సమస్తము తెలుసు అని గ్రహించారు. 1 యోహాను 3 : 20 , యోహాను 2 :25 , దానియేలు 2 :22 , మత్తయి 10 :30 . 

-ప్రభువుపట్ల చేసిన తప్పిదములను గ్రహించి "నా ప్రభువా, నాదేవా" అని చెప్పారు. యేసు క్రీస్తు చెప్పినది మొత్తం నిజం అని తెలుసుకున్నారు, ఆయన సృష్టి కర్త అని గ్రహించారు. (యోహాను 1 :1 -2 ). ప్రభువు తన దైవంగా భావించి తన పాపాలను ఒప్పుకొని ప్రభువును ఆరాధించి తన దైవంగా చేసుకొన్న గొప్ప పునీతుడు తోమాసుగారు. 

-తన బలహీనతను అంగీకరించుట ద్వారా ప్రభువు తనను బలపరుస్తున్నారు. నూతన వ్యక్తిగా చేస్తున్నారు. తనయొక్క శాంతితో నింపుచున్నారు. 

6. క్రీస్తుప్రభువుని ప్రేమించిన వ్యక్తి:

 మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి కొరకు ఏదైనా చేస్తాం.  అది ఎంత కష్టమైన ఇష్టంగా , తేలికగా ఉంటుంది. తోమాసు గారు ప్రభువు పట్ల వున్న ప్రేమను తనయొక్క పరిచర్య ద్వారా చూపించారు . తన కొరకు ప్రాణాలు ఇచ్చుటకు సైతం సిద్ధంగా ఉన్నారు. 

-పునీత తోమాసు గారు మనందరికీ ఆదర్శం, మనకు ఎన్ని సందేహాలున్న వాటన్నింటిని విశ్వాసంతో అధిగమించి ప్రభువుని విశ్వసించి అనుసరించాలి .

Doubting Thomas ను దేవుడు Daring Thomas గా మార్చిన విధంగా దేవుడు మన విశ్వాస జీవితాలనుకూడా బలపరచాలని ప్రార్థించుదాం.

Rev. Fr. Bala Yesu OCD


అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 9:14-17 

యోహను శిష్యులు  యేసును సమీపించి , మేము , పరిసయ్యులు  కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని. మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేల? అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు?  పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి  కొనిపోబడు దినములు  వచ్చును. అపుడు  వారు ఉపవాసము  చేయుదురు. పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త  గుడ్డను ఎవడు  ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన  ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త  ద్రాక్షరసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన యెడల అవి పిగులును; ఆ ద్రాక్షరసము నేల పాలగును. తిత్తులు నాశనమగును. అందువలన, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలో  పోయుదురు. అపుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను. 

యోహను శిష్యులు యేసు ప్రభువు  వద్దకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్న ఏమిటి అంటే మేము మరియు పరిసయ్యులు ఉపవాసము ఉందుము కాని మీ శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండరు? వారు ఈ ప్రశ్న అడగడానికి కూడా చాలా కారణాలు ఉండివుండవచ్చు. వాటిలో యేసు ప్రభువు మరియు ఆయన  శిష్యులు అనేక సమయాలలో విందులయందు కనపడుతుంటారు . 

కానా అనే ఊరిలో జరిగిన పెళ్ళిలో వీరు ఉన్నారు, సిమోను అనే పరిసయ్యుడు ఇచ్చిన విందులో ఉన్నారు, ఒక సుంకరి  అయిన జక్కయ్య మార్పు చెందిన తరువాత ఇచ్చే విందులో యేసు ప్రభువు శిష్యులు ఉన్నారు. లెవీ యేసు ప్రభువు అనుచరుడిగా మారిన తరువాత ఇచ్చిన విందులో వీరు ఉన్నారు. ఈ విందులన్నీ చూసి వీరు ఉపవాసం చేయక, ఎప్పుడు విందులు వినోదలతో ఉన్నారు అని వారు భావించి ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చు. లేక యేసు ప్రభువు శిష్యులు ఎందుకు ఉపవాసం చేయడం లేదో తెలుసుకోవడానికి  ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చు. యోహను శిష్యులు యేసు ప్రభువును తరువాత కూడా ఒక సారి ఓ ప్రశ్న అడుగుతున్నారు. అది ఏమిటి అంటే మా గురువు మిమ్ములను అడగమని పంపించారు, రానున్న రక్షకుడవు నీవేనా? లేక మేము ఇంకోకని కొరకు మేము వేచి చూడలా ? అంటే  యేసు ప్రభువు దగ్గరకు వీరు అప్పుడప్పుడు  వచ్చే వారు, వారి సమస్యలు గురించి చెప్పేవారు, ఆయనను ఒక రకముగా వారు తమ గురువు వలె గౌరవించారు. 

యోహను శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే ? పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు?  దీని అర్ధం ఏమిటి? ఇది మనం యోహను నుండి తెలుసుకోవాలి. యోహను యేసు ప్రభువుని సాన్నిధ్యంను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే గమనించి ఆనందంతో గంతులేశాడు. అంటే యేసు ప్రభువు సాన్నిధ్యం మనకు ఆనందం ఇస్తుంది. అది ఆనందించవలసిన సమయమే కాని దుఃఖించవలసిన సమయం కాదు. అంటే మనతో యేసు ప్రభువు మనతో ఉన్నంత కాలం మనం ఆనందించే సమయం. 

 పాత నిబంధనకాలంలో కూడా అనేక విధాలుగా ప్రజలు ఉపవాసం చేశారు, అది దేవుని నుండి, ఆయన ఆజ్ఞల నుండి  దూరంగా వెళ్ళిన వారు అనేక కష్టాలు అనుభవించారు. వారు చేసిన పాపాలకు గాను దైవ సాన్నిధ్యం యెరుషలేము దేవాలయం నుండి వెళ్ళి పోతుంది. దేవుని సాన్నిధ్యం  మన నుండి వెళ్ళిన , మనం దేవుని నుండి దూరంగా వెళ్ళిన దాని పర్యవసానం మనం అనేక కష్టాలకు , నష్టాలకు గురి అవుతాము. ఇది దేవుడు మనకు ఇచ్చే శిక్ష కాదు. మనం దేవుని నుండి దూరంగా వెళ్ళి మనం  తెచ్చుకున్నవి. కాని మరలా దేవుని దగ్గరకు రావడానికి మనం చేసే ఒక పని నేను మీతో ఉండటానికి ఇష్టపడుతున్నాను అని తెలియజేయడం. ఇది   తెలియజెసే ఒక విధానం ఉపవాసం. కాని దేవున్ని వారు దూరం చేసుకోకపోయిన దేవుని కోసం, ఆయన రాక కోసం , ఆయన  వచ్చినప్పుడు యోగ్యరీతిగా ఆయనను స్వీకరించడానికి ఒక సాధనం ఉపవాసం. యోహను ఉపవాసం దీనిలో భాగమే. దేవుని నుండి దూరమై ఆయన కారుణ్యం పొందుటకు కూడా  ఒక సాధనం ఉపవాసం, ఇది పాత నిబంధనలో నినివే ప్రజలు చేశారు. 

యేసు ప్రభువు సమాధానం మనకు ఒక విషయం తెలియ జేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు శిష్యులు ఏ విధంగా కూడా ఉపవాసం చేయనవసరం లేదు. కారణం వారు ఇప్పుడు దేవునితో కలసి ఉన్నారు. దేవుని సాన్నిధ్యం పొందుతున్నారు. యోహను శిష్యులు యేసు ప్రభువు రాకకై సిద్దపడు ఉపవాసం చేస్తున్నారు. ఆయనను యోగ్యంగా స్వీకరించడానికి.  కాని యేసు ప్రభువు శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు కనుక వారు ఉపవాసం చేయనవసరం లేదు. 

కాని యేసు ప్రభువు చెప్పిన విధంగా "పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి  కొనిపోబడు దినములు  వచ్చును. అపుడు  వారు ఉపవాసము  చేయుదురు." అంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోయినప్పుడు ఖచ్ఛితముగా వారు ఉపవాసం చేస్తారు. వారి నుండి యేసు ప్రభువు వెళ్లిపోతారు. అప్పుడు వారు ఆయన సాన్నిధ్యం పొందుటకు ఉపవాసం చేయాలి. మనం కూడా ఈ రోజు ఆయన సాన్నిధ్యం పొందక పోయిన యెడల ఉపవాసం , పాప సంకీర్తనం ద్వారా మనం ఆయన సాన్నిధ్యం పొందాలి. 

"పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త  గుడ్డను ఎవడు  ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన  ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును.క్రొత్త  ద్రాక్షరసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన యెడల అవి పిగులును; ఆ ద్రాక్షరసము నేల పాలగును. తిత్తులు నాశనమగును. అందువలన, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలో  పోయుదురు. అపుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను." ఈ వచనాలలో మనం ఎప్పడూ ఏమి చేయాలో తెలుసుకొని చేయాలి అని నేర్చుకుంటున్నాం. 

ప్రార్ధన : ప్రభువా! మా జీవితంలో అనేక సమయాలలో మీరు మాతో ఉన్న విషయాన్ని గమనించలేక పోతున్నాను. మిమ్ములను మీ సాన్నిధ్యాన్ని పొందాలనే కోరిక మాకు ఎంతో ఉన్నా కాని మేము పొందలేక పోతున్నాము. మేము మిమ్ము గుర్తించే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాము. మేము ఎందుకు ఉపవాసం చేయాలో , ఎప్పుడు ఉపవాసం చేయాలో తెలుసుకునే శక్తిని దయచేయండి. మాలో కొన్ని సార్లు నిజమైన మార్పు లేకున్నా , కేవలం బాహ్యంగా కొద్ది సేపు కనపడే మార్పులకు మేము పూర్తిగా మారిపోయాము అని బ్రమపడుతున్నాము. అటువంటి సమయాలలో మమ్ము మన్నించి మేము నిన్ను పూర్తిగా తెలుసుకొని, మీ సాన్నిధ్యం పొందే భాగ్యం దయచేయండి. ఆమెన్. 

1, జులై 2022, శుక్రవారం

14 వ సామాన్య ఆదివారం (2)

 14 వ సామాన్య ఆదివారం 

యెషయా  66: 10-14, గలతి 6: 14-18, లూకా  10: 1-12, 17-20

ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క సువార్తను ప్రకటించుట గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క సువార్తను ప్రకటించుట ద్వారా దైవ రాజ్య స్థాపన జరుగుతుంది, దేవుని యొక్క శాంతి నెలకొల్పబడుతుంది. 

దేవుడు సువార్త సేవకులను ఎన్నుకొన్నది ప్రజల యొక్క జీవితంలో దేవుని యొక్క శాంతిని నెలకొల్పుటకు, వారిని పరలోకం చేర్చుటకు, ప్రజల మీద దేవుని ఆశీర్వాదాలను క్రుమ్మరించుటకు, ప్రభువు సువార్త సేవకులను ఎన్నుకొన్నారు. 

దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే వారు సువార్తను అనగా మంచి వార్తను, సంతోష వార్తను, ప్రకటించేప్పుడు ఆనందంగానే ఉండాలి. మనందరం  జ్ఞానస్నానం పొందిన వారు సువార్త సేవకు అర్హులే. మన యొక్క మాటల ద్వారా, జీవితం ద్వారా ప్రభువును ప్రకటించాలి. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఒక సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నారు. 

బాబిలోనియా బానిసత్వం నుండి యిస్రాయేలు ప్రజలు విముక్తులవుతారని, అధే  విధంగా వారు యెరుషలేముకు తిరిగి వచ్చినప్పుడు శాంతితో , సంతోషముతో ఉంటారని తెలియజేశారు. యిస్రాయేలు ప్రజలు 50 సంవత్సరాల తరువాత క్రీస్తు పూర్వం 587-537 కాలంలో యెరుషలేముకు తిరిగి వచ్చారు. 

అప్పుడే బాబిలోనియా బానిసత్వం నుండి తిరిగి వచ్చిన యిస్రాయేలు ప్రజలను దేవుడు పసికందుతో పోల్చుతున్నాడు. 

తిరిగి వచ్చిన ప్రజలు తమ సొంత ప్రాంతమును మరియు దేవుని నివాస నగరమైన యెరుషలేమును చూసి నిరుత్సహపడ్డారు. శిధిలమైన తమ దేశాన్ని అలాగే కూలిపోయిన తమ యొక్క దేవాలయంను చూసినవారు బాధపడ్డారు. అలాంటి ఒక బాధకరమైన స్థితిలో ఉన్న వారికి దేవుడు సంరక్షణను, ఆనందంను  కలుగజేస్తారని పలుకుచున్నారు. 

ఒక తల్లి -బిడ్డల యొక్క ఉదాహరణతో దేవుడు తన ప్రజల పట్ల ఏ విధంగా మేలుగుతారని ప్రవక్త తెలుపుచున్నారు. ఈ ఉదాహరణలో యావే దేవుడును   యెరుషలేముతో పోల్చబడటం జరిగినది . చంటి బిడ్డను యిస్రాయేలుతో  పోల్చారు. 

11 వ వచనంలో యెరుషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు అని పలుకుచున్నారు. అనగా బిడ్డలైన యిస్రాయేలు ప్రజలందరు కూడా దేవుని ద్వారా పోషించబడతారు. దేవుడు వారికి బలమును ఒసాగుతారు. దేవుడు వారి యొక్క ఎదుగుదలకు కారణం అవుతారని తెలుపుచున్నారు. 

యిస్రాయేలు ప్రజలు పుష్కలమైన దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని ఆనందింతురు. అని తెలుపుచున్నారు. 

12 వ వచనంలో దేవుడు, తిరిగి వచ్చిన యిస్రాయేలీయుల యొక్క అభివృద్దికి తోడ్పడుతానని తెలుపుచున్నారు.  వారి యొక్క సంపదలు  పొంగి పొరలినట్లు, వారి యొక్క ఖ్యాతి పేరుగునట్లు  చేస్తానని ప్రభువు  నుడువుచున్నారు. 

యావే దేవుడు తన యొక్క  అమితమైన ప్రేమను, అనురాగంను  యిస్రాయేలు ప్రజలకు  అందజేస్తారు. 

యిస్రాయేలు ప్రజలను చంటి బిడ్డలవలె తన చేతులలోనికి తీసుకొని ముద్దాడతారు. తన ఒడిలో ఒళలాడించేదరు.  యావే దేవుడు యెరుషలేముపై తన శాంతిని ప్రవహింపజేస్తారు, ప్రజలను  ఆనందోత్సాహములతో నింపుతారు. 

ఒక తల్లి తన కుమారుని ఓదార్చిన విధంగా దేవుడు కూడా యిస్రాయేలు ప్రజలను ఓదార్చుతారు. దేవుడు వారిని అదరిస్తారు. ఆదుకుంటారు. ఏ సమయంలోనైనా దేవుడు వారికి సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటారని తెలుపుచున్నారు. 

యావే దేవుడు మరియు యిస్రాయేలు ప్రజల బంధం చాలా గొప్పది. చాలా సన్నిహితమైనది ఎందుకంటే దేవుడు స్వయంగా వారిని తన బిడ్డలుగా చేసుకున్నారు. తన సంరక్షణను కల్పిస్తానన్నారు. వారిని పోషిస్తానన్నారు, అధేవిధంగా వారిని ఆదుకుంటానని మరియు వారికి సంతోషంను, శాంతిని కలుగజేస్తానని ప్రభువు తెలుపుచున్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడి సేవకుడైన  యోషయా  ప్రవక్త తనకు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా  నెరవేర్చారు. అంటే ప్రజలకు సందేశంను (యావే దేవుని సందేశం) అందజేయుట. ఒక ఎన్నుకొనబడిన ప్రవక్త చేయవలసిన పనిని యోషయా ప్రవక్త చేశారు. దేవుని ప్రజలకు దేవునికి మధ్య ఉన్న తల్లి బిడ్డల బంధం గురించి తెలిపారు. 

ఈనాటి రెండవ పఠనంలో  పౌలు గారు  గలతీయులకు రాసిన చివరి మాటల గురించి చదువుకుంటున్నాం. 

పౌలు గారు దేవుని చేత తన యొక్క సువార్త -సేవకై ఎన్నుకొనబడిన తరువాత ఆయన సేవలో ఉన్న సిలువ పరమార్ధం గ్రహించి తాను సిలువ యందే ఆనందిస్తున్నా,  అని అన్నారు. 

యేసు ప్రభువు సిలువ మరణం ద్వారా ఈ లోకాన్ని జయించారు, ఈ లోక వ్యామోహలన్నింటిని త్యజించి మనకు రక్షణము ప్రసాదించారు. 

ఆయన సిలువను మోసి తండ్రికి సంపూర్ణ విధేయత చూపించారు. మనయందు ఉన్నటువంటి అపారమైన ప్రేమవలనే క్రీస్తు ప్రభువు సిలువ మీద మరణం పొందారు. 

-సిలువలో రక్షణ ఉందని 

-సిలువలో ప్రేమ ఉందని 

-సిలువలో విజయం ఉందని 

-సిలువలో స్వస్థత ఉందని తెలుసుకున్న పౌలుగారే  సిలువ యందు నేను గొప్పలు చెప్పుకొనుచున్నాను అని పలికారు. 

పౌలుగారు గలతీయుల ప్రాంతం విడిచిపెట్టి  వచ్చినప్పుడు కొంతమంది యూదయ  క్రైస్తవులు యెరుషలేము నుండి గలతీయ ప్రాంతంకు వచ్చి అందరు యేసు ప్రభువు వలె సున్నతి పొందాలి అనే ఒక ఆసత్య ప్రచారం లేక బోధన చేశారు.  ఎందుకంటే యేసు ప్రభువు కూడా సున్నతి పొందారు కాబట్టి మీరు కూడా సున్నతి పొందాలని ప్రకటించారు. దానికి సమాధానంగా వారి యొక్క అసత్య బోధనలను ఖండిస్తూ  పౌలుగారు, యేసు క్రీస్తును విశ్వసించి ఆయన యందు జ్ఞాన స్నానం పొందిన  ప్రతి ఒక్క వ్యక్తి  నూతన సృష్టియే అని తెలిపారు. 

ఒక విధంగా విశ్వాస పరంగా సందిగ్ధతలో ఉన్న గలతీయులకు పౌలు చక్కని భోదన చేశారు. యేసు క్రీస్తునందు జ్ఞాన స్నానం పొందేవారు, దేవుని యొక్క పవిత్రాత్మను పొంది నూతన సృష్టిగా రూపాంతరం చెందుతున్నారని, దేవుని బిడ్డలుగా తయారవుచున్నారని పౌలుగారు తెలిపారు. 

దేవునికి చెందిన వారిగా ఉండాలంటే కేవలం సున్నతి కాదు అవసరం. ఆయన యందు సంపూర్ణ విశ్వాసం అని పౌలుగారు తెలిపారు, అందుకే నేను సిలువ యందు గొప్పలు చెప్పుకుంటున్నాను అని అన్నారు.  పౌలుగారు పరిసయ్యుల వంశమునకు చెందిన వ్యక్తియైన సున్నతి కలిగిన వ్యక్తి అయినప్పటికి  జ్ఞాన స్నాన విలువను తెలుసుకొని విశ్వాస పాత్రుడిగా జీవించారు. 

ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన యొక్క సువార్త సేవకు శిష్యులను పంపించే  విధానం చదువుకుంటున్నాం. 

సువార్త సేవకు  పంపించే ముందు యేసు ప్రభువు శిష్యులకు  కోన్ని సూచనలు వారు చేయబోయే పరిచర్య గురించి ఇస్తున్నారు. 

ఈ సువిశేష భాగంలో మొదటిసారిగా యేసు ప్రభువు 72 మందిని సువార్త పరిచర్యకు నియమించి, వారిని ఇద్దరిద్దరిని చొప్పున, తనకు ముందుగా పంపారని సువార్తికుడు తెలియజేశారు. మత్తయి, మార్కు, సువార్తికులు కేవలం 12 మంది శిష్యుల యొక్క పరిచర్యను గురించి తెలిపితే, లూకా గారు మాత్రము 12 మంది శిష్యులతో పాటు 72 మంది శిష్యుల  పరిచర్యను కూడా వివరిస్తున్నారు. 

70 అనే సంఖ్య యిస్రాయేలు ప్రజల జీవితంలో గుర్తుండిపోయే సంఖ్య ఎందుకంటే , యకొబు యిస్రాయేలు నుండి ఐగుప్తుకు క్రొత్త జీవితం జీవించడానికి వెళ్లేటప్పుడు 70 మందిని తన వంశస్తులను తీసుకొని వెళ్లారు. వారితో ఒక నూతన రాజ్యం స్థాపించుటకు యాకోబుగారు వెళ్లారు. ఆది 46. 

నోవా కాలంలో కూడా 70 దేశములు /రాజ్యముల గురించి తెలుప బడింది. ఆది 10 వ ఆధ్యాయం. మోషే ప్రవక్త దేవుని ప్రజలను నడిపించుటకు 70 మందిని ఎన్నుకుంటున్నారు. వారు దేవుని మహిమను చూస్తున్నారు. నిర్గమ 24:1,9. 

70 మంది యిస్రాయేలు యొక్క నాయకులు /పెద్దలు . సంఖ్యా 11:16 

ఏలీము వద్ద 70 ఖర్జూరపు వృక్షములు వున్నాయి. నిర్గమ 15:17. 

యూదుల యొక్క sanhedrin సభయమండలి 70 మందితో కూడినది. వారే నడిపించేవారు, నిర్ణయాలు తీసుకునేవారు. 

యూదుల యొక్క నమ్మకం ఏమిటంటే అప్పట్లో  కేవలం 70   దేశాలు మాత్రమే ఉన్నాయి అన్నది. 

యేసు ప్రభువుకు అనేక మంది శిష్యులున్నప్పటికి కేవలం ఈ 70/72 మంది మాత్రమే ప్రభువును చాలా దగ్గరగా అనుసరించారు. 

ఇద్దరిద్దరిని పంపిస్తున్నారు ఎందుకంటే, ఇద్దరి సాక్ష్యం ఒక విషయం ఆమోదించుటనికి సహాయ పడుతుంది. ద్వితీయో 19:15, మత్తయి 18:16 , ద్వితీయో 17:6 

అధే విధంగా ఇద్దరు వ్యక్తులు పరస్పరం సహకరించుకొనుటకు, పరస్పరంప్రోత్సాహించుటకును, తోడుగా ఉండుటకు దేవుడు వారిని ఇద్దరిద్దరి చొప్పున పంపిస్తున్నారు. 

ప్రభువు వారిని పంపించింది ఎందుకంటే తన కొరకు మార్గమును సిద్ధం చేయుటకు, తన రాజ్య స్థాపన కొరకు అదే విధంగా దైవ ప్రేమను అందచేసి ప్రజల యొక్క హృదయంలో  శాంతిని నెలకొల్పుటకు  ప్రభువు  వారిని పంపిస్తున్నారు. 

మనల్ని కూడా దేవుడు సువార్త పరిచర్యకు జ్ఞాన స్నానం ద్వారా ఎన్నుకొంటున్నారు. 

ప్రభువు సేవ చేయుట కొరకు పని వారి కోసం ప్రార్ధించమని పలుకుచున్నారు. పంట విస్తారము కాని పనివారు లేరు కాబట్టి పని వారి కోసం ప్రార్ధించమని ప్రభువు పలికారు. విశ్వాసుల సంఖ్య అధికమే కాని సువార్త సేవ చేసే వారి సంఖ్యయే  తక్కువ కాబట్టి వారి కొరకు ప్రార్ధించమని ప్రభువు అంటున్నారు. 

ఈ 72 మంది యొక్క పని మానవుల ప్రణాళికా కాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడే వారి ద్వారా పని చేస్తారు. 

ప్రభువు శిష్యులను పంపించె ముందు వారికి గొప్ప గొప్ప వాగ్ధానాలు చేయలేదు వారి జీవితంలో కష్టాలు ఉంటాయని తెలిపారు అందుకే ప్రభువు నేను మిమ్ము తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలవలె  పంపిస్తున్నారు అని పలికారు. లూకా 10:3. 

వాస్తవానికి తోడేళ్లకు గొర్రె పిల్లలకు  ఎటువంటి బంధం లేదు. తోడేళ్ళు గొర్రెలను చంపుకొని తింటాయి, హింసిస్తాయి, గాయ పరుస్తాయి. అధే విధంగా తోడేళ్ల మనస్తత్వం కలిగిన వ్యక్తులు కూడా వుంటారని  ప్రభువు తెలిపారు. అంగీకారం  మరియు తిరస్కారం అన్నీ చోట్ల  ఉంటాయి అని ప్రభువు తెలిపారు. 

సువార్తకు పంపబడిన వారు  కూడా గొర్రె పిల్ల మనస్సు కలిగిఉండాలి. వినమ్రత, హాని చేయకుండుట,  యుద్దం చేయకుండుట (non - combative) లక్షణాలు కలిగి జీవించాలి. అపో 20:28-31 , యోహను 15:20 , యోహను 16:1-4, పిలిప్పీ 1:29, 2 తిమోతి  3:12. 

దేవుని కొరకు ఎన్ని కష్టాలు   అయినా అనుభవించుటకు సిద్ధంగా ఉండాలి దైవ సేవకులు. 

సువార్త సేవకు బయలు -దేరేటప్పుడు వారితో ఏమి తీసుకొని  పోరాదని ప్రభువు తెలుపుచున్నారు. ఎందుకంటే వారు సంపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడి జీవించాలి. వారి అనుదిన జీవితంకు సైతం అవసరమైన వస్తువులను  సైతం ప్రభువు పరిత్యజించమని కోరుచున్నారు. దేవుడే వారికి అన్నియు సమకూర్చుతారు. వారి యొక్క ఆలోచనలు ధనం గురించి , అధికారం గురించి మిగతా ఈ లోక విషయాలు గురించి ఉన్నట్లయితే వారు ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశ్యమును మరచి పోతారని ప్రభువు వారిని ఏమి తీసుకొని పోరాదని పలికారు. మొదటిగా దేవుని రాజ్యం వేదకితే అన్నీ ప్రభువే సమకూర్చుతారు. మత్తయి 6:33 . పిలిప్పీ 4:11-13, కీర్తన 37:3,5. సామెతలు 3:5 . 

దేవుని సేవకులు,  ప్రభువు యొక్క శాంతిని ప్రకటించాలి ఆహ్వానించే వారు ఉన్నట్లయితే వారి యొక్క ముఖ్య ఆహ్వానం మన్నించి, ప్రభువు యొక్క రాజ్యం గురించి ప్రకటించమన్నారు. ఆహ్వానించే వారు లేకపోతే పాద దూలిని వదలి అక్కడ నుండి వెళ్ళమని ప్రభువు పలుకు చున్నారు . 

దేవుని చేత పంపబడిన వారు ఆయన యొక్క రాజ్యం గురించి ప్రకటించాలి. అదియే వారి యొక్క ప్రధమ  బాధ్యత. వారి యొక్క పరిచర్య సేవ జీవితంలో ఎల్లప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. 

-దేవుని నుండి అంతా ప్రారంభించాలి 

- దేవుని మీద ఆధారపడి జీవించాలి 

-దేవునికొరకు హింసలు అనుభవించుటకు సిద్దంగా ఉండాలి. 

-దేవుడే వారి జీవితంకు కేంద్రం  కాబట్టి ఆయన కొరకు సమస్తము త్యజించాలి. 

-దైవ ప్రేమను పంచాలి, నిస్వార్ధ సేవ చేయాలి

- రోగులను స్వస్త పరచాలి , దేవుని శాంతిని ప్రకటించాలి. 

-దేవుని  ఉద్దేశం నెరవేర్చుట మరచి పోరాదు 

మనందరం కూడా  దేవుని కొరకు జీవించి దేవుని రాజ్య స్థాపన కోసం కృషి చేద్దాం, దేవుని సాక్షులై జీవించుదాం. 

Rev. Fr. Bala Yesu OCD

సామాన్య 14వ ఆదివారం

సామాన్య    14వ ఆదివారం

యెషయా  66: 10-14
గలతి 6: 14-18
లూకా  10: 1-12, 17-20

ప్రచారకులను పంపుట - సువార్త వ్యాప్తి - దైవ రాజ్య స్థాపన


ఈనాడు తల్లి తిరుసభ 14వ సామాన్య ఆదివారమును కొనియాడుచున్నది. ఈనాటి పఠనాలను మూడు అంశాల రూపేనా అర్ధం చేసుకుందాం. 
1  ప్రచారకులను పంపుట
2  సువార్త వ్యాప్తి
3 దైవ రాజ్య స్థాపన  
వీటిని విపులంగా ధ్యానిద్దాం.

1.  ప్రచారకులను పంపుట

ఈనాటి సువార్త పఠనంలో డెబ్బది ఇద్దరు శిష్యులను ప్రభువు పంపుచున్నారు (లూకా 10 : 19 ). “70”  సంఖ్య  పవిత్రగ్రంథంలో చిహ్నాపూర్వకమైన సంఖ్య . పూర్వ నిబన్ధనలో మోషే ఇశ్రాయేలు ప్రజలను యెడారికి నడిపించుకుని రావడంలో నాయకత్వం వహిస్తూ ఆ బాధ్యతా భారంతో అలసిసొలసి పోయినప్పుడు యావే ప్రభువు మోషే సహాయకులుగా డెబ్బది మందిని నియమిస్తారు (సంఖ్యా 11 : 16 - 17 ). ఇంకా పవిత్రగ్రంథంలో  ఎన్నో  చోట్ల  డెబ్భై  సంఖ్య  యొక్క  ప్రాముఖ్యతను చూస్తున్నాం. 

ఈరోజు కూడా ప్రభువు డెబ్బది రెండు  మందిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణకునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను (లూకా 10 : 1 ). ఇద్దిరిద్దరిని పంపేది కేవలం ఒకరికి ఒకరు సహాయంగా ఉండడానికి మాత్రమే కాక ఇద్దరి సాక్షానికి చట్టరీత్య ఎంతో విలువ ఉంటుందని కూడా పంపుచున్నారు. ఇంకా ప్రభువు వారితో పంట విస్తారము కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్ధింపుడు అనెను (లూకా 1 : 2 ). అంటే ప్రార్ధన ద్వారా దేవునితో కొనసాగింపు అనుబంధాన్ని మరియు నిర్మిత అవినాభావ సంబంధాన్ని  కలిగి యుండి, పరిచర్యలో వచ్చే కొరతలు ప్రభువుకు తెలియజేసి, ఆ కొరత తీరుటలో మధ్యవర్తిత్వాన్ని వర్తిస్తు, వారి ప్రేషిత కార్యాన్ని కొనసాగించాలని అర్ధము. వీరు తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలవలె పంపబడుచున్నారు.

ఎందుకు ? ఎందుకంటే వీరు సువార్త పరిచర్య  స్వీకరించేటటువంటి  ప్రజలు మరియు వీరు తిరిగేటటువంటి ప్రదేశాలు వీరికి పూర్తిగా అనుకూలంగా మద్దతుగా ఉండకపోవచ్చు.  ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి.  ఎన్నో ఇబ్బందులను అధిగమించాలి. ఎన్నో సమస్యలతో పోరాడాలి.  వీటన్నిటిలో గొర్రెపిల్లవలె ఉండి తోడేళ్లపై విజయాన్ని సాధించాలి. 

ఆ తరుణంలో వీరు పరిపూర్ణ పరిత్యాగాన్ని, పేదరికాన్ని పాటిస్తూ ప్రజల ధాతృత్వంపైన ఆధారపడివుండాలి. జాలెనైనను, జోలెనైనను, పాదరక్షలనైనను కొనిపోరాదు. మార్గమధ్యమున ఎవరిని కుశల ప్రశ్నలు అడగరాదు (10 : 14 ) అని ప్రభువు సెలవిస్తున్నారు.  వారికి అప్పగించిన భాధ్యతపై వారి మనసులను కేంద్రికరించి హృదయాలను లగ్నము చేసి శ్రద్ధ వహించి ఈ బాధ్యత నెరవేర్పునకు కృషి చేస్తూ  ముందుకు సాగాలి.  

2.  సువార్త వ్యాప్తి

ఈ డెబ్బది ఇద్దరు పంపబడటానికి ముఖ్య కారణం: సువార్త వ్యాప్తి. సువార్త అనేది స్థంబించినటువంటి ఒక వస్తువుగా ఉండకూడదు. సువార్త అన్ని వేళల అన్ని ప్రదేశాలలో అందరికి వ్యాపించబడాలి. సువార్త వ్యాపించబడాలి అంటే నువ్వు నేను సువార్త సైనికులుగా మారాలి . సువార్త వ్యాపింపచేయాలి అనే తపన కలిగిన వారందరు ఈనాటి రెండవ పఠనంలో (గలతి 6 : 14 - 18 ) చూస్తున్న విధంగా పౌలు గారితో కలిసి “నేను మరి ఇతరములైన దేనియందుగాక మన ప్రభువగు యేసు క్రీస్తు సిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును.  ఏలయన ఆయన సిలువ మూలముననే నాకు ఈలోకము, నేను ఈలోకమునకు సిలువ వేయబడితిమి” అని చెప్పగలగాలి. ప్రభువే స్వయంగా చెప్తున్నారు "నన్ను అనుసరింపగోరు వాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను" (మత్తయి 16 : 24 ).

పునీతులు కూడా చెప్తుంటారు శిలువే మా  సంపద అని. అవును ఎప్పుడైతే సిలువ మన సంపద అవుతుందో సిలువ వేయబడిన క్రీస్తు మన సర్వసం అవుతారు. అప్పుడు సువార్త వ్యాప్తిలో ఎదురయ్యే ప్రతి సవాలును, ప్రతి కష్టాన్ని నష్టాన్ని , ప్రతి అడ్డంకిని, ఇబ్బందిని తణుకు బెణుకు లేకుండా ఎంతో ధైర్యంతో ఎదుర్కొని అధిగమించి ముందుకు సాగగలుగుతాము  . మన బోధనలో క్రీస్తుప్రభుని భాధలు, సిలువ మరణము, పునరుత్తనము, మహిమ ప్రధాన అంశాలు కావలి. మన జీవితాలనుండి సిలువను వేరుచేయలేమను సత్యాన్ని ప్రతిక్షణం గ్రహించాలి మరియు   మన జీవితంలో జీవించాలి.  

క్రీస్తుప్రభుని జీవితంలో మరణం తధ్యం, ఆ మరణం కూడా సిలువ మరణమే. క్రైస్తవులుగా క్రీస్తువలె సిలువను హత్తుకొని జీవించాలి. పేతురుగారివలె క్రీస్తు కావలి, సిలువ వద్దు అనే భావంతో ఉండవచ్చు కానీ  తరువాత పేతురుగారికి అర్ధమైంది సిలువలేకుండా క్రీస్తు లేరు అని.

   పేతురుగారు నేను బోధించేది మీరు సిలువ వేసిన క్రీస్తును అని ధైర్యంతో భోధించగలిగారు. పునీత పౌలు గారు పలుకుతున్నవిధంగా ఎవరైతే క్రీస్తునందు, క్రీస్తుమరణంలో మరణిస్తారో వారు క్రీస్తుతో పాటు పునరుత్తానమౌతారు (రోమా  6 : 4 ).  అతడు నూతన సృష్టి ( గలతి 6 : 15 ). తమ తమ జీవితములలో సిలువ సూత్రమును పాటించువారికి సమాధానము, కనికరము తోడుగా ఉంటుంది (గలతి 6 : 16 ). సువార్త వ్యాప్తికై ఎంతగానో ప్రయాణించి శ్రమించిన పౌలుగారు సైతము యేసుక్రీస్తు సిలువనందు మాత్రమే గొప్పలు చెప్పుకొందును (గలతి 6 : 14 ) అని నొక్కి వక్కాణించుచున్నారు. సువార్త వ్యాప్తికై శ్రమిస్తున్న ప్రతి ఒక్కరినోట ఇదే మంత్రంగా మారాలి. ఇదే వారి చెవులలో మారు మ్రోగాలి. తద్వారా శిలువే మన సంపద కావలి. 

 దైవ రాజ్య స్థాపన 

పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 14 : 18లో దైవరాజ్యము అంటే ఏమిటో నిర్వచిస్తున్నారు. "దైవరాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి, సమాధానములే". దైవరాజ్య స్థాపన అంటే దేవుడు మనకు అనుగ్రహించిన నీతి, సంతోషములను మరి ముఖ్యంగా శాంతిని ఇతరులతో  పంచుకొని, ఈలోకమును ఒక పరలోకముగా మార్చడమే. ఈనాటి మొదటి పఠనములో (యెషయా 66 : 10 - 14 ) యావే ప్రభువు యెరూషలేము ప్రజలకు ఒక శుభసందేశాన్ని ఇస్తున్నారు "మీరు యెరూషలేముతో కలిసి ఆనందించి సంతసింపుడు....... మీరు యెరూషలేము తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు పాలిండ్లనుండి స్తన్యము గ్రోలి  సంతృప్తి చెందుదురు". యావే ప్రభువు మరల తన నివాసాన్ని ప్రజల మధ్య అనగా దేవాలయంలో ఏర్పరచుకున్నప్పుడు ఆ  పట్టణము ఆయన శాంతితో నిండిపోతుంది. ఆ ప్రజల మధ్య దేవుని శాంతి సంపదలు ఒక నది వలె ప్రవహిస్తాయి. ప్రజలు దేవుని అనుగ్రహముతో దీవెనలతో హాయిగా కాలం గడుపుతూ అభివృద్ధి చెందుతారు. యెషయా ప్రవక్త ప్రవచనం ప్రకారం యేసు ఈ లోకంలో శాంతి నెలకొల్పడానికి వచ్చారు. అందుకే సువార్త పఠనంలో ప్రభువు తన శిష్యులను శాంతిని అందించడానికి పంపుతున్నారు. "మీరు ఏ ఇంట ప్రవేశించిన ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలుకుడు" ( లూకా 10 : 5 ). 

సమాధానమును  దేవుడు ఒక్కడే  ఇవ్వగలడు. ఇది దేవుని అనుగ్రహవరం. ఈలోక మానవులు ఇవ్వగలిగే శాంతి సమాధానములు క్షణికమే. దేవుడు అనుగ్రహించే శాంతి శాశ్వతం. ఈ శాంతిని పొందాలంటే దానిని స్వీకరించాలి. దానిని స్వీకరించాలంటే దేవుడు పంపిన వారిని ఆహ్వానించాలి. వారిని ఆహ్వానించడం అంటే స్వయంగా దేవుని ఆహ్వానించడమే. అప్పుడు దేవుడే స్వయంగా సమాధానమును మనకు అనుగ్రహిస్తారు. ఒకవేళ మనం దేవుడు పంపిన వారిని ఆహ్వానింపనియెడల దేవుని తిరస్కరించినట్లే. అందుకే ప్రభువు తన శిష్యులతో "మీరు ప్రవేశించిన పట్టణప్రజలు మిమ్ము ఆహ్వానింపనియెడల ఆ పట్టన వీధులలోకి వెళ్లి మీ కాళ్లకు అంటిన దుమ్మును వారికి విరుద్ధంగా అచ్చటనే దులిపివేయుడు. ఇంకా వారికి దేవుని రాజ్యము సమీపించినదని గ్రహించమని గుర్తుచేయుడు అని చెప్పెను" ( లూకా 10 : 10 - 12 ).  

దేవుడు పంపిన వారిని ఆహ్వానింపకపోవడం తేటతెల్లముగా దేవుని పరిత్యజించడం మరియు దేవుని తీర్పును సూచిస్తుంది.  ఈ డెబ్బది ఇద్దరు ప్రభువు వారికి అప్పగించిన పనిని పూర్తిచేసిన తర్వాత వారి అసాధారణ శక్తులను, అనుగ్రహాలను దేవుని సువార్త సైనికులుగా ఉండి వాటిని ఉపయోగించమని క్రీస్తు వారికి అధికారాన్ని ఇస్తున్నారు. 

 దేవుని రాజ్యాన్ని  నా అనుదిన ఆలోచనలు, మాటలు మరియు కార్యాలద్వారా స్థాపిస్తున్నానా? అని  నువ్వు  నేను ఆత్మపరిశీలన చేసుకోవాలి.  దేవుని రాజ్యస్థాపన కేవలం గురువుల బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత. ఆ రాజ్య స్థాపనకు చిహ్నం శాంతి. మన వ్యక్తిగత కుటుంబ మరియు సంఘ జీవితంలో దేవుని శాంతిని అనుభవించ గలుగుతున్నామా? శాంతి అనేది మన నిజ జీవితంలో ఒక పరిస్థితి. ఎవరు సృజిస్తారు ఈ పరిస్థితిని అంటే మానవులమైన మనము. దేవుడు మనకు తన శాంతిని అనుగ్రహించారు. కానీ ఆ శాంతిని మనలో నెలకొల్పుకొని జీవించడమే మానవులమైన మన బాధ్యత.  ఈ శాంతి అనే  పరిస్థితిని మన వ్యక్తిగత , కుటుంబ, మరియు సంఘ జీవితంలో సృజించుకుందాం. క్రీస్తు సైనికులుగా ఉండి సువార్తను వ్యాపింపచేద్దాం. దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. శాంతియుతంగా జీవించుదాం. ఆమెన్.

Br. Sunil Inturi OCD

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 9:9-13 

తరువాత యేసు అటనుండి వెల్లుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో "నన్ను అనుసరింపుము"  అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు  కూర్చుండినపుడు సుంకరులును, పాపులును  అనేకులు వచ్చి ఆయనతోను, ఆయన శిష్యులతోను పంక్తియందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు "మీ బోధకుడు ఇట్లు సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు,  "వ్యాధిగ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు అను  లేఖనమునందలి  అర్ధమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు" అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్ఛెను. 

మత్తయి అను సుంకరిని యేసు ప్రభువు పిలుస్తున్నారు, యేసు ప్రభువు పిలుపుకు మత్తయి వెంటనే స్పందిస్తున్నారు. నాకు వేరె పని ఉంది అని కాని , లేక ఇంటి వద్ద చెప్పి వస్తాను అని కాని ఏమి చెప్పలేదు. యేసు ప్రభువు అడిగిన వెంటనే యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. యేసు ప్రభువుని  శిష్యుడు కావాలి అంటే ఇది ప్రధానమైన లక్ష్యం.  యేసు ప్రభువుని శిష్యుడు ఎప్పుడు విధేయుడగా , సంసిద్ధుడుగా ఉండాలి. విధేయత  మరియు సంసిద్ధత రెండు మనం మత్తయిలో చూస్తున్నాము. విధేయత యేసు ప్రభువు అప్పజెప్పిన పని చేయడానికి మరియు మన కర్తవ్యం మీదనే దృష్టి మరల్చకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సంసిద్దత మనలను ఎప్పడూ కర్తవ్య నిర్వహణ చేయడానికి, వెనుకడుగు వేయకుండా వుండటానికి ఉపయోగపడుతుంది.  యేసు ప్రభువును అనుసరించే వారు ఎల్లప్పుడు ఈ విధానంగానే ఉండాలి. అడిగిన వెంటనే మారు మాటలేకుండా ప్రభువును అనుసరించడానికి సిద్దపడటమే క్రీస్తు నిజమైన శిష్యుడు చేస్తాడు. 

"మీ బోధకుడు ఇట్లు సుంకరులతో , పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.  నీతి మంతుడైన పరగణించపడుతున్న ఒక వ్యక్తి ఎందుకు పాపులు, సుంకరులతో కలసి భుజించుచున్నాడు అని వారు యేసు ప్రభువును అడుగుతున్నారు. ఎందుకు యేసు ప్రభువు సుంకరులు, పాపులతో భుజించడానికి కారణం ఆయన వారి కోసం వచ్చారు. సుంకరులు , పాపులు దేవునికి దూరంగా ఉన్నారు. వీరు చేసిన పనుల ద్వారా వారు దేవునికి దూరంగా ఉన్నారు. కాని దేవుడు వీరికి కరుణ చూపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. దేవుడు వీరి దగ్గరకు వస్తున్నారు. వారిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికి వస్తున్నారు. వీరు పాపములో ఉన్న దేవునికి దూరంగా ఉన్న వీరిని మరల తండ్రి దగ్గరకు పోవుటకు అర్హులుగా చేయడానికి వీరితో కలసి భుజిస్తున్నారు. వీరితో కలసి భుజించడం వల్ల యేసు ప్రభువు వారిని తనతో కలసి ఉండటానికి వారి పాత జీవితం వదలి వేయడానికి ఆహ్వానం ఇస్తున్నాడు.  . 

ఇది పరిసయ్యులు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువును అపార్ధం చేసుకొని వారు శిష్యులను ప్రశ్నిస్తున్నారు.    పరిసయ్యులు బహిరంగంగా దేవుని ఆజ్ఞలును దిక్కరించిన వారితో  ఎప్పుడు కూడా భుజించరు. కాని యేసు ప్రభువు వారితో కలసి భుజిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు   హ్ోషయ ప్రవక్త మాటలను గుర్తుచేస్తున్నారు. "నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు"  హ్ోషయ ప్రవక్త  6:6 .  దేవునికి కావలసినది కారుణ్యము , బలులు కాదు. ఎవరికి ఈ కారుణ్యము మనం చూపించాలి అంటే అది ఎవరు అయితే పాపం చేసి దేవునికి దూరముగా ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే ఆకలితో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే అనారోగ్యంతో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే  అవసరంలో ఉన్నారో వారికి కరుణ చూపించాలి.  యేసు ప్రభువు చూపించిన కరుణ ఇటువంటి వారికి. వీరికి నిజానికి సమాజంలో ఒక స్థానం లేదు, యేసు ప్రభువు వీరితో ఉండటం వలన వీరికి సమాజంలో ఒక స్థానం ఇస్తున్నాడు. సమాజం వీరికి విలువ ఇచ్చే విధంగా చేస్తున్నారు. 

ప్రార్ధన : ప్రభువా! అనేక సార్లు మీరు నన్ను పిలిచిన కాని నేను మీ మాట వినక, నన్ను ఎందుకు దేవుడు పిలుస్తాడు అని అనుకున్నాను. మీరు మత్తయిని  పిలిచినట్లుగా మీచేత పిలువబడడానికి మీరు నా పవిత్రతని చూడరని, నేను అపవిత్రంగా ఉన్న నన్ను పిలుచుటకు వెనుకాడని మీ ప్రేమకు కృతజ్ఞతలు. మత్తయిని పిలిచినట్లుగానే నన్నును మంచి జీవితానికి పిలువండి. మత్తయి వలె నేను కూడా మీరు పిలిచిన వెంటనే మారు మాటలాడకుండా నేను మిమ్ము అనుసరించే విధంగా చేయండి. ప్రభువా మీరు వచ్చినది నన్ను పిలువడానికని , నాకు మీ ప్రేమను అందించడానికని, నా పాపములు క్షమించడానికని తెలుసుకొని వీటిని మీ నుండి వాటిని పొందుటకు నన్ను సిద్దపర్చండి. ప్రభువా మీరు  ఈ లోకానికి వచ్చినది నా కోసం అని తెలుసుకొని నేను మీ దగ్గరకు రావడానికి నన్ను సిద్దపరచండి. మిమ్ము ఎప్పటికీ కోల్పోకుండ నన్ను దీవించండి. ఆమెన్. 

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం   యెషయా 6:1-6  1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...